అభివృద్ధికి మార్గం వైఎస్సార్‌సీపీ | development on the state in ys jagan hands | Sakshi

అభివృద్ధికి మార్గం వైఎస్సార్‌సీపీ

Mar 25 2014 2:06 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడమే అభివృద్ధికి మార్గమని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

పలాస, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడమే అభివృద్ధికి మార్గమని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని 17వ వార్డులో పురుషోత్తపురంలో సోమవారం ఆమె ప్రసంగించారు.
 
జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలాస శాసనసభ్యుడు జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ పలాస కాశీబుగ్గమున్సిపాల్టీకి, వైఎస్ కుటుంబానికి సంబంధం ఉందన్నారు. ప్రతి ఎన్నికలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డికి పలాస ఒక  సెంటిమెంటన్నారు.  
 
 వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త వజ్జ బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్‌గా తాను చేసిన అభివృద్ధిని గుర్తించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బళ్ల ఉషను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
 
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్యి ప్రసాదరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ 17వ వార్డు అభ్యర్థి బళ్ల ఉష, మాజీ కౌన్సిలర్లు వజ్జ గంగాభవానీ, బళ్ల గిరిబాబు, స్థానిక నాయకులు బద్రి గోపాలరావు, మల్లా రాజారావు, కొరికాన ఫాల్గుణరావు, బద్రి మోహన్‌రావు, తాళాసు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement