200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి.. | Lokesh At It Again: Claims '200' Seats For TDP In '175-Seat' Assembly | Sakshi
Sakshi News home page

200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..

Published Fri, Apr 21 2017 1:50 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి.. - Sakshi

200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..

మరోసారి తడబడిన మంత్రి లోకేశ్‌
అనంతపురం అర్బన్‌: సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాట తడబడడం ఆనవాయితీగా మారింది. గురువారం అనంతపురంలో జరిగిన ‘నీరు– ప్రగతి ఉద్యమం’ సమావేశంలో ఆయన మరోసారి ఇలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలయితే.. 2019 ఎన్నికల్లో 200 స్థానాల్లో పార్టీని గెలిపించాలనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.

 సమావేశంలో విద్యార్థులు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతూ...‘చివరగా మీకు ఒక మాట చెబుతున్నా. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 2019 ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు. 200 స్థానాలు గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్న విషయం కూడా  లోకేశ్‌కు తెలియదా అంటూ అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement