కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు | KCR massive victory rally schedule changes | Sakshi
Sakshi News home page

కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు

Published Wed, Feb 26 2014 10:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు - Sakshi

కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం  బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బేగం పేట నుంచి గన్పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరతారు.
 
ర్యాలీ సాగేదిలా...
 
*మధ్యాహ్నం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద ర్యాలీ ఆరంభమవుతుంది.
*లైఫ్‌స్టైల్ బ్రిడ్జి, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, రవీంద్రభారతి మీదుగా గన్‌పార్కు చేరుకుంటుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల పొడువున ర్యాలీ సాగుతుంది.
* ర్యాలీ కొనసాగుతున్న సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి నిజాం కాలేజీ వరకు కేసీఆర్ ప్రత్యేక వాహనంపై ఆసీనులవుతారు. అక్కడి నుంచి పాదయాత్రగా గన్‌పార్కుకు చేరుకుంటారు.
* ర్యాలీ మార్గమధ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరఫున 1,000 మందితో పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు బోనాలతో అధినేతకు స్వాగతం చెబుతారు.
* ర్యాలీకి ముందు భాగాన వందల సంఖ్యలో గుర్రాలు, ఒంటెలు నడిచేలా ఏర్పాటు చేశారు.
* నాలుగైదు గంటల పాటు ర్యాలీ సాగుతుందన్న అంచనాలతో.. సామాన్య ప్రజలకు సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement