ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు! | Ekalavya buildings re-tenders | Sakshi

ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు!

Feb 16 2016 2:23 AM | Updated on Sep 3 2017 5:42 PM

రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని....

  గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్‌ఈ సుబ్బారావు

పార్వతీపురం: రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్‌ఈ ఎ.వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్లు చొప్పున 8 పాఠశాలలకు రూ.84 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పనులకు పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలో అది పరిష్కరించబడుతుందన్నారు. అనంతరం రీ-టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింద ని తెలిపారు. అలాగే ఆశ్రమ పాఠశాలలకు కొత్తభవనాలు, మరమ్మత్తులు చేపడతామన్నారు.


 ఇటీవల బాసంగి పనుల రాద్ధాంతంపై విలేకరులు ప్రశ్నించగా.. నిర్వాసిత బాసంగిలో 36 పనులకు గాను ఇప్పటికీ ఓ మహిళా సంఘానికి 3 పనులు కేటాయించామన్నారు. మిగతా 33 పనులు వీటీడీఏలు, అక్కడ ఇంకా ఏమైనా మహిళా సంఘాలుంటే వాటికి ఆ పనులు అప్పగిస్తామన్నారు. అలాగే ఎస్‌డీఎఫ్‌లో భాగంగా రూ.18 కోట్లతో ఐటీడీఏ పరిధిలో రోడ్లు నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందామని, వాటికితోడు ఉపాధిలో రూ.85కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌కు అనుమతులు కోరామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement