నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా! | Ex-gratia for Nagaram Victim's family | Sakshi
Sakshi News home page

నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా!

Jun 27 2014 6:50 PM | Updated on Sep 2 2017 9:27 AM

నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా!

నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా!

తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్‌ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్‌ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు గెయిల్ కంపెనీ నుంచి 20 లక్షలు,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో  15 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలు కాగా, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement