తిరుపతి(మంగళం), న్యూస్లైన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ‘మాట తప్పని.. మడమ తిప్పని’ వంశం నుంచి వచ్చిన వైఎస్. జగనమోహన్రెడ్డి అధికారంలోకి వస్తే మహిళాభ్యున్నతి జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని పార్వతీపురం లెనిన్నగర్లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి, షాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు.
సాయంత్రం కొర్లగుంట మారుతీనగర్లో పార్టీ నాయకుడు పి. అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్కోసం మొదటి సంతకం చేశారన్నారు. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సైతం అధికారంలోకి రాగానే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు. తొమ్మిదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ బీజేపీ, నరహంతకుడు నరేంద్రమోడి అని అభివర్ణించిన చంద్రబాబు నేడు అధికారం కోసం ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని తన దిగజారుడు రాజకీయాలు చాటుకున్నారన్నారు.
అన్నదమ్ముల్లా కలసికట్టుగా ఉన్న తెలుగుజాతి ముక్కలు కావడానికి ముఖ్యకారకులు కిరణ్, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు. కేవలం జగనన్న అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యంగా తాము అభివృద్ధి చెందుతామని మహిళలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తిరిగి జగనన్నతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, తొండమనాటి వెంకటేష్రెడ్డి, కట్టా జయరాంయాదవ్, పుల్లయ్య, జ్యోతిప్రకాష్, తాల్లూరి ప్రసాద్, దేవరాజులురెడ్డి, మోహన, భగీరథరెడ్డి, ముత్తువల్లి రసూల్, గోపాల్రెడ్డి, పీపీ చావడి రఫీ, బాల మునిరెడ్డి, నాగేంద్ర, పుణీత, శ్యామల, శాంతారెడ్డి, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు.
జగనన్నతోనే మహిళాభ్యున్నతి
Published Wed, Apr 9 2014 2:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement