repalle
-
మనం చేసిన మేలు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది
ఇవాళ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. విద్య, వైద్య రంగాలను నాలుగు నెలల్లోనే నాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పేదవాడు వెళితే వైద్యం చేస్తారన్న నమ్మకం లేని పరిస్థితి. దాదాపు రూ.2,400 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్లో పెట్టారు. చదువుకునే పిల్లలు విద్యాదీవెన, వసతి దీవెన కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసినా పెట్టుబడి సహాయం లేదు. ఆర్బీకేలు లేవు. ధాన్యం కొనుగోలులో మళ్లీ దళారులు వచ్చారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. ఏ పథకమూ డోర్ డెలివరీ లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు వెళ్తేనే వాళ్ల సమక్షంలో పథకాలు ఇచ్చే పరిస్ధితి. అక్కడకు వెళ్లకపోతే పథకాలు నిలిచిపోతాయి. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారు.మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. ప్రతి ఇంట్లో బతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామంలో ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి. పిల్లలు రూ.15 వేల గురించి అడుగుతారు. మహిళలు రూ.18 వేల గురించి అడుగుతారు. పెద్ద వాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు. రైతులు రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఏమని సమాధానం చెబుతారు? ఇప్పుడు రెడ్బుక్ పాలన సాగుతోంది. ప్రజలను భయపెడుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది. అన్ని వ్యవస్ధలు కూలిపోయాయి. అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం పది పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెంచే కార్యక్రమం నడుస్తోంది. డిస్టిలరీస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. లిక్కర్ సిండికేట్స్ అప్పుడే మొదలయ్యాయి. గ్రామ గ్రామాన బెల్టు షాపులు ప్రమోట్ చేసే కార్యక్రమం నడుస్తోంది. ఇసుక గురించి మాట్లాడలేని పరిస్థితి. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇవాళ ఉచితం లేదు కానీ, రెట్టింపుకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : ‘ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పారు. ప్రజలను మోసం చేశారు. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఇంటికీ మంచి చేసిన మనకే ఇలా అయితే.. ప్రజలను ఇంతలా మోసం చేసి, అన్నీ అబద్ధాలే చెప్పిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు? ఆయన ప్రజలను ఎన్ని రోజులు భయపెడతారు? ఎన్ని రోజులు కేసులు పెడతారు? ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే చంద్రబాబుకు పరాజయం తప్పదు.టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరు. ఇది నిజం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ ఉందన్నారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఎత్తిచూపుతూ.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని.. ఇది సృష్టి ధర్మమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఉద్బోధించారు. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష అని.. మన వ్యక్తిత్వమే మనల్నిముందుకు నడిపిస్తుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రేపల్లె నియోజకవర్గంలోని స్థానిక సంస్థలప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఐదేళ్లు గర్వంగా తలెత్తుకునేలా పాలన » 2019 నుంచి 2024 వరకు మనం గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం. ‘నేను వైఎస్సార్సీపీ కార్యకర్తను’ అని ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటికి వెళ్లి గర్వంగా చెప్పుకునేలా మన పాలన సాగింది. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగింది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి తొలిసారిగా మన పార్టీ మాత్రమే చెప్పింది. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పబోమని వాటిని నెరవేరుస్తూ అడుగులు వేశాం. » మొట్టమొదటి బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా పథకాలన్నీ అమలు చేశాం. మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరింది. మనకు ఓటు వేశారా.. లేదా అన్నది చూడలేదు. కులం, మతం కూడా చూడకుండా పథకాలు డోర్ డెలివరీ చేసి అండగా నిలబడ్డ ప్రభుత్వం మనది. » కోవిడ్ వంటి సంక్షోభం సమయంలో ఆదాయం తగ్గి.. ఖర్చు పెరిగినప్పటికీ ఏ పథకాన్నీ ఆపలేదు. ఎలాంటి సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. పైగా, అంతకు ముందు చంద్రబాబు చేసిన అప్పుల భారం కూడా మన మీద పడింది. దాదాపు రూ.20 వేల కోట్ల కరెంటు బిల్లులు వదిలిపెట్టి వెళ్లారు. అయినా తొలిసారిగా డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా ప్రజలకు మేలు చేయొచ్చని రుజువు చేశాం. అది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. గణేష్ మీ మనిషి» మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఏరోజైనా మంచే చేశాం. తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేశాం. అంతటితో మర్చిపోకుండా మంత్రి పదవి ఇచ్చి కేబినెట్లో పెట్టుకున్నాను. మండలిని రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవి పోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపాం. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీది. మనం ఆయనకు ఎక్కడా తక్కువ చేయలేదు. » ఇప్పుడు గణేష్ కు మీ మద్దతు చాలా అవసరం. మంచి వాడు. కార్యకర్తకు ఏంజరిగినా నా దృష్టికి తీసుకొస్తాడు. గణేష్ లో ఆ మంచి గుణం ఉంది. ఆయన మీలో ఒకడు. మీ నుంచి వచ్చిన వాడు. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యం. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు. నన్నే ఉదాహరణగా తీసుకోండి. మా నాన్న ముఖ్యమంత్రి. అయినా కష్టాలు వచ్చాయి. పెద్ద వాళ్లంతా ఏకమయ్యారు. తప్పుడు కేసులు పెట్టారు. ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టారు. వేధించారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించ లేదా? మంచి చేసే మనసు ఉన్నప్పుడు, ఆ మంచి వైపు దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి.కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు » విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. స్కూళ్లలో ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో స్కూళ్ల మార్పులు, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ క్లాసులు, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు వచ్చింది కూడా మన ప్రభుత్వమే. » మనం అధికారంలోకి రాక ముందు కేవలం వెయ్యి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు పెంచాం. ఏకంగా పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధి పెంచాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం. జీఎంపీ ప్రమాణాలున్న మందులు ఇచ్చాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఊళ్లలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అక్కడే 105 రకాల మందులు, 14 రకాల టెస్టులు చేసే విధంగా ఆరోగ్య సురక్ష అందుబాటులోకి తెచ్చాం. » వ్యవసాయ రంగంలో ఉచిత పంటల బీమా కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అమలైంది. రైతులకు పెట్టుబడి భరోసా పక్కాగా అమలు చేసింది మన ప్రభుత్వం మాత్రమే. మొదటిసారిగా ఈ–క్రాపింగ్, ఆర్బీకేలు, రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాం. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్ను అందుబాటులోకి తెచ్చాం. వాళ్లు తలెత్తుకుని తిరగలేని పరిస్థితివాళ్లు అబద్ధాలు చెప్పి మోసంతోనే ప్రచారం చేశారు. వలంటీర్లను తీసేయబోమని, వారికి రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నా.. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వారి తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు అని, 50 ఏళ్లకు పైబడిన మహిళ కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, కండువాతో రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి అబద్ధాలతో మోసం చేశారు. ఒకవేళ నేను కూడా అలాంటి అబద్ధాలు చెప్పి ఉంటే, ఈరోజు సీఎం స్ధానంలో ఉండేవాడిని. కానీ, మీలో ఎవరైనా ఇవాళ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేదా? -
ఇప్పుడే తేలిన లంక గ్రామాలు పరిస్థితి దయనీయం
-
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
-
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
-
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
-
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
-
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
-
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
థాంక్యూ జగన్ మామయ్య..
-
YSRCP జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు
-
Repalle: టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి అన్నారు. ఈవూరు గణేష్ను రేపల్లె ప్రజలంతా గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది. కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. సత్యప్రసాద్ హైదరాబాద్లో కూర్చుని పేకాట ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్ను గెలిపించుకోవాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ, లోక్సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సీఎం జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారు. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబులాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు, మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. వైఎస్సార్సీపీ అలా చేయదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం.సీఎం జగన్ని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీకి చేదు అనుభవం.. షాక్ ఇచ్చిన స్థానికులు
బాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరిట టీడీపీ కార్యక్రమం చేస్తుండగా, తమ వీధికి రావొద్దంటూ టీడీపీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు స్థానికులతో గొడవకు దిగారు. టీడీపీలో టికెట్ల పంచాయతీ పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్ను కొమ్మలపాటి శ్రీధర్ కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కొమ్మలపాటికి టికెట్ కేటాయించాలంటూ తీర్మానించారు. వేరే వారికి టికెట్ కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ చంద్రబాబు, లోకేష్లకు టీడీపీ నేతలు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదీ చదవండి: Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు! -
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీలో ఆధిపత్య పోరు
-
అమెరికాలో ఎయిర్పోర్ట్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం
న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్పోర్ట్కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు. విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్మౌత్ ట్రాన్పోర్టేషన్ బస్సు విశ్వచంద్ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్ది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు. -
మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: మోపిదేవి వెంకటరమణ
-
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
సత్వరమే స్పందించినా రాజకీయమా?
ఒంగోలు అర్బన్/ఒంగోలు/రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నా టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబులతో కలసి వనిత పరామర్శించారు. రూ.4.12 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వ్యక్తిగతంగా కొంత మొత్తాన్ని అందించారు. అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలి భర్త అర్ధరాత్రి స్థానిక పోలీసులను సంప్రదిస్తే.. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారని, తెల్లవారేసరికల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసుతోపాటు లైంగికదాడి, హత్యాయత్నం, దొంగతనం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ద్వారా బాధితులకు రూ.2 లక్షల పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మహిళా, శిశు సంక్షేమం కింద మరో రూ.50 వేలు అందజేస్తున్నామన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నా ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాధితులకు సాయమందించేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ మలికాగర్గ్ తదితరులు పాల్గొన్నారు. హోం మంత్రి తానేటి వనిత కారును అడ్డుకుంటున్న టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి కాన్వాయ్పై దాడి కాగా హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలసి బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలుదేరిన మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. వనిత కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ప్రజాప్రతినిధులను దూషించారు. ఈ ఘటన ఒంగోలు రాంనగర్ ఒకటో లైను వద్ద చోటు చేసుకుంది. దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొమ్మూరి సుధాకర్ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ట్రాన్స్జెండర్ గోను దుర్గ, శేషమ్మ, రావిపాటి సీత, ఆళ్ల వెంకటరత్నం తదితరులు దాడికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార ఘటనలో నిందితులకు 15 రోజులు రిమాండ్ కాగా అత్యాచారానికి పాల్పడిన ఇరువురు నిందితులను రేపల్లె అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో బాల నేరస్తుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
AP: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. -
వలస కూలీపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారంపై నిద్రించారు. సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు. బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్కు తరలించామన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని మహిళా కమిషన్ సీరియస్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో ఫోన్లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు. -
కణకణమండే అగ్ని కీలలు.. కొడ‘వళ్లు వంచి శ్రమించే’ శ్రామికులు
ఈ చిత్రంలోని ఇతని పేరు పుసులూరి బుజ్జిబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు. వ్యవసాయ సీజన్లో రోజుకు వంద నుంచి 150 కొడవళ్లు తయారు చేసి సాన పట్టి, కుక్కు పెడతారు. సుమారు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తారు. ఈ సీజన్లో నిత్యం పని ఉంటుందని, కుటుంబాలు సక్రమంగా సాగిపోతాయని బుజ్జిబాబు ఆనందంగా చెబుతున్నారు. మామూలు రోజుల్లో నామమాత్రంగా పని ఉంటుందని పేర్కొన్నారు. కణకణమండే అగ్ని కీలలు.. అందులో నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. లయబద్ధమైన సుత్తుల సవ్వడులు.. బలంగా బిగిసే పిడికిళ్లు.. కొడ‘వళ్లు వంచి’.. సానబట్టే చేయి తిరిగిన శ్రామికులు.. పేటేరు గ్రామంలో నిత్యం కనిపించే దృశ్యాలివీ.. కొడవళ్ల తయారీకి ఈ గ్రామం పెట్టింది పేరు. రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే రేపల్లె మండలం పేటేరు గ్రామం వైపు రైతులు, వ్యాపారుల అడుగులు పడతాయి. వ్యవసాయ పనులకు అవసరమైన కొడవళ్ల తయారీకి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకే కాక ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి కొడవళ్లు ఎగుమతి అవుతాయి. ఈ గ్రామంలో సుమారు 70 ఏళ్ల క్రితం కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. మూడు తరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఇక్కడి శ్రామికులు జీవనం సాగిస్తున్నారు. కొడవలి తయారీలో అద్భుత నైపుణ్యం సాధించారు. వీరు జీవించే కాలనీ శ్రామికనగర్గా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 40కుపైగా కార్ఖానా(కొలిమి)లు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 200 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. తయారీ ఎలాగంటే.. ముడి ఇనుపబద్ధలను కొలిమిలో కాల్చి కార్మికులు కొడవలిని తయారు చేస్తారు. అనంతరం దానికి సానబెట్టి నొక్కులు కొట్టి పట్టుకునేందుకు అనువుగా చివరన చెక్కలను అమరుస్తారు. సీజన్లో ఒక్కొక్క కొలిమిలో రోజుకు సుమారుగా 500 వరకు కొడవళ్లు తయారు చేస్తుంటారు. ఇవి మూడు సైజుల్లో ఉంటాయి. సైజును బట్టి ధర ఉంటుంది. చిన్నసైజు రూ.30, మధ్యస్తంగా ఉన్నవి రూ.60, పెద్దవి రూ.90 వరకు విక్రయిస్తారు. ప్రతి నెలా గ్రామంలో లక్షకుపైగా కొడవళ్లు తయారవుతాయని అంచనా. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చినా కొడవళ్లకు గిరాకీ తగ్గలేదు. ముడిసరుకు దిగుమతి బేల్ కట్లకు ఉపయోగించి పనికిరాని పడవేసే ఇనుప బద్దలను చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచే కాకుండా విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.30లెక్కన కొని ఇక్కడి కార్ఖానాల యజమానులు దిగుమతి చేసుకుంటారు. బొగ్గులు, చెక్క సిద్ధం చేసుకుని కొడవళ్లు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని, దీనికి రవాణా చార్జీలు అదనంగా పడుతున్నాయని యజమానులు చెబుతున్నారు. వందల మంది కార్మికులు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తుంటారు. కత్తులు తయారీలో నాణ్యమైన ముడి ఇసుమును ఉపయోగించటం వల్ల ఎక్కువ కాలం మన్నుతాయి. అందుకే ఇక్కడ తయారైన కొడవళ్లకు మంచి గిరాకీ ఉంది. – చందోలు రవికుమార్, శ్రామికనగర్, పేటేరు కొడవళ్లు అమ్ముతా వ్యవసాయ సీజన్లో పేటేరు నుంచి కొడవళ్లు తీసుకువెళ్లి మా జిల్లాలో అమ్మకాలు చేస్తుంటాం. పేటేరు కొడవళ్లు మన్నికగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా తీసుకువెళ్తున్నాం. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పేటేరు రావాల్సిందే. – సత్యనారాయణ, వ్యాపారి తుని, తూర్పుగోదావరి -
మహానటి సావిత్రి.. చదువులమ్మ..
ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం... అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం గ్రామంలో పాఠశాల ఏర్పాటు కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం. వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా... పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి. తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు. ‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. -
వెళితే మడమ తిప్పలేం
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతిసిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ.. సాగరుడితో జతకట్టేందుకు వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ.. చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలుపోతున్నట్టు వినసొంపైన పక్షుల కిలాకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలాహిరిలో అంటూ కడలి తీరానికి సాగే పడవ ప్రయాణం.. సముద్ర జలాల మధ్యలో చూసితీరాల్సిన అందాల దీవి.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్టు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు స్వాదించాలంటే నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. మరి ఓసారి చూసొద్దాం రండి.. రేపల్లె: తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్తీక మాసాన యాత్రికులను రారమ్మంటూ పిలుస్తున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని గుంటూరు–కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో సుమారు 4వేల హెక్టార్లలో దట్టంగా అలుముకున్నాయి. ఆహ్లాదం.. పడవ ప్రయాణం నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో పాతూరు డ్రెయిన్ ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్ల మేర మలుపులు తిరుగుతూ ప్రయాణించి సముద్రంలో కలుస్తోంది. ఈ డ్రెయిన్ ఇరువైపులా దట్టంగా విస్తరించిన మడ అడవులు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డ్రెయిన్లో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. సాగర తీరానికి ఈ మార్గంతో పాటు నక్షత్రనగర్ నుంచి బీఎం డ్రెయిన్ మీదుగా మరో మార్గమూ ఉంది. అయితే ఆ మార్గం మడ అడవులు తక్కువగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్లేందుకు పాతూరు లేదా నక్షత్రనగర్లో మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. బోటు మొత్తం బుక్ చేసుకుంటే సుమారు రూ.7వేలు తీసుకుంటారు. కార్తీక ‘ద్వీపం’ మడ అడవుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం అనంతరం సముద్ర తీరానికి కొంచెం దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన అందాల ద్వీపం ఉంటుంది. ఇది ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సముద్రంలో కొంత దూరం పడవలో ప్రయాణించాలి. ఈ ఐలాండ్ సాగర స్నానాలకు అనువుగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడపొచ్చు. సముద్ర తీరం వంపులో ఉండటంతో ఐలాండ్తోపాటు, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశావారిపాలెం గ్రామంలోని సముద్రంలో ఎడమ వైపు సూర్యోదయం, కుడి వైపు సూర్యాస్తమయం కనిపిస్తాయి. కన్యాకుమారి తరహాలో సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను తిలకించే అవకాశం ఇక్కడ ఉండడం విశేషం. ఐలాండ్లో వసతుల లేమి బోట్లు అంబాటులో లేకపోవడం వల్ల ఐలాండ్కు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. సరైన వసతులు లేకపోవడం కూడా యాత్రికులు రాకపోవడానికి మరో కారణం. గతంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా మడ అడవుల నడుమ ప్రయాణించి ఐలాండ్లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. ఐలాండ్ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు కల్పించి అందుబాటులో బోట్లు ఉంచితే ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఫలితంగా తీరప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. , -
రేపల్లె టౌన్ లో భారీ బైక్ ర్యాలీ
-
మందుబిళ్లలు అనుకుని ఎలుకల మందు తిన్న మహిళ
రేపల్లె రూరల్: సరిగా మతిస్థిమితం లేని మహిళ మందుబిళ్లలనుకుని ఎలుకల నియంత్రణ మందు తీసుకుని మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మండలంలోని చినఅరవపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఫిరోజ్ కథనం మేరకు చినఅరవపల్లి గ్రామానికి చెందిన భూపతి వీరరాఘవయ్య భార్య రాజేశ్వరి (42) కొన్నేళ్లుగా మతి స్థిమితం కోల్పోయింది. దీంతోపాటు ఆమె పక్షవాతంతో బాధపడుతోంది. కోలుకునేందుకు మందులు వాడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మందుబిళ్లలనుకుని ఎలుకలు - పందికొక్కులకు వాడే విషగుళికలు తీసుకుని వాంతులు చేసుకుని ఇంట్లో పడిపోయి ఉంది. గమనించిన స్థానికులు ఆమె కుమారుడు అరవింద్కు ఫోన్ చేసి సమాచారం అందించగా రాజేశ్వరిని హుటాహుటిన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి అంజనాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి
రేపల్లె: ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను బాబాయే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలను సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. వేజండ్లకు చెందిన కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి బెంగళూరులో ఉంటున్నారు. కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరు తమ ఇద్దరు కుమారులు పార్థివ్ సాహసవత్(10), రోహిత్తశ్విన్(8)లతో కలిసి ఇటీవల రేపల్లె పట్టణంలోని ఉమాదేవి తల్లి అయిన విజయలక్ష్మి ఇంటికొచ్చారు. ఉమాదేవికి చెల్లి శారదాదేవి, అన్న ఉన్నారు. తండ్రి గతంలోనే చనిపోయారు. శారదాదేవి, ఆమె భర్త కాటూరి శ్రీనివాసరావు కూడా విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నారు. శ్రీనివాసరావు గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. ఆయనకూ ఇద్దరు కుమారులు. ఇదిలా ఉండగా సమీపంలో ఆడుకుంటున్న పార్థివ్సాహసవత్, రోహిత్తశ్విన్లతో పాటు తన ఇద్దరు కుమారులనూ శ్రీనివాసరావు ఇంట్లోకి తీసుకెళ్లాడు. సాహసవత్, రోహిత్తశ్విన్లను చెక్క కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. శ్రీనివాసరావు కుమారులు ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో వెంటనే వారు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణలో వెలుగులోకొస్తాయని సీఐ సూర్యనారాయణరావు చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మారడంతో ఉమాదేవిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. -
సినీ ఫక్కీలో హైటెక్ దోపిడీ..
సాక్షి, రేపల్లె: లోను ఇప్పిస్తానంటూ... సినీ పక్కీలో వ్యాపారిని ఓ దుండగుడు బురిడీ కొట్టించి దోపిడీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో వెలుగు చూసింది. సీఐ సాంబశివరావు కథనం ప్రకారం.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామంలోని లక్ష్మీ కిరాణా మర్చంట్స్ యజమాని బొలిశెట్టి నారాయణను సోమవారం కలిశాడు. తన పేరు సుబ్బారావు అని, తాను రేపల్లె పట్టణంలోని కెనరా బ్యాంక్లోని ఉద్యోగినని, మీకు ముద్రాలోన్ పథకం ద్వారా బ్యాంక్ నుంచి రూ.10 లక్షల రుణం ఇప్పిస్తాంటూ నమ్మబలికాడు. రేపల్లె కెనరా బ్యాంక్ వద్దకు సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించాడు. దీంతో నారాయణ, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ మంగళవారం సర్టిఫికెట్లు తీసుకుని కెనరా బ్యాంక్కు వచ్చారు. సుబ్బారావు వీరి కోసం బ్యాంక్ వద్ద వేచి ఉండి వీరు రాగానే ముందుగా బ్యాంక్లో అకౌంట్ ప్రారంభించి రూ.2.5 లక్షలు డిపాజిట్ చేయాలని వారి నుంచి సొమ్ము తీసుకుని బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లాడు. మీ వద్ద ఒక సర్టిఫికెట్ లేదు, దీని జిరాక్స్ తీసుకు రమ్మని నారాయణను బ్యాంక్ నుంచి బయటకు పంపాడు. నారాయణ జిరాక్స్ కాఫీ తీయించుకుని బ్యాంక్ వద్దకు వచ్చే సమయానికి ఆ వ్యక్తి (సుబ్బారావు) కనిపించకపోవటంతో బ్యాంక్ సిబ్బందితో సంప్రదించి తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బ్యాంక్లోని సీసీ కెమెరా పుటేజ్లు పరిశీలించామన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. -
కృష్ణమ్మ విలయానికి 11 ఏళ్లు
సాక్షి, రేపల్లె: కృష్ణమ్మ విలయానికి సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తూ 106 సంవత్సరాల తరువాత 2009, అక్టోబర్ 5న అర్ధరాత్రి సరిగ్గా 12.10 ప్రాంతంలో 10.98 లక్షల క్యూసెక్కుల వరద నీటితో ఉరకలేస్తూ పరుగులు తీసింది. సరిగ్గా ఆదే సమయంలో కరకట్ట మధ్యలో ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకై భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని పల్లెపాలెం వద్ద కరకట్ట క్షణాల్లో కోతకు గురైంది. కళ్లు తెరిచి కళ్లు మూసే సమయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గ్రామాలపై విరుచుపడింది. గొడ్డుగోదా, పిల్లాపాపల్ని చంకనేసుకుని ప్రజలు బతుకుజీవుడా అంటూ జనం పరుగులు తీశారు. క్షణక్షణం భయానక వాతావరణం కృష్ణానది కరకట్ట తెగిన అనంతరం నీరు ఉప్పొంగుతూ క్షణాల్లో పక్కనే ఉన్న బ్యాంకు కెనాల్ను దాటుకుంటూ పంటలు, గ్రామాలపై విరుచుకుపడింది. ఆ ప్రభావంతో రేపల్లె పట్టణం మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటిæ రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆధ్వర్యంలో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. లంక భూములే రక్షణ కవచాలు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహించే సమయంలో కరకట్టకు రక్షణ కవచంలా లంక భూములు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వాటిల్లోని చెట్లు, ప్రవాహాన్ని నిలువరిస్తున్నా యి. సాధారణ నదీ ప్రవాహానికి కరకట్టకు మధ్యలో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల మేర లంకభూమి విస్తరించి ఉంది. ఇప్పటికే ఏయేటికాయేడు వరదల సమయంలో లంక భూమి కోతకు గురవుతోంది. 2009 అక్టోబర్లో వ చ్చిన వరద ఉద్ధృతికి మండల పరిధిలోని బొబ్బర్లంక లంక భూములు సుమారు 70ఎకరాల వరకు కోతకు గురయ్యా యి. దీంతో పాటు రేపల్లె మండల పరిధిలో మరో 30 ఎక రాల వరకు కోతకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. ‘సాక్షి’ సాయం మరువేనిది వరదల సమయంలో సాక్షి ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించిన సహాయక కార్యక్రమాలను ప్రజలు నేటి గుర్తు చేసుకుంటున్నారు. రెండు వేల కుటుంబాలకు దుప్పట్లు, బట్టలు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కరకట్ట పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం రెండు సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకుని పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతతో పాటు రైతులకు వెసులుబాటు కలిగించే విధంగా రోడ్డు నిర్మాణాలకు, గ్రామాల సమీపంలో కరకట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణాల అవసరాలను గుర్తించే కార్యక్రమాలను చేపట్టాం. –కె.నాగేశ్వరనాయక్, రివర్ కన్జర్షెన్సీ ఏఈఈ -
ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. దీంతో వారిని నేరుగా కలిసివారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా పాజిటివ్గా తేలిన జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆయన ఇటీవల కలవడంతో వైద్యుల సూచన మేరకు సెల్ఫ్ క్వారెంటైన్కు వెళ్లారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు తాను హాజరుకావడం లేదంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా తేలియజేశారు. లేఖలో ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) ‘కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నాను. ఇటీవల వ్యాపార రీత్యా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్నాను. కనుక శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్కు వైద్యుల సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. (కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్) -
కత్తితో టీడీపీ కార్యకర్త వీరంగం
రేపల్లె/గుంటూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలం చల్లమ్మ అగ్రహారంలో ఆదివారం జరిగింది. టీడీపీ కార్యకర్తలు దొంతుబోయిన నాగబాబురెడ్డి, బురకాయలరెడ్డి టీడీపీ పాలనలో సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వారికి సాయం అందలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వలంటీర్లు పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితా తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇంటికి బిల్లులు అందించాలని వలంటీర్ కుంచల వెంకటనాంచారెడ్డితో టీడీపీ కార్యకర్త దొంతుబోయిన నాగబాబురెడ్డి గొడవకు దిగి కత్తితో బెదిరించాడు. వీరంగం సృషించాడు. గతంలో నిర్మించిన ఇంటికి ఇప్పుడు బిల్లు ఎలా వస్తుందన్నందుకు కత్తితో వచ్చి బెదిరించాడని వలంటీర్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
సాక్షి, గుంటూరు : రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు చుక్కెదురైంది. వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. గురువారం వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే అనగాని పెనుమూడిపల్లెపాలెం వెళ్లారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం భోజనం పెట్టి ఆదుకుందని గ్రామస్తులు తెలిపారు. అనవసర రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేకు హితవు పలికారు. గ్రామస్తులు ఆగ్రహించటంతో చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్యే అనగాని అక్కడినుంచి వెళ్లిపోయారు. -
రేపల్లెలో బరితెగించిన టీడీపీ కార్యకర్తలు
-
రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తా : వైఎస్ జగన్
సాక్షి, రేపల్లే(గంటూరు జిల్లా) : అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తామని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా రేపల్లేలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రైతన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతన్న కన్నీరు పెడితే అరిష్టమని తాను నమ్ముతానని తెలిపారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలను కోరారు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపిదేవి వెంకట రమణారావు ,బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ బాబులను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గతంలో రెండు పంటలు పండే ఈ ప్రాంతంలో పంటల విరామం ప్రకటించే అధ్వాన్నమైన స్థితి నెలకొంది. సాగుకు నీరు కూడా అందడం లేదు. ఐదేళ్లుగా మరో లిఫ్ట్లు ఇవ్వమన్నా పట్టించుకోలేదు. నిజాంపట్నం హార్భర్ అభివృద్ధికి నోచుకోలేదు. సరైన రోడ్డు కూడా లేదు. మత్సకారులకు సబ్సిడీ అందడం లేదు. వేట నిషేద సమయంలో సరిగ్గా రూ.4 వేలు కూడా ఇవ్వడం లేదు. ఇదే రేపల్లెలో 18వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆక్వారైతులు పూర్తిగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయానికి దళారులు ఏకమై రైతులను దోచేస్తున్నారు. రైతన్న ఆకలితో అలమటించడం చూశా.. 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. ఆ యాత్రలో రైతన్న బాధలను విన్నాను. కష్టాలను స్వయంగా చూశాను. నా సుదీర్ఘ పాదయాత్రలో అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించడం చూశా. ఈ ప్రభుత్వంలో రైతుకు మిగిలేది కష్టం.. రైతుకు మిగిలేది నష్టం అన్నట్లుగా తయారైంది. చంద్రబాబు పాలనలో రైతులకు దుఃఖమే మిగిలింది. వ్యవసాయ రుణమాఫీ అంటూ మోసం చేశారు కాబట్టే.. రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. ఇప్పుడు వడ్డీలతో కలిసి రూ. లక్షా 50 వేల కోట్లకు చేరాయి. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రతి గ్రామంలో రైతుల భూములు కొట్టేసేందుకు మాఫియా తయారు చేశారు. భూములు దోచేసేందుకు భూ సేకరణ చట్టాన్ని సవరణ చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క పంటకు కూడా గిట్టు బాటు ధర రాలేదు. రైతన్నలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్గా మారి హెరిటేజ్ కోసం ధరలను పతనం చేశారు. మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నానే భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తాం. ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. ప్రతి ఏడాది మే నెలలోనే రూ.12500 నేరుగా రైతుల చేతుల్లో పెడ్తాం. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మేమే కడతాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం. పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తాం. పంట వేసే ముందే ఎంతకు కొంటామనేది చెబుతాం. రైతుకు పూర్తిగా అండగా ఉంటాం. ప్రతిమండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని పునరుద్దరిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం. అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటాం. దివంగత మహానేత వైఎస్ఆర్ కలగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళ మళ్లీ తెస్తాం. రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని.. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాను. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పిండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ ఇస్తామని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
టీడీపీకి జనసేన హెల్ప్.. చివరినిమిషంలో అభ్యర్థి మార్పు!
సాక్షి, గుంటూరు : టీడీపీ - జనసేన పార్టీల మధ్య అంతర్గతంగా పరస్పర అవగాహన మేరకు టికెట్ల కేటాయింపు చేసుకుంటున్నాయన్న విషయం ఆయా పరిణామాలను బట్టి మరింత తేటతెల్లమవుతోంది. జనసేన పార్టీకి ఇబ్బంది కలుగకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అదే తరహాలో జనసేన సైతం లోపాయకారిగా టీడీపీ అభ్యర్థులకు నష్టం కలగకుండా అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేస్తోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత, ఏపీ మంత్రి లోకేశ్పై జనసేన నేరుగా అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. నిజానికి సీపీఐ బలమున్న మరో స్థానాన్ని కోరుకున్నప్పటికీ ఒప్పించి మరీ ఆ స్థానం కేటాయించినట్టు సమాచారం. స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించరాదని ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థి పోటీ చేసిన పక్షంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాలేదన్న విమర్శ ఎదురవతుందని, సీపీఐకి కేటాయించడంతో పాటు సమయాభావం కారణంగా వెళ్లలేకపోయారని, ఒకవేళ పవన్ ప్రచారం నిర్వహించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు గుప్పించాలే తప్ప లోకేశ్ గురించి పల్లెత్తు మాట మాట్లాడకూడదన్న అంగీకారం కుదిరినట్టు స్థానికంగా ఉంటుందన్న ఇరు పార్టీల నుంచి వినిపిస్తోంది. ఇకపోతే, గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ప్రయోజనాలకు భంగం కలుగకుండా జనసేన ఏకంగా అభ్యర్థినే మార్చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావుకు జనసేన మొదట సీటు కేటాయించనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో మరో పేరును ఆ పార్టీ తెరపైకి తేవడం గమనార్హం. ఈనియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని కవతం సాంబశివరావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీటు కేటాయించారని ఆపార్టీ నేతల సమాచారం. టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రసాద్కు ప్రతికూలంగా పరిణమించే ఎలాంటి నిర్ణయం తీసుకోరాదన్న అంతర్గతంగా కుదిరిన అంగీకారం మేరకే చివరి నిమిషయంలో జనసేన అధినేత ఇక్కడి నుంచి అభ్యర్థిని మార్చినట్టు తెలిసింది. ఇలావుండగా, ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తానని కొందరు టీడీపీ నేతలకు హామీ ఇచ్చిన పార్టీ అధినేత చివరి నిమిషంలో మరో పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం పట్ల వారంతా తీవ్రస్థాయిలో రగిలిపోతున్నట్టు సమాచారం. -
రేపల్లెలో అధికారపార్టీ నేతల అక్రమాలు
-
మంకీక్యాప్లు పెట్టుకుని.. కంట్లో కారం చల్లి..
నిజాంపట్నం(రేపల్లె)/సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కిరాతకులు రెచ్చిపోయారు. ఒక వ్యక్తిని రాడ్లతో కొట్టి చంపారు. స్థానికుల కథనం ప్రకారం నిజాంపట్నం ఎక్స్ మిలటరీ కాలనీకి చెందిన శీలం మహిమ వర్ధన్ (46) గురువారం ఉదయం 8 గంటల సమీపంలో టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్కు వచ్చాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంకీక్యాప్లు పెట్టుకుని వచ్చి మహిమవర్ధన్ కంట్లో కారం చల్లి రాడ్లతో తలపై కొట్టి హతమార్చారు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన మహిమ వర్ధన్ భార్య రత్నావళి, బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకునేవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసువెళ్లనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. అయితే ఈ హత్యకు భూ వివాదాలే కారణమని చెబుతున్నారు. 1973లో అప్పటి ప్రభుత్వం 124 మంది దళితులకు 186 ఎకరాలు పంపిణీ చేసింది. ఆ భూమిని ప్రస్తుతం పలువురు రైతులు సాగుచేస్తున్నారు. తమ భూమిని పెత్తందారులు లాక్కుని అనుభవిస్తున్నారని గతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. ఈ వివాదాల నేపథ్యమే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలిసి వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, బంధువులను పరామర్శించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు మృతుడి భార్య, బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మృతుడి కుటుంబానికి తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ వరదరాజులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, మహిమవర్ధన్ హత్యకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్యలో పాల్గొన్న వ్యక్తి టీడీపీ నేత బొమ్మిడి రామకృష్ణ ముఖ్య అనుచరుడని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్యలో టీడీపీ నేతల హస్తం ఉండటంతో వారిని తప్పించి వైఎస్సార్సీపీ నేతలపై మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
జీవో86 రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన
-
అది చేజారిపోయే ప్రమాదం ఏర్పడింది
గుంటూరు జిల్లా : ఎన్నో పోరాటాలు చేసి 2010లో రేపల్లెకి సబ్ కోర్టు సాధించామని..కానీ ఇప్పుడు అది చేజారిపోయే ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చెరుకుపల్లి మండలాన్ని పొన్నూరు పరిధిలోకి మార్చటం అన్యాయమన్నారు. కానీ అక్కడ సబ్ కోర్టు లేకపోవడం వల్ల బాపట్ల వెళ్లాల్సి ఉంటుందని, దాని వల్ల న్యాయవాదులు, కక్షిదారులకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోడిపందేలపై చూపే శ్రద్ధలో కొంచెమైనా దీనిపై చూపాలని ఎద్దేవా చేశారు. రియల్ వ్యాపారులతో ఎమ్మెల్యే అనగాని కుమ్మక్కయ్యారని..అందుకే వారికి అవసరమైన చోట బ్రిడ్జీలు కట్టించే పనిలో ఎమ్మెల్యే ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులు ఎమ్మెల్యేకు పట్టడంలేదని తీవ్రంగా విమర్శించారు. -
మృతి కేసు మాఫీకి రూ.2.5 లక్షలు!
రేపల్లె: ఓ బ్యూటీపార్లర్లో చనిపోయిన యువతి మృతి కేసు మాఫీ కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆమె మృతదేహం వద్దే వేలంపాట నిర్వహించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెలోని డూ అండ్ డై బ్యూటీపార్లర్లో తెలంగాణలోని యాదాద్రి జిల్లా రెడ్లరేపాలెంకు చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని సిరి తల్లిదండ్రులు చెబుతున్నా.. వారిని బెదిరిస్తూ.. కేసును మాఫీ చేసేందుకు వేలంపాట నిర్వహించారు. హైదరాబాద్లో ఉంటున్న సిరి బుధవారమే ఈ బ్యూటీపార్లర్లో ఉద్యోగంలో చేరింది. ఉరిపోసుకున్నట్లు చెబుతున్నా.. ఆమె గదిలోని దుస్తులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. బ్యూటీపార్లర్లో జరుగుతున్న ‘వ్యవహారాలకు’ ఒప్పుకోకపోవడం లేదా బయటకు చెబుతానని బెదిరించడం వల్లే ఆమెను నిర్వాహకులే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువకుడు మృతిచెందటంతో మనస్తాపానికి గురై.. యువతి ఉరి వేసుకుని మృతిచెందిందంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులు కొత్త కథనం తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా... బ్యూటీ పార్లర్ అసలు నిర్వాహకురాలి జాడలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేత సమక్షంలో.. కేసు మాఫీ కోసం బ్యూటీపార్లర్ నిర్వాహకుల స్థానంలో అంతా తానై ఓ కాంగ్రెస్ పార్టీ నేత రాజీ ప్రయత్నాలు చేశారు. సిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ విలపిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఉర్మిళ, యాదయ్యలను, బంధువులను బెదిరిస్తూ.. మృతదేహం ఉన్న గదిలోనే ఆమె మృతి కేసు మాఫీకి పాట నిర్వహించారు. నిర్వాహకుల తరఫున రూ.2.50 లక్షలకు మధ్యవర్తిత్వం చేశారు. అనంతరం సిరి తల్లిదండ్రులు, బంధువులను బయటకు పంపించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి ఒకరు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి కేసు మాఫీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత తంతు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలి తండ్రి 2001లో పట్టణంలో జరిగిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. హత్య కేసు అనంతరం వడ్రంగి పనిచేసే వ్యక్తి చిన్నచిన్నగా కలప వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. బ్యూటీపార్లర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని, రాత్రి సమయాల్లోనూ పురుషుల రాకపోకలు అధికంగా ఉంటాయని చుట్టుపక్కలవారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
ఇసుక వేట.. అవినీతి మేట
ఇసుకాసురులు.. అక్రమ సంపాదన కోసం మత్స్యకారులు పోరాడి సాధించుకున్న జీవన భృతినీ వదలడం లేదు. ఇసుక తవ్వకానికి యంత్రమే వద్దన్న చోటికి ఏకంగా డ్రెడ్జర్లు తెచ్చి దోచుకుంటున్నారు. కార్మికులకు రావాల్సిన కూలిని సైతం అడ్డంగా బొక్కేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారం అండతో అడ్డగోలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రేపల్లె సమీపంలోని పెనుమూడి రేవులో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు తెగబడు తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారుల నోళ్లకు మామూళ్ల తాళాలు వేసుకుని మౌనం వహిస్తున్నారు. రేపల్లె: ఇసుక రుచి మరిగిన పాలకపక్ష నేతలు సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పెనుమూడి రేవులో మత్స్యకారులు చేసుకున్న విన్నపాన్ని కలెక్టర్ పరిశీలించి వారి భృతికి అవకాశం కల్పిస్తూ ఇసుకను తరలించుకునేందుకు గత ఏడాది అనుమతి ఇచ్చారు. యంత్రాల సహాయం తీసుకోకుండా ఇసుకను నదిలో తోడుకోవచ్చని చెప్పారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్థానిక నేతలు అంగీకరించకపోవటంతో దాదాపుగా 10 నెలలుగా తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. అనంతరం ఇసుకను తరలించుకునేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ స్థానిక పాలకపక్ష నేతలు రంగంలోకి దిగారు. తమ మాట వినకపోతే రేవును ఆపేస్తామని కార్మికులను బెదిరించి డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారు. రేవు సమీపంలో పెద్ద పెద్ద అగాధాలు పెడుతున్నారు. కొన్ని నెలలుగా రేయింబవళ్లు అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కూలీల వద్దా దండుకుంటున్న నేతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్కు రూ.400 వసూలు చేయాలి.పడవల నిర్వాహకదారులు ఇసుకను నది మధ్యలో నుంచి యంత్రాల సహాయం లేకుండా తీసుకొచ్చి ట్రాక్టర్కు లోడు చేస్తే యూనిట్ ఇసుక రూ.400 తీసుకోవాలి. పాలకపక్ష నేతలు మాత్రం ట్రాక్టర్ నుంచి సుమారు రూ.500 వరకు వసూలు చేస్తూ కార్మికులకు మాత్రం రూ.400 ఇస్తున్నారు. కొంత కాలంగా రోజుకు సుమారు 250 నుంచి 300 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. కార్మికుల కష్టాన్ని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రతి రోజూ దోచుకుంటున్నారు. అనుమతులు లేకున్నా డ్రెడ్జర్లు నదిలో నుంచి ఇసుకను బయటికి తీసుకురావాలంటే యంత్రాలు ఉపయోగించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ నది గర్భంలో నుంచి ఇసుకను తవ్వేందుకు అధికార పార్టీ నేతలు ఏకంగా డ్రెడ్జర్లను ఉపయోగిస్తున్నారు. దీనికిగాను యూనిట్ ఇసుక రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు సుమారు 1500 నుంచి 2 వేల యూనిట్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇలా రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు దండుకుంటున్నారు. నెలకు రూ.3.50 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. పట్టించుకోని అధికార గణం ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారి కూడా దాడులు చేసింది లేదు. అధికారులకూ అక్రమ సంపాదనలో కొంత వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీ నేతలకు బెదిరింపులకు తలొగ్గి పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పెనుమూడి రేవులో ఇసుకను తరలించుకునేందుకు పడవ నిర్వాహకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇసుకను ఒడ్డుకు చేర్చడానికి ఎటువంటి యంత్రాలు ఉపయోగించకూడదు. డ్రెడ్జర్ల సహాయంతో ఇసుకను తోడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్కు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ఎస్వీ రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె -
మాంట్ఫోర్ట్ స్కూల్ విద్యార్థుల అవస్తలు
-
ఉరేసుకుని ప్రేమికుడు ఆత్మహత్య.. కలకలం!
సాక్షి, గుంటూరు: జిల్లాలోని రేపల్లె మండలంలో కలకలం చెలరేగింది. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని ఓ యువకుడు మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. ప్రేమ పేరుతో అతను ఓ మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు. దీంతో ప్రేమికులిద్దరిని కౌన్సిలింగ్ నిమిత్తం పోలీసులు స్టేషన్ను తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపనికి గురైన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రుంకి వెళ్లిన ఆ యువకుడు చాలాసేపు వరకూ తిరిగి రాకపోవడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి చూశారు. అతడు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడు రేపల్లె మండలం గుడికాయలంకకు చెందిన శ్రీనివాసరావు అని పోలీసులు తెలిపారు. -
రేపల్లెలో ’భూ’పాలుడు
-
జటిలంగా ‘శ్మశాన వివాదం’
∙పుష్కరఘాట్పై గుడిసెలు వేసేందుకు సిద్ధమైన గ్రామస్తులు ∙సానుకూలంగా పరిష్కరించుకోవాలంటూ అధికారుల బుజ్జగింపులు ∙అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం రేపల్లె: పెనుమూడిలో శ్మశాన వాటిక సమస్య జఠిలంగా మారింది. కృష్ణా పుష్కరాలకు ముందు వరకు పుష్కరఘాట్ వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించవద్దని వ్యతిరేకించిన వర్గం ఘాట్పైనే మృతదేహాలను దహనం చేసేందుకు సిద్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం పుష్కరాల సమయంలో శ్మశనా వాటికను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పుష్కరాల అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెంది మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇక్కడికి తీసుకువస్తే వేరే వర్గం ప్రజలు, అధికారులు ఇక్కడ దహనం చేసేందుకు వీలులేదంటూ వేరే ప్రాంతంలో దహనం చేసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ఈ ప్రాంతం సమీపంలో ప్రజలు నివస్తున్నారన్న ఉద్దేశంతో మృతదేహాలు వేరే ప్రాంతంలో దహనం చేయడం జరిగుతోందని వివరించారు. నాడు వద్దు అన్నవారు.. నాడు దహన కార్యక్రమాలు చేయరాదం టూ వివాదం చేసిన వారే ఇక్కడ దహన సంస్కారాలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేయడానికి వీలేదంటూ, దహనం చేస్తే శిక్షార్హులంటూ తహసీల్దార్ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని దిక్కరిస్తు మృతదేహం దహన ప్రక్రియలు నిర్వహించడంతో ఇబ్బందికర వాతా వరణం నెలకొల్పుతుందన్నారు. మృతదేహం దహనం చేస్తుంటే వాసన రావటంతో పాటు చితి నుంచి బూడిద గాలికి నివాసాల వైపు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుమతి ఇచ్చారని, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు సహాయంతో దహన సంస్కారాలకు పాల్పడటం దారుణమన్నారు. టెంట్లు వేసి ఆందోళనకు దిగిన మహిళలు.. సమీపంలో ప్రజలు నివసిస్తూంటే ఇక్కడ దహన ప్రక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ సమీపంలో నివసిస్తున్న ప్రజలు చిన్నపాటి గుడిసెలు వేసి నిరసన తెలిపారు. ఇక్కడ మేమంతా నివాసం ఉంటే మృతదేహాలను ఏవిధంగా దహ నం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు వాగ్వాదం తలెత్తగా తహసీల్దార్ ఎస్వీ రమణకుమారి, సీఐ పెంచలరెడ్డి గ్రామస్తులను బుజ్జగించినప్పటికి ఫలితం లేకపోయింది. తహసీల్దార్, సీఐలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని అప్పటి వరకు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని కోరారు. -
రేపల్లె- సికింద్రాబాద్ రైల్లో దోపిడి
గుంటూరు: రేపల్లె నుంచి సికింద్రాబాద్ వస్తున్న డెల్టా ప్యాసింజర్ రైలులో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి-పొందుగల స్టేషన్ల మధ్యలో దుండగులు ఎస్-2 కోచ్లోకి ప్రవేశించి ప్రయాణికుల వద్ద నుంచి 20 తులాల బంగారం, రూ.60 వేల నగదును అపహరించుకుపోయారు. తర్వాత చైన్ లాగి రైలు దిగి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఓటమి గెలుపునకు తొలిమెట్టు
రేపల్లె (గుంటూరు): ప్రతి రంగంలోనూ గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు చెప్పారు. పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో రియో ఒలంపిక్స్–2016లో షటిల్ క్రీడలో క్వార్టర్ఫైనల్స్ వరకు ఆడిన షటిల్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు గురువారం నిర్వహించిన సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఓటమికి నిరుత్సాహకపడక మరిన్ని ప్రయత్నాలు సాధిస్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పారు. రియో ఒలింపిక్స్లో ప్రపంచ షటిల్ నంబర్ 1 క్రీడాకారుడు లిన్డాన్తో శ్రీకాంత్ చివరి వరకు పోరాడి అద్వితీయమైన ప్రతిభను కనపరించాడన్నారు. వచ్చే ఒలంపిక్స్ క్రీడల్లో తప్పకుండా శ్రీకాంత్ భారతదేశానికి బంగారు పతకాన్ని తీసుకురావాలని కోరారు. అనంతరం కిడాంబి శ్రీకాంత్ను, అతని తండ్రి కష్ణను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ తూనుగుంట్ల కాశీవిశ్వనాథగుప్త, ఎంసీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు, వేములపల్లి లక్ష్మీనారాయణ, గుమ్మడి రాజశేఖర్, జి.హనుమంతరావు, బాపారావు, రాధాకృష్ణమూర్తి,కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
వరుణ దేవా.. ఎంత పని చేశావయ్యా..!
-
రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్ విధింపు
జాస్మిన్, శ్రీసాయి మృతి ఘటనలతో రేపల్లెలో వేడెక్కిన వాతావరణం ప్రభుత్వాస్పత్రి వద్ద శ్రీసాయి బంధువుల బైఠాయింపు, ఆందోళన జాస్మిన్ సోదరుడు, బంధువును అదుపులోకి తీసుకున్న పోలీసులు రేపల్లె : యువతి జాస్మిన్, యువకుడు వేముల శ్రీసాయి మృతి ఘటనలు రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. నియోజకవర్గ పరిధిలోని నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలేనికి చెందిన షేక్ జాస్మిన్ ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె మృతికి గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్కుమార్ కారణమని బంధువులు, గ్రామస్తులు చితకబాదడం, ఈ ఘటనలో వేముల శ్రీసాయి అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వేముల శ్రీసాయిని అన్యాయంగా చంపేశారంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బైఠాయించి ఆదివారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క జాస్మిన్ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదాలు చెలరేగుతాయన్న ఉద్దేశంతో జాస్మిన్ కుటుంబ సభ్యులను, బంధువులను ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోకి పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి కొద్దిసేపు వాదన జరిగింది. చివరికి జాస్మిన్ కుటుంబ సభ్యులు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు. రెండు ఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో, అడవులదీవి గ్రామంలో 144వ సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు. అడుగడుగునా పహారా కాస్తూ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు అదుపులోకి... జాస్మిన్ను హత్య చేశారనే అనుమానంతో వేముల శ్రీసాయి, జొన్న పవన్కుమార్లను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా, ఆమె బంధువు గౌస్లను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో గ్రామంలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. హత్య కేసులుగా నమోదు – బాపట్ల డీఎస్పీ మహేష్ జాస్మిన్, శ్రీసాయిల మృతి ఘటనలపై రెండు వేర్వేరు హత్య కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేసిన ట్లు బాపట్ల డీఎస్పీ మహేష్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాస్మిన్ మృతిపై పలు కోణాల్లో విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. జాస్మిన్ తాను చనిపోతున్నానని వేముల శ్రీసాయికి ఫోన్ చేసిన అంశం నుంచి, వారిద్దరికీ ఉన్న పరిచయం, జాస్మిన్కు వివాహం చేసేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిపై విచారిస్తున్నామన్నారు. జాస్మిన్ను శ్రీసాయి, అతని స్నేహితుడు చంపేశారా, వారు వచ్చేసరికే జాస్మిన్ చనిపోయి ఉందా అన్న అంశంపై పూర్తి విచారణ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆమె ఇంట్లో పడి ఉన్న బ్యాట్, బెల్టు ఎవరివన్నదానిపై కూపీ లాగుతున్నామన్నారు. జాస్మిన్ ఇంట్లో పడి ఉన్న రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. జాస్మిన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అందించే నివేదిక కేసు విచారణకు మరికొంత ఉపకరిస్తుందన్నారు. పోస్టుమార్టం పూర్తి మృతిచెందిన జాస్మిన్, శ్రీసాయిల మృతదేహాలకు రేపల్లె ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. ఇద్దరి మృతదేహాలూ ప్రభుత్వాస్పత్రిలో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తొలుత జాస్మిన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోలీసుల బందోబస్తుతో మృతదేహాన్ని అడవులదీవి గ్రామానికి తరలించారు. అనంతరం గంటన్నర తరువాత శ్రీసాయి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి పోలీసు బందోబస్తుతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. శ్రీసాయి మృతదేహాన్ని గ్రామంలోకి వద్దని శ్రీసాయిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న మహ్మదీయపాలేనికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంచుతామని శ్రీసాయి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శ్రీసాయి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి శ్రీసాయి మృతదేహాన్ని గరువు గ్రామంలోని మృతుని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం చీకటి పడిపోవటంతో శ్రీసాయి అంత్యక్రియలను మంగళవారం నిర్వహించే విధంగా బంధువులు నిర్ణయించుకున్నారు. -
యువతరం అభిరుచుల్లో మార్పు రావాలి
‘సాక్షి’తో సినీగేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు రాజమహేంద్రవరం :‘నాటి పాట హృదయాన్ని తట్టిలేపేది. నేటి పాట శరీరాన్ని పట్టి ఊపుతోంది. యువతరం అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమా పాటలు వస్తాయ’ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి, తెలుగు వెలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యువచైతన్య పురస్కారం అందుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన సినీ గేయ ప్రస్థానాన్ని ఇలా వివరించారు. ‘‘మాది గుంటూరు జిల్లా రేపల్లె. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎమ్మెస్సీ చదివాను. డి.రామానాయుడి ‘ప్రేయసి రావే’ సినిమాలో తొలిసారిగా ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాట రాశాను. ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా కోసం ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ తదితర పాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటివరకూ సుమారు 60 సినిమాలకు వందకు పైగా పాటలు రాశాను. ఇటీవల విడుదలయిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా కోసం ‘నీతోనే ఉంది ప్రపంచం.. నీ తీరు మార్చు నేడు కొంచెం’ పాట విమర్శకుల మెప్పు పొందింది.’’ -
విషాదాంతమైన బాలుడి కిడ్నాప్
రేపల్లె (గుంటూరు) : రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమయ్యింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయపాలెం గ్రామానికి చెందిన సాల్మన్రాజు రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కిడ్నాప్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గురువారం కృష్ణానది తీరంలో బాలుడి మృతదేహం లభించింది. తిరిగి వస్తాడని ఆశిస్తున్న చిన్నారి మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. సాల్మన్ రాజును హతమార్చిన విషయం బయటపడుతుందని భావించి కృష్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. -
పెనుమూడిలో వ్యక్తి దారుణ హత్య
రేపల్లె : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్ధానికంగా నివాసముండే కుక్కలిగడ్డ నాగఫణీంద్ర(24) అనే వ్యక్తి ని సొంత బావమరిది నాగిడి నాగరాజు కత్తులతో పొడిచాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు
బీసీ కార్పొరేషన్ రుణం ఇప్పించలేదని మనస్తాపం రేపల్లె: ‘టీడీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నాను. వార్డు మెంబరుగా పోటీ చేసి ఓడిపోయాను. మరోవైపు ఆడపిల్లల పెళ్లిళ్లతో అప్పుల పాలయ్యాను. సొంత పార్టీ ఎమ్మెల్యే కదా రుణం ఇప్పించకపోతారా అనే ఆశతో వెళితే.. మొండి చెయ్యే చూపించాడు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటం నా వల్ల కాదు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందే ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటి ఆవరణలో సోమవారం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్కు చెందిన నాగిడి విజయలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు . ఆమె భర్త చేపల వేటకు వెళుతుంటాడు.ఈ నేపథ్యంలో కుటుం బ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడంతో బీసీ కార్పొరేషన్ నుంచి రుణం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయించి పలుమార్లు తిరిగింది. సోమవారం మరోసారి ఎమ్మెల్యేకి తన గోడు చెప్పుకునేందుకు వెళ్లగా.. గ్రామ సర్పంచ్ను కలవాలని సూచించి ఆయన వెళ్లిపోయారు. అంతకుముందే సర్పంచ్ వద్దకు ఆమె పలుమార్లు వెళ్లగా, ఆయన తన బంధువులకు రుణాలు ఇప్పించుకుంటున్నాడే తప్ప పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కూడా సర్పంచ్నే కలవమనడంతో మనస్తాపం చెందిన ఆమె తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడున్న వారు స్పందించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతంచికిత్స పొందుతోంది. -
ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి
వైద్యశాలలో నిండుకున్న వ్యాక్సిన్లు పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన రేపల్లె ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయని గ్రామసభల్లో పాలకులు ప్రచారం చేస్తే నిజమేననుకున్నాం. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని బతికించుకుందామని తీసుకొచ్చాం. తీరా వచ్చాక వైద్యులు సకాలంలో స్పందించలేదు. మందుల్లేవని చావుకబురు చల్లగా చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కేవి.’ అంటూ మృతుడి బంధువులు బోరున విలపించారు. మృతదే హంతో రాస్తారోకో చే శారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రేపల్లె మండలంలోని గుడ్డికాయలంక గ్రామానికి చెందిన చిట్టిమోతు ప్రసాద్(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని ఓ పొలంలో గడ్డి మోపులు కట్టేందుకు వెళ్లారు. గడ్డిలో ఉన్న పాము ప్రసాద్ భుజంపై కాటు వేసింది. కాలువేసింది రక్తపింజరిగా గుర్తించిన ప్రసాద్ వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషమంగా ఉన్న ప్రసాద్కు చికత్స చేసే విషయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాము కాటుకు విరుగుడు మందులు కూడా అందుబాటులో లేకపోవటంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. మందులు అందుబాటులో ఉంటే ప్రసాద్ ప్రాణాలు పోయేవికావంటూ ఆసుపత్రి ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో జరిగిన గ్రామసభల్లో ప్రభుత్వ వైద్యులు, పాలకులు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు, మందులు ఉన్నాయని ప్రచారం చేస్తేనే ఇక్కడికి తీసుకువచ్చామని విలపించారు. ఇలాగైతే ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను బండరాయితో మోది చంపిన భర్త
రేపల్లె రూరల్: గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ మండలం నల్లారిపాళెం గ్రామంలో భార్యను బండరాయితో మోది హత్య చేశాడో భర్త. గ్రామానికి చెందిన వినోదమ్మ(58)ను ఆమె భర్త జాముడు కు గత కొంత కాలంగా కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బండరాయితో తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపల్లె రూరల్ ఎస్ఐ సుబ్రమణ్యం సంఘటన స్థలాన్ని పరిశీలించి వినోదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. జాముడు పరారీ లో ఉన్నాడు. -
ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న టీడీపీ నేత
రేపల్లె (గుంటూరు) : ప్రభుత్వ అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె పురపాలక సంఘంలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్పై తెలుగు దేశం పార్టీ నేత, కాంట్రాక్టర్ గోగినేని శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం దాడికి దిగారు. బిల్లులకు సంబంధించిన విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు.. ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకుని ఆయనపై దాడి చేశాడు. దీంతో ఆయన కణత వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకుని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
రేపల్లె (గుంటూరు) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(40) సోమవారం ఉదయం కృష్ణానదిలో వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో నదిలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యం అయింది. -
కౌలు రైతు ఆత్మహత్య
రేపల్లె (గుంటూరు) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం చింగుపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నన్నేపాముల లాజర్(35) తనకున్న రెండెకరాలతో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది కూడా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది కూడా దిగుబడి వచ్చేలా కనిపించకపోవడంతో.. ఇంట్లో ఉన్న గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రేబిస్ తో యువకుడు మృతి
రేపల్లె (గుంటూరు) : కుక్క కరిచినా వైద్యం చేయించడంలో నిర్లక్ష్యం వహించడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని 17వ వార్డులో మూడు రోజుల క్రితం ఆనంద్(17) అనే యువకుడిని ఓ పిచ్చి కుక్క కరిచింది. స్వల్ప గాయాలు కావడంతో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోకుండా కేవలం ప్రాథమిక వైద్యం చేయించారు. అయితే సోమవారం ఆనంద్ పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్కు రేబిస్ సోకిందని, బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆనంద్ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకురాగా, సోమవారం సాయంత్రం మృతి చెందాడు. -
వీఆర్వోపై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు
రేపల్లె (గుంటూరు) : ఓ రెవెన్యూ ఉద్యోగిపై దాడి చేసి విధులకు ఆటంకపరిచినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రేపల్లె సినీయర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో వీఆర్వో వర ప్రసాద్పై అదే గ్రామానికి చెందిన వెంకట రమణారావు అలియాస్ బుల్లిబాబు కత్తితో దాడి చేశాడు. ఈ విషయమై బాధితుడు కోర్టుకెక్కాడు. విచారణ అనంతరం రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి చక్రపాణి ఈ రోజు తీర్పు చెప్పారు. మద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. -
మహిళ అనుమానాస్పద మృతి
రేపల్లె (గుంటూరు): ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆకుల లక్ష్మీ (40), భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే శుక్రవారం ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైల్లో మహిళ మృతి
రేపల్లె (గుంటూరు) : రైల్లో ప్రయాణిస్తున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెకోనలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా శివరామపురం గ్రామానికి చెందిన రావి శివనాగేంద్రం(48) రైల్లో తెనాలి నుంచి రేపల్లె వెళ్తున్నారు. కాగా ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
గుంటూరు (రేపల్లె) : బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని నిజాంపట్నం రోడ్డులో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా జారిపడిపోయాడు. దీంతో స్థానికులు అతని దగ్గరికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో డ్రైవర్ దారుణ హత్య
రేపల్లె(గుంటూరు జిల్లా): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆటో డ్రైవర్పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి గుంటూరు జిల్లా రేపల్లె మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఆటోస్టాండ్ వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని మోల్లగుంట గ్రామానికి చెందిన నాగరాజు(45) ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా, రాత్రి ఆటో స్టాండ్ వద్ద ఉన్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు: అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయిపాలెం గ్రామంలో జరిగింది. వివరాలు.. అక్రమంగా 25.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవైర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (రేపల్లె) -
పోస్టాఫీసులకు తాళాలు
గుంటూరు : గ్రామీణ తపాలా ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. గురువారం గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన పోస్టాఫీసుతోపాటు సబ్ పోస్టాఫీసులకు ఉద్యోగులు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రధాన తపాలా ఉద్యోగుల వేతనాల స్థాయిలో తమకూ వేతనాలు ఇవ్వాలని, ఇందుకోసం జ్యుడీషియల్ కమిటీ వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. (రేపల్లె) -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
రేపల్లెరూరల్, న్యూస్లైన్ : రూరల్ మండలంలో టీడీపీ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తోంది. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలని జిల్లా అధికారులు పదేపదే చేస్తున్న అదేశాలను మండలస్థాయి వారు విస్మరిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు పసుపు రంగులు వేయిస్తూ పార్టీ అధినేత, స్థానిక అభ్యర్థి పేర్లను రాసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కోడ్ నీరుగారిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. మండలంలోని నల్లూరుపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి నేటి వరకు ముసుగువేయకపోవటం, అదే గ్రామంలోని పలు విద్యుత్ స్తంభాలకు పచ్చ రంగు వేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అంటున్నారు. పట్టణంలోని ఓల్డుటౌన్లో సైతం విద్యుత్ స్తంభానికి పసుపు రంగులు వేసి అభ్యర్థుల పేర్లతో టీడీపీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరం, న్యూస్లైన్: మండలంలోని సజ్జావారిపాలెంలో రేపల్లె-నగరం రహదారి పక్కన టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటుచేసినా అధికారులు వాటిపై కన్నెత్తి కూడా చూడకపోవటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల జెండాలను తొలగిస్తున్నామని చెబుతున్న అధికారులు ఆయా పార్టీల జెండాలను తొలగించడంలేదు. నగరంలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికి కూడా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి ఉంది. పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు టీడీపీ జెండాలున్నాయి. పంచాయతీ, రెవెన్యూ అధికారులెవ్వరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. -
బస్సు డ్రైవర్ ప్రాణాలు తీసిన 'బైక్'
-
బస్సు డ్రైవర్ ప్రాణాలు తీసిన 'బైక్'
గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో శనివారం దారుణం జరిగింది. అనుకోకుండా ఓ బస్సు ....మోటార్ బైక్ను తాకిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీ చైతన్య స్కూల్ బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో .... పక్కన ఉన్న బైక్ను తాకింది. దాంతో బైక్పై ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక డ్రైవర్ మృతి చెందాడు. కాగా నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపల్లెలో షర్మిళ ప్రసంగం
-
సంక్షేమ పథకాలు జగన్తోనే సాధ్యం
రేపల్లె రూరల్, న్యూస్లైన్ :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు చెప్పా రు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం లో సోమవారం వెయ్యిమంది కాంగ్రెస్ కార్యకర్తలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గూడవల్లి బాబూరావు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. మోపిదేవి మాట్లా డుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహానేత వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే, వాటిని ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు నీరుగారుస్తూ ఆయా వర్గాలకు తీరని అన్యాయంచేశారని దుయ్యబట్టారు. పథకాలను దూరం చేయడాన్ని ప్రశ్నించిన వైఎస్ తనయుడు, జననేత జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పాలకులు కక్షగట్టారన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ముందుకు సాగుతున్నానని ప్రజల అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మోపిదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ లోయ తాండవకృష్ణ, నాయకులు గడ్డం రాధాకృష్ణమూర్తి, కొమ్మురి వీరబ్రహ్మేంద్రస్వామి, గుజ్జర్లమూడి ప్రశాంత్, డొక్కు నాగేశ్వరావు, చిత్రాల ఒబేదు, బేతపూడి కోటేశ్వరరావు, చిమటా బాలాజీ, యలమనేని కిషోర్కుమార్, జడల వాసు, అల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
భర్త వద్దకు పంపాలంటూ పోరాటం
-
అత్తింట్లో యువతి పోరాటం
రేపల్లె రూరల్, న్యూస్లైన్ :తన భర్త హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే.. తాను అత్తవారింట్లో ఉండడమేంటని ప్రశ్నిస్తూ.. తనను భర్తతో కాపురానికి పంపించాలంటూ ఓ యువతి అత్తవారింట్లో నిరాహార దీక్ష చేపట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 8వ వార్డులో ఉంటున్న వీసం రామారావు రెండో కుమారుడు శ్రీధర్కు చెరుకుపల్లికి చెందిన అన్నం పుల్లారావు కుమార్తె శకుంతల నాగార్జునతో 2011లో వివాహం చేశారు. హైదరాబాద్లో హెచ్ఎస్బీసీలో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేస్తున్న శ్రీధర్ పెళ్లయ్యాక 15 రోజులకోసారి ఇక్కడకు వచ్చి ఒకరోజు ఉండి వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కాపురం పెట్టాలని శకుంతల బంధువులు శ్రీధర్ తల్లిదండ్రులను కోరగా అంగీకరించారు. దీంతో ఏడాది క్రితం రెండు లక్షలు విలువైన ఇంటి సామానును హైదరాబాద్కు పంపించారు .ఇంతలో అత్తమామలతో పాటు అత్త తమ్ముడు దిల్బాబు కలిసి శ్రీధర్కు మేనకోడల్ని ఇచ్చి పెళ్లిచేయాలని కుట్రపన్నారు. కాపురం పెట్టడానికి శకుంతలను హైదరాబాద్ తీసుకువెళ్లి కొద్దిరోజులకే మళ్లీ రేపల్లెకు తీసుకువచ్చారు. అత్తింటివారు పథకం ప్రకారం ఆమెను మానసికంగా హింసించి పుట్టింటికి పంపించారు. దీంతో శకుంతల బంధువులు ఆమె అత్తమామలను ప్రశ్నించగా కాపురం అప్పుడు పెడతాం .. ఇప్పుడు పెడతామంటూ దాటవేస్తూ వచ్చారు. పెద్దమనుషుల జోక్యంతో కాపురానికి తీసుకువెళతామన్న అత్తమామలు దాటవేసే ధోరణిని అవలంబించసాగారు. దీంతో మానసిక వ్యధకు గురైన శకుంతల, ఆమె బంధువులు పెద్ద మనుషులను తీసుకుని అత్తవారింటికి వ చ్చి నిరాహార దీక్ష ప్రారంభించింది. తనను భర్తతో కాపురానికి పంపించి, తనకు న్యాయం చేయాలని శకుంతల విలపించింది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు కూడా ఇచ్చినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. కృష్ణబలిజ సంఘం మద్దతు.. ఏడాదిన్నర కాలంగా కాపురానికి పంపిస్తామని వీసం రామారావు దంపతులు మభ్యపెడుతూ శకుంతలకు అన్యాయం చేయడం సరైన విధానం కాదని కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం రాఘవయ్య అన్నారు. న్యాయం జరిగే వరకు సామాజిక పోరాటం చేస్తున్న శకుంతలకు అండ గా ఉంటామన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగమని లక్షలు కట్నం తీసుకుని ఆడపిల్లను చిత్రహింసలు పెట్టడాన్ని సమాజం హర్షించదని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిడి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తున్న శకుంతలకు మద్దతు ప్రకటించారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
రేపల్లె రూరల్, న్యూస్లైన్ :నకిలీ నోట్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను టౌన్ సీఐ యు.నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని నల్లూరుకు చెందిన రైతు శ్రీపతి శ్రీనివాసరావును రేపల్లెలో 20 రోజుల క్రితం పేటేరుకు చెందిన గాలి చంద్రబాబు, అమర్తలూరి వీరబాబు, భట్టిప్రోలుకు చెందిన పేటేటి అరవిందబాబులు కలిశారు. రూ. 50 వేలు ఇస్తే లక్ష రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని వారు నమ్మబలికారు.తన వద్ద ఉన్న పది వేల రూపాయలను శ్రీనివాసరావు ఇవ్వగా మిగతా రూ.40 వేలు ఇస్తే రాజమండ్రిలో లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇప్పిస్తామని నమ్మించారు. అయితే, ఇటీవల గుడ్డికాయలంకలో నకిలీ నోట్ల ముఠాను అరెస్టు చేశారన్న సంగతి తెలుసుకున్న శ్రీనివాసరావు మోసపోయానని భావించి నాలుగు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా ఉన్న అరవిందబాబు, వీరబాబు, చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. అరవిందబాబు నకిలీ నోట్ల మార్పిడి ఏజెంట్గా మారి అమాయకులకు డబ్బు ఆశ చూపి మోసగిస్తున్నట్లు వెల్లడయింది. గతంలో గాలి చంద్రబాబు, అమర్తలూరు వీరబాబులకు నకిలీనోట్లు ఇప్పిస్తానని రూ.1.70 లక్షలు అరవిందబాబు కాజేశాడు. దీంతో నష్టపోయిన సొమ్మును రాబట్టుకునేందుకు ఈ ఇద్దరు కూడా అరవిందబాబుతో జతకట్టారు. అరవిందబాబు ఇప్పటివరకు రేపల్లె, నరసరావుపేట, వెల్లటూరులలో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలింది. సమావేశంలో హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వరావు, సిబ్బంది లింగరాజు, హర్ష, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. -
మంత్రిగా నేను చేసిన తప్పేంటి?
గుంటూరు : ‘మంత్రిగా నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. సముద్రతీర ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు చేపడితే పరిశ్రమలు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అప్పటి ముఖ్యమం త్రి డాక్టర్ వైఎస్ను కోరా. ఈ క్రమంలోనే వాన్పిక్ ప్రాజెక్టు అంశం తెరమీదకు వచ్చింది. ఈ విషయంపై కేబినెట్లో చర్చించాకే అందుకు సంబంధించిన జీవో విడుదలైంది. అది నా ఒక్కడి నిర్ణయం కానేకాదు. అయినా సీబీఐ నన్ను మాత్రమే అరెస్టు చేసింది. అన్యాయంగా 18 నెలలు జైల్లో పెట్టింది. ఒక్కటి మాత్రం నిజం. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో వైఎస్ జగన్కు పెరిగిన ప్రజాదరణను చూసి ఓర్వలేక, దానికి కట్టడి వేసేందుకే ఢిల్లీ పెద్దల సహకారంతో సీబీఐని అస్త్రంగా నన్ను, నా తరువాత వైఎస్ జగన్ను అరెస్టు చేశారు. అధికార పార్టీ ఇంత దిగజారుడు రాజకీయానికి, కుట్రకు పాల్పడుతుందని ఊహించలేకపోయా..’ అని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మోపిదేవి శనివారం గుంటూరు జిల్లా రేపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సిండికేట్ల వారెవరూ తనకు రూ.10 లక్షలు ఇవ్వలేదని, ఈ విషయంపై అసెంబ్లీలో రాద్దాంతం జరిగిన రోజే సీఎంకు వివరణ ఇచ్చానని చెప్పారు. ఆ రోజే తన అరెస్టుకు బీజం వేశారని ఆలస్యంగా గుర్తించానన్నారు. -
జగన్ను కట్టడి చేసేందుకే అరెస్టు చేశారు:మోపీదేవి
-
రేపల్లెలో అర్థరాత్రి రెచ్చిపోయిన దొంగలు
గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లెలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వరుస చోరీలకు పాల్పడి, అందినకాడికి దోచుకుని ఉడాయించారు. పట్టణంలో 18 దుకాణాల తాళాలు పగులగొట్టి దొరికినంతా దోచుకెళ్లారు. విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న దొంగతనం జరగడంపై షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. -
మత్స్యకారుల విలవిల
రేపల్లె, న్యూస్లైన్ :ఈ ఏడాది వరుస విపత్తులతో సముద్రంలో వేట సాగక మత్స్యకారులు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 15వ నుంచి మే 31వ తేదీ వరకు వేట నిషేధం అనంతరం వేటకు అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురౌతున్నాయి. ఇటీవల పై-లీన్ తుపాను ప్రభావంతో సుమారు వారం రోజుల పాటు తీర పాంతంలో వేట నిలిచిపోయి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజాంపట్నం హార్బర్, లంకెవానిదిబ్బ, కొత్తపాలెం, హారీస్పేట ప్రాంతాల్లో సుమారు 150 మెక్నైజ్డ్ బోట్లు, సుమారు 700 మోటరైజ్డ్ బోట్లు నిలిచిపోయాయి. దీంతో మత్స్యకారులకు పూటగడవటమే కష్టంగా మారింది. తిరిగి ఇప్పుడిప్పుడే వేట సాగుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నామమాత్రంగానే బోట్లు వేటకు వెళ్తున్నాయి. సోమవారం ఎక్కువ శాతం బోట్లు హార్బర్లోనే నిలిచిపోయాయి. కలుషిత జలాలతో ఇక్కట్లు.. సముద్రజలాలు కలుషితమవటంతో ఇప్పటికే వేటలో మత్స్య సంపద లభ్యత మందగించింది. ఒకప్పుడు సముద్ర తీరానికి అతి సమీపంలో వేట చేసే మత్స్యకారులు నేడు తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. దీనివల్ల అధిక శ్రమతో పాటు పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత కృంగదీస్తున్నాయి. ఉప్పు నిల్వలపై పట్టలు.. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హార్బర్లోని మత్స్య సంపద, ఉప్పు నిల్వలను భద్రపరుచుకోవటంలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. హార్బర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఉప్పు నిల్వలపై పట టలు క ప్పారు. -
గుంటూరులో భారీ వర్షం
బాపట్లటౌన్/తాడికొండ, న్యూస్లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. దాదాపు 30 వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు నీట మునిగాయి. కొద్ది రోజు కిందట కురిసిన వర్షాల నుంచి తేరుకుంటున్న రైతులను ఈ వర్షం ఆందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురవడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, తాడికొండ, పొన్నూరు,రేపల్లె, గుంటూరు నగరం తదితర చోట్ల కుండపోతగా వర్షం పడింది. పంటపొలాలు ముంపునకు గురికాగా, పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీటితో రోడ్లు తటాకాలను తలపించాయి. బాపట్లలో ఎనిమిది ,తాడికొండ, అమరావతి ప్రాంతాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. కొండవీటివాగు పొంగి ప్రవహిస్తోంది. లాం గ్రామం వద్ద లోలెవల్ చప్టాపై మూడు అడుగుల ఎత్తున వాగునీరు ప్రవహిస్తుండటంతో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు గుంటూరు-అమరావతి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో నెలరోజుల కిందట నాట్లువేసిన వరి పొలాలు ముంపునకు గురికావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నరసాయ పాలెం, కంకటపాలెం, జమ్ములపాలెం, ముత్తాయపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, మురుకుంటపాడు, వెదుళ్లపల్లి తదితర గ్రామాల్లోని సుమారు 10 వేల ఎకరాల్లోని వరి పైరు ముంపునకు గురైంది.అలాగే కర్లపాలెం మండలంలోని వెయ్యి ఎకరాల్లోని పైరు కూడా నీట మునిగింది. ఈ రెండు ప్రాంతాల్లో వరి,వేరుశనగ పంటలకు ఈ వర్షం చెరుపు చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతకు అగచాట్లు...: అన్నదాతలకు ఈ ఏడాది అడుగడుగునా అగచాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. విత్తనాలు చల్లింది మొదలు వరుణుడు దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి నారుమళ్లు మొత్తం పాడైపోయాయి. చేసేది లేక బాపట్ల ప్రాంతంలోని రైతులు సెంటు వరి నారు రూ. 1200 నుంచి 1500 వరకు కొనుగోలు చేసి నాట్లు పూర్తి చేశారు. పొలాలు నీటి ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటుండగా గురువారం కురిసిన వర్షం రైతులను మరో దెబ్బకొట్టినట్టయింది. కాల్వ కట్టకు మూడు చోట్ల కోత... గుంటూరు: భారీ వర్షాల కారణంగా సాగునీటి కాల్వల్లో నీటిపరిమాణం బాగా పెరిగింది. అప్పాపురం మెయిన్ కాల్వలో 300 క్యూసెక్కుల నీటి విడుదల జరగ్గా, వర్షపునీరు తోడై కాల్వ కట్టలు మూడు ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర కోతకు గురయ్యాయి. వట్టిచెరుకూరు, కోవెలమూడి, పాతరెడ్డిపాలెం గ్రామాల సరిహద్దుల్లో కాల్వ కట్ట మీటరు లోతున కోతకు గురైంది. దీంతో ఆయకట్లు రైతులు పంటలు మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితిని సమీక్షిస్తామని ఇరిగేషన్ ఎస్ఈ రమేష్బాబు పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ కూడా పొంగిప్రవహిస్తోంది. -
త్వరలో రేపల్లె - గుంటూరుల మధ్య కొత్త రైలు
రేపల్లె - గుంటూరుల మధ్య త్వరలో నూతనంగా రైలు ప్రవేశపెడుతున్నట్లు గుంటూరు డివిజన్ ఆర్ఎం ప్రసాద్ శుక్రవారం రేపల్లెలో వెల్లడించారు. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన నూతన రైలు ట్రైయిల్ రన్ను ఆయన ఈ రోజు ఉదయం రేపల్లెలో ప్రారంభించారు. రైలు ప్రయాణ వేళలను అధికారులు ఖరారు చేస్తారని ఆయన వివరించారు. -
రేపల్లెలో మిన్నంటిన సంబరాలు
రేపల్లె, న్యూస్లైన్: రేపల్లె నియోజకర్గంలో సోమవారం సాయంత్రం పండుగ వాతావారణం నెలకొంది. రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు 45 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 2012 మే 24వ తేదీ నుంచి మోపిదేవి చంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయ్యప్ప మాల ధరించిన ఆయనకు శబరిమలై యాత్ర వెళ్లేందుకు సీబీఐ కోర్టు గత డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతినటంతో పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సీబీఐ వ్యతిరేకించింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎన్నిసార్లు బెయిల్కు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం వెలువడిన బెయిల్ వారిలో ఆనందం నింపింది. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బాణసంచా కాల్చుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గడ్డం రాధాకృష్ణామూ ర్తి, బేతపూడి కోటేశ్వరావు, రెడ్డి శంకర్, ఐనాల సాంబశివరావు, యార్లగడ్డ వెంకటేశ్వరావు(చినబాబు), యలమనేని కిషోర్కుమార్, యార్లగడ్డ మదన్మోహన్, వేజళ్ల కృష్ణమోహన్, చిత్రాల ఒబే దు, చిమటా బాలాజీ, అల్లంశెట్టి శ్రీనివాసరావు, జడల వాసు, పీబీఎన్.శర్మ, డొక్కు నాగేశ్వరావు, బొర్రా వెంకటేశ్వరావు, ఒడుగు రాంబాబు, తులసి దుర్గాప్రసాద్, బిక్షాలు,పాల్గొన్నారు. -
కృష్ణ నీళ్లు రాకపోతే సీమాంధ్ర ఎడారే: షర్మిల