ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి మరికొద్ది సేపట్లో భూమిపూజ ప్రారంభం కానుండగా తుళ్లూరు మండలంలో ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. మందడం- తాళ్లాయపాలెంలో శనివారం ఉదయం బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం కురుస్తుండటంతో భూమి పూజకు స్వల్ప ఆటంకాలు ఎదురయ్యాయి. గాలుల ధాటికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఆహుతుల కోసం పేర్చి ఉంచిన కుర్చీలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.
శనివారం ఉదయం 8:49 నిమిషాలకు ముహుర్తం ఖరారుకాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితి అధికారులను కలవరపెడుతోంది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సతీసమేతంగా రాజధాని ప్రాంతానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. బంగారు తాపీ, వెండి గమేలాతో భూమి పూజ నిర్వహించనున్నారు.
రాజధాని భూమి పూజకు స్వల్ప ఆటంకాలు
Published Sat, Jun 6 2015 7:54 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement
Advertisement