
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్ను పరీక్షించగా.. 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్ను పరీక్షించగా.. 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 911 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నలుగురు రాజ్భవన్ సిబ్బందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో ఆరోగ్యశాఖ జాబితా విడుదల చేసింది.
(చదవండి: కరోనా: 12 వేల మందికి పరీక్షలు లక్ష్యం... )