
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉందని.. అందువల్ల తన వాదనలు వినకుండా ఆ పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరుతూ గోవిందరాజ దీక్షితులు హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు దాటిన అర్చకులను టీటీడీ అధికారులు ఇటీవల పదవీ విరమణ చేయించారని, ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన నరసింహ దీక్షితులు తనపై పిటిషన్ దాఖలు చేస్తారని, అందువల్ల తన వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment