itda
-
తామర పంటకాదు.. పూల్ మఖానా!
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో.. మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు. తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం.– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాచదవండి: అందాల దీవిలో కడలి కల్లోలంఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదంమఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం. – అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు -
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ఇప్పమొక్క!
ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్ అడవి లేక.. చెట్లు కానరాక పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది. ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు. గత ఏడాది 327 క్వింటాళ్లు భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారంటే? జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది. పర్ణశాలలో అమ్మకం శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 25వేలకు పైగా మొక్కలు ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. -
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
కొలువుల చదువు.. భవితకు నెలవు
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ... రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు. ► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి. చక్కని వసతి సదుపాయం ► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు. మెరుగైన శిక్షణ రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది. –కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం మెరిట్ విద్యార్థులకే ప్రవేశం రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు. –కోసు ఠాగూర్దొర, డైట్ కళాశాల విద్యార్ధి. నూరుశాతం ఫలితాలు తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది. –సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
'నన్నారి'కి నల్లమల బ్రాండ్!
(నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు) అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించేది)పై గురిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) ఉత్పత్తికి ఊతమిస్తోంది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచుల జీవనోపాధికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి అక్కడి చెంచులు నల్లమల అడవిపై ఆధారపడి సంచార జీవనం సాగిస్తుంటారు. వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంచడమే కాకుండా ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చెంచులు వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడు కాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు మద్దతు ధరకు విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నన్నారి ఉత్పత్తికి ఊతం.. ఇక నన్నారి చెట్ల సాగు, ఉత్పత్తి, విక్రయాలకు శ్రీశైలం ఐటీడీఏ అనేక చర్యలు చేపడుతోంది. కర్నూలు జిల్లా డి.వనిపెంట చెంచుగూడెంలో 20 మంది చెంచు రైతులు 20 ఎకరాల్లో గత మూడేళ్లుగా నన్నారి సాగుచేస్తున్నారు. మరో 12 మంది 30 ఎకరాల మామిడి తోటల్లోను అంతర పంటగా నన్నారి సాగుచేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు కుటుంబాలు ఇళ్ల ముంగిటే ఈ మొక్కల సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు. మూడు జిల్లాల్లో 13 వికాస కేంద్రాలు నిజానికి.. గిరిజనుల వద్ద వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి గిరిజనులే మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని సంకల్పించింది. మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో 15 గ్రూపులు (300 మంది సభ్యులు) చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఫలసాయాన్ని గిరిజనులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనున్నారు. నన్నారితో షర్బత్ తయారీ శిక్షణ వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేస్తారు. శుద్ధిచేసిన ఒక కిలో నన్నారి గడ్డలతో నీరు, పంచదార, నిమ్మ ఉప్పు, ప్రిజర్వేటివ్, కొద్దిపాటి రంగుతో 25 లీటర్ల నన్నారి పానీయం తయారవుతుంది. లీటరు షర్బత్ తయారీకి రూ.వంద అయితే దాన్ని రూ.150కి విక్రయిస్తారు. నల్లమల బ్రాండ్తో విక్రయాలు చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చాం. నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాం. నన్నారి సాగును ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన సాగుకు ఊతమిస్తున్నాం. ఐదువేల మామిడి మొక్కలను పంపిణీ చేశాం. తిరుపతిలోని చినీ, నిమ్మ పరిశోధన స్థానం నుంచి స్వీట్ ఆరంజ్ (రంగపురి రకం) 3వేల మొక్కలను పంపిణీ చేశాం. 750 ఎకరాల్లో చెంచులు మిరప పండిస్తుండటంతో చిల్లీపౌడర్ (కారం) తయారుచేసే కేంద్రాన్ని డోర్నాలలో ఏర్పాటుచేస్తున్నాం. యర్రగొండపాలెం, సున్నిపెంటలో వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా యువతకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్తోపాటు ఫుడ్, గూడ్స్ ప్యాకింగ్పైన శిక్షణనిచ్చాం. చెంచుల అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం. – బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, శ్రీశైలం ఐటీడీఏ -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
అభివృద్ధే అందరి లక్ష్యం
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కష్టపడి పనిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాల్లో సోమవారం ఎస్పీ సతీష్, జేసీ ధనంజయ్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనిచేసే అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో నివాసముండాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 200 నుంచి 300 గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లతో ఏజెన్సీలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఆస్పత్రులు, వాటిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రేషన్కార్డు, పింఛన్ల సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందనకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఏజెన్సీలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.గిరిజనులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గిరిజనులకు సేవ చేయడం అదృష్టం జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో ఏపీవో సీఎస్ నాయుడు, డీడీ ముక్కంటి, ఈఈ డేవిడ్రాజు, ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
బుల్లి బుల్లి దీవులు.. కేరళను మించి సోయగాలు
సాక్షి, విశాఖపట్నం: కొండ కోనల నడుమ మన్యం అందాలు ఒకవైపు.. యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక కేంద్రాల సోయగాలు మరోవైపు. ఆ అందాలకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విశాఖ మన్యంలో కేరళ తరహాలో బ్యాక్ వాటర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మనోహరమైన సుజనకోట ప్రాంతంలోని చిన్న చిన్న దీవుల్లో కేరళను మించిన అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. సుజనకోట.. ప్రకృతి మేట బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంగా ముంచంగిపుట్టు మండలం సుజనకోటను గుర్తించారు. సుజనకోటలోని మత్స్యగెడ్డ వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. జి.మాడుగులలో ప్రారంభమై.. హుకుంపేట, పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు వద్ద జోలపుట్టు డ్యామ్లో కలుస్తుంది. ఒకవైపు పచ్చని దీవులు, మరోవైపు ఆకర్షణీయమైన సుందర ప్రదేశాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సుజనకోట పంచాయతీలో మత్స్యగెడ్డ అందాలు కేరళను తలపిస్తుంటాయి. మెలికలు తిరుగుతూ ఎత్తయిన గిరుల మధ్య నుంచి మత్స్యగెడ్డ పాయలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ అందాలను చూసేందుకు నిత్యం వందలాదిగా పర్యాటకులు వస్తుంటారు. బ్యాక్ వాటర్ బోటింగ్.. ఫ్లోటింగ్ రెస్టారెంట్ కేరళ పర్యాటకానికి పేరు తెచ్చింది బ్యాక్ వాటర్స్ అని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే అనుభూతిని సుజనకోటలో పొందవచ్చు. మత్స్యగెడ్డ బ్యాక్వాటర్ను అభివృద్ధి చేస్తే.. కేరళ వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా అంతర్జాతీయ పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తుంది. బ్యాక్ వాటర్లో సేదతీరేలా బోటింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.2.50 కోట్లతో సుజనకోట అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారు. బ్యాక్వాటర్ అందాలను తిలకించిన తర్వాత.. దేశ, విదేశీ టూరిస్టుల అభిరుచికి అనుగుణంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండు మూడు రోజులు ఇక్కడ ప్రకృతి ప్రేమికులు విహరించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించనున్నారు. అడ్వెంచర్ టూరిజానికీ.. బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ప్లాన్ సిద్ధం చేసింది. బోటింగ్తో పాటు జిప్లైనర్ ద్వారా బ్యాక్ వాటర్ నుంచి కొండల వైపునకు వెళ్లేలా సాహస విన్యాసాలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆమోదం తెలిపిన సీఎం జగన్ కేరళకు బ్యాక్ వాటర్స్ టూరిజం ఎంత పేరు సంపాదించి పెట్టిందో.. అదే మాదిరిగా విశాఖ మన్యం అందాలకు సుజనకోట కూడా అంతే పేరు తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే ప్రకృతి కేరళ కంటే వైభవంగా ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాత్రిపూట బ్యాక్ వాటర్లో సేదతీరేలా ప్రాజెక్టు రూపొందిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అరకు వచ్చే పర్యాటకులు సుజనకోట చేరుకునేందుకు రైల్వే స్టేషన్తో పాటు రోడ్డు మార్గం కూడా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నాం. పర్యాటక మన్యహారంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
గిరిజన ఉత్పత్తులకు 'బ్రాండింగ్'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడవి బిడ్డల కష్టాన్ని హైజాక్ చేస్తున్న దళారులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. గిరిజనుల కష్టం వృథా కాకుండా వారు సేకరిస్తున్న 105 రకాల ఉత్పత్తులకు ‘బ్రాండింగ్’ కల్పించి, వాటిని గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవి అరుదుగా దొరికే రకాలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మార్కెట్లో వీటికి మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు సంబంధించి రూ.34 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. వచ్చే ఏడాది దీని విలువ ఏకంగా 40–50 శాతం పెరగనుంది. ఈ పరిణామాలు అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడమే కాక వారికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటు నల్లమల ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. వీరి అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను 1987లో నంద్యాలలో స్థాపించారు. శ్రీశైలంలో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత దీంతో కలిసి పనిచేసేందుకు 1989లో జీసీసీని శ్రీశైలానికి తరలించారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డివిజన్లో నంద్యాల, ప్రకాశం జిల్లా దోర్నాలలో రెండు గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటుచేశారు. ఇవికాకుండా పాడేరు, చింతపల్లి, రంపచోడవరంలోనూ సొసైటీలున్నాయి. వీటి పరిధిలోని మండలాల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. తేనె, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా, జాస్మిన్, నీమ్ ఇంటర్నేషనల్ సబ్బులు, ఉసిరి, శీకాకాయ, కుంకుడు కాయలు, వీటిద్వారా తయారుచేసిన షాంపులు, రాజ్మా చిక్కుళ్లతో పాటు 105 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇందులో కర్నూలు, ప్రకాశం జిల్లాలోనే 58 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి కల్తీ లేకుండా లభించే స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు. వీటిని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి ‘జీసీసీ’ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఉత్పత్తుల ద్వారా సబ్బులు, షాంపులతో పాటు అరకు కాఫీ, వైశాఖీ కాఫీపొడి తయారుచేస్తున్నారు. వీటి కోసం హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వీటి బ్రాండింగ్తో పాటు మార్కెటింగ్ విశాఖపట్నంలోని జీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. బ్రాండింగ్, వాటి ధర, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ప్యాకెట్పై ముద్రిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. తుట్టె నుంచి తేనెను సేకరిస్తున్న దృశ్యం ఉపాధి అవకాశాలు మెరుగు ఇటీవల వీటికి గిరాకీ పెరుగుతుండడంతో గిరిజనులు కూడా ఎక్కువగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. అంతేకాక, వారి పొలాల్లో ఇతర పంటలు పండించి వాటిని సొసైటీకి ఇస్తున్నారు. దీంతో వీరికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనులు 3.78 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులోకి తేవడం ద్వారా కల్తీలేని స్వచ్ఛ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. సూపర్ మార్కెట్లలో జీసీసీ బ్రాండ్ ఉత్పత్తులు భారీగా సేల్ అవుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు లభించడంలేదు కూడా. గిరిజనుల కోసం నిత్యావసర డిపోలు గిరిజనుల ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు వీరికి అవసరమయ్యే వస్తువులు వినియోగించేలా నంద్యాల, ప్రకాశం జిల్లాలోని దోర్నాల సొసైటీలతో పాటు ఇతర సొసైటీలలో నిత్యావసర డిపోలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పుతో పాటు జీసీసీ బ్రాండ్ పసుపు, కారం, చింతపండు, కాఫీ, సబ్బులు, షాంపులు, తదితర వస్తువులు ఇక్కడ అందిస్తారు. అలాగే, ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 100 గిరిజన హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటికి కావల్సిన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్, శానిటరీ వస్తువులు కూడా శ్రీశైలం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. దీంతో పాటు వీరి అభివృద్ధి కోసం 171 చెంచుగూడేల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారు. -
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్కు ఇన్చార్జిగా నియమించారు. -
ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్వో డాక్టర్ లీలా ప్రసాద్ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. -
పట్టించుకోని ఆదివాసీల గోడు
-
నేరేడుబందకు మొబైల్ ఆధార్ టీం
పాడేరు: ఆ మారుమూల గిరిజన తండా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతోంది. విశాఖ జిల్లా జి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దులోని నేరేడుబంద గ్రామంలో పిల్లలకు ఆధార్ కార్డులు అందనున్నాయి. ఈ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, దీంతో వారు ఆధార్ కార్డులకు నోచుకోక చదువుకు దూరం కావడంపై ‘సార్.. మా ఊరే లేదంటున్నారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్నబాబు, ఇతర అధికారులు సోమవారం నేరేడుబంద గ్రామాన్ని సందర్శించారు. వారిచ్చిన నివేదికతో పీవో వెంటనే మొబైల్ ఆధార్ టీంను పంపించారు. వారు సోమవారం రాత్రికే నేరేడుబంద చేరుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలోని 18 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేయనున్నారు. ఆ గ్రామానికి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోవడంతో ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని జోగుంపేట ఆధార్ కేంద్రంలో ఆన్లైన్ చేయనున్నారు. ‘సాక్షి’ కథనంతో ఎంతోకాలంగా ఉన్న తమ సమస్య పరిష్కారం అవుతోందని నేరేడుబంద గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అడవి 'బిడ్డ'లకు ఆయుష్షు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్)లు నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆస్పత్రి ఉండటమంటేనే కష్టం. పీహెచ్సీ ఉన్నా అక్కడ చిన్న పిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్ఎన్సీయూలు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. సీతంపేట, రంపచోడవరం, పాడేరు, శ్రీశైలం తదితర కొండ ప్రాంతాల్లోని చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. 24 గంటల వైద్యంతో ఇవి అండగా నిలుస్తున్నాయి. లక్ష మంది చిన్నారులకు ఔట్ పేషెంట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదేసి పడకలతో 23 ఎస్ఎన్సీయూలున్నాయి. ఇవి 2018, ఆగస్ట్లో ఏర్పాటుకాగా, బాగా నిర్వహణలోకి వచ్చింది మాత్రం 2019 జూన్ తర్వాతే. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో లక్ష మంది శిశువుల దాకా ఔట్ పేషెంట్ సేవలు పొందారు. శిక్షణ పొందిన నర్సులతో పాటు పీడియాట్రిక్ వైద్యులు, ఐసీయూ పడకలుండటంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. చింతూరు ఏజెన్సీలోని కూనవరం ఎస్ఎన్సీయూలో అత్యధికంగా 10,806 మంది శిశువులకు ఔట్ పేషెంట్ సేవలందగా, మంచంగిపుట్టు ఎస్ఎన్సీయూలో 8,619 మందికి వైద్య సేవలందాయి. త్వరలోనే మరో 10 కేంద్రాలను ఒక్కొక్కటి 10 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ఇప్పటికే టెండర్లనూ పిలిచారు. స్పెషాలిటీ సేవలు.. ఎస్ఎన్సీయూలో అత్యాధునిక రేడియంట్ వార్మర్లుంటాయి. వీటితో పాటు ఫొటోథెరపీ యూనిట్లూ ఉంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నియంత్రణకు సీ–పాప్ యంత్రం ఉంటుంది. ఐదుగురు శిక్షణ పొందిన నర్సులు షిఫ్ట్ల వారీగా ఉంటారు. డాక్టర్లు 9 గంటల పాటు కేంద్రంలో ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఎంత ఖరీదైన మందులైనా ఎస్ఎన్సీయూల్లో శిశువులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సెంటర్లో ఐదు పడకలుంటే వాటిలో ఒకటి ప్రత్యేక సెప్సిస్ (ఇన్ఫెక్షన్లు సోకని) బెడ్ ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణతో శిశు మరణాల నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ కృషిచేస్తోంది. శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ఎస్ఎన్సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్ వార్డులను కూడా కోవిడ్ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువునూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్ కుటుంబ సంక్షేమశాఖ -
అనాస రైతుకు బాసట: రైతు బజార్లలో విక్రయాలు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పండించే పంట అనాస. ప్రారంభంలో ధర బాగుండటంతో మంచి లాభాలొస్తాయని రైతులు ఆశించారు. కానీ.. కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రారంభంలో రూ.16 నుంచి రూ.20 పలికిన ఒక్కో అనాస కాయ ధర ప్రస్తుతం రూ.5 నుంచి రూ.6కు మించి పలకలేదు. చిన్న సైజు కాయలైతే కొనే నాథుడే లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐటీడీఏ, మార్కెటింగ్ శాఖ అనాస రైతుకు బాసటగా నిలిచాయి. రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి చిన్న సైజు కాయలను రూ.5, పెద్ద కాయలను రూ.10 చొప్పున 200 టన్నులకు పైగా అనాస పండ్లను సేకరించిన సీతంపేట ఐటీడీఏ వాటిని ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో ఒక్కో సభ్యురాలికి ఒక్కో పండు వంతున రూ.5 సబ్సిడీపై పంపిణీ చేసింది. రవాణా సౌకర్యం.. మరోవైపు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి అనాస రైతులకు రైతు బజార్లలో స్థానం కల్పించి నేరుగా వారే పంటను అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. వారికి అవసరమైన రవాణా సదుపాయాలను మార్కెటింగ్ శాఖ ఉచితంగా కల్పించింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేసింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ రైతు బజార్లలోని స్టాల్స్లో సుమారు 50 టన్నులకు పైగా అనాస పండ్లను రైతులు విక్రయించుకోగలిగారు. కాయలు మంచి నాణ్యతతో ఉండటంతో వ్యాపారులు సైతం పోటీపడి వీరి నుంచి కొనుగోలు చేశారు. ఒక్కో కాయకు రూ.12 నుంచి రూ.15 వరకు గిట్టుబాటు కావడంతో రైతుల్లో ఆనందం అవధులు దాటింది. తమ జిల్లాలో ఒక్కో కాయ రూ.5కు మించి అమ్ముకోలేకపోయే వారమని, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఒక్కో కాయకు రూ.10కి పైగా ధర వచ్చిందని రైతులు సంబరపడుతున్నారు. రైతు బజార్లలో అమ్మకం పైనాపిల్ ధర పతనమైందని తెలిసి సీతంపేట ఐటీడీఐ ఆధ్వర్యంలో కాయల్ని కొనుగోలు చేశారు. కాగా ఇంకా రైతుల వద్ద మిగిలి ఉన్న కాయలను అమ్ముకునేందుకు రైతు బజార్లలో ఏర్పాట్లు చేసాం. రైతులే స్వయంగా మార్కెట్లకు తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశాం. వ్యాపారులు పోటీపడటంతో రైతులకు మంచి ధర వచ్చింది. – శ్రీనివాసరావు, రైతుబజార్ల సీఈవో ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేను మాది సీతంపేట మండలం విజ్జయాగూడ గ్రామం. నేను మూడెకరాల్లో అనాస సాగు చేశా. ఈ ఏడాది ఊహించని రీతిలో అనాస కాయ ధర రూ.5కు పడిపోవడంతో కొనేనాథుడు లేకుండా పోయారు. ప్రభుత్వ చొరవతో ఈ రోజు ఒక్కో కాయ రూ.14కు అమ్ముకోగలిగా. రాజమండ్రి మార్కెట్కు 1,500 పండ్లు తీసుకొచ్చా. రూ.21 వేల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేను. – సవర మసయ్య,విజ్జాయగూడ, శ్రీకాకుళం ప్రభుత్వ చొరవతో గట్టెక్కాం మూడెకరాల్లో మూడు టన్నుల దిగుబడి వచ్చింది. రేటు పడిపోవడంతో కాయ కొనేవాళ్లే కరువయ్యారు. దీంతో చాలా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రోజు 800 కాయల్ని విజయవాడ మార్కెట్కు తెచ్చా. రూ.11,200 ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – ఎస్.పాపారావు, కుసిమిగూడ, శ్రీకాకుళం -
Elephants: కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఏనుగులు
ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి సుమారు 14 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు గిరిజనులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 2007లో సీతంపేట మన్యంలోకి వచ్చిన 11 ఏనుగులు అప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాయి. వీటిలో ఏడు చనిపోగా మిగిలిన నాలుగు ఇక్కడే తిష్ట వేశాయి. వీటి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోతున్నారు. వీటి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా వీటి నుంచి శాశ్వత పరిష్కారం లభించలేదు. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు లేక జనావాసాల్లోకి వచ్చేస్తుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సీతంపేట: ఏనుగుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని, సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం, ఎల్ఎన్పేట మండలాల్లోనే గత 14 సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో భామిని, సీతంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లోకి తరచూ వస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తగ్గిన అటవీ విస్తీర్ణం 2007లో ఏనుగులు సీతంపేట మన్యంలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి వివిధ రకాల చెట్లకు నిలయమై ఉండేవి. ఇప్పుడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. అభివృద్ధి పేరిట అటవీ ప్రాంతంగుండా రహదారులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపోడు వ్యవసాయం కోసం అడవులను కాల్చివేస్తున్నారు. దీంతో మూగజీవాలకు నిలువనీడలేక మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. ఒడిశాలోని లకేరీ అటవీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లను నరకడం, అడవుల్లో జనసంచారం పెరగడంతో అక్కడ ఉండే ఏనుగులు జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చేస్తున్నాయి. వెదురు, రావి, వెలగ, మర్రి, చింత, ఇతర పండ్ల జాతుల చెట్లు, దట్టమైన పచ్చిక బయళ్లు ఏనుగులకు ఆహారం. కానీ అడవుల్లో ఈ జాతులు మొక్కలు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది. దీంతో గిరిజనులు పండించే పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు పైగా పంటలను నాశనం చేశాయని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు వద్దకు నీటి కోసం వచ్చిన ఏనుగులు నీరే ప్రధానం.. ఏనుగులకు నీరు చాలా అవసరం. వాటి చర్మం మందంగా ఉంటుంది. వేడిని తట్టుకోవడానికి తరుచుగా నీరు తాగడం, మీద చల్లుకోవడం చేస్తుంటాయి. భరించలేని పరిస్థితుల్లో బురద మట్టిని సైతం దేహానికి పూసుకుంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వాటికి కావాల్సిన మేత కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు గతంలో ఏనుగు సంచరించే అటవీ ప్రాంతాన్ని గుర్తించి నీటి కుంటలు నిర్మించారు. అయితే అనంతరం వీటి నిర్వహణ గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో వేసవి ఆరంభంలోనే జనావాసాలకు సమీపంలోకి వచ్చేస్తున్నాయి. సీతంపేట–భామిని సరిహద్దు ప్రాంతంలో చెరువు ఉండడంతో ప్రస్తుతం అక్కడకు వచ్చి ఏనుగులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. శాశ్వత పరిష్కారాలు లేవా? ఏనుగులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. వేసవిలోనూ వాటికి మేత, నీరు లభ్యమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏనుగుల నియంత్రణకు రెండేళ్ల క్రితం కందకాలు తవ్వడం వంటివి చేసినప్పటికీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. కందకాల్లో గిరిజనులకు చెందిన ఆవులు, మేకలు వంటివి పడి చనిపోయిన సందర్భాలు ఉండడమే కారణం. ఏనుగులను ఇక్కడ నుంచి తిరిగి లకేరి అటవీ ప్రాంతానికి తరలించాలని జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒడిశా కోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో సాధ్యం కావడం లేదు. జీపీఎస్తో ట్రాక్ చేస్తున్నాం ఏనుగులు ఎక్కడ సంచరిస్తున్నాయనేది జీపీఎస్తో ట్రాక్ చేస్తున్నాం. అవి ఎటువైపు పయనిస్తున్నాయనేది తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 14 మంది ట్రాకర్లు ఉన్నారు. ఏనుగులు గ్రామాలవైపు రాకుండా వారు చర్యలు చేపడతారు. ఏనుగుల కారణంగా పంటనష్టం వాటిల్లుతున్న మాట వాస్తవం. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హార్టీకల్చర్, వ్యవసాయశాఖలు ఏనుగులు తొక్కేసిన పంటల నష్ట పరిహారం అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారంగా పరిహారం కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. – గుండాల సందీప్కృపాకర్, డీఎఫ్వో జీడి, మామిడి పంటలకు నష్టం కొన్ని రోజులుగా మా ప్రాంతంలోనే ఏనుగులు సంచరిస్తూ జీడి, మామిడి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగులు ఏ మూల నుంచి దాడి చేస్తాయోననే భయంతో కొండపోడు పనులకు వెళ్లడం లేదు. – ఎన్.ఆదినారాయణ, చిన్నబగ్గ కాలనీ సమస్య పరిష్కరించాలి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు కష్టపడి సాగు చేస్తున్న పంటలను ఏనుగులు నాశనం చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వీటిని నియంత్రించడంలో అటవీశాఖ విఫలమైంది. ఇప్పటికైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇక్కడ నుంచి ఒడిశా అటవీ ప్రాంతానికి తరిమివేయాలి. – పి.సాంబయ్య, గిరిజన సంఘం నాయకుడు -
మిరియం సాగులో కేరళకు పోటీ
సాక్షి, విశాఖపట్నం: మిరియాల సాగుకు కేరళ పెట్టింది పేరు. ఇప్పుడు విశాఖ మన్యంలోనూ మిరియాలు సాగవుతున్నాయి. దిగుబడిలోనే కాకుండా నాణ్యతలోనూ మన్యం మిరియం కేరళకు గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో పండే మిరియాల కంటే నాణ్యమైన ఆర్గానిక్ మిరియాలను విశాఖ మన్యం అందిస్తోంది. ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండానే.. ఇంకా చెప్పాలంటే పైసా పెట్టుబడి లేకుండానే గిరిజన రైతులు వీటిని పండిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మిరియాల పంట ద్వారానే మన్యం రైతులు రూ.150 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించారంటే విశేషమే మరి. విశాఖ మన్యంలో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు జరుగుతోంది. కాఫీ తోటల ద్వారా కాపును బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం వస్తుంటే.. అందులో అంతర పంటగా వేస్తున్న మిరియాలతో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతోంది. 98 వేల ఎకరాల్లో అంతర పంటగా.. మిరియాల సాగుకు సూర్యరశ్మితో పాటు తగిన నీడ కూడా ఉండాలి. నీరు నిలవని ఏటవాలు భూమి అవసరం. పాదులు 20 నుంచి 30 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి కాబట్టి వాటికి ఆసరాగా ఎత్తయిన చెట్లు ఉండాలి. విశాఖ మన్యంలోని కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం 98 వేల ఎకరాల కాఫీ తోటల్లో రైతులు అంతర పంటగా మిరియాల పాదులు వేశారు. ఒకసారి మొక్క వేస్తే రెండో ఏట నుంచే కాపు మొదలవుతుంది. 20 సంవత్సరాల పాటు జనవరి నుంచి ఏప్రిల్–మే నెల వరకూ ఫలసాయం వస్తుంది. ఈ ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం పొడవుగా ఎదిగే సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల మొదలులో మిరియం మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజన రైతులను మిరియాల సాగు వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు–1 అనే రకాల మిరియాలు సాగవుతున్నాయి. వాటికన్నా అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చే మేలు రకాల మొక్కల (మదర్ ప్లాంట్ల)ను కోజికోడ్లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్–ఐఐఎస్ఆర్) నుంచి తీసుకొచ్చి చింతపల్లిలో నర్సరీల్లో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో శక్తి, మలబార్ ఎక్సెల్, పౌర్ణమి, గిరిముండ, పంచమి, శుభకర, శ్రీకర రకాల మొక్కలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో దిగుబడి వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వచి్చంది. 3.2 కిలోల పచ్చి మిరియాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. వాటి ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150 కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరియాలతో సమకూరింది. లాభసాటి మొక్కల అభివృద్ధి కేరళ నుంచి లాభసాటి రకాల మిరియం మొక్కలను తెచ్చి నర్సరీల్లో అంట్లు కట్టడం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే జీకే వీధి, చింతపల్లి, పాడేరు మండలాల్లో రైతులకు మొక్కలు ఉచితంగా పంపిణీ ప్రారంభించాం. రానున్న రోజుల్లో మిగతా మండలాల్లోనూ అందిస్తాం. ఎకరాకు వంద మొక్కలు చొప్పున అవసరమవుతున్నాయి. – రాధాకృష్ణ, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ రైతులకు సహకారం ఎరువులు, సస్యరక్షణ ఖర్చు లేకపోయినా మిరియాల కోత రైతులకు కాస్త కష్టమైన పని. ఇందుకు వెదురుతో చేసిన నిచ్చెనలు వాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పైస్ బోర్డు అభివృద్ధి చేసిన అల్యూమినియం నిచ్చెనలను ఉచితంగా సమకూరుస్తున్నాం. క్లీనింగ్, గ్రేడింగ్ మెషిన్లను ఇస్తున్నాం. ఇప్పటివరకూ 20 వేల మంది రైతులకు బృందాల వారీగా సమకూర్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల, ప్రాజెక్టు అధికారి, పాడేరు ఐటీడీఏ -
గిరిజన గురుకులాల్లో అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అక్షర యజ్ఞం మొదలైంది. గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 45 శాతం మంది విద్యార్థులకు సబ్జెక్టులపై సరైన పట్టు లేదని గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్లైన్ టెస్ట్లో స్పష్టం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 190 గిరిజన గురుకుల విద్యాలయాలు ఉండగా వీటిని 9 రకాలుగా విభజించారు. వేర్వేరు గురుకులాల్లో 28,237 మంది బాలురు, 19,149 మంది బాలికలున్నారు. కో ఎడ్యుకేషన్లో 3,664 మంది చదువుతున్నారు. మొత్తంగా చూస్తే గిరిజన గురుకులాల్లో 51,040 మంది విద్యార్థినీ విద్యార్థులున్నారు. మూడు సబ్జెక్టుల్లో తర్ఫీదు.. గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్లైన్ టెస్ట్లో 20 వేల మందికి పైగా విద్యార్థులు సగటు కంటే తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థులకు గణితం, ఆంగ్లం, తెలుగులో ప్రమాణాలు పెంపొందించేందుకు 15 రోజుల క్రితం గురుకుల సొసైటీ 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రతి పది రోజులకు ఒక అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక యాప్తో నిత్యం పరిశీలన.. గురుకులాల్లో అక్షర యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు కార్యదర్శి ప్రత్యేక యాప్ను తయారు చేయించారు. రోజూ ఈ యాప్ ద్వారా మూడు సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని ఉపాధ్యాయుడు వివరించాలి. కార్యదర్శి ప్రతి స్కూలులో విద్యార్థుల ప్రమాణాలను ర్యాండమ్గా పరీక్షించి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు.. విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. 50 రోజుల్లో గణితం, ఇంగ్లిష్, తెలుగులో పరిపూర్ణమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులకు కేటాయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై కొరడా ఝుళిపించేందుకు సైతం గురుకుల సంస్థ సన్నద్ధమైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ 50 రోజుల కార్యక్రమంలో ఉన్నారు. వారికి అన్నీ ఒకటే! గురుకులాల్లో చదువుతున్న పీవీటీజీ విద్యార్థులతో పాటు పలు ఏజెన్సీ ఏరియాల్లో పిల్లలు వారి సొంత భాషలో మాట్లాడతారు. ఆ భాషలకు లిపిలేదు. అందువల్ల ఆ భాషలో బోధించే అవకాశం లేదు. వారు తెలుగు, ఇంగ్లిష్, హిందీని పరాయి భాషల మాదిరిగానే భావించే అవకాశం ఉన్నందున దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి లేఖే ప్రేరణ ‘50 రోజుల అక్షర యజ్ఞానికి విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని కొయ్యూరు బాలుర గురుకుల స్కూలు విద్యార్థి ఆత్మహత్య ఘటనే ప్రేరణగా నిలిచింది. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ విద్యార్థి తనకు తెలుగు రాదని లేఖలో పేర్కొన్నాడు. తనను తల్లిదండ్రులు చదువు రాని వాడు అంటున్నారని, స్నేహితులు గేలి చేస్తున్నారని మనస్థాపం చెందాడు. ఆ విద్యార్థి లేఖ నన్ను కదిలించింది. అందుకే బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. విద్యా ప్రమాణాల విషయంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులే బాధ్యులు. గిరిజన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వారిలో పట్టుదల ఎక్కువ. ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటే వారు ప్రపంచాన్ని జయిస్తారు’ – కె. శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ, తాడేపల్లి -
ఐటీడీఏలతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది. పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు. ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది. పోడు వ్యవసాయానికి పెద్దపీట ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది. -
త్వరలో ‘గిరిజన వికాసం’ వెబ్సైట్
సాక్షి, అమరావతి: గిరిజనుల ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో ‘గిరిజన వికాసం’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించనుంది. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ఈ వెబ్సైట్లో గిరిజన కుటుంబాలకు చెందిన అన్ని వివరాలు పొందుపరచనున్నారు. వెబ్సైట్లో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి సబంధించిన సమగ్ర వివరాలు ఉండటం వల్ల వారి ఆస్తులకు రక్షణ ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. దీనివల్ల ఎలాంటి భూ వివాదాలకు తావుండదని చెప్పారు. ముఖ్యమంత్రితో ఈ వెబ్సైట్ను ప్రారంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆధార్ నంబర్తో అనుసంధానం రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు సంబంధించి నిర్వహించిన సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారం పూర్తిగా ఒక చోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన కుటుంబ యజమాని లేదా కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్ వెబ్సైట్లో నమోదు చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ఒక వేళ సమాచారంలో లోపం ఉంటే సంబంధిత ఐటీడీఏలో వివరాలు తెలిపి మార్పులు చేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు గిరిజన కుటుంబాలకు అందాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగ పడుతుంది. వెబ్సైట్లో ఏముంటాయంటే.... ► గిరిజన కుటుంబంలో సభ్యుల పూర్తి వివరాలు. స్థిర, చరాస్తుల వివరాలు ► గిరిజన రైతుల పేరిట ఉన్న భూముల సమగ్ర వివరాల నమోదు, వెబ్ల్యాండ్, ఆర్వోఎఫ్ఆర్ çహక్కు పత్రాల వివరాలు. ► పట్టాదారు పేరు, ఊరిపేరు, సర్వే నంబరు ఇతర వివరాలు. ► రైతు భరోసా కింద ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం వివరాలు. ► అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వివిధ పథకాల ద్వారా ఎంత మొత్తం సాయం అందిందనే వివరాలు ► భూములు లేని వారి వివరాలు కూడా నమోదు. వారు ఏ ప్రభుత్వ పథకం కింద ఎంత మొత్తం సాయం తీసుకున్నారనే వివరాలు. ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూమిలో గిరిజన రైతుతో జియో ట్యాగింగ్. -
గిరిజనుల ఉపాధికి జీసీసీ భరోసా
సాక్షి, అమరావతి: అడవినే నమ్ముకుని కొండ కోనల్లో నివసించే గిరిజనులకు రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అండగా నిలుస్తోంది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులతో పాటు పండించే పంటలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలతో పాటు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సుమారు లక్షన్నర గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. గిరిజనులు జొన్న, సజ్జలు, రాగులు, కంది పంటలతో పాటు అక్కడక్కడా వరి పండిస్తున్నారు. తేనె, కుంకుళ్లు, చింతపండు, ఉసిరి తదితర అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. గిరిజనులు తమ గ్రామాలను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన 962 డిపోల ద్వారా ఆయా ఉత్పత్తులన్నిటినీ జీసీసీ కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.5.23 కోట్ల విలువైన 6,320.30 క్వింటాళ్ల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో మద్దతు ధరను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తోంది. కేవలం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజన కుటుంబాలకు రూ.98.19 లక్షలు జీసీసీ ద్వారా అందాయి. కాఫీ రైతులకు ప్రోత్సాహం మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో అనువైన చోట కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.21 కోట్ల విలువైన 2,005.16 క్వింటాళ్ల అరబికా ఫార్చెమెంట్, అరబికా చెర్రీ, రోబస్టా చెర్రీ రకం కాఫీ గింజలను జీసీసీ సేకరించింది. అదే సమయంలో 760 గిరిజన కాఫీ రైతు కుటుంబాలకు రూ.1.36 కోట్ల వ్యవసాయ పరపతి కల్పించింది. గిరిజనుల అవసరాలు తీర్చడంపై జీసీసీ దృష్టి కేంద్రీకరిస్తోంది. 16 పెట్రోల్ బంకులు, 10 ఎల్పీ గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 11,704.32 కోట్ల విలువైన పెట్రోల్, గ్యాస్, కందెనల అమ్మకాలు చేపట్టింది. అలాగే ‘గిరిజన్’ బ్రాండ్ కింద అటవీ ఉత్పత్తులతో తయారయ్యే సబ్బులు, కారం, పసుపు పొడుల వంటి వస్తువులకు రూ.16.01 కోట్ల విలువైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. 75 వన్ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు ప్రధానమంత్రి వన్ధన్ వికాస్ యోజన ద్వారా 21,280 మంది సభ్యులతో కూడిన 1,125 గ్రూపులతో 75 వన్ధన్ వికాస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీసీసీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రామాల్లోనే శుద్ధి (ప్రాసెసింగ్) చేయడం ద్వారా ఉత్పత్తులకు అదనపు విలువను జోడిస్తారు. ఈ విధంగా తయారైన వస్తువులను సభ్యులు తిరిగి జీసీసీకి లేదా తమకు ఇష్టమొచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ వన్ధన్ వికాస్ కేంద్రాలు కొత్తగా మరో 188 ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. -
పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా?
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లా విభజన వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కొంతవరకు జిల్లా అధికారులు పంపించారు. మరింత సమాచారం అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా భావిస్తున్నారు. అందుకు కీలకమైన కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సమాచారం పంపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజనకు చేపట్టిన కసరత్తు జిల్లాలోనూ కొనసాగుతోంది. దీనికోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు జిల్లాలో భౌగోళిక పరిస్థితులు, భవనాలు, సిబ్బంది, ఇతర వివరాలు సేకరిస్తున్నాయి. కార్యాలయాలకు భవనాల గుర్తింపు రాష్ట్ర కమిటీలో ఒకరైన ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. పార్వతీపురం డివిజన్ కేంద్రంలో కీలకమైన కార్యాలయాలకు అవకాశం ఉన్నభవనాలు గుర్తించి ఇవ్వాలని సూచించారు. దీనిపై పార్వతీపురం సబ్ కలెక్టర్ను ప్రతిపాదనలు కోరారు. ఆయన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు సంబంధించి వివరాలు పంపించారు. కలెక్టరేట్కు ఐటీడీఏకోసం కొత్తగా నిర్మి స్తున్న భవనం, ఎస్పీ కార్యాలయానికి ప్రస్తుత డీఎస్పీ కా ర్యాలయం, ప్రత్యామ్నాయంగా యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ), జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సూచించారు. వాటి విస్తీర్ణం, అందులో భవనాల విస్తీర్ణం, ఖాళీగా ఉన్న స్థలం విస్తీర్ణం వివరాలు మ్యాప్లతో సహా నివేదించగా వాటిని కలెక్టర్ ముఖ్య కార్య దర్శి కార్యాలయానికి పంపించారు. భౌగోళిక పరిస్థితులపై నివేదిక జిల్లాకు సంబంధించి బౌగోళిక పరిస్థితులు కూడా ఇక్కడి అధికారులు పంపించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో ప్రస్తుతం ఉన్న మండలాల వారీగా జనాభా, కుటుంబాల వివరాలు పంపించారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,85,585 కుటుంబాలుండగా 23,44,439 జనాభా ఉన్నట్టు తేల్చారు. మండలాల వారీగా ఉన్న ఈ సమాచారం పంపించారు. ప్రభుత్వం వద్ద ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉందో సమాచారం ఉన్నందున వీటి ఆధారంగా విభజన పక్రియ చేపడతారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని భవనా ల వివరాలు కూడా అన్లైన్లో సంబంధిత సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా, డివిజన్ కార్యాలయాల భవనాలతోపా టు మండలస్థాయిలో ఉన్న భవనాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 106 శాఖలున్నాయి. ఇందులో విజయనగరంలో 106శాఖలు ఉండగా పార్వతీపురంలో 37 శాఖలున్నాయి. ఈశాఖల పరిధిలో మొత్తం 387 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. విజయనగరం డివిజన్లో 252, పార్వతీపురం డివిజన్లో 387 భవనాలు గుర్తించారు. ఆ వివరాలు అప్లోడ్ అవుతున్నాయి. జిల్లాలో శాఖల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలు సిద్ధమవుతున్నాయి. శాఖల వారీగా పార్వతీపురం వెళ్లాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాపై ఉన్నతాధికారుల సూచన మేరకు కసరత్తు చేస్తున్నారు. డేటా పంపిస్తున్నాం విభజన ప్రక్రియకు సంబంధించి నాలుగు కమిటీలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో వివరాలు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అప్లోడ్ చేస్తున్నారు. పార్వతీపురంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు భవనాలు గుర్తించి సూచించాలని ఉన్నతాధికారులు కోరగా ఆ సమాచారం కలెక్టర్ పంపించారు. కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలు విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. – ఎం.గణపతిరావు, డీఆర్వో, విజయనగరం -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
సాక్షి, అమరావతి/పార్వతీపురం టౌన్/పాడేరు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యేలు, నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సేవలను కొనియాడారు. 90 శాతం హామీలు నెరవేర్చాం.. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని, మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పుష్పశ్రీవాణి కొనియాడారు. కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా.. విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, మాజీ మంత్రి మణికుమారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ ఎస్టీ సెల్ నేతలు పాల్గొన్నారు. నాడు వైఎస్సార్ 32 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో గిరిజనులకు హక్కులు కల్పించారని పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుంభా రవిబాబు గుర్తుచేసుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 వేల ఎకరాల భూమిని 24,500 మంది గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారని కొనియాడారు. -
విస్తరిస్తున్న విశాఖ యాపిల్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాల్లో యాపిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 10 వేల ఎకరాల్లో యాపిల్ సాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాల్లో గిరిజన రైతులతో యాపిల్ సాగు చేయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. - వచ్చే జనవరి నుంచి గిరిజన రైతులకు మొక్కల పంపిణీకి శ్రీకారం చుడతారు - ఏడాది వయసున్న ఒక్కొక్క మొక్కకు రూ.250 చొప్పున వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది - లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్ సాగుకు బాగా అనుకూలం - ఇక్కడ ఒక్కో సమయంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీలకు పడిపోతుంది. ఎక్కువ రోజులు సున్నా డిగ్రీలు నమోదవుతుంది - హిమాచల్ ప్రదేశ్లో పండుతున్న అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాలను ఇక్కడ సాగు చేయిస్తారు - రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. అప్పటినుంచి 20 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది. యాపిల్ సాగుకు అనువైన ప్రాంతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి, చింతపల్లి, జీకే వీధి గిరిజన గ్రామాలు యాపిల్ సాగుకు అనువైనవిగా గుర్తించాం. తక్కువ ఉష్టోగ్రతల్లో పండే యాపిల్ రకాలను ఇక్కడ సాగు చేయించాలని నిర్ణయించాం. భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తాం. – ఆర్పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ -
అడవి ‘తల్లి’కి ఆలంబన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. గిరిజన స్త్రీలు గర్భందాల్చితే వారిని అత్యవసర వైద్యానికి ‘డోలీ’ కట్టి కొండలు, గుట్టల మీదుగా మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేది. జిల్లాలో గత మూడేళ్లలో 60 మంది తల్లులు, 673 మంది శిశువుల మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో గిరిశిఖర గర్భిణుల ప్రాణాలకు పూర్తి భరోసా లభిస్తోంది. పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పని చేసిన లక్ష్మీషా గతేడాది కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గిరిజన గర్భిణుల కోసం సాలూరులో ప్రత్యేక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులను ఈ కేంద్రానికి తరలించి, అవసరమైన వైద్యం, పౌష్టికాహారం అందించటంతో పాటు ప్రసవం కూడా ఇక్కడే జరిగేలా వసతులు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని మిగతా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం వసతి కేంద్రాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వసతి కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించడం గమనార్హం. అంకురార్పణ జరిగిందిలా.. సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలోని సిరివర గ్రామంలో కొండతామర గిందె అనే మహిళకు పుట్టిన బిడ్డ మరణించడం, ఆ బాలింతను డోలిలో గ్రామస్తులు తీసుకురావడంపై 2018 జూలై 31న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘జోరువానలో 12 కిలోమీటర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. దీన్ని సుమోటో ఫిర్యాదుగా స్వీకరించి, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ ఎం. హరిజవహర్లాల్ సూచనలతో అప్పటి పార్వతీపురం ఐటీ డీఏ పీఓ లక్ష్మీషా 2018 ఆగస్టు 2న కాలినడకన అటవీమార్గం గుండా సిరివర గ్రామానికి వెళ్లారు. మాతా, శిశుమరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. వసతి గృహంలో యోగా చేస్తున్న గర్భిణీలు ముఖ్యమంత్రి చొరవతో విస్తరిస్తున్న సేవలు ప్రసవ సమయానికి నెలన్నర, రెండు నెలలు ముందు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణులకు తగిన రక్షణ, వైద్యం కల్పించాలని లక్ష్మీషా భావించారు. 2018 సెప్టెంబరు 17న సాలూరులో ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 291 మంది చేరారు. వీరిలో 250 మందికి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం 41 మంది గర్భిణులు వసతి పొందుతున్నారు. సాలూరు వసతి కేంద్రం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భం అరకులో మరో వసతి కేంద్రాన్ని ప్రారంభించారు. పాడేరు, చింతపల్లికి కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు వసతి కేంద్రాన్ని సందర్శించనున్న గవర్నర్ విజయనగరం జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా సాలూరులోని గర్భిణుల వసతి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక్కడ గర్భిణులకు అందుతున్న సేవలను గవర్నర్ స్వయంగా పరిశీలించనున్నారు. గర్భిణులకు సకల వసతులు గర్భిణులకు పురిటి నొప్పులు ప్రారంభం కాగానే సాలూరు సీహెచ్సీకి నిమిషాల వ్యవధిలోనే తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికోసం అంబులెన్స్ ఉంది. వసతి కేంద్రంలో గర్భిణులకు సమయానికి పౌష్టికాహారం అందుతుంది. ఉదయం పాలు, గుడ్లు, కిచిడి, లెమన్ రైస్.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాగిజావ, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం (ఆదివారం, బుధవారం మాంసాహారం), సాయంత్రం వేరుశనగ చక్కిలు, నువ్వుల చక్కిలు, పండ్లు, రాత్రి భోజనం అందజేస్తున్నారు. పరీక్షల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. ఉదయం గర్భిణులతో యోగా చేయిస్తున్నారు. వినోదం కోసం టీవీ ఉంది. చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. గర్భిణులకు ఇంతకుముందే పిల్లలు ఉంటే, వారిని వసతి కేంద్రంలో తమతో పాటే ఉండనివ్వొచ్చు. వసతి కేంద్రం చాలా సౌకర్యంగా ఉంది ‘‘నేను 13 రోజులుగా సాలూరు వసతి కేంద్రంలో ఉంటున్నాను. ఇంటి వద్ద కంటే ఇక్కడే చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సమయానికి అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు’’ – సీదరపు నర్సమ్మ, గర్భిణి, బొడ్డపాడు, జిల్లేడువలస గ్రామం, సాలూరు మండలం ఇక్కడ ఉంటే భయం లేదు ‘‘మా గిరిజన గ్రామాల్లో పురుడు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరైన రోడ్డు లేకపోవడంతో, పురిటి నొప్పులు వస్తే సమయానికి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. వసతి కేంద్రంలో ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా పోయింది. తరచూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయానికి మంచి ఆహారం అందిస్తూ గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నారు’’ – పేటూరి కాంతమ్మ, గర్భిణి, ఊబిగుడ్డి, కేసలి పంచాయతీ, పాచిపెంట మండలం తల్లీబిడ్డల ప్రాణాలు పోకూడదనే... ‘‘గిరిజన గ్రామాల్లోని గర్భిణులు పురిటి సమయంలో తరుచూ ఇబ్బందులు పడడం, మాతా శిశుమరణాలు నమోదవుతుండడం చాలా భాద కలిగించేది. ప్రసవ సమమంలో తల్లీ బిడ్డల ప్రాణాలు పోకూడదన్న లక్ష్యంతో గర్భిణుల కోసం సాలూరులో వసతి కేంద్రం ఏర్పాటు చేశాం’’ – డా.జి.లక్ష్మీషా, గిరిశిఖర గర్భిణుల వసతి కేంద్రం రూపకర్త -
ఐటీడీఏ ముట్టడికి యత్నం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు మళ్లీ పోరుబాట పట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరుతూ బుధవారం ఐటీడీఏ కార్యాలయ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలను పోలీసులు కట్టడి చేసే క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కుమురంభీం కాంప్లెక్స్లో బుధ వారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. లోపల సమావేశం జరుగుతుండగా.. వెలుపల ఆదివాసీలు నినాదాలతో హోరెత్తించారు. లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపించడంతో కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యలు బయటకు వచ్చి ఆదివాసీలను శాంతింపజేసేందుకు యత్నించారు. వారి ప్రధాన డిమాండ్పై సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినందున తీర్పు వచ్చేవరకూ ఆగాలన్నారు. ఏజెన్సీలో డీఎస్సీ నిర్వహిం చేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో తీర్మా నం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు
సాక్షి, ఆదిలాబాద్ : ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇష్టార్యాజంగా వ్యవహరిస్తూ అదే శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, గెస్ట్ హౌజ్ల పనులు టెండర్లు పిలవకుండానే పనులు చేపడుతున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీడీఏ శాఖలోని ఉద్యోగులతో పనులు చేయించి బిల్లులు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టెండర్లు లేవు.. ఆ శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరితే వాటిని మరమ్మతు చేయించడం మంచి పనే. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆయా పనులకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ పనులను తక్కువ ధరకు చేయించేలా రూపకల్పన చేస్తారు. దాని ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తారు. టెండర్లకు హాజరైన కాంట్రాక్టర్లలో ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి పనులు అప్పగిస్తారు. పైగా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీడీఏ పరిధిలో పని చేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పద్ధతి ప్రకారం వారు రికార్డు చేస్తేనే కాంట్రాక్టర్కు బిల్లులు వస్తాయి. కానీ ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న కొన్ని పనులకు టెండర్లు పిలువకుండానే వివిధ పనులను చేపట్టారని తెలుస్తోంది. ఉద్యోగులకు పనులు.. సర్వ సాధారణంగా ఏవైనా పనులు చేపట్టాలంటే సంబంధిత శాఖకు చెందని వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ ఐటీడీఏలో మాత్రం అలా జరగడం లేదని ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత శాఖ ఉద్యోగులే కాం ట్రాక్టర్ల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. లక్షల విలువైన పనులన్ని ఉద్యోగుల పేరిటే జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంతో పాటు గెస్ట్ హౌజ్, మరమ్మతులకు లక్షల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కా కుండా వివిధ ఆశ్రమ పాఠశాలల్లో వైరింగ్, పే యింటింగ్, తదితర పనుల పేరిట అదే శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు పనులు అ ప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఓ అ« దికారి అండదండలు ఉన్నట్లు గుసగుసలు వి నిపిస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు.. ఎన్నికల కోడ్ కంటే ముందు వివిధ సంఘాల నాయకులు ఐటీడీఏ గెస్ట్ హౌజ్కు మరమ్మతులు చేయాలని పలుమార్లు విన్నవించినా ఆ శా ఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు న్నాయి. ఎన్నికల అధికారుల కోసం విశ్రాంతి భవనాలకు మరమ్మతులు చేస్తున్నామని అ ధి కారులు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ అ మల్లోకి రాకముందు పట్టించుకోని అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఎట్టకేలకు ఐటీడీఏలో కదలిక
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది అడవులు.. గిరిజనులు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. అటవిని నమ్ముకుని జీవించే గిరిపుత్రుల అభ్యున్నతికి బాటలు వేయాల్సింది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. అటువంటి ఐటీడీఏ మూడేళ్లుగా గిరిజనుల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించలేక పోయింది. ప్రణాళిక రూపొందించినప్పుడే అమలు చేయలేకపోయిన అధికారులు ఇక ప్రణాళిక లేమి కారణంగా ఎంతవరకు అభివృద్ధి చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నెలలోనే.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశం ఈనెల చివరి వారంలో నిర్వహించాలని యోచిస్తున్నారు. చివరిసారిగా 2016 జూలైలో జిల్లాల విభజనకు ముందు ఈ సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం నిర్వహించక 36 నెలలు దాటింది. వివిధ దశలో ఆటంకాలు కూడా సమావేశ నిర్వహణకు అడ్డు తగిలాయి. 2016 అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఆదిలాబాద్ జిల్లా విభజనలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ మొత్తం నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి. జిల్లాల విభజన తర్వాత సమావేశం జరగలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, లంబాడాల మధ్య వివాదంతో కొద్ది నెలల పాటు శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోవడంతో అసెంబ్లీ రద్దయ్యింది. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరుసగా రావడంతో కోడ్ అమల్లోనే ఉంది. కోడ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు అన్ని అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీడీఏ గవర్నింగ్బాడి సమావేశ నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా ఉన్నారు. పీఓగా కృష్ణా ఆదిత్య వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీడీఏ పా లకవర్గ సమావేశ నిర్వహణ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు జిల్లాల్లో గిరి జనుల కోసం గత 12 క్వార్టర్స్ (36 నెలలు)లో గిరిజనాభివృద్ధికి సంబంధించి నిధులు, ఖర్చులకు సంబంధించి నివేదికలు సమర్పించారు. త్వ రలో సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా వీటికి స్పందించి స్పష్టమైన లెక్కలు ఉండాలని చైర్పర్సన్, పీఓ ఆదేశించారు. అయితే గడిచిన 36 నెలలకు సంబంధించి ఖర్చుల లెక్కలే జరగబోయే పాలకవర్గ సమావేశంలో పరిశీలన చేస్తారా.. లేనిపక్షంలో గిరిజనాభివృద్ధి భవిష్యత్ ప్రణాళిక కూడా రూపొందిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఐటీడీఏనే ఒక ప్రత్యేకం.. ప్రస్తుతం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పడినప్పటికీ ఐటీడీఏ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ కేంద్రంగానే పనిచేస్తోంది. 2018 మేలో ఐటీడీఏ పీఓగా కృష్ణా ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు రూపొందించినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే వారికి ప్రయోజనం దక్కుతుంది. 1975 ఆగస్టు 1న మొదట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే హెడ్క్వార్టర్తో ఐటీడీఏ ఏర్పాటు జరిగింది. 1979లో ఈ హెడ్క్వార్టర్ను ఉట్నూర్కు తరలించడం జరిగింది. దీని అధికార వికేంద్రీకరణ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని 44 మండలాలతో ఉంది. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ దీనికి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జియోగ్రాఫికల్ ఏరియా ఆధారంగా 38.13 శాతం ట్రైబల్ సబ్ప్లాన్ ఏరియా కిందికే వస్తాయి. ఐటీడీఏ ద్వారా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు జరిగింది. తద్వారా జిల్లా యంత్రాంగానికి సరిసమానంగా ఇక్కడ ఒక యంత్రాంగం పనిచేస్తుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. విద్య, వైద్య, ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయి. డీఈఓ (ఏజెన్సీ), డిప్యూటీ డైరెక్టర్ (టీడబ్ల్యూ), డీటీడబ్ల్యూవో, అడిషనల్ డీఎంహెచ్ఓ (ట్రైబల్), జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఈ ఉట్నూర్ కేంద్రంగా పనిచేస్తారు. అదే విధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, జైనూర్, కాగజ్నగర్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్లలో ఏటీడబ్ల్యూవోలు క్షేత్రస్థాయిలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. ఇంతటి విభాగాలు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ప్రణాళిక లేమి కారణంగా గిరిజనాభివృద్ధి సమగ్రంగా జరగడం లేదనేది స్పష్టం. ప్రగతి జరిగేనా.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా విద్య, వైద్యంలో గిరిజనులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ముఖ్య లక్ష్యం. ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల నిర్మాణం, జీపీ భవనాలు, ఎంఎంఎస్ బిల్డింగ్ల నిర్మాణం, ఇతరత్ర విస్తృతంగా చేపట్టాలి. మూడేళ్లుగా ప్రణాళిక లేక సాగిపోతోంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం జరిగింది. అంతేకాకుండా పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కలిసి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చతో పాటు గిరిజనుల అభివృద్ధికి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. తద్వారా గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఎల్టీఆర్–1959 యాక్ట్, 1970 రెగ్యులరైజేషన్ ప్రకారం గిరిజనేతరుల నుంచి అటువంటి భూములను స్వాధీనం చేసుకొని తిరిగి గిరిజనులకే అప్పగించాలి. అలాంటి కేసులు ఏజెన్సీ మండలాల్లో అనేకంగా పెండింగ్ ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఐటీడీఏలో ఉందంటే ప్రాధాన్యత గ్రహించాలి. అదేవిధంగా గిరిజన ఉత్పత్తులకు సంబంధించి విక్రయించుకునేందుకు గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్ లిమిటెడ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ లిమిటెడ్ ద్వారా గిరిజనులకు సరైన ఆదరణ లభించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత చొరవ తీసుకొని గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా చూడాలి. తద్వారా గిరిజనులకు ఆదాయం లభిస్తుంది. సీసీడీపీ నిధులతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. వెంటాడుతున్న సమస్యలు.. గిరిజనులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సీజనల్ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు, రక్తహీనత గిరి జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. సర్వేలో విద్యార్థులకు సికిల్సిల్, తలసేమియా వ్యాధులు బయటపడ్డాయి. అదేవిధంగా నేటికీ ఏజెన్సీ గ్రామాలకు సరైన రవాణ సదుపాయాలు లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలో రోడ్లు తెగిపోయి అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు పడిన ఇబ్బందులు అవగతమే. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. నివేదికలు సిద్ధం చేసుకోవాలి ట్రైబల్ సబ్ప్లాన్కు సంబంధించి వివిధ శాఖల ద్వారా ఈ మూడేళ్ల కేటాయింపులను వివరంగా తీసుకురావాలని సూచించడం జరిగింది. ట్రైకార్కు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది. ఎల్టీఆర్ కేసులకు సంబంధించి వివరాలను కూడా పాలకవర్గ సమావేశంలో చర్చిస్తాం. నాలుగు జిల్లాల అధికారులు పూర్తి సమాచారం సిద్ధం చేసుకోవాలి. – కృష్ణా ఆద్యిత, పీఓ, ఐటీడీఏ, ఉట్నూర్ -
మన్యంలో ఏనుగు భీభత్సం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : మన్యం గజగజలాడింది. ఐటీడీఏ పరిధిలోని గ్రామాలను పన్నెండేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఏనుగుల గుంపులోని ఓ మదగజం మారణకాండకు పాల్పడింది. సోమవారం ఈతమానుగూడ గ్రామానికి చెందిన సవర గయ్యారమ్మ (53), మండ గ్రామానికి చెందిన సవర బోడమ్మ(65)లను పొట్టనపెట్టుకుంది. సీతంపేట మండలంలో ఏనుగు దాడికి దిగడం పన్నెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మిగతా మండలాలపై ప్రతాపం చూపిన ఏనుగుల గుంపు సీతంపేట మండలాన్ని మాత్రం కనికరించాయి. 2007 అక్టోబర్ నెలలో మన్యంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు మండలంలోని కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన పసుపురెడ్డి అప్పారావు, సిరిపోతుల మరియమ్మలను చంపేశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇద్దరిని హతమార్చాయి. ఐటీడీఏ పరిధిలో 13 మందిని ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో పొట్టన బెట్టుకున్నాయి పని చేసుకుంటుంటే.. ఈతమానుగూడకు చెందిన గయ్యారమ్మ కొండపోడు పనులుచేస్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపులో ఓ ఏనుగు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందిం ది. అలాగే మండ గ్రామానికి చెందిన బోడమ్మ, శ్రీరంగమ్మలు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఏనుగులు కనిపించడంతో శ్రీరంగమ్మ పరుగు లంకించుకుని తప్పించుకుంది. బోడమ్మ మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏనుగు తీవ్రం గా దాడి చేసి గాయపర్చడంతో స్థానికులు ఆమెను సీతంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి పాలకొండ రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో శ్రీకా కుళం రిమ్స్కు తరలించాలని చెప్పారు. రిమ్స్కు తరలించగా అక్కడే ఆమె మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొండంతో తెచ్చి.. గయ్యారమ్మపై కొండపైన దాడి చేసిన ఏనుగు ఆమెను చంపేసి తొండంతో పట్టుకుని వచ్చి గ్రా మ పొలిమేరల్లో చెట్టు కింద పడేసిందని గిరిజనులు తెలిపారు. కిలోమీటరున్నర దూరంలో ఎత్తైన కొండపై కొండపోడు పని చేస్తుంటే అక్కడ దాడి చేసిన ఏనుగు మృతదేహాన్ని తొండంతో తీసుకురావడం, గ్రామానికి సమీపంలో ఓ భారీ వృక్షం వద్ద పడేసి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయని స్థానికులు చెబుతున్నారు. తామంతా వేర్వేరు చోట్ల కొండపోడు పనులు చేసుకుంటున్నామని, ఒక్కసారిగా వచ్చిన ఏనుగు భయంకరమైన అరుపులతో తన తల్లిపై దాడి చేసిందని మృతురాలి కుమారుడు ఈశ్వరరావు తెలిపారు. అలాగే గ్రామంలో ఓ మరుగుదొడ్డిని కూడా నాశనం చేసిందన్నారు. గంటల వ్యవధిలోనే.. గంటల వ్యవధిలోనే ఒకే ఏనుగు ఇద్దరిని చంపేసి బీభత్సం సృష్టించింది. మొదట కొండపోడు పనుల కోసం మండ నుంచి సుదూర ప్రాంతానికి నడిచివెళ్తున్న బోడమ్మపై దాడి చేసిన ఏనుగు అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈతమానుగూడకు చేరుకుని అక్కడ పోడు పనులు చేస్తున్న గయ్యారమ్మపై దాడి చేసి చంపేసింది. ఏజెన్సీలో తిరుగుతున్న నాలుగు ఏనుగుల గుంపులో కొద్ది రోజుల కిందట ఒక ఏనుగుకు విద్యుత్షాక్ తగిలి మతి భ్రమించిందని ఆ ఏనుగు మాత్రమే ఈ తరహా దాడులకు తెగబడుతోందని అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఓ వైపు 3 ఏనుగులు సంచరిస్తుంటే మరో వైపు ఒక ఏనుగు మాత్రం వేరేగా తిరుగుతోందని చెబుతున్నారు. కొండపో డు పనులు వంటివి చేయడానికి వెళ్లాలంటే భయమేస్తోందని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. గత మూడు నెలలుగా సీతంపేట మండలంలోనే ఏనుగులు తిష్టవేశాయి. మొదట చిన్నబగ్గ అటవీ పరిధిలో బగ్గ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న నాలుగు ఏనుగుల గుంపు బొండి సమీపంలో ఊటబావి వద్ద పక్షం రోజులకు పైగా గడిపాయి. అనంతరం కొండాడ, మేడ ఒబ్బంగిల్లో మరికొన్ని రోజులున్నాయి. అంటికొండ, పెద్దగూడ గ్రామాల్లో నాలుగు రోజుల కిందటి వరకు సంచరించాయి. తాజాగా మండ, జొనగ, ఈతమానుగూడ ప్రాంతాల్లో సంచరిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. -
సాగులోకి గిరిజనుల భూమి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడానికి చిన్ననీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్లో ఎస్టీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరుల ఉపయోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా నీరందే భూములకు కాకుండా, మిగిలిన భూములకు చిన్ననీటి వనరులైన చెరువులు, వాగుల ద్వారా నీరందించాలని సూచించారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా కొండలు గుట్టల్లో ఉంటాయని.. అందుకోసం పైపుల ద్వారా సాగునీరందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పోడు భూముల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని.. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎంత సాగుభూమి ఉందనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎస్టీ రైతులు మంచి పంటలు పండించుకునే విధంగా సాగునీటి ప్రణాళిక ఉండాలన్నారు. రాష్ట్రంలో 46,500 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టులున్నాయి. 16,771 చెరువులు విడిగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90% చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ చెరువులకు ఈ వర్షాకాలం నుంచే ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలి. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, పడువాటు నీళ్లు చెరువులకు చేరే విధంగా ఫీడర్ ఛానళ్లు, అలుగు కాలువలు ఈ ఎండాకాలంలోనే పూర్థిస్థాయిలో సిద్ధం చేయాలి’అని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ దృష్టి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కూడా అధికంగానే ఉంది. వాగులు, వంకలు చాలా ఉన్నాయి. వీటిపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు నీరందించవచ్చో గుర్తించాలి. మిగతా ప్రాంతాలకు చిన్ననీటి వనరుల ద్వారానే నీరివ్వాలి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకు చిన్ననీటి వనరుల వినియోగం ద్వారా గరిష్ట భూ–వినియోగం అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బూర్గంపాడు సమీపంలో జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు 1500 హెచ్పీ మోటార్లను ఉపయోగించి ఆ ప్రాంతానికి నీరివ్వాలని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును కోరారు. ఆదిలాబాద్లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్వరూపం, వాటివల్ల సాగయ్యే భూమి వంటి అంశాలను అధ్యయనం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో వట్టివాగు, లాతూరు గండిలను వినియోగించుకొనే మార్గాలను చూడాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంఏవై.. పత్తా లేదోయ్!
హోరున గాలి వీస్తుంటే మట్టి గోడల పక్కన భయంభయంగా బతకాల్సిందే. జోరున వాన కురుస్తుంటే చిల్లులు పడిన రేకుల కింద బకెట్లు మారుస్తూ రోజులు గడపాల్సిందే. ఏనుగుల ఘీంకరింపులు వినిపించిన వేళ తంతే విరిగిపోయే తలుపుల వెనుక నోరు కట్టుకుని మౌనంగా ఉండాల్సిందే. గిరిజన గూడేల్లోని గుడిసెల బతుకుల్లో మార్పు రావడం లేదు. పక్కా ఇంటికి మారాలన్న వారి కల నెరవేరడం లేదు. రెండేళ్లుగా ఊరించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆఖరుకు ఉసూరుమనిపించింది. అర్హులను గుర్తించి ఆ తర్వాతి పనులు ఆపేసింది. ఫలితంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు పూరి గుడిసెల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం, సీతంపేట: ఐటీడీఏ పరిధిలో పీఎంఏవై పథకం దాదాపు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. రెండేళ్లుగా ఈ పథకం ద్వారా ఒక్క ఇంటిని కూడా మం జూరు చేయలేదు. దీంతో గిరిజనులు మళ్లీ ఆ పాత ఇళ్లలోనే కాలం నెట్టుకురావాల్సి వస్తోంది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకం వీరి బతుకులను మార్చలేకపోతోంది. 2017లో ఈ పథకం ద్వారా ఆగమేగాలపై పల్స్ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఇంటింటా సర్వే చేశారు. మండలానికి 3 నుంచి 4 వేల వరకు గృహాలు అవసరమని గుర్తించారు. ఈ మేరకు వినతులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఈ పథకానికి సంబంధించిఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో సుమారు 60 వేల కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవని సర్వేలో గుర్తించారు. కానీ అలా గుర్తించిన వారికి ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వలేదు. కొద్ది నెలల కిందట వచ్చి తిత్లీ తుఫాన్కు ఉన్న రేకులు, పూరిళ్లు ఎగిరిపోవడంతో గిరిజనులు పడుతున్న బాధలు రెట్టింపయ్యాయి. 2016లో కేవలం సీతంపేట మండలానికి సంబంధించి పీఎంఏవైలో మాత్రమే 33 గృహాలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి మరెవరికీ గృహాలు మంజూరు కాని పరిస్థితి ఉంది. ఈ పథకంలో ఒక్కో గృహానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందివ్వాలని గతంలో నిర్ణయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి అతీగతి లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణానిదీ అదే దారి ఎన్టీఆర్ గృహనిర్మాణానిది కూడా దాదాపు ఇదే దారి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఈ పథకం కింద 148 గృహాలు మాత్రమే మంజూరయ్యాయి. పాలకొండ డివిజన్లో 770, టెక్కలి డివిజన్ పరిధిలో 158 మాత్రమే మంజూరయ్యాయి. మొత్తం 1076 మంజూరు కాగా వీటిలో 500ల వరకు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటికి ఎన్నికల హామీల్లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లో గృహాల నిర్మాణానికి రూ.2లక్షల 75 వేలు ఇస్తామని ఇందులో రూ. 1.75 వేలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చ లేదు. కేవలం రూ.లక్షా 50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికితోడు గత కొద్ది రోజులుగా నూతనంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆన్లైన్లో ఏఈల ఆధార్ అథంటికేషన్ నిలిచిపోవడమేనని చెబుతున్నారు. హౌసింగ్ ఏఈ ఏమన్నారంటే... ఈ విషయమై హౌసింగ్ ఏఈ సంగమేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పీఎంఏవై గృహాలకు సంబంధించి గతంలో పల్స్ సర్వే చేశామని ఇంకా ఇళ్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం బిల్లులు చెల్లింపులకు సర్వర్ నిలిచినట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు గిరిజనులకు పూర్తిస్థాయిలో గృహాలు మంజూరు చేయాలని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అలాగే ఉన్న హౌసింగ్ పథకాలకు సైతం దిశానిర్దేశం లేదు. పీఎంఏవై గృహాల మంజూరు లేదు. ఎన్టీఆర్ గృహాలు కూడా ఒక్కో మండలానికి వంద లోపే తూతూ మంత్రంగా మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.– విశ్వాసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే ఇల్లు ఇవ్వడం లేదు గృహం మంజూరు కాక అవస్థలు పడుతున్నాం. పూరిళ్లలో నివసిస్తున్నాం. ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు గృహాలు మంజూరు చేయాలి. – అమావాస్య, అచ్చిభ బిల్లులు రాలేదు కొన్నేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికీ బిల్లులు కావడం లేదు. దీంతో పునాదులు నిర్మించినా బిల్లులు ఇవ్వకపోడంతో కష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి కట్టడం జరిగింది. ప్రభుత్వ కరుణ లేదు.– ఎస్.పట్టాభి, అంటికొండ -
అన్నదాత ఇంట ఐఏఎస్
సాక్షిప్రతినిధి, విజయనగరం :ఐఏఎస్... దీనిని సాధించాలని ఎంతోమంది కలలు గంటారు. అన్ని అవకాశాలూ... పరిస్థితుల ప్రోత్సాహం... ఆర్థిక స్థితిగతులూ... తోడున్నా... అందుకోవడం కష్టమే. కానీ ఇవన్నింటికీ దూరంగా... కేవలం స్వశక్తితో పోరాడి ఐఏఎస్ అందుకున్నవారు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే డాక్టర్ జి.లక్ష్మీశ. నాలుగొందల మంది జనాభా ఉన్న కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లి పెంపకంలో ఐఏఎస్గా ఎదిగారాయన. ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా గిరిజన ప్రాంతంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడున్నర దశాబ్దాల ఐటీడీఏకు 52 మంది పీఓలు పనిచేశారు. వారంతా సగటున ఏడాదికి 20 రోడ్లు కనెక్ట్ చేస్తే లక్ష్మీశ ఒకే ఏడాదిలో 200 రోడ్లతో గిరిజన ప్రాంతాలను కనెక్ట్ చేయగలిగారు. ఇలాంటి విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ నేపథ్యం నుంచి... కర్ణాటక రాష్ట్రంలోని ఆలుగొండనహళ్లి మా గ్రామం. జనాభా కేవలం 400 మంది. ఓటర్ల సంఖ్య అందులో సగం. నాన్న గంగముత్తయ్య రైతు. చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. అమ్మ లక్ష్మమ్మ. నేను, అన్నయ్య, ముగ్గురు అక్కలు. అందరినీ అమ్మ చాలా కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ నాది. ట్రైనింగ్ కర్నూలులో పూర్తిచేసుకుని నూజివీడులో మొదటి అపాయింట్మెంట్. తరువాత పార్వతీపురం ఐటీడీఏ పీఓగా. నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్. అగ్రికల్చర్లో పీహెచ్డీని బెంగళూరులో పూర్తి చేశా. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లా. ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పూర్తి చేశా. ఐఎఫ్ఎస్లో మూడు సంవత్సరాలున్నా. హిమాచల్ ప్రదేశ్లో పనిచేశాను. కుటుంబానికి దగ్గరగాఉండాలని అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేశా. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో లిటరేచర్ చదివిన జ్ఞానేశ్వరిని 2014లో పెళ్లి చేసుకున్నాను. తను నాకు పూర్తి సపోర్ట్. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకొస్తే ఒక్కోసారి రాత్రికి గానీ ఇంటికి చేరం. నా విధినిర్వహణను నా భార్య అర్ధం చేసుకుంటుంది. మా ఇద్దరికీ ప్రాణం మూడేళ్ల మా పాప ఆద్వీ. ఇక్కడే అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది. చిన్నప్పటి నుంచీ విలువలు నేర్పాలనేది నా ఉద్దేశం. నిజాయితీగా పనిచేయాలనే... ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా నిధులు వినియోగించుకోలేకపోతే వెనక్కి వెళ్లిపోతాయి. అందువల్ల కలెక్టర్ అనుమతితో మెటీరియల్ కోసం కొంత నగదు అడ్వాన్స్ గా తీసుకుని ఉంచాం. కానీ పనులు చేయకుండానే డబ్బులు తీసేసుకున్నారంటూ కొందరు నిందలు వేశారు. వారికి వివరించా. నేను వచ్చాక ఐటీడీఏలో కొందరు ఉద్యోగులను సరెండర్ చేశా. మరికొందరిని సస్పెండ్ చేశా. బాగా పనిచేసిన వారికి ప్రమోషన్స్ ఇచ్చి పంపిం చా. మొదట్లో నేను బాగా పనిచేయలేదని చెప్పిన గిరిజన నాయకులే ఇప్పుడు పొగుడుతున్నారు. మలేరియా మరణాల నుంచి ఉపశమనం గిరిజన గ్రామాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. నేను రాకముందు పది మంది పిల్లలు ఒకే ఏడాది చనిపోయారు. మలేరియా వస్తే ఇక్కడి స్కూళ్లల్లో పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. అక్కడ వైద్యం చేయిం చకుండా భూత వైద్యుల్ని ఆశ్రయిస్తారు. అందుకే జ్వరం వస్తే పిల్లల్ని ఇంటికి పంపించవద్దని ఆదేశాలిచ్చా. ఉపాధ్యాయుల్నే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నా. 2007లో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోనే మలేరియా ఎక్కువగా వచ్చింది. కానీ ఒక్కరూ చనిపోలేదు. 2018వ సంవత్సరంలో పీహెచ్సీలకు మందులు సరఫరా చేశాం, దోమతెరలు ఇచ్చాం. ఛాలెంజ్గా చేశాం. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు సిక్టర్లు ఇచ్చి దోమ తెరను పంపిణీ చేసినప్పుడు దానిని ఆ ఇంటికి అంటించాలని చెప్పాం. మొన్న జిఎల్పురం వెళ్లి చూస్తే ఇంటి ముందు అది కనిపించింది. రాష్ట్రంలో 88 శాతం మలేరియా తగ్గింది మన విజయనగరం జిల్లాలోనే. గతేడాది జిల్లాలో 1230 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 230 కేసులే నమోదయ్యాయి. రహదారులపైనే దృష్టి ఇరవై ఏళ్ల క్రితం పార్వతీపురం ఎలా ఉందో ఈ రోజూ అలానే ఉంది. స్టేడియం ప్రొపోజల్ ఉంది. దానికి ల్యాండ్ చూశాం. ఆరెకరాల స్థలం ఒకేచోట దొరకడం లేదు. తోటపల్లి దగ్గర ఉన్న స్థలం టిట్కో వాళ్లు తీసుకున్నారు. నియోజకవర్గంలోనే ఉండాలి కాబట్టి సీతానగరం, బలిజిపేటలో ల్యాండ్ చూడమని చెప్పాం. గిరిజన ప్రాంతంలో 450 రోడ్లు కనెక్ట్ చేసిస్తే ఐటీడీఏలో మొత్తం గిరిజన గ్రామాలు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం అంబులెన్సు Ðð వెళ్లే విధంగా 200 రోడ్లు కనెక్ట్ అయ్యాయి. ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే రూ.5 కోట్లవుతుంది. అలాగే ఏజెన్సీలో రోడ్డు విషయంలో ఫారెస్టు వారి సమస్య కూడా ఉంది. సుమారు 50 రోడ్లు ఫారెస్టు వారి అండర్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం మీద 773 కిలోమీటర్ల మార్గాన్ని కనెక్ట్ చేశాం. రోడ్డు కోసం అవసరమైతే మెషీన్ కట్టింగ్కు ఫర్మిషన్ తీసుకున్నాను. రూ. 219 కోట్లతో పనులు ప్రారంభించాం. మెటల్ ప్రొబ్లమ్ వస్తే అధికారులందరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాం. ఆగస్టు నాటికి అన్ని రోడ్లూ క¯ðనెక్ట్ చేస్తాం. కాఫీ తోటలకు శ్రీకారం చింతపండు, మొవ్వ, నరమామిడి చెక్కలు జీసీసీకే ఇచ్చేవారు. ఇప్పుడు వేరే వారికి ఇస్తున్నారు. దళారి ఎక్కువ రేటు ఇస్తున్నాడు. కానీ రెండు కిలోలను ఒక కిలోగా చూపిస్తాడు. ప్రతీ జీసీసీ డీపోలో డిజిటల్ కాటా ఇచ్చాం. చింతపండు, ఉసిరి కాయల్లో పిక్కలు తీసి ప్యాకింగ్ చేయడంలో తర్ఫీదు ఇస్తున్నాం. జీసీసీ ప్రారంభమై 50 సంవత్సరాలైంది. సరైన మార్కెటింగ్, శ్రద్ధ లేక ఇలా ఉంది. మన ఏజెన్సీలో ఇప్పుడిప్పుడే 200 ఎకరాల్లో గిరిజనులు సొంతంగా కాఫీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి 400 ఎకరాల్లో కాఫీ సాగు చేయడానికి ఐటీడీఏ తరపున ఏర్పాట్లు చేస్తున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిరివర గ్రామం నుంచి గర్భిణిని డోలీలో మోసుకుని రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తాం. ఈ లోగా ఏదోఒకటి చేయాలనుకుని బెర్త్ వెయిటింగ్ రూమ్స్కు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు వైటీసీలో గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేశాం. ఇప్పుడు సాలూరు, కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో విస్తరించాం. డెలివరీకి నెల ముందు గాని రెండు నెలలు ముందుగాని తోడుగా కుటుంబ సభ్యులను తీసుకువచ్చి మరీ గర్భిణులను ఇక్కడ ఉండమన్నాం. వచ్చిన వారికి మూడు పూటల తిండి పెడుతున్నాం. 24 ఫీడర్ అంబులెన్సులు తీసుకువచ్చాం. ఇప్పటి వరకు 2,500 మందికి సేవలందించాం. రోడ్డు, మొబైల్ నెట్వర్క్ ఉంటేనే గిరిజనులకు మేలు జరుగుతుంది. ‘గిరినెట్’ ను ప్రతీ గ్రామానికి ఇవ్వడానికి చూస్తున్నాం. మార్కొండపుట్టి, కోనవలసలో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఫోన్ వెసులుబాటు కల్పిస్తున్నాం. చదువుతోనే చైతన్యం ఐటీడీఏ పరిధిలో 55 స్కూళ్లున్నాయి. 18 హాస్టళ్లున్నాయి. 45 శాతం మంది చెప్పేది మెనూ సరిగ్గా అమలు చేయడం లేదని, అందుకే స్కూల్ లెవెల్ అధికారిని నియమించి ఆ స్కూల్ బాధ్యత అప్పగించాం. అక్కడ మెనూ మార్చాం. కరెక్ట్గా అమలు చేయాలని చెప్పాం. ఎవరైతే పనిచేయరో వారిమీద చర్యలు తీసుకుంటున్నాం. -
ఈ–కామర్స్లోకి ‘గిరిజన’ బ్రాండ్స్
సాక్షి, హైదరాబాద్: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల వరకే పరిమితమైన అమ్మకాలను, తాజాగా ఆన్లైన్కు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ–కామర్స్తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం గత కొంతకాలంగా చర్చలు జరిపిన అధికారులు అవగాహన కుదుర్చుకోనున్నారు. సంప్రదాయ ఉత్పత్తుల పేరుతో.. జీసీసీ ద్వారా తేనె, సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, మసాలా పొడులు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల ప్రాసెసింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయడంతో ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీఆర్ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ద్వారా గిరిజనుల సంస్కృతులకు సంబంధించి చిత్రకళను సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక కళాకారులను గుర్తించి వారితో పెయింటింగ్స్ వేయించి విక్రయించే వెసులుబాటు కల్పించారు. తాజాగా జీసీసీ ఉత్పత్తులతోపాటు గిరిజన సాంస్కృతిక చిత్రాలను కూడా అమెజాన్ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. వీటిని ట్రైబల్ ట్రెడిషన్ ప్రొడక్ట్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. అమెజాన్తో అవగాహన నేపథ్యంలో కంపెనీ అధికారులు పలుమార్లు జీసీసీని సందర్శించారు. అదేవిధంగా పెయింటింగ్స్ను సైతం పరిశీలించారు. అవగాహన కుదిరితే ఉత్పత్తుల్లో శాంపిల్ను గోడౌన్లో అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిని డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలి. అమెజాన్ వెబ్సైట్లో గిరిజన సంక్షేమ శాఖ సెల్లర్ కేటగిరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీసీసీ నుంచి వచ్చే తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా కారం, పసుపు, సహజసిద్ధమైన సబ్బులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లకు చేరింది. ఆన్లైన్ విక్రయాలు మొదలుపెడితే టర్నోవర్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. అవగాహన ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల మొ దటివారం నుంచి గిరిజన ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. -
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
-
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి బయపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలవరంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై గత నాలుగైదు నెలలుగా సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రచురితమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సాక్షి కథనాలతో విచారణ చేపట్టిన ఐటీడీఏ పీఓ హరీంద్రయ ప్రసాద్ దాదాపు రూ. 13 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. జంగారెడ్డి గూడెం మండలం తాడువాయి, చల్లా వారి గూడెం, మంగి శెట్టి గూడెం తదితర గ్రామాల్లో సేకరించిన 1000 ఏకరాల భూమిలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్ట బయలైంది. రాళ్ల క్వారిలో జీడిమామిడి తోట ఉన్నట్లు.. పామాయిల్ తోటలో కోకో తోటలు ఉన్నట్లు, లేని టేకు, వేప చెట్లను ఉన్నవాటిగా నమెదు చేసి కోట్ల రూపాయలు మింగిన వైనం తెరమీదకొచ్చింది. పోలవరంలో జరిగిన అవినీతి నిరూపణ కావడంతో పీఓ హరీంద్రయ ప్రసాద్ ఇప్పటికే 8 మంది ఉద్యోగులను సస్సెండ్ చేశారు. దాంతో పాటు కొందరు టీడీపీ నేతలకు రికవరీ నోటీసులు పంపించి.. సొమ్ము చెల్లించపోతే కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. అయితే అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. -
ఐటీడీఏలో సగం పోస్టులు ఖాళీ
విశాఖపట్నం, పాడేరు: ఏజెన్సీలో గిరిజనాభివృద్ధికి మూలస్తంభంగా ఉన్న పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో సగానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గిరిజనాభివృద్ధికి కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన శాఖల్లో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1975లో ఐటీడీఏ ఏర్పడిన తరువాత ప్రధాన కార్యాలయ పరిపాలన విభాగానికి, వ్యవసాయ, ఉద్యాన వన విభాగాలకు మంజూరైన 86 పోస్టుల్లో ప్రస్తుతం 47 ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఐటీడీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో), స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎస్వో) పోస్టు ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఒకటి, డేటా ప్రాసెసింగ్ ఆపీసర్(డీపీవో పోస్టు) ఒకటి, సీనియర్ అకౌంటెంట్ల పోస్టులు– 2, సీనియర్ అసిస్టెంటు పోస్టులు–6, వ్యవసాయ అధికారి (ఏవో) పోస్టు–1, ఉద్యానవన అధికారులు(హెచ్వో పోస్టులు)–8, వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో పోస్టులు)–6, ఏఈవో పోస్టులు(కాఫీ)–2, టైపిస్టు పోస్టులు–4, డ్రైవర్ పోస్టులు–4, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు–4, వాచ్మెన్ పోస్టులు–2, స్టెనో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, మాలీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో అర్హులైన గిరిజన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదు. గిరిజన సంక్షేమశాఖ(విద్య)లోని పోస్టుల ఖాళీల భర్తీలోను ఏళ్ల తరబడి తాత్సారం జరుగుతోంది. ఏజెన్సీ 11 మండలాల్లో 122 ఆశ్రమ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో మంజూరైన 1997 టీచర్ పోస్టులకు గాను 181 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా 233 జీవో ప్రకారం ఈ పాఠశాలలకు కొత్తగా మంజూరైన 640 పోస్టులు భర్తీ చేయడానికి గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏజెన్సీ ఆశ్రమాల్లో 821 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, ఏటా ప్రభుత్వం 534 మంది సీఆర్టీలను నియమిస్తూ పాఠశాలలను నిర్వహిస్తోంది. 87 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు 36 ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్లుగా కొనసాగుతున్నారు. ఏజెన్సీలో కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులను కూడా అదనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఆశ్రమ వసతిగృహాల్లో కూడా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. 545 నాల్గోతరగతి ఉద్యోగుల పోస్టులకు గాను 338 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఔట్ సోర్సింగ్పై 248 మంది వర్కర్లను నియమించి వసతిగృహాలను నిర్వహిస్తున్నారు. 122 ఆశ్రమ వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 743 క్లాస్–4 ఉద్యోగులుండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెగ్యులర్, ఔట్సోర్సింగ్ కలిపి 455 మంది మాత్రమే. గిరిజన సంక్షేమశాఖలో వివిధ కేటగిరీల్లోకొత్తగా ఈ పోస్టులు మంజూరులోనూ తాత్సారం నెలకొంది. ఏజెన్సీలో వైద్య,ఆరోగ్యశాఖలోనూ 7,082 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్ఏ–మేల్), సెకండ్ ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, పోస్టుల్లోనూ అధికశాతం మంది గిరిజన అభ్యర్థులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. ఏజెన్సీలో ప్రధానమైన ఈ శాఖల్లో పోస్టులు భర్తీకాక ఉద్యోగావకాశాలు లభించక గిరిజన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. -
స్పెషల్ డీఎస్సీ కోసం ఆందోళన
పాడేరు రూరల్: ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్కుమార్ డిమాండ్ చేశారు. టెట్ క్వాలీఫైడ్ డీఎడ్ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడారు. బీఎడ్ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోట్ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
అరకులో యాపిల్ సాగుకు అనుకూల వాతావరణం
-
దాహార్తి..కక్కుర్తి
ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచుగూడెంలో నీటి సౌకర్యం కోసం చేసిన పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. లోతు తక్కువ బోర్లకు ఎక్కువ వేసినట్లు నమోదు చేయడం, టెండర్ సూచనలకు విరుద్ధంగా ఇతర కంపెనీల మోటార్లు వినియోగించడం, నాసిరకం పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఎస్టీ సెల్ నాయకుని ఫిర్యాదుతోనే ఏసీబీ విచారణ కోసం సమాచారం సేకరించనుంది. మాచర్ల టౌన్: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని చెంచుగూడెంలలో చెంచుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం రూ.11.12 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 43 చెంచుగూడెంలలోని 5,764 మంది చెంచులకు, ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 71 గూడెంలలోని 11,084 మందికి, కర్నూలు జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 17 గూడెంలలోని 3,717 మంది చెంచుల కోసం నిధుల కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలోని 131 గూడెంలకు చెందిన 20,565 మంది చెంచుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు కావాలని శ్రీశైలం ఐటీడీఏ అధికారులు తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.11.20 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో బోర్లు వేసి, మోటార్లు బిగించి, ట్యాంక్లు నిర్మించి పైప్లైన్ పనులు చేయాలని ఇంజినీరింగ్ శాఖ ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలకు విరుద్ధంగా పనులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జియాలజిస్టుల వద్ద కొన్ని చోట్ల వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేయాలని నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికలకు అనుగుణంగా వెయ్యి అడుగులకు బదులు కొన్ని చోట్ల 240, మరికొన్ని చోట్ల 500 అడుగుల వరకు బోర్లు వేసి వెయ్యి అడుగులకు బిల్లులు రాసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కొక్క బోరు విషయంలో రూ.60వేలు వ్యత్యాసముంది. గుంటూరు జిల్లాలో 43 బోర్లకు తక్కువ లోతు బోర్లు వేయడం వలన రూ.25.80 లక్షలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముంది. అంచనాలలో సూచించిన టెక్స్మో కంపెనీ మోటారుకు బదులుగా అంబూజా మోటార్లను వేశారు. ఇనుప పైప్లైన్కు బదులుగా లబ్బర్ పైప్లైన్ వేశారు. నీటి ట్యాంకులను కొన్ని చోట్ల కొలతలకు విరుద్ధంగా, మరికొన్ని చోట్ల నాసిరకంగా వేసినట్లు సమాచారం. జియాలజిస్టు నివేదిక లేకుండానే.. కొన్ని చోట్ల జియాలజిస్టు నివేదిక ఇవ్వకుండా బోర్లు పాయింట్ పెట్టని చోట్ల బోర్లు వేశారు. బొల్లాపల్లి, రేమిడిచర్ల, దుర్గి మండలంలోని నిదానంపాడు, వెల్దుర్తి మండలంలోని మండాది వంటి గ్రామాల్లో 500 అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావటం లేదు. వెయ్యి అడుగులకు బదులుగా తగ్గించి వేసిన బోర్లలో అనేక చోట్ల బోర్లు బావులు నీరు రాక నిరుపయోగంగా ఉన్నాయి. ఈ అక్రమాలపై వీటీడీఏ ఉపాధ్యక్షుడు, టీడీపీ ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మండ్లి గురవయ్య పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీఓ, ఈఈ, డీఈ, ఏఈ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇటీవల గుడిపాడు చెరువుకు విచ్చేసిన జిల్లా జేసీ, ఏసీబీ అధికారులకు అక్రమాలపై ఫిర్యాదు చేశారు. దీనికి అవినీతి నిరోధకశాఖ అధికారులు స్పందించారు. సోమవారం గురవయ్యను గుంటూరుకు పిలిపించి అక్రమాల వివరాల అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గురవయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏసీబీ అధికారులతో చర్చించిన విషయం వాస్తవమేనన్నారు. ఏసీబీ వారు విచారణ కోసం మరికొంత సమాచారం కావాలన్నారని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఇప్పటికే అర్జీ పెట్టానని, ఆ సమాచారం అందిన వెంటనే ఏసీబీ వారికి అందజేసి విచారణకు సహకరిస్తానని వివరించారు. -
పోస్ట్మెట్రిక్ హెచ్డబ్ల్యూవో సస్పెన్షన్
సీతంపేట : సీతంపేట పోస్ట్మెట్రిక్ వసతిగృహ సంక్షేమాధికారి కె.రాజారావును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదివారం సస్పెండ్ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పీవో ఆకస్మికంగా ఈ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతిగృహ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించకపోవడం, మౌలికవసతులు కల్పించాలని గతంలో హెచ్చరించినా సరైన మౌలికవసతులు కల్పించకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన్ని సస్పెండ్ చేసినట్టు పీవో తెలిపారు. సరైన పర్యవేక్షణ లేనందుకు ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు షోకాజ్నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు. -
అయ్యో.. దేవా !
వాజేడు(భద్రాచలం) : తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్టగండి వద్ద గుట్ట ల్లో కొలువైన భీరమయ్య(భీష్మశంకరుడు)ను కొలిచేందుకు భక్తులు ఏడాదికోసారి పోటెత్తుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాజేడు మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గుట్ట(గాటీ)పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు(రెండు రాష్ట్రాల సరిహద్దులో) వెళ్లే రహదారిలో గుట్టపై భీరమయ్య కొలువై ఉన్నాడు. ఈ గుట్టపై అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తుల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, పెద్దగంగారం, కడేకల్ గ్రామాలకు చెందిన గిరి జనులు భీరమయ్యను పూజిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాత ర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం కాని ఇటు భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. సౌకర్యాల లేమి.. భీష్మశంకరుడిని ఆరాధించే గిరిజనులే జాతర సమయంలో భక్తుల అవసరాల కోసం ఆయిల్ ఇంజన్ ద్వారా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక చేతి పంపును వేయించాలని ఎన్నిసార్లు గిరిజనులు, భక్తులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పేరూరు ఎస్సైగా పనిచేసిన కాగితోజు శివప్రసాద్ చేతి పంపును రహదారి పక్కన వేయించారు. అదొక్కటే ప్రస్తుతం భక్తుల దాహార్తిని తీరుస్తోంది. మధ్యలో నిలిచిన గుడి నిర్మాణం.. సమీపంలోని నాలుగు గ్రామాల ప్రజలు భీరమయ్యకు గుడినిర్మాణం తలపెట్టా రు. నిధుల లేమి, ఇతర కారణాలతో గుడి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. గిరిజనులు అధికారులకు, ఐటీడీఏకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో గుడిమధ్యలోనే ఆగిపోయింది. అటు ఐటీడీఏ, ఇటు ప్ర భుత్వం నిధులను కేటాయించకపోవడంతో దానిని నిలిపివేశారు. దానికి సమీపంలో స్వామి వారిని ప్రతిష్టించిన ప్రాంతంలో చిన్నమందిరాన్ని పోలీసుల సహకారంతో నిర్మించి పూజలు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి.. భీరమయ్య గుడికి 2008లో భద్రాచలం ఐటీడీఏ నుంచి రూ 25 లక్షల నిధులను కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరి గింది. అప్పట్లో గుడినిర్మాణంతోపాటు గుట్ట ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పడుతాయని ఈ ప్రాంత ప్రజానీకం సంతో షించారు. కాని కాలక్రమేనా వాటి ఊసేలేకుండా పోయింది. దీంతో గుడికి నిధులు మంజూరు భ్రమగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నిత్యం పూజలు.. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతోపాటు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భక్తుల తాకిడి స్వామికి ఎక్కువగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లరు. 31 నుంచి 2 వరకు జాతర.. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు భీరమయ్య జాతరను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టేకులగూడెం గ్రామస్తులు మైక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ జాతరకు గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపేవారు. మరి ఈ సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. -
ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్): ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఆశ్రమాల్లో జరిగే ప్రతీ సంఘటన.. విషయం క్షణాల్లో అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీచోట ఆరు సీసీ కెమెరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ లేదా వైఫై ద్వారా నేరుగా ఆయా జిల్లాల డీటీడీవో కార్యలయాలు, అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యలయానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆశ్రమాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేక ఐపీల ద్వారా కార్యాలయాలు, అధికారులు స్మార్ట్ఫోన్లకు ప్రత్యక్షంగా వీక్షించేలా అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతరం సీసీ నిఘా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127 ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతి గృహాల్లో 1254 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తూ వసతి సౌకర్యాలు క ల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలలపై పటిష్ట పర్యవేక్షణ ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, విద్యనందించాలని ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యకు అనుగుణంగా ఆరుకు తగ్గకుండా సీసీ కెమెరాలు, డీవీఆర్, మానిటర్లను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇప్పటికే 40శాతం పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిసింది. ఆశ్రమం ప్రధాన ద్వారం, సరుకుల గది, మైదానం, వరండాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేస్తూ కార్యాలయ గదిలో టీవీలకు అనుసంధానం చేయడం ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లేదా వైఫై సాయంతో ప్రత్యే క ఐపీల ద్వారా నేరుగా డీటీడీవో కార్యాలయానికి అక్క డి నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అధికా రుల స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. మహిళా సిబ్బంది హర్షం, బాలికలకు భరోసా.. ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆశ్రమాల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు గిరిజన సంక్షేమశాఖ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా బాలికల ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నార్నూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ అనే ఉపాధ్యాయుడు గిరిజన బాలికలపై అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుతో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి, బాలికల భద్రతకు భరోసా ఏర్పడనుంది. డుమ్మా సిబ్బందికి గుబులు.. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు అంటేనే అక్రమాలకు నిలయమని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా చా లా మంది సిబ్బంది ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం కంటే హెచ్డబ్ల్యూవో (వార్డెన్)లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూ పిస్తుంటారు. ఇందుకోసం ఉన్నతా«ధికారులపై రాజకీయంగా, ఇతర రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి హెచ్డబ్ల్యూవోలుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులకు పెట్టే మెనూలో కోత పెట్టి బి య్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టిస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడిన సం దర్భాలున్నాయి. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది వంతులవారీగా ఆశ్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సంఘటనలున్నాయి. జిల్లాలో ఓ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ నెలల తరబడి వి ధులకు హాజరు కాకుండా రిజిష్టర్లో వేరే సిబ్బందితో తన సంతకం పెట్టిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సిబ్బంది తరచూ ఆశ్రమాలకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాలు, వ్యవసాయం లాంటి పనులు చేసుకుంటున్నారు. అధికా రులకు తెలిసిన పైరవీలు, రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో సీసీ నిఘా ఏర్పాటు కావడంతో ఆశ్రమాల్లో చోటు చేసుకునే అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో విధులకు ఎగనామం పెట్టే సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యం నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో సీసీల ఏర్పాటు ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందనుంది. సీసీల నిఘాతో గిరిజన విద్యార్థులకు అన్ని రకాలుగా మేలు జరగనుంది. – పోషం, గిరిజన సంక్షేమశాఖ, డీటీడీవో, ఐటీడీఏ జిల్లాలవారీగా ఆశ్రమ పాఠశాలలు జిల్లా పేరు ఆశ్రమ, వసతి గృహాలు విద్యార్థులు ఆదిలాబాద్ 54 19,706 కుమురంభీం 46 12,327 మంచిర్యాల 17 3,359 నిర్మల్ 17 4,940 -
వేతనాల్లేవ్..ఇక ఏడుపే
పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్లు, వాచ్మెన్లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి. అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన పనిభారం.. హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్లు, భోజనం, వెజ్, నాన్ వెజ్ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి. ఇలా పనిభారం నానాటికీ పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. జీతాలు సకాలంలో రావడం లేదు. జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. – కాంతమ్మ, హెల్పర్ పనిభారం పెరిగింది గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. – రాంబాయి, హెల్పర్ పర్మనెంట్ కాక ఇబ్బందులు రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సరోజిని, హెల్పర్ -
అడవి దివిటీ
ఆదివాసీలకు అండగా నిలుస్తున్న యువతి ∙12వ ఏటే అన్యాయాన్ని ఎదిరించిన ధీర ∙సహాయం కోసం ఆశ్రయిస్తున్న పేదలు.నేనున్నానని భరోసా ఇస్తూ రంగంలోకి ∙మడావి కన్నిబాయి స్ఫూర్తివంతమైన కథ ఆదివాసీ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. సమాజంలో జరుగుతున్న పోకడలను అర్థం చేసుకునేందుకు చదువు చాలా ముఖ్యం. నేడు ఆదివాసీల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులున్నారు. పిల్లలందరు బడికి వెళ్లాలి. బాగా చదువుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో ఎదిరించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి అది 2007 మడావి కన్నిబాయి ఆసిఫాబాద్లోని గిరిజన పాఠశాలలో 7వ తరగతి చదువుతూ సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న బాధ, ఏడుస్తున్న తీరు చూసి దిగ్భ్రాంతి చెందింది. తల్లిదండ్రులు చెప్పిన విషయం విని నిశ్చేష్టురాలైంది. ‘నాలుగేళ్ల క్రితం పొలాన్ని కౌలుకు ఇచ్చాం. ఇప్పుడు పొలం తిరిగి ఇవ్వాలని రైతును అడిగితే ఎక్కడి పొలం.. నేను కొనుగోలు చేశాను.. డబ్బులు కూడా అప్పుడే ఇచ్చేశాను అని బుకాయిస్తున్నాడు. గ్రామ పెద్దలకు చెప్పినా∙పట్టించుకోలేదు. ఏం తినాలి.. ఎలా బతకాలి’ అంటూ కన్నవారు అసలు విషయం ఆ చిన్నారికి చెప్పారు. వెంటనే కన్నిబాయి తల్లిని వెంట బెట్టుకుని బస్సులో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లింది. పీవో సార్ ఎక్కడుంటాడో తెలుసుకొని ఆయనకు తెలుగులో రాసిన ఓ దరఖాస్తును ఇచ్చింది. దాన్ని చూసిన పీవో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కన్నిబాయి ధైర్యాన్ని మెచ్చుకుని వెంటనే ఆర్డీ్డవోతో పాటు మరికొంత మంది అధికారులను వెంటబెట్టుకుని గ్రామానికి వెళ్లాడు. రైతు కబ్జాలో ఉన్న పొలాన్ని మళ్లీ కన్నిబాయి తల్లిదండ్రులకు అప్పజెప్పాడు. అప్పుడే అనుకుంది కన్నిబాయి.... నాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. వారికి న్యాయం చేయాలి.. హక్కులు వారికి కల్పించాలి అని. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్గోంది గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి ఆ రోజు నుంచి ఆదివాసీ మహిళా చైతన్యానికి ఒక దివిటీలా నిలిచింది. తన పోరాటం తన మాటల్లోనే.... పేదల పక్షం నా పేరు మడావి కన్నిబాయి. తల్లిదండ్రులు మడావి భీంబాయి–జైతు. ఇద్దరు అన్నలున్నారు. నేను చిన్నదాన్ని. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్ లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్ కెరమెరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించాను. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోయా. కాని ఉన్న చదువుతోనే చాలా పనులు చేయవచ్చని గ్రహించా. ఇందిరాక్రాంతి పథంలో పీవోపీ (పూరెస్ట్ ఆఫ్ పూర్) సీఏగా విధులు నిర్వహిస్తున్నప్పుడు మండలంలోని చాలా గ్రామాలు సందర్శించా. ఎస్టీ, ఎస్సీలలో ఉన్న అత్యంత వెనకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించా. ఆ క్రమంలో మండలంలో 108 అత్యంత వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని గుర్తించి, అధికారులకు నివేదిక సమర్పించా. ఆ తర్వాత ఆదివాసీ గిరిజన సంఘంలో మహిళా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాలకు చెందిన 150 మంది ఆదివాసీలకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ హక్కు) పత్రాలను ఇప్పించా. వారు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో దళారులను, వ్యాపారులను ఆశ్రయించి వడ్డీలకు వడ్డీలు చెల్లించి నష్టపోతున్నారని తెలుసుకొని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణణ్తో మాట్లాడి ఆ 150 మందికి పట్టాలిప్పించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ప్రస్తుతం వారు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎన్నో నష్టపరిహారాలు తిర్యాణి మండలానికి చెందిన కొలాం విద్యార్థిని ఆసిఫాబాద్లోని గిరిజన పాఠశాలలో 6వ తరగతి చదువుతూ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని, మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనæ చేపట్టా. దీనికి స్పందించిన ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం చేసింది. అలాగే ఈ ప్రాంతంలో కొలాం అమ్మాయిలపై జరిగిన అత్యాచారాలపై గళం విప్పి వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేశా. ప్రస్తుతం కొలాం మహిళా డెవలప్మెంట్ సొసైటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంచార్జిగా బాధ్యతలు చేపడుతున్నా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, కెరమెరి, వాంకిడి మండలాల్లో ఇప్పటికి 41 గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పూర్తిగా ఆదిమ గిరిజనులైన కొలాం, నాయక్పోడ్, తోటిలకు చెందేలా కార్యాచరణ రూపొందించా. సినిమాలో కొరియోగ్రాఫర్గా.. వీ6 టీవీ ఫేం బిత్తిరి సత్తి నటిస్తున్న ‘తుపాకి రాముడు’ సినిమాలో కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాను. ఆ సినిమాల్లో నటించేందుకు 52 మంది కొలాం తెగకు చెందిన కళాకారులను తయారు చేసి నటింపజేస్తున్నాను. ఆ సినిమాల్లో నృత్యదర్శకురాలిగా నేనే డ్యాన్సులు నేర్పిస్తున్నాను. ఎలాంటి బట్టలు వేయాలి.. ఎలా నృత్యాలు చేయాలి అనేది నేర్పిస్తున్నాను. కొండలు ఎక్కగలను.. నెహ్రూ యువ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు అక్కడి అధికారులు నాలో ఉన్న ప్రతిభను గుర్తించి ట్రెక్కింగ్లో శిక్షణ ఇప్పించారు. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్లోని కుంటాల జలపాతంలో ఉన్న పెద్ద పెద్ద గుట్టలను సైతం ఎక్కాను. అధికారులతో ప్రశంసాపత్రాలు, మెమోంటోలు తీసుకున్నా.. కబడ్డీ, ఖోఖో ఆటలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ గ్రామానికి వెళ్తే సమయం చిక్కితే ఆటలు ఆడుతా. గడిచిన రెండేళ్లుగా నేను పేదలకు చేస్తున్న సేవలను గుర్తించిన కుమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా మంచి సేవకురాలిగా అవార్డు అందుకున్నా. భయం వీడాలి.. విద్యనభ్యసించాలి! ఆదివాసీ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. సమాజంలో జరుగుతున్న పోకడలను అర్థం చేసుకునేందుకు చదువు చాలా ముఖ్యం. నేడు ఆదివాసీల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులున్నారు. పిల్లలందరు బడికి వెళ్లాలి. బాగా చదువుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో ఎదురించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి. సమాజంలో ఆదిమ తెగల వారంటే అందరికీ అలుసే. ఈజీగా మోసం చేయవచ్చనే భావన గిరిజనేతరుల్లో ఉంది. వాటిని తిప్పికొట్టే ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. మోసపోకూడదు. తమ హక్కులు, తమ చట్టాలను తెలుసుకోవాలి. కౌలు చేసుకుంటున్న కౌలుదార్లు చాలా మంది పట్టేదారులను మోసగించి భూములు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. వారి మోసాన్ని గ్రహించాలి. అప్పుడే సమాజంలో నిలబడగలం. – సుర్పం ఆనంద్, సాక్షి ప్రతినిధి కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా -
కన్ను మూస్తున్నా..కళ్లు తెరవరేం..
రంపచోడవరం: ఏజెన్సీలో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రంపచోడవరం ఐటీడీఏ మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రతిరోజూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం సైతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చిన మారేడుమిల్లి మండలం శ్రీపురానికి చెందిన తొమ్మిది నెలల మడకం వెంకన్నదొర విగతజీవిగా మారాడు. ప్రాణాలు పోయిన పసివాడి తల్లిదండ్రులు కన్నీటితో తల్లడిల్లినా ఐటీడీఏ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదు. మూడు రోజులు నుంచి అనారోగ్యంతో.. మారేడుమిల్లి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మడకం పండుదొర, రాజమణిల తొమ్మిది నెలల కుమారుడు వెంకన్నదొర మూడు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. స్థానిక వాడపల్లిలో జరిగే సంతలో ఆర్ఎంపీ వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చిన తరువాత వైద్య సేవలు అందేలోపే మృతి చెందాడు. దీంతో తండ్రి బాలుడు మృతదేహాన్ని భుజంపై వేసుకుని తమ ఊరుకు వెళ్లే ఆటో స్టాండ్కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. పిల్లల ఆరోగ్యంపై కానరాని శ్రద్ధ గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో గిరిజన చిన్నారులు అనేక మంది మృత్యువాత పడినా ఐటీడీఏ నేటికీ సరైన కార్యచరణ ప్రణాళిక రూపొందిచలేదు. పౌష్టికాహారం అందించి చిన్నారుల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన చిన్నారులుకు పౌష్టికాహారమే ప్రధాన శుత్రువుగా మారింది. -
సౌకర్యాలు మృగ్యం..
బెల్లంపల్లిరూరల్ : చాకేపల్లి...మండలంలోని ఏకైక గిరిజన గ్రామమైన ఇక్కడ మౌలిక వసతులు కానరావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా..అధికారులు వస్తూ వెళ్తున్నా గ్రామ రూపురేఖలు మారడం లేదు. కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామం చాకేపల్లిలో కనీస సౌకర్యాల లేమిపై ‘సాక్షి’ కథనం.. వెయ్యికి పైగా జనాభా ఉన్న చాకేపల్లిని దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా ప్రకటించింది. ఏజెన్సీ గ్రామంగా ఉండీ ఏ అభివృద్ధికి నోచడం లేదు. పంచాయతీకి మంజూరవుతున్న అరకొర నిధులే తప్పా ఐటీడీఏ నుంచి నిధులు లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది. గ్రామంలో ప్రధానంగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ రోడ్డు ఊసే లేకుండా పోతుంది. ప్రధాన వాడలకు సైతం సరైన రోడ్లు లేవు. మట్టి రోడ్లు గుంతలు పడి, కంకర పైకి తేలి అధ్వానంగా ఉన్నాయి. అధ్వానంగా కాలువలు.. గ్రామంలో మురుగునీటి పారుదల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూడిక నిండి కంపు వాసన కొడుతున్నాయి. మురుగు బయటకు వెళ్లడానికి సౌకర్యం కరువైంది. కొన్ని వాడలలో ఇంకా మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణానికి నోచడం లేదు. దీంతో మురుగు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది. తాగునీటికి తంటాలు.. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని వాడలలో చేతిపంపులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో అవి పనిచేయడం లేదు. ఎండాకాలంలో నీటి సమస్య రెట్టింపవుతుంది. ప్రతి వేసవిలో గ్రామస్తులకు నీటి తిప్పలు తప్పడం లేదు. పట్టింపులేని ఐటీడీఏ.. గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీడీఏ శ్రద్ధ వహించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. గ్రామంలో ఇప్పటి వరకు చెప్పుకో తగ్గ పనులేమీ చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రం కోసం ఓ భవనం నిర్మించి, కొద్దిమొత్తంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం తప్పా మరే ఇతర పనులు కల్పించలేదు. అసలు ఐటీడీఏ అధికారులు ఏడాదికోసారైనా గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
గిరిజన వర్సిటీ చేజారింది
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందనే ఆశ ఇక కలగానే మిగిలిపోనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జయశంకర్భూపాల్పల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో వచ్చే జూన్లో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని గత గురువారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ కోసం అవసరమైన భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలనీ అధికారులకు సూచించారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సంవత్సరం నవంబర్ 17న జీవో నంబరు 797 విడుదల చేసింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2011 ఆగస్టు 27న జీవో నంబరు 783 జారీ చేసింది. దీంతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవెనుకాల ప్రభుత్వ భూమి 470 ఎకరాల్లో పరంపోగు భూమి 300 ఎకరాలు గుర్తించింది. 7వ నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా, హైటెన్షన్ విద్యుత్తోపాటు ఇతర సౌకర్యాలు=ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. కేంద్రంలోని యూపీఏప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుప్రస్తావన ఉంది. అప్పటికే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని అంతా ఆశించారు. ప్రారంభానికి ఏర్పాట్లు గిరిజన యూనివర్సిటీ పాత వరంగల్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)లో ఏర్పాటుకు గత ప్రభుత్వాల హయాంలోనే బీజం పడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిశోర్ చంద్రదేవ్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా, పాత వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి చెందిన బలరాంనాయక్ ఉండడంతో యూనివర్సిటీని ఆ జిల్లాకు తరలించేలా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు సూత్రపాయ అనుమతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న పాత ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అనువైన ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయించారు. మొదట ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా ప్రయత్నాలు జరిగినా.. పోలవరం ముంపు ప్రాంతాలైన ఎనిమిది మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలుపడంతో అక్కడ సాధ్యం కాలేదు. అదే జిల్లాలోని ఇల్లందులో ఏర్పాటుకు అనుకున్నా.. అక్కడ బొగ్గు గనులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్లో ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా.. పరిస్థితులు ఆశాజనకంగా లేవని నిర్ధారించడంతో మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ నియోజకవర్గం ములుగులో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు అవకాశాలు సర్వే చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో అనుకున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. అనువైన పరిస్థితులు ఉన్నా.. ఉమ్మడి జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్లో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలు ఉన్నా.. రాజకీయ కారణాలు, ఒత్తిళ్లతోనే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2008లోనే ఉట్నూర్లో అవసరమైన ప్రభుత్వ పరంపోగు భూమిని అధికారులు గుర్తించారు. 4,95,794 గిరిజన జనాభాతో వివిధ గిరిజన తెగలకు అనువైన ప్రాంతంగా ఉందని, ఇతర సౌకర్యాల కల్పనకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని నివేదికలు ప్రభుత్వాలకు పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం కావడంతోనే మొండి చేయి చూపిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తాము యూనివర్సిటీ కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రజాప్రతినిధుల సహకారం లేకపోవడంతో యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలివెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీడీఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ(సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఐటీడీఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 25 ఏళ్లుగా ఐటీడీఏల్లో పనిచేస్తున్నప్పటికీ అరకొర వేతనాలు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలలో జాప్యం చేయడంతో సిబ్బందికి నెలవారీ వేతనాలు అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు కాంట్రాక్టు సిబ్బంది సోమవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ను కలసి వినతిపత్రం అందించారు. సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు నిజమే
సాక్షి, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతేడాది జరిగిన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) నియామకాల్లో అక్రమాలు జరగడం వాస్తవమేనని గుర్తించారు. ‘సాక్షి’ దినపత్రికలో గత నెల 30న ‘సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేష్దత్ ఎక్కా స్పందించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లను విచారణకు ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణను విచారణకు పంపారు. ఆయన ఆశ్రమ పాఠశాలలను సందర్శించి వివరాలు సేకరించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17కిగానూ 48మంది అభ్యర్థులను సీఆర్టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కలెక్టర్ అప్రూవల్ తీసుకోకుండా అడ్డదారుల్లో వారిని నియమించారనేది ఆరోపణ. జిల్లాలో పనిచేస్తున్న ఓ సహాయ గిరిజనాభివృద్ధి అధికారి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో ఐదుగురు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నియామకమైనట్లు గుర్తించినట్టు సమాచారం. -
‘ఎస్టీ’ నుంచి లంబాడీలను తొలగించాలి
ఉట్నూర్(ఖానాపూర్): ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకూ ఆదివాసీలందరూ ఒక్కటై పోరాటం చేస్తారని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ స్పష్టంచేశారు. మరో ఇంద్రవెల్లి ఘటన పునరావృతం కాకముందే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం నుంచి ఉట్నూర్లోని ఐటీడీఏ వరకు సుమారు 19 కిలోమీటర్ల మేర ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు, ఆర్డీవో విద్యాసాగర్కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సోయం బాపూరావ్ మాట్లాడుతూ... ‘1976లో నాటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాయి. నాటి నుంచి అసలైన ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. షెడ్యూల్డ్ తెగలో గోండు, కోలాం, తోటి, నాయక్పోడ్, మన్నెవార్, కోయ, ప్రధాన్, ఆంద్ జాతులను రాజ్యాంగం ఆదివాసీలుగా గుర్తించి అభివృద్ధి ఫలాలు అందించాలని పేర్కొంది. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన నాటి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక ఫలాలు నిజమైన ఆదివాసీలకు అందకుండా పోతున్నాయి’అని అన్నారు. ఇటీవల ఆదివాసీ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, జోడేఘాట్లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహణలో విఫలమైన జిల్లా కలెక్టర్ చంపాలాల్, లంబాడీ అధికారులను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తుంటే అధికారులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు.. ఆదివాసీలు గిరిజనేతరులకు వ్యతి రేకం కాదని, తమ మనుగడ కోసం చేస్తు న్న ఉద్యమానికి గిరిజనేతరులు మద్దతు ఇవ్వాలని బాపూరావ్ పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి మద్దతు ఇస్తే గిరిజనేతరులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. వచ్చేనెల 9న ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్తో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజ్జు, ఆంద్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముకాడే విష్ణు, గోడ్వాన రాయిసెంటర్ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, కోలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావ్, ఏఎస్యూ కుమురం భీం జిల్లా ఇన్చార్జి కోట్నాక్ గణపతి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి భూపతి, ప్రధాన్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క పాల్గొన్నారు. -
అడవికాసిన నిధులు
అక్కడ ఎవరికైనా జబ్బు చేస్తే డొల్లలు.. కావడే దిక్కు.. లేదా రోగిని మంచానికి కట్టుకొని ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వెళ్లాలి.. ఈలోపు పరిస్థితి విషమించితే ప్రాణాలు కోల్పోవాల్సిందే!ఆ గూడేల్లో ఎవరికైనా పురిటి నొప్పులొస్తే జీవన్మరణ సమస్యే.. అంబులెన్సులు అందుబాటులో ఉండవు.. ఉన్నా అవి వచ్చేందుకు రోడ్డు ఉండదు.. అష్టకష్టాలు పడి ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్ ఉండడు.. నొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన అభాగినులు ఎందరో..!!అభివృద్ధి పేరిట కోట్లకు కోట్లు నిధులు వెచ్చిస్తారు.. కానీ ఖర్చంతా కాగితాలకే పరిమితం.. రోడ్లు.. విద్యుత్.. విద్య.. వైద్యం.. తాగునీరు వంటి మౌలిక వసతులు ఇప్పటికీ గగనమే!!! – సాక్షి నెట్వర్క్ దట్టమైన అడవులు, కొండకోనల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా గిరిజన ఆవాసాలు కనీస మౌలిక వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఐటీడీఏలు నెలకొల్పి మూడు దశాబ్దాలు పూర్తయినా గిరిజనుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జయశంకర్ జిల్లా ఏటూరునాగారం, భద్రాద్రి జిల్లా భద్రాచలం, నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్లలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. వీటికి గ్రూప్–1 లేదా ఐఏఎస్ కేడర్ అధికారులను ప్రాజెక్టు అధికారి (పీవో)గా నియమించి వారి పర్యవేక్షణలో పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, ఉద్యానవనం, ఇరిగేషన్, గిరిజన సహకార సంస్థ, పట్టుపరిశ్రమ, వ్యవ సాయం తదితర విభాగాలను ఏర్పాటు చేసి పథకాలు అమలు చేస్తు న్నారు. నిధుల లేమి, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, పాలకుల పట్టింపులేనితనం, అవినీతి అక్రమాలు వంటి కారణాలతో పథకాల ఫలాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. గిరిజనుల కష్టాలు, వారి ఆవాసాల్లో వసతుల లేమిపై ఈవారం ఫోకస్... అందని ద్రాక్షగా హక్కు పత్రాలు అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం.. పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి. కానీ ఇది గిరిజనులకు అందని ద్రాక్షగానే మారింది. ఏటూరునాగారం ఐటీడీఏలో మొదటి దశ కింద 2010–11లో 14,016 మందికి 41,314.59 ఎకరాలకు హక్కు పత్రాలు జారీ చేశారు. వీఎస్ఎస్ కింద 134 మందికి 1,18,122 ఎకరాలకు పత్రాలు అందించారు. ∙భద్రాచలం ఐటీడీఏలో 31,961 మంది గిరిజనులకు 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. వైఎస్సార్ మరణం తర్వాత ఇప్పటివరకు 456 మంది గిరిజనులనే అర్హులుగా తేల్చారు. వారిలో ఇప్పటివరకు 265 మందికే పట్టాలను పంపిణీ చేశారు. ∙మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో వైఎస్సార్ హయాంలో దాదాపు 2,630 కుటుంబాలకు 4,412 ఎకరాల భూమికి హక్కు పత్రాలు జారీ చేశారు. 2008–09లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ హక్కు కల్పించలేదు. ఇంకా తండాల్లో 5 వేల కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అటవీ అధికారులు దాడుల పేరిట వారి పంటలను నాశనం చేçస్తూ కేసులు పెడుతున్నారు. ∙ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 56,358 వేల మంది 2,25,569.82 ఎకరాల పోడు భూములపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 37,712 మందినే అర్హులుగా గుర్తించి 1,35,997.85 ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. అటవీ ఉత్పత్తులకు ధర ఏది? గిరిజనులు సేకరించే వివిధ రకాల అటవీ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభి వృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన గిరిజన సహ కార మార్కెటింగ్ సొసైటీ (జీసీసీ)లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం అటవీ ఉత్పత్తులకు పుట్టినిల్లు. ఈ ప్రాంత గిరిజనులు జిగురు, తేనె, కుంకుడుకాయలు, కరక్కాయలు, సుగంధ పాలవేర్లు, చీపుర్లు, విషముష్టి గింజలు, కానుగ పలుకు, చింతపండు, మైనం, నర్రమామిడి చెక్క, మారెడు గడ్డలు, జిల్ల గింజలు, సారెపప్పు, చింతగింజలు వంటి వివిధ రకాల అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఉట్నూర్, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో ఇప్పపువ్వు, తేనె, చీపుర్లు ఎక్కువగా సేకరిస్తుంటారు. కానీ వీటికి సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానరాని వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. ఐటీడీఏల ఆధ్వర్యంలో వైద్య విభాగం పనిచేస్తున్నా ఎక్కడా తగిన సౌకర్యాలు లేవు. డిప్యూటీ డీఎంహెచ్వో స్థాయి అధికారి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లు ఉన్నాయి. అయితే చాలాపోస్టులు ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గిరిజనుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. కాంట్రాక్టు పద్ధతిన నియమితులైన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్లను సైతం అద్దెకు నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైపెచ్చు వాటిని వైద్య సేవలకు వాడినట్లుగా రికార్డులు సృష్టించి బిల్లులను తీసుకుంటున్నారు. ఏటూరు నాగారంలో గతంలో ఓ అంబులెన్స్ను ఇలాగే బయట అద్దెకు నడుపుతుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 32 పీహెచ్సీలు, 186 సబ్సెంటర్లు ఉన్నాయి. వాటిలో 795 పోస్టులకుగాను 150 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వైద్య విధాన పరిషత్ అధీనంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ వైద్యాధికారులు లేక కాంట్రాక్ట్ ఎంబీబీఎస్లతో వైద్యం అందిస్తున్నారు. 16 అంబులెన్స్లు అరకొరగా సేవలందిస్తున్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నాలుగు ఏరియా వైద్యశాలలు, ఐదు సీహెచ్సీలు, 38 పీహెచ్సీలు, 340 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు 21 ఉన్నా.. ఒక్కదానికి కూడా అంబులెన్స్ సదుపాయం లేదు. 108 వాహనాలు 16, 104 వాహనాలు 15 ఉన్నా వాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. 24 గంటల ఆస్పత్రి.. ఒక్కరే వైద్యాధికారి ఇది భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని చర్ల మండలం సత్యనారాయణ పురంలో 24 గంటలపాటు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దీని పరిధిలో వాస్తవానికి ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్నర్సులు, పీహెచ్ఎస్, హెచ్వీ, సూపర్వైజర్, ఏపీఎంఓ, డీపీఎంఓ, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్తోపాటు ఆస్పత్రి పరిధిలో ఉన్న ఆరు సబ్ సెంటర్లలో ఆరుగురు ఫస్ట్ ఏఎన్ఎంలు, మరో ఆరుగురు సెకండ్ ఏఎన్ఎంలు ఉండాలి. కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సబ్ సెంటర్ల పరిధిలో సెకండ్ ఏఎన్ఎంలే ఉన్నారు. సారథుల్లేరు.. పోస్టులు ఖాళీ - ఐటీడీఏల్లో ప్రాజెక్టు అధికారితోపాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయి. రాష్ట్రంలో 4 ఐటీడీఏలు ఉంటే ఇందులో మూడింటికి ఇన్చార్జి పీవోలే కొనసాగు తుండడం గమనార్హం. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా ఉన్న ఐఏఎస్ అధికారి ఆర్వీ కర్ణన్ను కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ఐటీడీఏ ఇన్చార్జి పీవో బాధ్యతలనూ ఆయనకే అప్పగించారు. కలెక్టర్గా బిజీగా ఉండే కర్ణన్ ఐటీడీఏకు సమయం కేటాయించలేకపోతు న్నారు. - భద్రాచలం ఐటీడీఏలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ పీవోగా ఉన్న రాజీవ్గాంధీ హన్మంతును కొత్తగా ఏర్పడిన జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ప్రస్తుతం ఆయనే ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా వ్యవహరిస్తున్నారు. - మన్ననూర్ ఐటీడీఏ కూడా ఇన్చార్జి పీవోతో నడుస్తోంది. గ్రూప్–1 అధికారి అయిన మంగ్యానాయక్ డీటీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తూనే పీవోగా వ్యవహరిస్తున్నారు. ఏటూరునాగారంలో మాత్రమే చక్రధర్రావు రెగ్యులర్ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. - ఐటీడీఏల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ లో అన్ని విభాగాల్లో 1,532 పోస్టులు ఉండగా.. 1,127 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 408 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. - భద్రాచలం ఐటీడీఏలో 152 పోస్టు లకు 42 ఖాళీలుగా ఉన్నాయి. పశు సంవర్థక శాఖ, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలను ఐటీడీఏ నుంచి తరలించారు. కొండరెడ్ల విభాగానికి అధికారి లేరు. జిల్లాల విభజన తర్వాత ఐటీడీఏకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. - ఉట్నూర్ ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో 107 పోస్టులుండగా 76 ఖాళీలున్నాయి. - మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో 20 పోస్టులకు 17 ఖాళీగానే ఉన్నాయి. ఆర్థిక చేయూత ఏదీ? గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రవేశపెట్టిన ‘ఎకనామికల్ సపోర్ట్ స్కీం’ (ఈఎస్ఎస్) వారిని ఏమాత్రం ఆదుకోవడం లేదు. ఈ పథకం కింద స్వయం ఉపాధి కోసం కిరాణాలు, జిరాక్స్ సెంటర్లు, టెంట్హౌజ్లు, ఫొటో స్టూడియోలు, బుక్స్టాళ్లు, చికెన్ సెంటర్, వాహనాలు ఇస్తుంటారు. రైతులకు దుక్కిటెద్దులు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి గేదెల యూనిట్లు మంజూరు చేస్తారు. అలాగే ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ బోర్లు, కరెంట్ మోటార్లు, పైపులైన్లు అందజేస్తారు. ఏటా వందల సంఖ్యలో యూనిట్లు కేటాయిస్తున్నా.. వాటిలో సగం కూడా గ్రౌండింగ్ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతున్నారు. మత్స్య, పట్టు పరిశ్రమలు నిర్వీర్యం ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 14 గిరిజన మత్స్య సహకార సంఘాలున్నాయి. చేపల పెంపకం శిక్షణ కేంద్రం పదేళ్ల కిందట మూతపడింది. ట్రైకార్ యాక్షన్ ప్లాన్లో ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నా.. ఐటీడీఏ ఖర్చు చేయడం లేదు. పట్టు పరిశ్రమ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నూరుకు తరలిపోయింది. ఏటూరునాగారంలో పట్టుగూళ్ల పెంపకం పూర్తిగా బంద్ అయ్యింది. మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. రోడ్డు లేక ప్రాణాలు పోతున్నయ్ మా ఊరి రోడ్డులో రాజుగూడ వద్ద ఉన్న కల్వర్టు వానలకు కొట్టు కుపోయినప్పటి నుంచి దారిలేక ఇబ్బందులు పడుతున్నాం. మేలో ఐటీడీఏ ఎదుట ఆందోళన కూడా చేశాం. జూన్ 28న పెందోర్ సోంబాయి అనే గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. అంబులెన్సు లేక ఆమె ప్రాణాలు వదిలేసింది. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం దొంగచింత, సోనాపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించేందుకు రూ.89 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. – కె. జుగాదిరావ్, దొంగచింత పటేల్, ఉట్నూర్ మండలం దశాబ్దాలుగా అభివృద్ధి శూన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించిననాడే అభివృద్ధి సాధ్యం. ఐటీడీఏలు ఏర్పాటు చేసి ముప్పయ్యేళ్లు గడుస్తున్నా గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగానే ఉందంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది.. – జాదవ్ రమణనాయక్, ఎల్హెచ్పీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు హక్కు పత్రాలు ఇచ్చినా దక్కని భూమి ఈయన పేరు బొద్దిల సమ్మయ్య, ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామం. ఈయనకు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎకరం పది గుంటల స్థలం ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం అందజేశారు. ఇందులో ఇరవై గుంటల స్థలం అటవీశాఖ అధీనంలోనే ఉంది. భూసర్వే సక్రమంగా చేయకపోవడంతో ఇరవై గుంటలను కోల్పోవాల్సి వచ్చింది. చేసేదేమీలేక ఉన్న భూమినే సాగు చేసుకుంటున్నాడు. సాగుకు సాయమేదీ? ఏటూరు నాగారం పరిధిలో ఇంది ర జలప్రభ పథకం కింద 673 మంది రైతులు పొలాల్లో బోర్లు వేసుకున్నా విద్యుత్ మోటా ర్లు, త్రీఫేజ్ కరెంటు కనెక్షన్ ఇవ్వక నిరుపయోగంగా మారాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా తాడ్వాయి, మంగ పేట, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు, గోవిందరావుపేట మండలాలకు నాలుగేళ్ల కిందట రూ.55.45 కోట్లతో చెక్డ్యాం పనులు మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. భద్రా చలం ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో ఐటీడీఏ గిరిజనులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వటం లేదు. -
పైరవీల కొలువు
♦ వైద్య శాఖ ఉద్యోగాల్లో అధికార పార్టీదే హవా... ♦ కలెక్టర్ ఆదేశాలను తప్పుదారిపట్టిస్తున్న నేతలు ♦ ఒత్తిళ్లకు తలొగ్గి అర్హులను పక్కన పెట్టిన యంత్రాంగం ♦ అనర్హుల కోసం చేతుల మారిన కాసులు సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఏదైనా శాఖ ద్వారా పనులొస్తే తమవారికే అప్పగించాలి. పోస్టుల్లోనూ తమవారినే నియమించాలి. పథకాలు ఏవైనా వస్తే తాము చెప్పినవారికే మంజూరు చేయాలి. ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ సాగిస్తున్న దందా... వారి పైరవీల వల్ల నిజమైన అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందనడానికి కిల్లాడ అనూరాధ ఉదంతం ఒకఉదాహరణ మాత్రమే. వెలుగులోకి రానివెన్నో ఇలాంటివి ఉన్నాయి. అసలేమైందంటే... ఐటీడీఏ పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో 6 స్టాప్నర్సు, 6 ఏఎన్ఎం, నాలుగు ఫార్మసిస్టు, పార్వతీపురంలోని సీమాంక్ సెంటర్లో 2 స్టాఫ్ నర్సు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 12న స్క్రూట్నీ, 13న మెరిట్ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. 14న గ్రీవెన్స్ సెల్ అదే రోజున ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని నోటిఫికేషన్లో వివరించారు. కానీ ఈ నెల 14న ఓసారి, 16న మరోసారి అభ్యర్థులు వెళ్లినా అక్కడ మెరిట్ లిస్టు పెట్టలేదు. రోజు లు గడుస్తున్నా తమకు సమాచారం అందకపోవడంతో ఈ నెల 24న డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా పోస్టులు భర్తీ చేసేశామని చెప్పారు. మెరిట్లో ముందున్న వారు విషయం తెలిసి అవాక్కయ్యారు. కార్యాలయ సిబ్బందిని అడిగితే దరఖాస్తులందిన తరువాత ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చి అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పుకొచ్చారు. పైరవీలకే పెద్దపీట జిల్లాలోని ఏజెన్సీలో పనిచేసేందుకు భర్తీ చేస్తున్న వైద్య శాఖ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పలువురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల సూచనలు, సిఫార్సు లేఖలతోనే ఈ పోస్టుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా వారికి అందకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులు, కార్యకర్తలు సూచించిన వారికే పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులపై కన్నేసి తమ అనుయాయులకు కట్టబెట్టుకున్న నాయకులు వైద్యుల పోస్టుల భర్తీకి మాత్రం కృషి చేయలేకపోవడం విచారకరం. -
ఈ స్కూళ్లకు ఇంకా సెలవులే..
కురుపాం: మండలంలోని ఐటీడీఏ పరిధిలోని పది గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు వేసవీ సెలవుల అనంతరం జూన్ 12 వతేదీకే తెరవాల్సి ఉండగా నేటి వరకు ఆ పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో 1, 2వ తరగతి విద్యార్థులకు నేటికి 15 రోజులు గడుస్తున్నా విద్యాబోధన జరగటం లేదు. దీంతో ఆ గిరిజన విద్యార్థులు బడికి దూరంగా తమ గ్రామాల్లోనే ఉండి చెట్ల కింద పుట్ల కింద ఆటలాడుకోవలసిన పరిస్థితి తలెత్తిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వేసవి సెలవుల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేశారు. దీంతో కురుపాం మండలంలోని ఏగులవాడగూడ, గుండాం, కోటకొండ, తోలుంగూడ, ఎగువ గొత్తిలి, వాడకొయ్య, టొంపలపాడు, దొమ్మిడి, చీడిగూడ, గుమ్మిడిగూడ తదితర గ్రామాల్లో ఉన్న గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవడంతో ఆయా ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. నేటికి పాఠశాలలు ప్రారంభమై 17 రోజులు కావస్తున్నా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించక పోవడంతో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి బడులు తెరిచే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఐటీడీఏ డిప్యూటీ డీఈఓ కె.వి.వి.రమణరాయుడు వద్ద ప్రస్తావించగా ఖాళీగా ఉన్న పాఠశాలల్లో 10 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులను, 19 మంది సీఆర్టీలను బోధించేందుకు నియమించామని వీరంతా ఈ నెల 30 వతేదీ నుంచి విధుల్లో చేరుతారన్నారు. ఇంకా ఎక్కడైనా ఉపాధ్యాయ కొరత ఉంటే సీఆర్టీలతో పూరిస్తామని తెలిపారు. -
చర్యలు శూన్యం
► ఐటీడీఏలో అవినీతి పరులను పట్టించుకోని ప్రభుత్వం ► తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు ► మరికొంత మంది ఇంకా దోచేస్తున్న వైనం సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఐటీడీఏలో అయితే మరీ చెప్పనక్కర్లేదు. అధికారులే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడుగా ఇప్పటికీ కొంతమంది తమ అక్రమాలను కానిచ్చేస్తుండగా, ఇప్పటికే అక్రమాలు చేసి, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన కొంతమంది అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు పక్క జిల్లాలకు బదిలీలు చేసుకున్నారు. ఉపకార వేతనాల కుంభకోణాల తరహాలోనే ఐటీడీఏలో చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉపకార వేతనాల కుంభకోణంలో మొత్తం 11 మందిని అరెస్టు చేయడంతో సంచలనం రేగింది. దీనిలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఒక డీడీ, ఏటీడబ్ల్యూవో, ఇద్దరు హాన్రోరియం డైరెక్టర్లు ఉన్నారు. వీరి అరెస్టు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో గతంలో నిధులు దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎరువుల కుంభకోణంలో రూ. 90 లక్షల దుర్వినియోగం ఐటీడీఏ టీపీఎంయూ మండలాలైన సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ఉద్యానవన రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏడాదిన్నర క్రితం రూ. 2 కోట్ల నిధులు వెచ్చించారు. ఉద్యానవన శాఖ ద్వారా వీటిని అందించాల్సి ఉంది. అయితే ఎరువులు, పురుగు మందులు పూర్తిస్థాయిలో సరఫరా చేయకుండా చేసినట్టు రికార్డులు చూపి నిధులు కైంకర్యం చేశారు. రూ. 90 లక్షల మేర నిధులు దుర్వినియోగం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చేశారు. అయితే ఆ విచారణ ఏమైందో తెలియని పరిస్థితి. అలాగే ఎరువులు పంపిణీ చేయకుండా స్థానిక హెచ్ఎన్టీసీలో ఉంచడం, తర్వాత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వాటిపై ఆరాతీయడం వంటివి జరిగాయి. అయితే సంబంధిత పీహెచ్వోకు ఇతర జిల్లాలకు బదిలీ జరిగింది తప్ప చర్యలు చేపట్టలేదు. హౌసింగ్ అక్రమాలపై చర్యలేవి? ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపి చాలాచోట్ల నిధులను హౌసింగ్ సిబ్బంది కాజేశారు. సుమారు రూ. 2 కోట్ల మేర వీటిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఎటువంటి చర్యలు లేవు. మళ్లీ కొంతమంది వర్క్ ఇన్స్పెక్టర్లకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కట్టబెట్టినట్టు తెలిసింది. మరోవైపు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్శాఖలో అక్రమాలకు అడ్డూ అదుపు లేదు.గతంలో ఇంజినీరింగ్శాఖ ద్వారా నిర్మించిన రహదారుల్లో 42 చోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.వీటిపై విచారణ చేయాలని పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు నిలదీశారు. పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తీర్మానించారు. విచారణ అతీగతి లేదు. బాలబడులు, న్యూట్రీషియన్ కేంద్రాల్లో సుమారు రూ. 2 కోట్లు అక్రమాలు జరిగాయని ఆ శాఖాధికారులే గుసగుసలాడుకుంటున్నారు. దీనిపై విచారణ చేశారు. అనంతరం సంబంధిత ఏపీఎంలకు వేరే జిల్లాల్లో పోస్టింగ్లు సైతం ఇచ్చేశారు. దీనిపై ఎటువంటి చర్యలు లేవు. రెండేళ్ల క్రితం మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిధులు ఎంఆర్సీలో స్వాహా జరిగాయి. వాటిపై విచారణలు తప్ప చర్యలు శూన్యం. ఐటీడీఏ పీవో ఏమన్నారంటే... ఈ విషయాలపై ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. పాత కుంభకోణాల విషయమై పరిశీలించాల్సి ఉందన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏలో కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగితే గిరి జన సంక్షేమ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎటువంటి విచారణలు చేపట్టడంలేదు. ప్రభుత్వం అవినీతి పరులకు కొమ్ముకాస్తుంది. ఇప్పటికైనా స్పందన రావాలి. నిజాలు నిగ్గుతేల్చాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ -
ఐటీడీఏ అధికారుల పనితీరు అధ్వానం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వెలుగోడు : చెంచుల జీవన స్థితిగతులు పరిశీలించేందుకు నియమించబడిన ఐటీడీఏ అధికారుల పనితీరు అధ్వానంగా తయారైందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక విజయదుర్గా చెంచు కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెంచు మహిళల సదస్సుకు శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెంచు మహిళలను సమస్యలు అడిగి తెలసుకున్నారు. చెంచుల స్థితి గతులు మార్చేందుకు ఐటీడీఏ వ్యవస్థను ఏర్పాటు చేశారని, అయితే వారికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని శివాజీ తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయన్నారు. చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉశ్సేనమ్మ అనే మహిళతో ఖాళీ చెక్కులపై ఎందుకు సంతకాలు చేసుకున్నారని ఐటీడీఏ అధికారులను నిలదీశారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ రామస్వామి, ఆర్డీవో హుస్సేన్సాహెబ్, ఐటీడీఏ ఏపీవో రోశిరెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు సలోమీ, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ తులసీనాయక్, ఎంపీడీవో భాస్కర్, ఎస్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
కొలువులపై విభజన క్రీనీడ
విలీన మండలాల డీఎస్సీ అభ్యర్థుల ఆక్రోశం స్థానికులు కాదంటూ నియామకాలకు అడ్డంకి కోర్టు కరుణించినా ఖాతరు చేయని ఐటీడీఏ! నెల్లిపాక : రాష్ట్ర విభజన గిరిజన నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివిన వారిని స్థానికత కష్టాల పాలు చేసింది. అర్హత ఉన్నా వారికి ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. విలీన మండలాల ఏజెన్సీ డీఎస్సీలో ఆ మండలాల అభ్యర్థుల పట్ల ప్రభుత్వ నిర్ణయం వారికి తీరని ఆవేదనను మిగుల్చుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో 2016 అక్టోబర్ 29న ప్రత్యేక డీఎస్సీ అర్హత పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని గత ఏడాది డిసెంబర్ 29న ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించారు. అయితే రాష్ట్ర విభజనతో తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నాలుగు విలీన మండలాల్లోని కొందరు అభ్యర్థులు అర్హత సాధించినా స్థానికత పేరుతో నియామకాలను నిలిపివేశారు. దీంతో వారు గత మూడు నెలలుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. కోర్టును కూడా ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు సాధించుకున్నా అధికారుల నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు. విలీన మండలాల్లో మొత్తం 10 మంది అభ్యర్థుల నియామకాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరిలో ఎటపాక మండలంలోని ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు, నలుగురు లంబాడా తెగకు చెందిన వారు కాగా చింతూరు మండలంలో ఒకరు, వీఆర్ పురం మండలంలో ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు ఉన్నారు. వీరి నియామకాలను స్థానికత లేదనే కారణంగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు. కోడళ్లుగా వచ్చిన వారికీ అడ్డంకే ఆరుగురు ఆదివాïసీ అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ స్థానికత లేదని ఉద్యోగావకాశం కల్పించలేదు. అయితే వీరిలో ఎటపాకకు చెందిన కోర్స సుజాత, పొడియం కౌసల్య, వీఆర్పురానికి చెందిన కారం అరుణ, సీహెచ్ వెంకటలక్ష్మి ఈ ప్రాంతానికి కోడళ్లుగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నవారే. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీలోనే ఉంటూ వీరి చదువులు పూర్తి చేశారు. వివాహాలు కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగాయి. ప్రత్యేక డీఎస్సీలో కొలువులు సాధించేందుకు అహర్నిశలు కష్టపడి చదివి అర్హత పొందారు. కానీ వీరిని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని నియామకాలు నిలిపివేయటం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాధించుకున్న ఉద్యోగాలు గత మూడునెలలుగా దూరం కావటంతో వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. నాణ్యత ఉంటే ఒట్టు..!
సీతంపేట: గిరిజన గ్రామాలకు రూ.కోట్లు వెచ్చించి వేస్తున్న రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. రోడ్ల నిర్మాణంలో అలసత్వం వెరసి అనతికాలంలోనే రూపం కోల్పోతున్నాయి. దీనికి ఈతమానుగూడకు సుమారు రూ.50 లక్షలు, జగ్గడగూడకు రూ.20 లక్షలతో నిర్మించిన రోడ్లే నిలువెత్తు సాక్ష్యం. ఇంచుమించుగా అన్ని రోడ్ల పరిస్థితి ఇంతే. మరికొన్ని గ్రామాలకు అసలు రోడ్లే నిర్మించకపోవడంతో గిరిజనులు రాళ్లదారులపై నరకప్రయాణం సాగిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 1250 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ 300లకు పైగా గ్రామాలకు రోడ్లు లేవు. 2012 నుంచి ఇప్పటి వరకు భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాలకొండ, వీరఘట్టం, సారవకోట, మందస, బూర్జ, నందిగాం తదితర మండలాల్లో ఉపాధిహామీ నిధులతో రోడ్లు వేశారు. 2012–13 ఆర్సీపీ –2లో 29 పనులకు 27 పూర్తి చేయగా రూ.41.8 లక్షలు వెచ్చించారు. 2013–14లో ఆర్సీపీ–3 కింద 296 పనులకు 21 పనులు పూర్తిచేశారు. రూ.75.99లక్షలు ఖర్చుచేశారు. 275 పనులు చేస్తామంటూ ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. అన్కనెక్టవిటీ విలేజ్ ప్రొగ్రాంలో 71 పనులకు రూ.16 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించారు. కంచిలి మండలంలో 9, బామిని, హిరమండలాల్లో 3 పనులు చొప్పున, కొత్తూరు, పాతపట్నం 2, మందస 13, సీతంపేట, వీరఘట్టం 4, సరుబుజ్జిలి 1, సారవకోట 7, మందస 13, టెక్కలిలో 3 పనులు ఆరంభించారు. నిర్మాణంలో నాణ్యత లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంట్రాక్టర్లతో ఐటీడీఏ అధికారులు కుమ్మక్కైయ్యారంటూ ఆరోపిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎక్కడ? ఇంజినీరింగ్ శాఖ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే రాళ్లు తేలిపోవడం, కొండలపై గ్రామాలకు మధ్యమధ్యలో సీసీ ర్యాంపులు వేయకపోవడం, సగం పనిచేసి మిగతాపని పూర్తి చేయకపోవడంతో గిరిజనులకు ప్రయోజనం కలగడంలేదు. కొన్ని గ్రామాలకు కనీసం బైక్లు కూడా వెళ్లని పరిస్థితి. అత్యవసర వేళ 108 వాహనాలు వెళ్లవు. ఇలాంటి గ్రామాలు 80 ఉన్నాయి. ఈ గ్రామాల్లోని రోగులను డోలీపై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. చర్యలు తప్పవు.. రోడ్ల నాణ్యతాలోపాలను ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ వద్ద ప్రస్తావించగా నాణ్యతలేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. పనులు వద్ద కాంట్రాక్ట్ పేరు, ఫోన్తో బోర్డు పెట్టిస్తామన్నారు. నాణ్యత లోపిస్తే గ్రామస్తులు ప్రశ్నించవచ్చన్నారు. రోడ్లు లేని గ్రామాలకు ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తామన్నారు. -
ఐటీడీఏ పాలకవర్గ సమావేశం @ : 7 నెలలు
సీతంపేట(పాలకొండ): ‘ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నాం.. కేవలం మూడుగంటల్లోనే ముగిస్తున్నాం.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. గిరిజన సమస్యలపై సుదీర్గ చర్చ సాగాలి.. సమావేశాలు ప్రతి మూడునెలలకు ఒకసారి కాకుండా రెండునెలలకు ఒకసారి నిర్వహిద్దాం’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ గత పాలకవర్గ సమావేశంలో మొదటి ప్రశ్న లేవనెత్తారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సభ్యులు కలిసి తీర్మానం చేశారు. తరచి చూస్తే... రెండు నెలలు కాదు.. మూడు నెలలు కాదు.. ఏకంగా ఏడు నెలలైంది. పాలకవర్గ సమావేశానికి అతీగతీ లేదు. గతే ఏడాది జూన్ 23న పాలకవర్గ సమావేం నిర్వహించారు. అంతే.. అప్పటి నుంచి సమావేశం నిర్వహణకు చర్యలు తీసుకున్నవారే కరువయ్యారు. ఫలితం.. గిరిజన పల్లెల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా చర్చించేవారే లేరు. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల వినియోగం, సమస్యల గుర్తింపు వంటి వాటిపై ప్రశ్నిం చే అవకాశం లేకుండా పోయిందంటూ గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. నేతలు, ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నా యి. సమస్యలు వెంటాడుతున్నా... ఐటీడీఏ పరిధిలోని 150 గ్రామాల్లో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. నివార ణా చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేవు. నిర్మాణానికి వేసవి కాలం అనువైనది. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదు. పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. జీసీసీ గిట్టుబాటు ధరలు కల్పన, విద్య, వైద్యసదుపాయాల కల్పన, హార్టీకల్చ, ఐడబ్ల్యూఎంపీ, చిన్ననీటి వనరులు తదితర శాఖలపై చర్చించాల్సి ఉంది. గిరిజనుల అభివృద్ధికి పునాది పడాల్సిన సమావేశం నిర్వహణలో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందంటూ గిరిజన సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. ఇదే విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్ వద్ద ఫోన్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐడీడీఏ ఏపీవో ఆర్.శ్యామ్యుల్ వద్ద ప్రస్తావించగా ఐటీడీఏ సమావేశ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గిరిజన సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కలేదు.. గిరిజన సమస్యలను పట్టించుకోవడం మానేశారు. రెండు నెలలకు పాలక వర్గ సమావేశాలు పెడతామని ఏడు నెలలకు కూడా పెట్టకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటికే గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. గవర్నింగ్ బాడీ సమావేశాలు పెట్టడం ఆలస్యమైనా కనీసం ఐటీడీఏ ఉన్నతాధికారులైనా క్షేత్రస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలతోనైనా సమావేశం పెట్టి సమస్యలు తెలుసుకుంటే బాగుండేది. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి
ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్ రంపచోడవరం : వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వీలు కలుగుతుందన్నారు. రైతులను భూసార పరీక్షలు చేయించి సూక్ష్మ పోషకాలందించి అధిక దిగుబడిని సాధించేలా చైతన్యం చేయాలన్నారు. ఏజెన్సీలోని చెక్డ్యామ్లకు మరమ్మతులు చేయించి పూర్తిగా వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అవకాశాలను మెరుగుపర్చాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ రాబర్ట్పాల్, శ్రీనివాస్రెడ్డి , ఏపీడీ వై శంకర్నాయక్, పీహెచ్ఓ బి.శ్రీనివాసులు, ఈఈ వెంకటేశ్వర్లు, మైక్రో ఇరిగేషన్ పీడీ సుబ్బారావు, కేవీకే కో ఆర్డినేటర్ శ్రీనివాసు, పీఏఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాగా నోడల్ ఏజెన్సీలో ఉన్న పెండింగ్ సమస్యలను గిరిజన సబ్ప్లాన్లో పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్బాబు పీవో దినేష్కుమార్ను కోరారు. టీఎస్పీ కింద గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 2017–24 వరకు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం టీఎస్పీ కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పీవో దినేష్కుమార్ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో టీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నాబార్డు కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం సంప్రదింపులు జరిపినట్లు పీవో తెలిపారు. -
ఐటీడీఏ పీఓగా దినేష్కుమార్
శ్రీకాకుళం జేసీగా చక్రధరబాబు బదిలీ పాడేరు ఐటీడీఏ పీఓగా వెళ్లనున్న రంపచోడవరం సబ్కలెక్టర్ రంపచోడవరం : రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కేవీఎ¯ŒS చక్రధరబాబును శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేస్తు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పశ్చిమ గోదారి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్గా పని చేస్తున్న దినేష్కుమార్ను నియమించింది. అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న రవి పట్టా¯ŒSశెట్టిని పాడేరు ఐటీడీఏ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు. ఏడాదిపాటు రంపచోడవరం సబ్ కలెక్టర్గా పని చేశారు. సొంత రాష్ట్రం కర్ణాటక. ఆయన స్థానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. కనిపించని పీవో మార్క్ అభివృద్ధి గతంలో ఐటీడీఏ పీవోలుగా పని చేసిన ఐఏఎస్ అధికారులు పరిపాలనలో కనీసం ఒక్క అంశంలోనైనా తమదైన ముద్ర వేసేవారు. కానీ చక్రధరబాబు ఇక్కడ సుమారు రెండేళ్లు పని చేసినా గిరిజనుల కోసం ఎలాంటి ప్రత్యేక పథకాలూ అమలు చేయలేదు. క్షేత్రస్థాయి సందర్శనలు కూడా అంతంతమాత్రమనే చెప్పాలి. కేవలం అధికారులతో సమీక్షలు, రోజువారీ పరిపాలనకే పరిమితమయ్యారు. ఐటీడీఏలోని కింది స్థాయి ఉద్యోగిపై ప్రాజెక్టు అధికారి హోదాలో చక్రధరబాబు ఒకసారి చేయి చేసుకున్నారు. దీంతో ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేశాయి. ఉన్నతాధికారుల జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చక్రధరబాబు 2015 ఏప్రిల్లో ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా పని చేస్తూ రంపచోడవరం పీవోగా బదిలీపై వచ్చారు. ఐఏఎస్ రాక ముందు ఐపీఎస్ హోదాలో అస్సాం రాష్ట్రంలో ఎస్పీ హోదాలో పని చేశారు. నర్సాపురం సబ్ కలెక్టర్ నుంచి ఐటీడీఏ పీవోగా: రంపచోడవరం ఐటీడీఏ కొత్త పీవోగా నియమితులైన దినేష్కుమార్ తమిళనాడు విరుద్నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం మానూరులో 1982 ఆగస్ట్ 26న జన్మించారు. ఆయన తండ్రి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన రైతు. తల్లి గృహిణి. 2009లో ఇండియ¯ŒS రెవెన్యూ సర్వీస్కు ఎంపికైన ఆయన కొంతకాలం ఆదాయ పన్ను శాఖలో పని చేశారు. 2013లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనీ కలెక్టర్గా పని చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేస్తూ.. నర్సాపురం సబ్ కలెక్టర్గా 2015 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించారు. ఆయన సతీమణి విజయా కృష్ణ¯ŒS కూడా ఐఏఎస్ అధికారే. 2013 బ్యాచ్కు చెందిన ఆమె రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా పని చేస్తున్నారు. -
ఐటీడీఏ పీవో సోదరి ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం సిటీ : సీతంపేట ఐటీడీఏ ప్రోజెక్టు అధికారి జల్లేపల్లి వెంకట్రావు అక్రమ ఆస్థులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపద్యంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం శ్రీకాకుళం నగరం రాజీవ్నగర్లో అతని సోదరి మంగవేణి ఇంట్లో దాడులు నిర్వహించారు. మంగవేణి భర్త కపాల రమణమూర్తి శ్రీకాకుళం, ఎస్సీ బాలుర వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తున్నారు. ఏసీబీ ఇన్స్పెక్టర్ (కాకినాడ) బి రాజశేఖరరావు, కమ్యూనిటీ హెల్త్ అధికారి(శ్రీకాకుళం) ఎం లక్ష్మణరావులు తనిఖీలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను, రికార్డులను పరిశీలించారు. ఐటీడీఏ పీవోకు సంబందించి ఎటువంటి ఆదారాలు ఇక్కడ లబించలేదని స్పష్టం చేసారు. -
ఐటీడీఏ పీవో సోదరి ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం సిటీ : సీతంపేట ఐటీడీఏ ప్రోజెక్టు అధికారి జల్లేపల్లి వెంకట్రావు అక్రమ ఆస్థులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపద్యంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం శ్రీకాకుళం నగరం రాజీవ్నగర్లో అతని సోదరి మంగవేణి ఇంట్లో దాడులు నిర్వహించారు. మంగవేణి భర్త కపాల రమణమూర్తి శ్రీకాకుళం, ఎస్సీ బాలుర వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తున్నారు. ఏసీబీ ఇన్స్పెక్టర్ (కాకినాడ) బి రాజశేఖరరావు, కమ్యూనిటీ హెల్త్ అధికారి(శ్రీకాకుళం) ఎం లక్ష్మణరావులు తనిఖీలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను, రికార్డులను పరిశీలించారు. ఐటీడీఏ పీవోకు సంబందించి ఎటువంటి ఆదారాలు ఇక్కడ లబించలేదని స్పష్టం చేసారు. -
సీతంపేట ఐటీడీఏ పీఓ బంధువులు ఇండ్లలో ఏసీబీ దాడులు
రాజాం : రాజాం నగరపంచాయతీ పరిధిలోని అమ్మవారి కాలనీలో సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావుకు చెందిన బంధువుల ఇళ్లల్లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ సీఐ సూర్యమోహన్రావుతోపాటు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక్కడనివాసం ఉంటున్న జల్లేపల్లి వెంకటరావు సోదరుడు శ్రీనివాసరావుకు వరసకు మామ అయిన ఎల్.సత్యన్నారాయణ ఇంటితోపాటు మరో ఇంట్లో సోదాలు నిర్వహించారు. జల్లేపల్లి వెంకటరావు బంధువులకు చెందిన 1.50 కోట్లు అక్రమాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించడంతోపాటురెండు ఇళ్లు, ఒక కల్యాణమండపం ఉన్నట్లు గుర్తించామని సీఐ విలేకరులకు తెలిపారు. దాడులు జరుగుతాయని ముందుగా గుర్తించిన వీరంతా ఇండ్లకు తాళాలువేసి వెళ్లిపోగా కొద్దిసేపటి తరువాత బంధువులను రప్పించి సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వెంకటరావు భార్య పేరుతోపాటు ఆయన బంధువుల పేరుమీద ఉన్న ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్టున్నట్లు తెలిపారు. ధర్యాప్తు అనంతరం అసలు విషయాలు బయటపడతాయని ఈ సందర్భంగా సీఐ విలేకరులకు తెలిపారు. అలజడి. ఇదిలా ఉండగా జల్లేపల్లి వెంకటరావు గతంలో రాజాంతోపాటు సంతకవిటి, వంగర మండలాల్లో తహశీల్దార్గా విధులునిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలియడంతో మూడు మండలాల్లోని రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ఆయనతో కలసి విధులు నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. ఇటీవల రాజాంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఏసీబీ దాడులు అధికమవడం, రెవెన్యూ అధికారులను టార్గెట్ చేయడంతో రాజాం నియోజకవర్గం మొత్తం హాట్టాపిక్గా మారింది. రెవెన్యూ అధికారులు మరింత అప్రమత్తం అవడంతోపాటు ఏసీబీ అధికారులు సోదాలుపై చర్చించుకోవడం మొదలైంది. -
ఐటీడీఏలో ఏసీబీ సోదాలు
సీతంపేట: ఆదాయానికి మించీ ఆస్తులు ఉన్నాయని ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు ఉంటున్న సీతంపేట ఐటీడీఏ బంగ్లాలో మంగళవారం విస్త్రతంగా సోదాలు జరిగాయి. ఉదయం ఐదున్నర గంటలకే ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో బృందం రంగంలోకి దిగి సాయింత్రం 5 గంటల వరకు విచారణ చేశారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయంలో తనికీలు జరిపిన అనంతరం పీవో ఉంటున్న బంగ్లాను ఏసీబీ తన ఆదీనంలోకి తీసుకుని తనికీలు జరిపింది. ఇంట్లో ఉన్న పైళ్లు,ఇతర పత్రాలు, వెండి, బంగారు ఆబరణాలు వంటì వాటిని స్వాదీనం చేసుకుని లెక్కకట్టారు. ఈసందర్బంగా డీఎస్పీ రంగరాజు మాట్లాడుతూ అన్ని చోట్ల తనికీల అనంతరం మొదటి రోజు కోటి పది లక్షలు వరకు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు గుర్తించామని తెలిపారు. ఇంకా విచారణ సాగుతుందన్నారు. శ్రీకాకుళం,ఆముదాలవలసలలో రెండు ప్లాట్లు, విశాఖపట్నం సీతమ్మదారలో ఒక ప్లాట్, ఆరిలోవకాలనీలో మరో ఇల్లు, ఆముదాలవలసలో ఒక ఇళ్లు, ఒక కారు ఉన్నట్టు గుర్తించామన్నారు. రాజాంలో రెండు ప్లాట్లుకు రియల్ ఎస్టేట్ కడుతున్నట్టు తమ పరిశీలినలో వెల్లడైందన్నారు. బంగారం, వెండి వస్తువులు ఉన్నాయని వాటి వెల కడుతున్నట్టు తెలిపారు. విశాఖపట్టణంలో ఉన్న రెండు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉందన్నారు. ఏకకాలంలో 8 బృందాలు సోదా చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, రాజాం, పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం ఏలూరు తదితర చోట్ల బందువుల ఇళ్లల్లో ఒక డీఎస్పీతో పాటు మరో 9 మంది ఇన్స్పెక్టర్లు సోదా చేస్తున్నట్టు తెలిపారు. తనికీలు పూర్తి అయిన తర్వాత పీవోను అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవోను విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కాగా కొన్ని ఫైల్లను కూడా పరిశీలించి వాటిని కూడా ఏసీబీ అధికారులు సీజ్చేసినట్టు తెలియవచ్చింది. తనికీల్లో సీఐ లక్ష్మోజి, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన ఐటీడీఏ... మునుపెన్నడూ లేని విధంగా ఐటీడీఏలో ఏసీబీ సోదాలు జరిగాయనే వార్త దావనంలో వ్యాపించడంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు లేని విదంగా దాడులు జరగడంతో అంతాచర్చనీయంశమైంది. మంగళవారం అంతా ఇదే చర్చనీయంశమైంది. ఐటీడీఏ ఏర్పడి మూడు దశాబ్దాలైంది. ఇప్పటి వరకు ఏ పీవో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన లేదని అధికారులు, సిబ్బంది గుసగుసలాడడం కనిపించింది. -
ఐటీడీఏ పీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు ఇంటిపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో జరిపిన ఈ దాడుల్లో ఇప్పటివరకు ఐదు ఫ్లాట్లు, ఒక కారు, రెండిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. మొత్తం కోటి రూపాయల ఆస్తులున్నట్లు ఇప్పటివరకు చేసిన తనిఖీలలో తేలింది. శ్రీకాకుళంతో పాటు ఆముదాలవలస, వైజాగ్లలోని అతనికి చెందిన ఇళ్లపై కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీవన ప్రమాణాలను మెరుగుపర్చండి
రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ పద్మ నెల్లూరు(పొగతోట): యానాదుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో బుధవారం నిర్వహించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (యానాదులు) ఏడో గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో యానాదులకు జీవనోపా«ధులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి జిల్లాకు ఐటీడీఏ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. గిరిజన కాలనీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న నిర్మాణాల్లో నాణ్యత ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యానాదుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలను యానాదులు సద్వినియోగం చేసుకునేలా ప్రతి జిల్లాలో వర్క్షాపులను నిర్వహించాలని కోరారు. గిరిజన మత్స్యకార సంఘాలకు పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కార్పొరేట్కు దీటుగా గిరిజన వసతిగృహాల్లో సౌకర్యాలను కల్పించాలని సూచించారు.æవిద్యార్థులు మధ్యలో చదువులను నిలిపేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలి పదో తరగతి చదివిన విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అర్హులైన యానాదులకు ఏఏవై రేషన్కార్డులను మంజూరు చేసి సక్రమంగా రేషన్ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న యానాదుల గృహాల స్థానంలో నూతన ఇళ్లు నిర్మించేలా చర్యలు చేపడతామన్నారు. సబ్ప్లాన్ నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. గిరిజన యువత అభివృద్ధి చెందేలా ఆటోలు, మేకలు, తదితర యూనిట్లను మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో చర్చించి రుణాలను మంజూరు చేయించాలని తెలిపారు. యానాదుల కోసం ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనంతరం కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. యానాదుల గృహనిర్మాణాల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి ఫెయిలైన విద్యార్థినులను గుర్తించి వారిని పాఠశాలలు, హాస్టళ్లలో చేర్పించి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యానాదుల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాయింట్ కలెక్టర్ అధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో సమావేశాలను నిర్వహించాలని కోరారు. అనేక అంశాలపై తీర్మానాలు చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఐటీడీఏ పీఓ కమలకుమారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు హేమమహేశ్వరరావు, సీతారామరాజు, శ్రీధర్బాబు, నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.