కౌలు రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Published Mon, Oct 12 2015 7:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

రేపల్లె (గుంటూరు) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం చింగుపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన నన్నేపాముల లాజర్(35) తనకున్న రెండెకరాలతో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గతేడాది కూడా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది కూడా దిగుబడి వచ్చేలా కనిపించకపోవడంతో.. ఇంట్లో ఉన్న గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement