తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50,రూ 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 3 కంపార్ట్మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు:
ఉచిత గదులు - 59 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు - 13 ఖాళీగా ఉన్నాయి.
రూ.100 గదులు -ఖాళీగా లేవు
రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవలన్నీ గురువారం వైకుంఠ ఏకాదశి ఉన్న కారణంగా రద్దుచేశారు.