Breadcrumb
ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు: డీసీపీ
Published Fri, Sep 26 2014 8:48 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
ఏలూరు: విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనలో మరణించిన ముగ్గురి వ్యక్తుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పినకడిమిలో పూర్తయ్యాయని విజయవాడ డీసీపీ ఇక్బాల్ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మూడు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు.
నిందితుల కోసం పినకడిమిలో 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించినట్టు డీసీపీ వెల్లడించారు. నిందితుల బంధువుల ఇంట్లో కూడా సోదాలు పూర్తి చేశామని ఆయన అన్నారు.
Related news by tags
-
‘రెడ్ బుక్ ఎక్కడ? అందరి సంగతి తేలుస్తాం!’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని ఆసరాగా తీసుకుని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం.కాగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబును ఎయిర్పోర్టులో అడ్డుకుని నిర్భందించిన వారు ఎక్కడున్నారు?. ఇప్పుడు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?. రెడ్ బుక్ ఏమైంది?. బయటకు తీయాల్సిందే. వారిని కఠినంగా శిక్షించాలి.ఎన్నికల సమయంలో వారి అంతు చూద్దామనుకున్నాను. వారిని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. మనం బతికి ఉన్నప్పుడే వారి అంతు చూడాలి. కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. అందరి సంగతి తేలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ..‘బీజేపీ కార్యకర్తలను గుర్తించాలనే ఆలోచనతోనే నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు అన్ని విషయాల్లో కలుగజేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీని వర్చువల్గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఫుడ్ ఆర్డర్లో నిర్లక్ష్యం.. జొమాటోకు రూ.60 వేల జరిమానా
జొమాటో, స్విగ్గీ వంటివి అందుబాటులో వచ్చిన తరువాత కావలసిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఉన్న చోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే ఈ సర్వీసుల్లో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటన ఇటీవల కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. దీనిని విచారించిన కోర్టు జొమాటోకు రూ. 60వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన శీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న జొమాటోలో మోమోస్ ఆర్డర్ చేశారు. దీనికి 133 రూపాయలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల తరువాత డెలివరీ అయినట్లు జొమాటో యాప్ చూపించింది. నిజానికి ఆమెకు మోమోస్ డెలివరీ కాలేదు.ఆర్డర్ పెట్టిన మోమోస్ డెలివరీ కాకపోవడంతో రెస్టారెంటుకు కాల్ చేయగా, డెలివరీ ఏజెంట్ ఆర్డర్ తీసుకున్నారని, ఇతర వివరాలు కోసం డెలివరీ ఏజెంట్ను సంప్రదించమని వెల్లడించారు. అయితే ఏజెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతను స్పందించలేదు. దీంతో శీతల్ జొమాటోకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రతిస్పందన కోసం 72 గంటల పాటు వేచి ఉండాల్సిందిగా కంపెనీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. అయినా శీతల్ను ఎలాంటి రిప్లై అందలేదు.ఇదీ చదవండి: పెరిగిన ఎస్బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..జొమాటో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 2023 సెప్టెంబర్ 13న కంపెనీకి లీగల్ నోటీసు పంపించారు. నోటీసుకు ప్రతిస్పందనగా, కోర్టుకు హాజరైన జొమాటో తరపు న్యాయవాది ఈ ఆరోపణ తప్పు అని పేర్కొన్నారు. ఆ తరువాత పొంతనలేని సమాధానాల ఆధారంగా కోర్టు తీర్పునిస్తూ.. జొమాటో నిర్లక్ష్యం వల్ల మహిళ మానసిక వేదనకు గురైందని.. దీనికి పరిహారంగా రూ. 50000, కేసు.. ఇతర ఖర్చుల కారణంగా మరో పదివేలు.. ఇలా మొత్తం జొమాటోకు రూ. 60000 జరిమానా విధించింది.Lady Ordered Momos on Zomato For ₹133She Didn’t Receive The OrderBut Zomato Marked Delivered in The AppShe Sent a Legal Notice and Filed a ComplaintNow Consumer Forum Ordered Zomato To Pay ₹60,000 Compensation To Complainant— Ravisutanjani (@Ravisutanjani) July 14, 2024 -
‘రేవంత్.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా?’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణలో నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అలాగే, రేవంత్కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా అని కామెంట్స్ చేశారు.కాగా, కాసం వెంకటేశ్వర్లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ల మీద నిలబడి నిరుద్యోగుల ఓట్లు అడిగారు. రేవంత్కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా?. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు.1970 నుంచి అమలులో ఉన్న పోస్టులనే భర్తీ చేస్తున్నారు. అంతే తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదు. రేవంత్.. నీకు నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా?. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి కేసీఆర్ కంటే డబుల్ తప్పులు చేస్తున్నారు. నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేపించలేదా?. తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్కు వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడమేంటి?గతంలో హౌస్ అరెస్టుల మీద మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళీ, హరగోపాల్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా?. యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదు. అక్కడ కొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు. రేవంత్ ఎప్పుడైనా యూనివర్సిటీలో చదువుకుని ఉంటే ఆయనకు తెలిసేది. ఆయన ఎక్కడ చదివాడో ఏమీ చదివాడో ఎవరికి తెలియదు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. ఇదేమైనా పోలీస్ పాలనా?. కేసీఆర్ దొంగ అయితే రేవంత్ గజ దొంగ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. త్వరలో ‘కేఎస్ఆర్టీసీ’ ఛార్జీల పెంపు!
బెంగళూరు: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను 15నుంచి20 శాతం వరకు పెంచేందుకు కర్ణాటక ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కేఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఆదివారం(జులై 14)చెప్పారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీజిల్,నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచలేదన్నారు. గడిచిన మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది.ఛార్జీల పెంపుతో కేవలం పురుష ప్రయాణికులపైనే భారం వేస్తామనే వాదన సరికాదన్నారు. మహిళల ఛార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నందున పెరిగిన మేరకు డబ్బులను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Related News by category
-
కావేరీ నీటి వాటా: కర్ణాటక నిర్ణయాన్ని ఖండించిన సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటా విడుదలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ ఖండించారు. ఆయన మంగళవారం కావేరీ జలాల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని తప్పుపట్టారు.‘కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటాను విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని కోరుతున్నాం’ అని తెలిపారు.ఇక.. కర్ణాటక ప్రభుత్వం కేవలం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్లీ కావేరీ జలాల వివాదం తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది.నిన్న(సోమవారం) కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం అనంతరం తమిళనాడు కావేరీ నీటి పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘మేము ప్రతిరోజు ఒక టీఎంసీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయలేం. కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు. -
నూపుర్ శర్మ వ్యతిరేక నినాదాల కేసులో నిందితులకు ఊరట
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు. రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది. -
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
మణిపూర్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టుకు.. ఎవరీ ఎన్ కోటీశ్వర్?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం వెల్లడించారు.కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు.జస్టిస్ కోటీశ్వర్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. -
జేకేలో అమరులైన కెప్టెన్, జవాన్లు వీరే
జమ్ముకశ్మీర్లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం.
Advertisement