సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్లో ఏర్పాటుచేసిన వర్క్షాప్కు హాజరయ్యేందుకు సీఆర్డీఏ అధికారుల బృందం ఈ నెల 10న బయలుదేరి వెళ్లనుంది. దీనికి ప్రభుత్వ సీఎస్ దినేశ్కుమార్ శనివారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ షాన్మోహన్తోపాటు ప్రభుత్వ కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్ ఈ వర్క్షాప్కు హాజరుకానున్నారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ సంస్థ 11, 12, 13 తేదీల్లో ఈ వర్క్షాప్ నిర్వహిస్తోంది.
శ్రీకాంత్ ఈ పర్యటనకు వెళుతుండటంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ వర్క్షాప్లో పాల్గొనేందుకు సినీ దర్శకుడు రాజమౌళిని కూడా సీఆర్డీఏ అధికారులు లండన్ తీసుకెళుతున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై ఆయన ఫోస్టర్ సంస్థకు సలహాలివ్వనున్నారు.
Published Sun, Oct 8 2017 1:44 AM | Last Updated on Sun, Oct 8 2017 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment