బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి | mp mekapati rajamohan reddy denies quitting ysrcp to join bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి

Published Wed, Oct 29 2014 10:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి - Sakshi

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి

నెల్లూరు :  తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలను ఆయన బుధవారమిక్కడ తీవ్రంగా ఖండించారు.  కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న తనపై కూడా తప్పుడు ప్రచారం  చేయటం శోచనీయమన్నారు. మరోసారి ఇటువంటి వార్తలు పునరావృతమైతే ఆ సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం సరికాదని మేకపాటి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం వల్లే జన్మభూమిలో పాల్గొంటున్నామని ఆయన తెలిపారు.  ఏ ప్రభుత్వం మంచి చేసిన సమర్థిస్తామని మేకపాటి వెల్లడించారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎండగడతామన్నారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మే 19న ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేసే పనులకు మద్దతు ఇస్తామని జగన్ కూడా చెప్పారన్నారు.

తాను వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నానని, తాను నెరవేర్చాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయని మేకపాటి అన్నారు.  ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో వైఎస్ జగన్కు తెలుసునని, తనకు కూడా చాలా బాధ్యతలు అప్పగించారన్నారు. ఎంపీ కొత్తపల్లి గీతపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని మేకపాటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement