
సాక్షి, విశాఖపట్నం : అరకు ఉత్సవాల పోస్టర్ను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి రెండు రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. నేడు ఉత్సవాల షెడ్యూల్ను మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.