రేషన్ షాపుల్లో సరుకుల్లేవు..! | Minister Paritala Sunitha visits Nellore | Sakshi
Sakshi News home page

రేషన్ షాపుల్లో సరుకుల్లేవు..!

Published Sat, Nov 21 2015 4:18 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Minister Paritala Sunitha visits Nellore

పొగతోట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) : వరద బాధితులకు అందించాల్సిన నిత్యావసరాలు చౌక ధరల దుకాణాల్లో లేకపోవటంతో పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత శనివారం ఉదయం నెల్లూరు నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కొత్తూరులోని రేషన్ షాపులో తనిఖీలు చేశారు. అందులో బియ్యం మినహా ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసిన కందిపప్పు, చక్కెర, పామాయిల్ నిల్వలు లేవు.

అనంతరం ఆమె పొదలకూరు రోడ్డులోని మరో రేషన్ షాపును పరిశీలించారు. అందులో బియ్యం సహా సరుకులేమీ లేవు. ఈ పరిస్థితిపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలను వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతినటం, ఆగని వానల కారణంగానే తాము సరుకులను రవాణా చేయలేకపోయామని అధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement