ఒడిశా తీరం దాటిన వాయుగుండం | Depression crosses Odisha coastal, says cyclone warning center | Sakshi
Sakshi News home page

ఒడిశా తీరం దాటిన వాయుగుండం

Published Sun, Jun 21 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

ఒడిశా తీరం దాటిన వాయుగుండం

ఒడిశా తీరం దాటిన వాయుగుండం

విశాఖపట్నం: గోపాల్పూర్ - పూరీ మధ్య వాయుగుండం ఒడిశా తీరం దాటిందని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయుగుండం పూల్బనికి 9 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం క్రమేపి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఉత్తరకోస్తాలో తీరం వెంబడి గంటకు 45 - 60, దక్షిణ కోస్తాలో 45 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. కోస్తా అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement