పెళ్లయిన మర్నాడే.. | Man Escape After Love Marriage In Visakhapatnam | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మర్నాడే పరారీ

Sep 15 2018 6:47 AM | Updated on Sep 22 2018 12:27 PM

Man Escape After Love Marriage In Visakhapatnam - Sakshi

సీఐ సమక్షంలో వివాహం చేసుకున్న పరమేశ్వరి, వల్లీ (ఫైల్‌) ,భర్త ఇంటి ముందు పరమేశ్వరి ఆందోళన

విశాఖపట్నం, నర్సీపట్నం: ప్రేమించి ఆపై పోలీసుల సమక్షంలో వివాహం చేసుకుని మొహం చాటేసిన భర్త కోసం భార్య పెదిరెడ్ల పరమేశ్వరి శుక్రవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.  పాతసంతబయలకు చెందిన పరమేశ్వరి, ఇదే ప్రాంతా నికి చెందిన షేక్‌ అబ్దుల్లా అలియాస్‌ వల్లీ   ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేని  వల్లీ వెనకడుగు వేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో పట్టణ సీఐ ని   పరమేశ్వరి ఆశ్రయించింది. వల్లీని స్టేషన్‌కు పిలిపించి పో లీసులు పెళ్లికి ఒప్పించారు.

వారి సమక్షంలోనే ఇద్దరూ వివా హం చేసుకున్నారు. వల్లీ రాత్రి రాత్రే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరమేశ్వరీ మళ్లీ టౌన్‌ సీఐను ఆశ్రయించింది. పోలీ సుల నుండి సరైన సమాధానం రావటం లేదని బాధితురాలు జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. ఆరు నెలల నుంచి కాళ్లు అరిగేలా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం స్వయంగా వల్లీ ఇంటికి వెళ్లి తన భర్తను రప్పిం చాలంటూ డిమాండ్‌ చేస్తూ  ఆందోళనకు దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement