ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనీ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారని సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు మండిపడ్డారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనీ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారని సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు మండిపడ్డారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఏడాది గడిచినా హామీల అమలులో ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
రాజధాని భూములు కొల్లగొడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఓట్ల కోసం జనాన్ని చంద్రబాబు వాడుకున్నారని వారు దుయ్యబట్టారు.