Media Field
-
‘టీఎంటీ’ విభాగంలో ఏఐ ప్రభావం
దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్వర్క్ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్ఫోర్స్లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్వర్క్ ఆటోమేషన్పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలి. అందుకు హెల్త్కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు. -
నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నిజమైన పాత్రికేయులను అగౌరవపరిచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. వారికి అన్నివేళలా అండగా ఉంటామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వ్యవస్థపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించిన 38 ఎకరాల భూపత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాప్రభుత్వంలో పాత్రికేయులు’ కార్యక్రమంలో సొసైటీకి సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేఎన్జే సొసైటీలో సభ్యులు కాని ఇతర జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సిటీ నిర్మాణంలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలని కోరారు. మీడియా అకాడమీకి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పాత్రికేయులకు స్వేచ్ఛ యాజమాన్యాల విధానాలు ఏ విధంగా ఉన్నా, పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను అర్థం చేసుకొని, వారికి సంక్షేమం అందించడంలో ముందుంటామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనేక ఆంక్షలుండేవని, తమ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, తమకు కష్టాన్ని తెచ్చేలా ఉండకూడదన్నారు. పత్రికా సమావేశాల్లో ఆ ట్యూబ్...ఈ ట్యూబ్ అంటూ నిజమైన పాత్రికేయులకన్నా వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఏమన్నా అంటే పత్రికలపై దాడి అని అల్లరి చేస్తున్నారని, వారు ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో పాత్రికేయులే చెప్పాలన్నారు. పాత్రికేయుల ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త విధానాలు రూపొందించాలని మీడియా అకాడమీని సీఎం ఆదేశించారు. కొంతమంది పాత్రికేయులు విలువల్లేకుండా రాజకీయ పార్టీల యజమానులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నడుపుతున్న పత్రికల పోకడలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉన్మాద ధోరణితో వెళుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు కూడా స్థలాలు ఇవ్వాలన్నారు. అనంతరం మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం సీఎం రేవంత్రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జేఎన్జే నాయకులు కిరణ్కుమార్, రవికాంత్రెడ్డి, వంశీశ్రీనివాస్, రమణారావు, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Bangladesh: పత్రికా కార్యాలయం ధ్వంసం.. మహిళా జర్నలిస్టుపై దాడి
బంగ్లాదేశ్లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి. -
ఐఏఎన్ఎస్లో అదానీకి మెజార్టీ వాటాలు
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ .. మీడియా రంగంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ఇండియాలో 50.5 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ లావాదేవీ నిర్వహించింది. ఐఏఎన్ఎస్, అందులో వాటాదారు (ఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్) సందీప్ బమ్జాయ్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అయితే, కొనుగోలు కోసం ఎంత వెచి్చంచినదీ మాత్రం వెల్లడించలేదు. ‘ఐఏఎన్ఎస్ నిర్వహణ నియంత్రణ అంతా ఏఎంఎన్ఎల్ చేతిలో ఉంటాయి. సంస్థలో డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారాలు కూడా ఉంటాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. కొనుగోలు అనంతరం ఐఏఎన్ఎస్ ఇకపై ఏఎంఎన్ఎల్కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుందని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అనారోగ్యం బారిన పడినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితులు మారాయని బమ్జాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్నకు వాటాలు విక్రయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు భద్రత కలి్పంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెజారిటీ వాటాలు విక్రయించేసినందున ఇకపై సంస్థ రోజువారీ నిర్వహణలో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ ఖాతాలో మొత్తం మూడు మీడియా సంస్థలు (ఎన్డీటీవీ, క్వింటిలియన్, ఐఏఎన్ఎస్) చేరినట్లయింది. ఐఏఎన్ఎస్ కథ ఇదీ.. ఐఏఎన్ఎస్ అనేది ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయుల అవసరాల కోసం 1986లో ఇండో–ఏíÙయన్ న్యూస్ సర్వీస్గా ప్రారంభమైంది. అటు తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టి పెడుతూ పూర్తి స్థాయి వైర్ ఏజెన్సీగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12 కోట్లు, అంతకు ముందు రూ. 9 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సంస్థలో 200 మంది పైచిలుకు ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా (ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాల్లో) 350కి పైగా సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. బీక్యూ ప్రైమ్ అనే ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫాంను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ గతేడాది మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. -
మీడియా, ఎంటర్టైన్మెంట్ ఆదాయం... రూ. 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం భారీ వృద్ధిని చూడనుంది. 2027 నాటికి పరిశ్రమ ఆదాయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ 73.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని (రూ.6.03 లక్షల కోట్లు) పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల ప్రాధాన్యతలు పెరుగుతూ ఉండడం, ఇంటర్నెట్ విస్తరణ, కొత్త టెక్నాలజీల అవతరణ ఇవన్నీ కూడా మీడియా, వినోద పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమకు 2022ను కీలక మలుపుగా చెప్పుకోవాలి. 5.4 శాతం వృద్ధితో ఆదాయం 2.32 లక్షల డాలర్లకు (రూ.190 లక్షల కోట్లు) చేరింది. 2021లో వృద్ధి 10.6 శాతంతో పోలిస్తే సగం తగ్గింది. వినియోగదారులు చేసే ఖర్చు తగ్గడమే ఇందుకు కారణం’’అని నివేదిక తెలిపింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో అతిపెద్ద విభాగంగా ఉన్న ఇంటర్నెట్ ప్రకటనల విభాగంలో వృద్ధి గతేడాది స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్లో ఆశావహం భారత్లో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి ఆశావహ పరిస్థితులు నెలకొన్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. 2022లో పరిశ్రమ ఆదాయం 15.9 శాతం వృద్ధి చెంది 46,207 మిలియన్ డాలర్లుగా (రూ.3.78 లక్షల కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లు, గేమింగ్, సంప్రదాయ టీవీ, ఇంటర్నెట్, అవుట్ ఆఫ్ హోమ్ ప్రకటనల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు వివరించింది. ఇదీ చదవండి ➤ Economic Loss due to floods: కన్నీటి వరదలు.. ఎన్ని వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాయో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్ ముఖ్యంగా 2022లో భారత్లో 5జీ సేవలు ప్రారంభించడం మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. నూతన ఆవిష్కరణలతో ఓటీటీ ఆదాయం 2022లో 1.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని, 2021లో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో పోలిస్తే 25 శాతం అధికమని, 2018లో ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు వివరించింది. భారత్లో ఓటీటీ ఆదాయం ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, 2027 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వినియోగం విస్తృతం ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), మెటావర్స్ విస్తరణతో వినియోగం విస్తృతమైంది. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగేందుకు రూపాంతర ఆవిష్కరణలపై కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ మన్ప్రీత్ సింగ్ అహుజా తెలిపారు. మొబైల్ వినియోగం పెరగడం ప్రస్తుత చానళ్లపై ప్రభావం చూపిస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ చానళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందున, సంప్రదాయ మీడియా, వినోద వ్యాపార సంస్థలు సరైన విధానాలను అవలంబించడం కీలకమని పేర్కొంది. భారత్ ఈ ఏడాది వేగంగా వృద్ధి సాధిస్తున్న వార్తా పత్రికల మార్కెట్గా ఉన్నట్టు తెలిపింది. ఓటీటీ, కనెక్టెడ్ టీవీ మార్కెట్కు భారత్లో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు అంచనా వేసింది. -
అందమే అసూయ పడేలా ఉంది.. ఇంతకీ ఎవరీ సౌందర్య!
బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ అడుగుపెడుతూ తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా ఏఐ (కృతిమ మేధస్సు) మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందించిన 'లిసా' 'సనా' అనే ఇద్దరు వర్చువల్ న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ వర్చువల్ న్యూస్ రీడర్ ప్రవేశపెట్టింది. హాయ్ నా పేరు సౌందర్య అంటూ ఆ రోబోట్ పాఠకులకు పరిచయం చేసుకుంది. అనంతరం తను మాట్లాడుతూ.. ‘ నాలో కొంతమంది సహచరులు (AI న్యూస్ ప్రజెంటర్లు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ఛానెల్లలో వార్తలు అందిస్తున్నారు. నేను సౌందర్య, పవర్ టీవీ ద్వారా సౌత్ ఇండియా మొదటి రోబోటిక్ యాంకర్ అని తెలిపింది. ఈ ఛానెల్ ప్రస్తుతం రోబో న్యూస్ రీడర్తో వివిధ వార్తా కార్యక్రమాలతో కూడా ప్రయోగాలు చేస్తుంది. కేవలం వీళ్లే కాకుండా దేశంలోని కొన్ని ఇతర ఛానెల్లు కూడా తమ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ ప్రెజెంటర్లతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల, OTV అనే ఒడియా ఛానెల్ రాష్ట్రం మొదటి AI న్యూస్ ప్రెజెంటర్ లిసాను ప్రారంభించింది. ఇంగ్లీష్, ఒడియా రెండింటిలోనూ దోషరహిత వార్తలు చదువుతూ చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత లిసా ఇంటర్నెట్ను వైరల్గా మారింది. ఇంకా ముందుకు వెళితే, న్యూయార్క్కు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సును ఉపయోగించి తనకు భర్తను సృష్టించుకుని, అతనితో సంభాషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరుతోంది. భారతదేశంలోని ప్రముఖ మ్యాగజైన్ కంపెనీలలో ఒకటైన ఇండియా టుడే గ్రూప్ తన వార్తా సంస్థ ఆజ్ తక్ కోసం ఒక కృత్రిమ మేధస్సుతో కూడిన మహిళను సృష్టించింది. 'సనా'గా పిలవబడే ఈ మహిళ గత మార్చిలో ప్రపంచానికి పరిచయమైంది. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
ప్రజలే బుద్ధి చెప్పే రోజొస్తోంది
నగరంపాలెం (గుంటూరు): రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ప్రజా వ్యతిరేక ధోరణులు, తప్పుడు కథనాల (ఫేక్ న్యూస్)పై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ, బెటర్ ఆంధ్రప్రదేశ్ (బాప్), నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్స్ ఫోరం, ఎడిటర్స్ అసోసియేషన్, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై పాలించే ప్రభుత్వాలను కొన్ని పత్రికలు, చానళ్లు శాసించడం సరికాదని హితవు పలికారు. ఈ పరిస్థితి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానెళ్ల కుట్రను ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలో బుద్ధి చెప్పే రోజులొస్తాయని వ్యాఖ్యానించారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం గుంటూరు నగరంలోని మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో ‘ఆంధ్రప్రదేశ్ మీడియా–నిరాధార, పక్షపాత వార్తలు– పర్యావసానాలు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా అబద్ధపు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆ పత్రికలు, ఆ చానళ్లు చెప్పినట్టు ప్రజలు నడుచుకోవాలని చెప్పడం దుర్మార్గం. ఫేక్ న్యూస్పై యుద్ధం అనివార్యం. – డొక్కా మాణిక్య వరప్రసాదరావు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జర్నలిజం సిగ్గుపడుతోంది ప్రస్తుతం జర్నలిజం సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఫేక్న్యూస్ ప్రచారం చేయడం కోసం అనేక కుట్రలు చేస్తున్నారు. ఒక విషయం కరెక్టా కాదా అనేది నిర్ధారించుకోకుండానే ప్రసారం, ప్రచారం చేస్తున్నారు. పెత్తందారులకు, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్ధతికాదు. – చందన మధు, బెజవాడ మీడియా సెంటర్ అధ్యక్షుడు తప్పుడు సమాచారమిస్తే శిక్షించాలి ప్రస్తుతం మీడియా ప్రపంచంలో అసత్యమనేది ఎక్కువగా రాజ్యమేలుతోంది. నిజం తెలిసేలోగా ఫేక్ న్యూస్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ప్రభుత్వాలకు ఛాలెంజ్గా మారుతోంది. సోషల్ మీడియాలోని ఫేక్న్యూస్ను ప్రజలు గమనించాలి. తప్పుడు సమాచారం అందించే వారిని శిక్షించే రోజులు రావాలి. – చందు సాంబశివరావు, బీజేపీ నేత మీడియా వ్యాపారమైంది ప్రస్తుతం మీడియా రంగం వ్యాపార రంగంగా మారింది. దీని ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా ప్రభుత్వాన్ని వాడుకోవాలి, చివరికి కోరుకున్న వ్యక్తి సీఎంగా ఉండాలనేదే ప్రధానంగా మారింది. దీంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చర్చా వేదికలో వారికి కావాల్సిన వాళ్లను తీసుకొచ్చి కావాల్సినట్టు మాట్లాడిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు నిజాలు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. – రామరాజు శ్రీనివాస్, ఏపీ ఇన్కంట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు హుందాతనమే లేదు మా చిన్నతనంలో మద్రాసు నుంచి ఒకట్రెండు పత్రికలొచ్చేవి. అందులో సినిమా వాళ్లపై అప్పుడప్పుడు ఫేక్ న్యూస్లు వచ్చేవి. వాటిని సరదాగా తీసుకునేవాళ్లం. ఈనాడు వచ్చాక పరిస్థితి మారింది. అవసరమైనప్పుడల్లా అబద్ధపు వార్తలతో ప్రజలను మభ్యపెట్టింది. ఆంధ్రజ్యోతి ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది. డిబేట్లు నిర్వహించే వారు కూడా çహుందాతనాన్ని పక్కన పెట్టేశారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎప్పుడు ఏం చేయాలో వారే డిసైడ్ చేస్తారు. – డీఏఆర్ సుబ్రమణ్యం, నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్ ఫోరం ఛైర్మన్ విష ప్రచారాన్ని ఆపాలి ఫేక్ న్యూస్ను అడ్డుకోలేకపోతే సమాజం కొట్టుకుపోతుంది. లక్షల కోట్లంటూ సీఎం జగన్పై ఎన్నో ఆరోపణలు చేశారు. అవేవీ నిజం కాదని అందరికీ తెలుస్తోంది. ఈ సమయంలో పనిగట్టుకొని మళ్లీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఆలోచించే అవకాశం లేకుండా గందరగోళపరుస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా కర్లపాలెం వద్ద ఓ వ్యక్తి ఉబ్బసంతో చనిపోతే, పనుల్లేక అంటూ ఓ పత్రిక విష ప్రచారం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీæ, గుంటూరు జిల్లా కన్వీనర్ ఫుల్స్టాప్ పడాల్సిందే ఫేక్ న్యూస్ను నిషేధించాల్సిన బాధ్యత వార్తా సంస్థలపై ఉంది. దీనిపై ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్ పడాలి. వ్యక్తిగత దూషణలతో మీడియా ఎటువెళ్తుందనేది అర్థం కావడం లేదు. – ఎం.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్టీఆర్ను దింపిన రోజులు కావివి తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మీడియా అధిపతులు అర్ధ సత్యాలు, అసత్యాలతో ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్లో ఉంటూ ఏపీ రాజకీయాలపై తప్పుడు డిబేట్లు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో గతంలో రామారావు ప్రభుత్వాన్ని గద్దెదింపిన రోజులు కావివి. డిబేట్ల తీరు మారాలని త్వరలో ఆయా యాజమాన్యాలకు లేఖలు రాస్తాం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కాదేదీ బిజినెస్కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇదే చివరిది.. ఐదో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త!
గతంలో పెళ్లికి వెళ్లిన బంధువులు, సన్నిహితులు వధూవరులను నిండు నూరేళ్లు కలిసి జీవించమని ఆశీర్వదించేవాళ్లు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం.. అలా చెప్పరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వివాహ మండపంలో జీవితాంతం చేయి వదలనన్న ప్రమాణాన్ని వధూవరులు మరుస్తున్నారు. ఏదో ఒక కారణంతో దాంపత్య జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఏకంగా తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. మరి అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే లాస్ట్ అనుకుంటా.. ప్రముఖ ఆస్ట్రేలినయన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మార్దొక్ మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు. ఈయనకు వ్యాపారం రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 92 ఏళ్ల వ్యాపారవేత్త తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని నెలల కిందటే శాన్ ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి విషయాన్ని స్మిత్కు చెప్పగా.. ఆమె కూడా అంగీకరించింది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, మార్దొక్ ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు. వీళ్లిద్దరి వ్యక్తిగత విషయాలను చూస్తే.. స్మిత్ ఇంతకుముందు దేశీయ గాయకుడు, రేడియో టీవీ ఎగ్జిక్యూటివ్ చెస్టర్ స్మిత్ను వివాహం చేసుకుంది. అతను ఆగస్టు 2008లో మరణించాడు. ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్ కు రూపర్ట్ తో పరిచయం ఏర్పడి, అది కాస్త పెళ్లికి వరకు వెళ్లింది. ఇక రూపర్ట్ మార్దోక్కి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యి.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. ముర్డోక్ తన నాల్గవ భార్య, మాజీ టాప్ మోడల్ అయిన జెర్రీ హాల్కు గతేడాది ఆగస్టులో విడాకులు ఇచ్చని సంగతి తెలిసిందే. మర్డోక్ వ్యాపార సామ్రాజ్యంపై ఓ లుక్కేస్తే.. యూఎస్లోని ఫాక్స్ న్యూస్, యూకేలోని రైట్వింగ్ టాబ్లాయిడ్ ది సన్ ఉన్నాయి. అతను న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, పబ్లిషింగ్ హౌస్ హార్పర్ కాలిన్స్లకు న్యూస్ కార్పొరేషన్ అధిపతిగా కొనసాగుతున్నాడు. -
విష ప్రచారం మానుకోండి
సాక్షి, అమరావతి: ప్రజా చైతన్యానికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు దారి తప్పుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ స్వలాభం, వర్గ ప్రయోజనాల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విలువలను వదిలేసి విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలతో ఓ వర్గం మీడియా అంతిమంగా రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేదిగా మారుతోందన్నారు. నేడు నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ‘జర్నలిజం మౌలిక సూత్రాలు–ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర’ అంశంపై విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, పత్రికా సంపాదకుడు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి పాల్గొన్నారు. కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియాది ప్రధాన పాత్ర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంశంఒక్కటే అయినా గత ప్రభుత్వంలో ఒప్పు అయింది.. ఈ ప్రభుత్వంలో తప్పు అయినట్టు కథనాలు ఉంటున్నాయి. విలువలను ఉల్లంఘించడమే సంప్రదాయంగా కొన్ని పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మారగానే వార్తల రూపం, స్వరూపం, ప్రాధాన్యం మారిపోతున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు విశాఖలో జీఐఎస్ సదస్సుకు ఎందరో పారిశ్రామికవేత్తలు వచ్చి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపైనా కొన్ని పత్రికలు వక్రీకరించి కథనాలు ప్రచురించాయి. దీనివల్ల ఎవరికి లాభం?.. నష్టపోయేది ఎవరు? అనేది పాత్రికేయులు ఆలోచించాలి. సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలోని కలం ఒకటే. లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు మీడియాలో విలువలు దిగజారిపోతున్నాయి. ఇది సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు. తమకు వ్యక్తులపై ఉన్న కక్షను వ్యవస్థపై రుద్దేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ పత్రికలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. ప్రజాసంక్షేమం గిట్టదు. – పి.విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆ రెండు పత్రికలకు మంచి కనిపించదు.. ఆ రెండు పత్రికలకు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు జరుగుతున్న మంచి కనిపించదు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అవి అదే ధోరణి అవలంబిస్తున్నాయి. –మల్లాది విష్ణు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు -
దళితుల ప్రాతినిధ్యంతోనే మీడియాలో సామాజిక మార్పు
సనత్నగర్ (హైదరాబాద్): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో 1920, జనవరి 31న మూక్నాయక్ పత్రిక స్థాపించిన సందర్భంగా మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో మొదటి ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ డేగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లం నారాయణతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో సమానత్వం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రికేయుడిగానూ కొనసాగారన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగ్గవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను టీవీ చానల్ ప్రారంభించినప్పుడు ముఖ్యమైన కేంద్రాల్లో దళితులను, ఆదివాసీ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే 14 మందిని నియమించినట్లు వివరించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో దళిత జర్నలిస్టులపై వివక్షత ఉండేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. -
మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది
పటాన్చెరు టౌన్: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా వినోద్ కోహ్లీ, ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సయ్యద్ ఇస్మాయిల్(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్గా నతుముల్ శర్మ (ఛత్తీస్గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ(చండీగఢ్), భాస్కర్(తెలంగాణ) సిమిజాన్ (కేరళ), బాబు థోమస్, అనిల్ బిశ్వాస్, తారక్ నాథ్రాయ్(వెస్ట్బెంగాల్), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు. -
షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్ఎన్ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్ కాంట్రిబ్యూటర్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు, నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు) ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్, ఎంటీవీ, వీహెచ్1 లాంటి అనేక ఇతర నెట్వర్క్లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. (శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు) CNN boss Chris Licht informs employees in an all-staff note that layoffs are underway. Licht says those being notified today are largely paid contributors and then tomorrow CNN "will notify impacted employees." Licht will then provide an update to staff afterward. pic.twitter.com/nD0pt9Ruwj — Oliver Darcy (@oliverdarcy) November 30, 2022 -
ఎన్డీటీవీకి అదానీ ఆఫర్ షురూ
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్కు అనుమతించింది. దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ! చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
మీడియా@65 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద (ఎంఅండ్ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్ఈ రంగం 2022లో 27–29 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 65–70 బిలియన్ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‘కు డిజిటల్ వీడియో, గేమింగ్ సెగ్మెంట్లు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది. డిజిటల్.. డిజిటల్.. మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు. ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది. 2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
లక్ష కోట్లు దాటుతోంది.. ఇంకా లైట్ తీసుకుంటే ఎలా ?
న్యూఢిల్లీ: టీవీ, న్యూస్పేపర్, వెబ్సైట్, వీడియో కంటెంట్ సైట్ ఏదైనా సరే అడ్వెర్టైజ్మెంట్ కనిపించిందంటే చాలు వెంటనే ఛానల్ మార్చడంతో, పేపర్ తిప్పడంలో స్కిప్ బటన్ నొక్కడమో చేస్తాం. జనాలు పెద్దగా యాడ్స్పై దృష్టి పెట్టకున్నా ప్రకటనల విభాగం మాత్రం ఊహించని స్థాయి వృద్ధి కనబరుస్తోంది. మరో రెండేళ్లలో లక్ష కోట్ల మార్క్ను దాటేయనుంది. లక్ష కోట్లు ప్రకటనల రంగం దేశంలో 2024 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని ఈవై–ఫిక్కీ నివేదిక వెల్లడించింది. వార్షిక వృద్ధి 12 శాతం నమోదవుతుందని తెలిపింది. ‘ప్రకటనల రంగ ఆదాయం 2019లో రూ.79,500 కోట్లు. పరిశ్రమ 2020లో 29 శాతం తిరోగమనం చెందింది. కోవిడ్–19 ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రంగం తిరిగి పుంజుకుని 2021లో ఆదాయం 25 శాతం అధికమై రూ.74,600 కోట్లను దక్కించుకుంది. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో రూ.86,500 కోట్లకు చేరనుంది. ఆ రెండు కలిపితే భారత మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం గతేడాది 16.4 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు నమోదు చేసింది. ఈ ఏడాది 17 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లను తాకి మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. 2024 నాటికి ఏటా 11 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లు నమోదు చేస్తుంది. నంబర్ వన్ టీవీనే టెలివిజన్ అతిపెద్ద సెగ్మెంట్గా మిగిలిపోయినప్పటికీ డిజిటల్ మీడియా బలమైన నంబర్–2గా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముద్రణ విభాగం పుంజుకుని మూడవ స్థానంలో నిలిచింది. డిజిటల్ మీడియా వాటా 2019లో 16 శాతం కాగా, గతేడాది 19 శాతానికి ఎగబాకింది. మీడియా, వినోద రంగంలో టీవీ, ప్రింట్, చిత్రీకరించిన వినోదం, ఔట్డోర్ ప్రకటనలు, సంగీతం, రేడియో వాటా 68 శాతముంది. 2019లో ఇది 75 శాతం నమోదైంది. సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీ చందాలు మినహా మీడియా, వినోద పరిశ్రమలో 2021లో అన్ని విభాగాల ఆదాయాలు పెరిగాయి. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్య మాలపై ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ని ఎంసీహెచ్ఆర్డీలో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత మీడియాదేనని స్పష్టం చేశారు. సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వ రాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణాపత్రికకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ముట్నూరి కృష్ణారావు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం అయిందన్నారు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా.వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గేదేలే అంటున్న అదానీ.. ఈ రంగంలో కూడా ఎంట్రీ
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్ తాజాగా మీడియా వ్యాపారంలోకి ప్రవేశించింది. క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎం) మైనారిటీ వాటాను అదానీ కైవసం చేసుకుంది. ఎంత వాటా, చెల్లించిన మొత్తాన్ని కంపెనీ వెల్లడించలేదు. క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాలో వాటా కోసం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ అయిన క్వింట్ డిజిటల్ మీడియాతో అవగాహన ఒప్పందం కుదిరింది. బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ కంపెనీ అయిన క్యూబీఎం.. బిజినెస్ వార్తలను అందిస్తున్న డిజిటల్ వేదిక బ్లూమ్బర్గ్ క్వింట్ను బ్లూమ్బర్గ్తో కలిసి నిర్వహిస్తోంది. అదానీ ప్రవేశించిన వెంటనే యూఎస్కు చెందిన బ్లూమ్బర్గ్ మీడియా క్యూబీఎంను విడిచిపెట్టింది. భారతదేశంలో క్యూబీఎమ్తో ఈక్విటీ జాయింట్ వెంచర్ను ముగిస్తున్నట్లు బ్లూమ్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్లూమ్బర్గ్ వాటాను అదానీ కొనుగోలు చేసిందా అన్న అంశంలో స్పష్టత లేదు. క్యూబీఎంకు మాత్రమే ఈ డీల్ పరిమితమని, క్వింట్ డిజిటల్కు చెందిన ద క్వింట్, క్విన్టైప్ టెక్నాలజీస్, ద న్యూస్ మినిట్, యూత్ కీ ఆవాజ్కు సంబంధం లేదని అదానీ స్పష్టం చేసింది. మీడియాలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్.. తన మీడియా సంస్థకు సారథిగా ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ పుగాలియాను నియమించుకుంది. క్వింట్ డిజిటల్ మీడియా ప్రెసిడెంట్ గా సంజయ్ గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన అదానీ మీడియా వెంచర్స్ సీఈవోగా ఉన్నారు. -
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. -
ఇవాళ్టి అవసరం!
ఎవరైనా, ఏదైనా మారుతున్న కాలానికి తగ్గట్టు మారాల్సిందే. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకొని, దేశంలోని పత్రికా రంగాన్నీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ను గుర్తుచేసుకున్న పక్షం రోజులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమర్పించిన నివేదిక మారుతున్న మీడియా ప్రపంచంతో మారాల్సిన విధానాలను స్పష్టం చేసింది. పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ – ఇలా విస్తరించిన మీడియా అంతటినీ పర్యవేక్షించేలా ‘మీడియా కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అవ్యవస్థలకూ, అక్రమాలకూ అడ్డుకట్ట వేసేలా కౌన్సిల్కు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టాలంది. ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఉన్నా, దాని ప్రభావం పరిమితమే. అందుకే, వర్తమానానికి అవసరమైన మీడియా కౌన్సిల్ ఏర్పాటు కోసం నిపుణులతో ఓ కమిషన్ వేయాలంది. ప్రింట్ మీడియాకు ఎప్పటి నుంచో చట్టబద్ధమైన ప్రెస్ కౌన్సిల్ ఉంది. కానీ, టీవీకి అలాంటిది లేదు. సంస్థలుగా వృద్ధి చెందిన జాతీయ బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాల సంస్థ (ఎన్బీఎస్ఏ), న్యూస్ బ్రాడ్కాస్టర్ల అసోసియేషన్ (ఎన్బీఏ)లకేమో ప్రభుత్వ అధికారిక గుర్తింపు లేదు. మరోపక్క, మన దేశంలో ఎన్ని ఇంటర్నెట్ వెబ్సైట్లున్నాయో ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖలో రికార్డు లేదు. ఓ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వెబ్సైట్లున్నాయి. వాటిలో కనీసం 20 కోట్ల సైట్లు చురుకుగా పనిచేస్తున్నాయి. మన దేశంలో 1.44 లక్షల వార్తాపత్రికలు, మేగజైన్లున్నాయి. 926 ఉపగ్రహ టీవీ ఛానళ్ళు (387 న్యూస్ ఛానళ్ళు, 539 నాన్–న్యూస్ ఛానళ్ళు), 36 దూరదర్శన్ ఛానళ్ళు, 495 ఆకాశవాణి ఎఫ్.ఎం. కేంద్రాలు, 384 ప్రైవేట్ ఎఫ్.ఎం. రేడియోలు ఉన్నట్టు లెక్క. ఇవి కాక నేటి సోషల్ మీడియా. అందుకే, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని స్థాయీ సంఘం బుధవారం పార్లమెంట్కు సమర్పించిన ‘మీడియా కవరేజ్లో నైతిక ప్రమాణాలు’ నివేదికలోని అంశాలు కీలకం. నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తున్న రోజులివి. వాటితో కుస్తీ సాగుతుండగానే, మరోపక్క సామాజిక మాధ్యమ వేదికల వల్ల పత్రికా రచన పౌరుల చేతుల్లోకి వచ్చింది. కొన్ని లోపాలున్నా పౌర పాత్రికేయం మంచిదే. అయితే, వ్యాప్తి పెరుగుతున్న డిజిటల్ మీడియాలోనూ విశృంఖలత విజృంభిస్తోంది. అందుకే, డిజిటల్ మీడియాలో నిర్ణీత నైతిక నియమా వళిని పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంఘం సూచించింది. అది కావాల్సిన, రావాల్సిన మార్పు. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ఆ పని చేయాలంది. అది ఆమోద యోగ్య మార్గం. అలాగే, ఈ ఏడాదే ప్రకటించిన ‘ఐటీ రూల్స్ 2021’ డిజిటల్ మీడియా వేదికల్లో జవాబుదారీతనం తెస్తాయనీ, కంటెంట్ నియంత్రణలో ఉపకరిస్తాయనీ స్థాయీసంఘం ఆశిస్తోంది. ఇవాళ్టి డిజిటల్ యుగంలోనూ ప్రభుత్వాలు విధిస్తున్న నెట్ నిషేధాలూ చూస్తున్నాం. కానీ, దేశ భద్రత, సమైక్యత పేరిట ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్పై నిషేధంతో ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఆర్థిక పురోగతీ దెబ్బతింటుంది. అత్యవసర పరిస్థితులంటూ ఫోన్, నెట్ సేవలను నిషేధించడం వల్ల టెలికామ్ ఆపరేటర్లకు ప్రతి సర్కిల్ ఏరియాలో గంటకు రూ. 2.4 కోట్ల నష్టం వస్తుందని అంచనా. గంపగుత్తగా ఇలా నిషేధం పెట్టి నష్టపరిచే కన్నా, అవసరాన్ని బట్టి ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి సర్వీసులను ఎంపిక చేసుకొని ఆ నిర్ణీత వేళ వాటిని నిషేధించే ఆలోచన చేయాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇదీ ఆచరణాత్మకమే అనిపిస్తోంది. 1995 నాటి కేబుల్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టంలో మార్పులు తేవాలనీ స్థాయీ సంఘం అంటోంది. అలా చట్టాన్ని సవరిస్తే– ఫిర్యాదులపై పాలకుల ఇష్టారాజ్యపు కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు కాక, చట్టప్రకారం వ్యవహరించవచ్చు. ఇక, ‘కేబుల్ నెట్వర్క్ రూల్స్–2014’లోని ‘జాతి వ్యతిరేక వైఖరి’ అనే పదాన్ని సమాచార ప్రసార శాఖ సరిగ్గా నిర్వచించాలన్న మాట స్వాగతనీయం. ప్రైవేట్ టీవీ ఛానళ్ళను అనవసరంగా వేధించడానికి ఆ పదం ఆయుధమవుతున్న సందర్భాలు న్నాయి. ఆ మధ్య కేరళలో రెండు టీవీ ఛానళ్ళకు అదే జరిగింది. ఇటీవల ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలూ ఊపందుకుంటున్నాయి. ఆన్లైన్లో, ఓటీటీ వేదికల్లో నియంత్రణ లేని అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంటోంది. ఏ పరిధిలోకీ రాకుండా తప్పించుకుంటున్న వీటిపైనా ఈ స్థాయీ సంఘం దృష్టి పెట్టింది. అనియంత్రిత ఓటీటీ కంటెంట్ పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అలాగని ఏది చూడాలి, ఏది వద్దనే వీక్షకుడి స్వేచ్ఛను ప్రభుత్వం కఠిన చర్యలతో కత్తిరించడమూ కరెక్ట్ కాదు. స్థాయీ సంఘం సైతం అంగీకరించిన వీటిని దృష్టిలో పెట్టుకొని నియమావళి చేయాలి. ప్రతిపాదిత ‘మీడియా కౌన్సిల్’ ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధనకు పనిచేసే నిపుణుల కమిషన్ ఆరు నెలల్లో తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆపైన ప్రభుత్వం చొరవ చేస్తే, ప్రెస్ కౌన్సిల్కు భిన్నంగా అన్ని మీడియాలనూ పర్యవేక్షించే మీడియా కౌన్సిల్ వస్తుంది. డిజిటల్ మీడియాకూ నైతిక వర్తనా నియమావళిని చేశాక, అది అమలయ్యేలా చూడడం మరో ఎత్తు. అందుకు సమాచార, ఐటీ శాఖలు కలసి పనిచేయడం అవసరం. అదే సమయంలో కొత్త కౌన్సిల్, నియమావళి దుర్వినియోగం కాకుండా చూడడమూ అంతే అవసరం. పాలకులు తమ స్వార్థం, కక్ష సాధింపుల కోసం వాటిని వినియోగించుకొంటే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛకూ, మీడియాకూ అండనిచ్చిన 14, 19, 21వ రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘించకుండా అదుపాజ్ఞలూ కావాలి. అలాంటి సమగ్ర నియమావళి, సమర్థ మీడియా కౌన్సిల్ ఏర్పడితే మంచిదే! -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్లో జరిగిన లాయర్ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు. పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లి శ్రీనాథ్రెడ్డి తదితరులు మాట్లాడారు. స్వప్నకు తుంగా అవార్డు తుంగా రాజగోపాల్రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు. వీఆర్ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును సన్మానించారు. పుస్తకావిష్కరణ.. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. -
మీడియా అంటే సాయికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు. గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!) సీఐడీకి చిక్కడంతో.. మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం) ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్కు అడ్డా అయిన కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్కు అడ్డా అయిన కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
దేహం తేలికైంది.. జీవితం బరువైంది
మిల్లీ సాన్సోయీ రచయిత్రి. యూకేలో మీడియారంగంలో కెరీర్ని నిర్మించుకుంటోంది. ఇరవై ఏడేళ్ల మిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. ఒక రకంగా ముంచుకు వస్తున్న మృత్యువు బారిన పడకుండా ఉండడానికి పెద్ద పోరాటమే చేసింది. పదహారేళ్ల వయసులో 33 కిలోల బరువుతో జీవితాన్ని బరువుగా లాక్కు వచ్చింది మిల్లీ. ఇదంతా చూస్తుంటే ఏ ప్రాణాంతక వ్యాధి వచ్చి తగ్గిందో అనుకుంటాం. కానీ ‘‘అంతా నేను చేతులారా చేసుకున్నదే’’ అంటుంది మిల్లీ. ‘‘అదృష్టవశాత్తూ నేను మృత్యువు ఒడిలోకి జారిపోవాల్సిన సమయానికి రెండు వారాల ముందు డాక్టర్ రక్షణలోకి వెళ్లగలిగాను కాబట్టి వ్యాధి బారి నుంచి బయటపడ్డాను. ఆరోగ్యాన్ని పొందడం కోసం నేను చేసిన పోరాటాన్ని మీతో పంచుకుంటాను. ఎందరో అమ్మాయిలు నా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటోంది మిల్లీ సాన్సోయీ. కేలరీల దహనమే ధ్యేయం ‘‘చిన్నప్పటి నుంచి బొద్దుగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఒక వెక్కిరింత... నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా సరే బరువు తగ్గాలి, నన్ను ఎగతాళి చేసిన అమ్మాయికంటే స్లిమ్గా మారాలనే పట్టుదల కలిగింది. ఆహారంలో మార్పులు చేసుకుని, జిమ్లో వర్కవుట్లు చేస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాను. డ్రెస్ సైజ్ కూడా మారింది. ఆ మార్పును గుర్తిస్తారని ఆశించాను. కానీ అలా జరగలేదు. దాంతో ఇంకా మొండితనం వచ్చేసింది. తీవ్రంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. అంతలో ఒక యాక్సిడెంట్. మోకాలికి గాయమైంది. జిమ్లో వర్కవుట్ సాధ్యం కాదు. మరెలా? ఆహారం పరిమాణం బాగా తగ్గించేశాను. కేలరీలు కొలత చూసుకోవడం, దేహంలోకి వెళ్లిన కేలరీలను దహింప చేయడానికి విపరీతంగా నడవడం దినచర్యగా మారింది. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు వరకు నడుస్తూనే ఉండేదాన్ని. క్రమంగా పీలగా మారిపోయాను. అయినా సరే... ఎగతాళి చేసిన అమ్మాయి కంటే సన్నగా అయ్యాను. కానీ ఆమె నన్ను ఏడిపించడం మానలేదు. ‘మిల్లీ ఇప్పుడు నీ కంటే సన్నగా ఉంది కదా? ఇంకా ఎందుకు ఏడిపిస్తావ్’ అని నా ఫ్రెండ్ నిలదీసింది. అప్పుడా అమ్మాయి ‘మిల్లీ అప్పట్లో లావుగా ఉండేది, ఇప్పుడు పేషెంట్లా ఉంది’ అని వెక్కిరించింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను ఎలా ఉండాలి? అనే సందేహం. నేను మరీ సన్నబడడంతో ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక... రెండు వారాలే! పద్నాలుగేళ్ల వయసులో పడిన ఒక విషబీజం పదహారేళ్లు వచ్చేసరికి ఊడలుగా విస్తరించి ఆరోగ్యాన్ని కబళించింది. ‘దేహంలో అంతర్గత అవయవాల పనితీరు క్షీణించింది. మరో రెండు వారాలకంటే బతకడం కష్టం’ అని చెప్పారు డాక్టర్. నా ఆరోగ్యం కోసం అమ్మ పడుతున్న తపనను చూసి అమ్మకోసం అనొరెక్సియా, ఈటింగ్ డిజార్డర్ సమస్యల నుంచి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశాను. ఒక వేసవి మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను. బరువు 33 కిలోల నుంచి 51 కిలోలకు పెరిగిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత చేసిన మొదటి పని స్కూలు మారడం. ఇదొక పాఠం నా అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత మా అమ్మమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడామె అన్న మాటను నేను మర్చిపోలేను. ‘అందరి దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఏదైనా సాధించు. అంతే కానీ అనారోగ్యంతో కాదు. పని చేసుకునే వాళ్లను చూడు, వాళ్లకు దేహాకృతి గురించిన పట్టింపు ఉండదు. తమ పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు’ అని చెప్పింది. స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్లో చేరాను. చదువు పూర్తయ్యేటప్పటికి జీవితం చాలా చిన్నదనే వాస్తవం తెలిసింది. అనొరెక్సియా, ఈటింగ్ డిజార్టర్ల వెనుక అసలైన జీవితం ఉందని కూడా తెలిసింది. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాను. నా అనుభవం ఎందరికో పాఠంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పింది మిల్లీ సాన్సోయీ. మీడియా కూడా ‘సన్నబడడానికి సులువైన మార్గాలు’ అనే కథనాలకు బదులు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన మార్గాలను సూచించాలని మిల్లీ కోరుతోంది. అంతేకాదు... తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బాడీ షేమింగ్కు పాల్పడే ఆలోచనను పిల్లల్లో మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని కూడా సమాజం తెలుసుకోవాలి. -
Afghanistan: నేను చనిపోలేదు.. తాలిబన్లు చితకబాదారు
కాబూల్: మేం మారిపోయామని, మునుపటిలా లేమని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ల మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేనట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తోంది. తాజాగా కాబూల్లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ను విధులు నిర్వహిస్తుండగా చితకబాదారు. వివరాల ప్రకారం.. టోలో న్యూస్కు చెందిన జియార్ యాద్ ఖాన్ అనే జర్నలిస్టు తాను రిపోర్టింగ్ చేస్తుండగా తాలిబన్లు కొట్టినట్లు చెప్పాడు. కాగా తొలుత తాలిబన్ల దాడిలో జియార్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని అతను ట్వీట్ చేశాడు. కాబూల్ న్యూ సిటీలో పలు అంశాలపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో తాలిబన్లు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపాడు. అంతేగాక కెమెరాలు, సాంకేతిక పరికరాలతో పాటు తన మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నారని చెప్పాడు. చదవండి: ‘కొంత మంది మనుషుల కన్నా.. ఈ కోతి చాలా నయం’ -
జోరు మీదున్న మొబైల్ గేమింగ్
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ గేమింగ్ జోరు మీద ఉంది. కోవిడ్–19 పుణ్యమాని స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయిన వారి సంఖ్య పెరిగింది. దీంతో గేమింగ్ మార్కెట్ 2023 నాటికి భారత్లో రూ.21,750 కోట్లకు చేరనుందని పరిశోధన సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. ప్రస్తుతం ఈ విపణి రూ.8,700 కోట్లుంది. అలాగే 36.5 కోట్ల పైచిలుకు మొబైల్ గేమర్స్ ఉన్నట్టు అంచనా. ఈ సంఖ్య గణనీయంగా అధికమవుతోంది. ప్రొఫెషనల్ గేమర్స్, వ్యూయర్స్ పెరుగుతుండడంతో సంప్రదాయ క్రీడల మాదిరిగానే ఈ–స్పోర్ట్స్ సైతం వృద్ధి బాటలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దూసుకెళ్తున్న సంఖ్య.. 2020 ద్వితీయ త్రైమాసికంలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచి గేమ్స్ డౌన్లోడ్స్ 20 శాతం వృద్ధి చెందాయి. అలాగే ఆన్డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి 51 శాతం అధికమయ్యాయి. గతంలో చాలా ఏళ్లపాటు డిజిటల్ సేవలు అణిచివేతకు గురయ్యాయి. ఇంటర్నెట్ లేకపోవడం, స్మార్ట్ఫోన్లు ఖరీదుగా ఉండడం, అధిక డేటా చార్జీలు, డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ప్రస్తుతం 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉండడం, చవక డేటా చార్జీలు, స్మార్ట్ఫోన్ల విస్తృతి, కోవిడ్–19.. వెరశి మొబైల్ గేమింగ్ అభివృద్ధి చెందుతోందని నివేదిక అంటోంది. డిజిటల్ వినియోగం, ఆన్లైన్ కస్టమర్లు అంతకంతకూ పెరగడం, చవక స్మార్ట్ఫోన్లు, డేటా చార్జీలు పరిశ్రమను నడిపిస్తున్నాయి. పీసీ, కన్సోల్ గేమింగ్ పెద్ద ఎత్తున పెరిగినప్పటికీ, మొబైల్ గేమ్స్ స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదని సీఎల్ఎస్ఏ అనలిస్ట్ దీప్తి చతుర్వేది అన్నారు. ప్రముఖ కంపెనీలు ఇవే.. దేశంలో నజారా, డ్రీమ్ 11, గేమ్స్ 24/7, పేటీఎం ఫస్ట్ గేమ్స్, మొబైల్ ప్రీమియర్ లీగ్, జియో గేమ్స్ వంటి కంపెనీలు ప్రముఖంగా నిలిచాయి. గేమింగ్ రంగంలో అయిదేళ్లలో రూ.300 కోట్లను నజారా వెచ్చించింది. రూ.100 కోట్లు సమీకరించింది. బిలియన్ డాలర్ల కంపెనీగా డ్రీమ్ 11 నిలిచింది. గేమ్స్ 24/7లో టైగర్ గ్లోబల్ పెట్టుబడులు ఉన్నాయి. పేటీఎం ప్రమోట్ చేస్తున్న పేటీఎం ఫస్ట్ గేమ్స్కు 4.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 300 గేమ్స్ను ఆఫర్ చేస్తోంది. జియో గేమ్స్ను రిలయన్స్ జియో, మీడియాటెక్ ప్రమోట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా.. మీడియా రంగంలో అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో గేమింగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ మార్కెట్ రూ.12 లక్షల కోట్లపైమాటే. ఇందులో మొబైల్ గేమింగ్ వాటా రూ.5.36 లక్షల కోట్లు. 2016లో మొబైల్ గేమింగ్ పరిశ్రమ విలువ రూ.2.97 లక్షల కోట్లు. ఇక చైనాలో 5జీ కారణంగా ఈ–గేమింగ్కు ఊతమిస్తోంది. భారత్లో గేమ్స్, ఆన్లైన్ అనుభూతి మెరుగవుతుండడంతో వినియోగదార్లు లైవ్ ఈవెంట్స్ వీక్షణంతోపాటు ప్రైజ్ మనీ అందుకోవడానికి పోటీలోకి దిగుతున్నారని నివేదిక వెల్లడించింది. -
‘డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత ఉత్పత్తులనే కాకుండా మన గళాన్ని కూడా ప్రపంచం ఆదరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జైపూర్లో పత్రికా గేట్ను, పత్రికా గ్రూప్ చీఫ్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాతినిథ్యం పెరిగిన క్రమంలో భారత మీడియా కూడా అంతర్జాతీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మన వార్తాపత్రికలు, మేగజీన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఉందని, డిజిటల్ శకంలో మనం డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ కావాలని అన్నారు. కోవిడ్-19పై భారత మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించిందని ప్రశంసించారు. సోషల్ మీడియా మాదిరిగా మీడియా సైతం కొన్ని సందర్భాల్లో విమర్శలు గుప్పించినా విమర్శల నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, ఇదే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని అన్నారు. ప్రజలు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు ఆథ్యాత్మిక, వేదాంత విజ్ఞానానికే పరిమితం కాదని, విశ్వం, శాస్త్రాల లోతులనూ అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగినవని చెప్పుకొచ్చారు. చదవండి : ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలి : మోదీ -
ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాదే
సాక్షి, బెంగళూరు: ‘కొత్తగా వస్తున్న మాధ్యమాలు అనతికాలంలోనే ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాలను జనాలను తెలియజేయాల్సిన బాధ్యత మాధ్యమాలదే. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ మాధ్యమాలు వాస్తవాలను వెలుగులోకి తేవడంతో విజయవంతం అయ్యాయి’అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శనివారం బెంగళూరులోని హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ది హడిల్’ నాలుగవ ఎడిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ మాధ్యమ రంగంలో వాస్తవాలు తెలియజేయడం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, న్యాయం, మానవీయత అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్ని పత్రికలు వచ్చినా.. ఎప్పటి నుంచో ఉన్న వార్తా సంస్థలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. క్రీడలు, వ్యాపారం, రాజకీయం, సామాజిక రంగాల వార్తలకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సోషల్ మీడియా పెరిగిపోతున్నా, పత్రికలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. జాతిపిత కూడా విలేకరే... జాతిపిత మహాత్మాగాంధీ కూడా పత్రికా విలేకరిగా పని చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. సత్యం, ప్రామాణికమే మాధ్యమాల ప్రధాన ఆయుధం అన్నారు. మాధ్యమాల్లో నిజాయితీ, పాలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యడియూరప్ప అన్నారు. పాలనలోని పారదర్శకతను గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చెప్పారు. మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
‘మీడియా చెప్పిందల్లా నిజం కాదు’
న్యూఢిల్లీ : భారత్లో మహిళల భద్రత గురించి మీడియా క్రియేట్ చేసిన ఒపినియన్ వల్లే మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం ఏర్పడిందంటూ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎమ్సీ) 51వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్లు పార్లమెంట్లో జరిగే నిరసనలు కవర్ చేయడానికి ఉత్సాహం చూపిస్తాయి.. కానీ సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి నడిచే డిబేట్లను ప్రసారం చేయవంటూ విమర్శించారు. ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరగరు.. అంత మాత్రం చేత భారత్లో ఉన్న మహిళలు సురక్షితంగా లేరని చెప్పలేం కదా అన్నారు. అంతేకాక నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది మేడం.. మీ దేశం ఇప్పటికి కూడా సురక్షితం కాదా అంటూ అక్కడి జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు అని తెలిపారు. అప్పుడు నేను గత 75 ఏళ్లుగా నేను ఇండియాలో ఉంటున్నాను.. నాకేం కాలేదు.. నా కూతురికి గాని.. కోడలికి గాని ఏం కాలేదు. మీరనుకుంటున్నట్లు ఏం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మా దేశంలోను.. మీ దేశంలోను.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రజలు నేరాలు చేస్తుంటారు. అంటే ఆ దేశంలో నేరాలు మాత్రమే జరుగుతాయా.. వేరే ఏం జరగవా అని వారిని అడుగుతాను అని తెలిపారు. అలానే రాజకీయాల్లో ఎప్పుడు అసభ్య పదజాలమే వాడము కదా.. కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడతాము. కానీ వాటి గురించి మీడియా పట్టించుకోదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సమాజానికి ఏం అవసరముంది.. కానీ మనం ఎలాంటి వార్తలు ప్రచురిస్తున్నాం అనే విషయం గురించి మీడియా సంస్థలు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్కు పరిస్థితిని విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉండటం చాలా ప్రధానం అని తెలిపారు. -
రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేదు
హైదరాబాద్: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేదని కొన్ని మీడియా సంస్థలు పాలించేవారికి సొత్తులుగా మారుతున్నాయని, అధికారంలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సోమవారం బండ్లగూడలో గిరిప్రసాద్ భవన్లో నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ప్రజాపక్షం అనే తెలుగు పత్రిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను అణచివేసే ప్రక్రియను బహిరంగంగానే చేపట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తే ప్రజాస్వామ్యం బతకదని, తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు ఇతర రంగాలను శాసించినట్లే మీడియాను కూడా శాసిస్తున్నాయని అన్నారు. మీడియాను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. నాలుగేళ్లకే పాలన పగ్గాలు పడేసి మళ్లీ ఓటు కోసం వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు అడ్డుకుంటున్నారని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం హరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. అన్ని పక్షాలు ఏకమై టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, ఐజేయూ జాయింట్ సెక్రటరీ దేవులపల్లి అమర్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్పాషా, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వర్రావు, గుండా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
#మీటూ.. ఐడబ్ల్యూపీసీ ఆందోళన
న్యూఢిల్లీ: కార్యాలయాల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు యంత్రాగాలను ఏర్పాటు చేసుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కారప్స్ (ఐడబ్ల్యూపీసీ) పలు మీడియా సంస్థలను సోమవారం కోరింది. తమ పై అధికారులు, సహోద్యోగులు తమను లైంగికంగా వేధించారంటూ పలువురు మహిళా విలేకరులు ఇటీవల బయటపెట్టడం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండటంపై విచారం వ్యక్తం చేసిన ఐడబ్ల్యూపీసీ.. న్యాయం కోసం బాధితులు ఈ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను సంప్రదించాలని సూచించింది. ‘పై అధికారులు, సహోద్యోగుల చేతిలో లైంగిక వేధింపులకు గురై, ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు ధైర్యం ఉన్న మహిళా విలేకరులు, మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు ఐడబ్ల్యూపీసీ మద్దతుగా ఉంటుంది. అప్పట్లోనే ఫిర్యాదులు చేసినా మీడియా సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం దారుణం, హీనమైన విషయం. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. కానీ చాలా మీడియా సంస్థల్లో అసలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు’ అని ఐడబ్ల్యూపీసీ అధ్యక్షురాలు రాజలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని మీడియా సంస్థలూ తమ కార్యాలయ ప్రతి శాఖలోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించడం తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు. -
మీడియాలోనూ కీచకులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు మీడియాలో మొదలయింది. తోటి జర్నలిస్టులు, రైటర్లు తమను లైంగికంగా వేధించారని, తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పలువురు మహిళా జర్నలిస్టులు శుక్రవారం నాడు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఎవరు, ఎప్పుడు, ఎలా? తమ పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించారో, ఎవరు తమకు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించారో, ఎవరు తమను ఏమేమీ కోర్కెలు కోరారో వారు సోషల్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు. ఎక్కువ మంది బాధితులు తమను సోషల్ మీడియా ద్వారానే వేధించినట్లు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో కొందరు తమ ప్రవర్తనకు చింతిస్తూ బేషరుతుగా క్షమాపణలు చెప్పగా, మరి కొందరు సంస్థ విచారణ కమిటీ ముందు హాజరవుతున్నామని, వాస్తవాస్తవాలేమిటో అవే బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇంకొందరు తమకు ఎలాంటి పాపం తెలియదని, తమ ఉత్తమ నడవడిని శంకించరాదంటూ వివరణ ఇవ్వగా, తమ ప్రతిష్టను, క్యారెక్టర్ను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కొందరు ఎదురు దాడికి దిగారు. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ఆరోపణల వివాదం రగులుతున్న నేపథ్యంలో ‘మీ టూ’ అంటూ మహిళా జర్నలిస్టులు ముందుకు వస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం ముందుగా హాలీవుడ్లో ప్రారంభమైన విషయం తెల్సిందే. బేషరతుగా క్షమాపణలు: అనురాగ్ వర్మ ‘నేను పంపించిన స్నాప్చాట్ సందేశాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. నేను అనుచితంగా ప్రవర్తించిన మాట వాస్తవమే. ఏదో అప్పుడు హాస్యానికన్నట్లు సందేశాలు పంపించాను. అందులో వాస్తవం లేదు. ఫొటోలు, వీడియోలతో మీలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. క్రాస్ ఫొటోలే కాకుండా నగ్న ఫొటోలు కూడా పంపించాను. అందుకు నన్ను క్షమించండి’ అంటూ 2017, అక్టోబర్ నెల వరకు ‘హఫ్ పోస్ట్ ఇండియా’లో పనిచేసిన జర్నలిస్ట్ అనురాగ్ వర్మ శుక్రవారం ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు. Hello. My snapchats have been problematic. I have been problematic. The content that I thought was "funny" at the time was actually not. I'm sorry, I have made many of you uncomfortable with my crass photos and videos that I thought would pass as a humour. — Anurag Verma (@kitAnurag) October 4, 2018 ఆలస్యంగానైనా విచారిస్తున్నా : కామిక్ ఉత్సవ్ చక్రవర్తి యూట్యూబర్, కామిక్ ఉత్సవ్ చక్రవర్తిపై ఎక్కువ మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఏదో అప్పటికప్పుడు క్షణికావేశంతో పంపించిన సందేశాలు, ఫొటోలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తొలుత సమర్థించుకోబోయిన చక్రవర్తి 24 గంటల తర్వాత బేషరతుగా బాధితులకు క్షమాపణలు చెప్పారు. ‘కాస్త ఆలస్యమైనప్పటికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ 24 గంటలు నేను ఎంతో వేధనను అనుభవించాను. ఇక నా వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కోరుకుంటున్నాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి, చేసిన తప్పులను ఎలా సరిదిద్దు కోవాలో కూడా మీరే సూచించండి’ అని ఆయన సోషల్ మీడియా ద్వారానే వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో కామెడీ షో నిర్వహించేందుకు నౌకలో వెళుతున్నప్పుడు తమను లైంగికంగా వేధించినట్లు ఎక్కువ మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. చక్రవర్తి ఫ్రీలాన్సర్గా తమతో పనిచేస్తున్నందుకు ‘ఆల్ ఇండియా బకర్డ్’ టీమ్ కూడా క్షమాపణలు తెలిపింది. ఉత్సవ్ చక్రవర్తి కూడా 2015 వరకు ‘హఫ్పోస్ట్ ఇండియా’ మీడియాలో పనిచేశారు. వర్మ, చక్రవర్తి తమ సంస్థలో పనిచేసినప్పుడు వారిపై ఎలాంటి ఆరోపణలు రాలేదని, వారు ఎవరినైనా వేధించారా? అన్న విషయాన్ని సంస్థగతంగా పరిశీలిస్తున్నామని ఎడిటర్ ఇన్ చీఫ్ అమన్ సేథి తెలిపారు. తాము మాత్రం ఇలాంటి వేధింపులను సహించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. నేనెంతో బాధ పడుతున్నా: మిహిర్ చిత్రే ఆడవాళ్లను లైంగికంగా వేధించినందుకు ప్రముఖ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ మిహిర్ చిత్రే కూడా శుక్రవారం నాడు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని, మీతోటి వారిని బాధ పెట్టినందుకు నేనెంతో బాధ పడుతున్నాను. నా తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అనుచితంగా ప్రవర్తించను’ అని ఆయన ట్విట్టర్లో స్పందించారు. I'm certainly guilty of a lack of judgement on my part about all this. I'm terribly hurt that I've hurt you & others. That was never ever my intent. I stand corrected and I've too much to look within. Thank you for making me realise this. Never again. I'm sorry. @FuschiaScribe https://t.co/shwt9xBaOG — Mihir Chitre (@mihir_chitre) October 5, 2018 కమిటీ దర్యాప్తు జరుపుతోంది : రెసిడెంట్ ఎడిటర్ ఓ మహిళా జర్నలిస్ట్ తనపై చేసిన లైంగిక ఆరోపణలను ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్ పరోక్షంగా ఖండించారు. ఈ ఆరోపణలను విచారించేందుకు ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యాన సంస్థాగతంగా ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయిందని, తాను విచారణకు హాజరై అన్ని విషయాలను కమిటీ ముందు వివరిస్తానని ఆయన తెలిపారు. కిరణ్ నగార్కర్ కూడా ఓ ఓటలో ఇంటర్వ్యూ సందర్భంగా రైటర్ కిరణ్ నగార్కర్ తనను అసభ్యంగా తాకారని ఓ మహిళా జర్నలిస్ట్ వెల్లడించారు. అదే రైటర్ తమనూ లైంగికంగా వేధించారని మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆనక స్పందించారు. ఈ ఆరోపణలన్నీ అబద్ధమని నగార్కర్ ఖండించారు. హాలివుడ్తో ప్రారంభమై బాలివుడ్, టాలీవుడ్ మీదుగా మీడియాకు పాకిన ‘మీ టూ’ ఉద్యమం కళా, సాహితీ రంగాలకు కూడా విస్తరిస్తోంది. -
ఉత్తరప్రదేశ్ ఆలీగఢ్లో లైవ్ ఎన్కౌంటర్
-
మీడియా సొంత విచారణ వద్దు
న్యూఢిల్లీ: మీడియా తన పరిధికి కట్టుబడి ఉండాలని, కేసుల్ని ప్రభావితం చేసేలా మితిమీరి వ్యవహరించకుండా సమన్వయం పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సున్నితమైన కేసుల్లో మీడియా సొంత విచారణ చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. బిహార్లోని ముజఫర్పూర్ షెల్టర్ హోంలో మహిళలపై లైంగిక దాడుల కేసు దర్యాప్తునకు సంబంధించిన వార్తల సేకరణపై పట్నా హైకోర్టు ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చిన్న విషయం కాదు. ఒక దశలో మీడియా పూర్తిగా పరిధి దాటి వ్యవహరించింది. సమన్వయం పాటించాలి. మేం అనుకుంటున్న దాన్ని చెపుతాం అని మీరు అనలేరు. మీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ కేసును ప్రభావితం చేయకూడదు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండాలో మాకు చెప్పండి’ అని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే వాదిస్తూ.. ఈ కేసులో హైకోర్టు మీడియాపై పూర్తి నిషేధం విధించిందని కోర్టుకు తెలిపారు. మీడియాపై నియంత్రణ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ బిహార్ ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ముజఫర్పూర్ ఘటన బాధితులను ఇంటర్వ్యూ చేసేందుకు మహిళా లాయర్ను నియమిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
మయన్మార్ చరిత్రలో చీకటిరోజు
నోపిడా : మయన్మార్ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా ఆ దేశ పత్రిక సెవెన్ డైలీ (7డైలీ) వర్ణించింది. దేశంలో వాక్ స్వాతంత్య్ర లేదని, మీడియాపై ప్రభుత్వం కుట్రపూరీతంగా వ్యవహరిస్తోందని దేశంలో అతిపెద్ద ప్రచురణగల సెవెన్ డైలీ మొదటి పేజీలో ప్రచురించింది. అంతేకాకుండా మొదటి పేజీలో కొంత భాగాన్ని పూర్తిగా నల్లరంగుతో ప్రచురించి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మయన్మార్లో ఇటీవల జరిగిన రోహింగ్యాల ఊచకోతపై ఇద్దరు జర్నలిస్టులు ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా కథనాలు రాశారన్న ఆరోపణలతో.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్లు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పత్రికలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రజాప్రభుత్వం పేరుతో 2015లో బాధ్యతలు స్వీకరించిన అంగ్సాన్ సూకీ కూడా గతంలో దుర్మర్గాలకు పాల్పడిన సైన్యం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సెవెన్ డైలీ వ్యాఖ్యానించింది. పత్రికలపై సెన్సార్షిప్ విధిస్తూ 2012 సైన్యం చట్టం చేసిందని.. ఆ చట్టం పేరుతో సూకీ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా మండిపడింది. -
ట్రంప్పై దండెత్తిన 350 మీడియా సంస్థలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 350 మీడియా సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సంపాదకీయాలను ప్రచురించాయి. 2016లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడం తెల్సిందే. ఇటీవల ఆయన కొన్ని మీడియా సంస్థలను అమెరికా ప్రజలకు శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాకుండా గతంలో ఓ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినందుకు సీఎన్ఎన్ చానల్ రిపోర్టర్ను ఇటీవల జరిగిన పత్రికా సమావేశానికి హాజరుకాకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు, వ్యాఖ్యలను నిరసిస్తూ సంపాదకీయాలు రాయాలని బోస్టన్ గ్లోబ్ పత్రిక పిలుపునిచ్చింది. తమకు నచ్చినట్లు రాతలు రాయని పత్రికలపై దేశానికి శత్రువులుగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ముద్రవేస్తున్నారని బోస్టన్ గ్లోబ్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. తమకు నచ్చని వార్తల్ని నకిలీ కథనాలుగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. న్యూయార్క్ పోస్ట్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలను పత్రికలు ప్రచురించినంత మాత్రన అవి నకిలీ వార్తలు అవిపోవని సంపాదకీయం రాసింది. ప్రతీకారం, వేధింపులు, శిక్షల నుంచి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే.. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ లేనట్లేనని ఫిలడెల్ఫియా ఇన్క్వైరర్ సంపాదకీయం ప్రచురించింది. -
‘మురసొలి’తో పాత్రికేయుడిగా..
సాక్షి, చెన్నై: దక్షిణామూర్తి అలియాస్ ముత్తువేలర్ కరుణానిధి అన్ని రంగాల్లోనూ ఆరితేరిన వారే. మీడియా రంగంలో ఆయన అరంగేట్రం మురసొలితో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో 18 ఏళ్ల వయసులో ఆయన కలం చేబట్టారు. స్వస్థలం తిరువారూర్ వేదికగా 1942 ఆగస్టు 10 నుంచి ‘మురసొలి’పేరుతో కరపత్రాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇందులో వ్యాసాలు, సమాచారాన్ని ‘చేరన్’బై లైన్తో రాసేవారు. కరపత్ర పత్రికగా ప్రజల్లోకి వచ్చిన మురసొలికి 1940 నుంచి కొంత కాలం బ్రేక్ పడింది. 1944 జనవరి 14 నుంచి వారపత్రికగా ఆవిర్భవించింది. తిరువారూర్ నుంచి చెన్నై కోడంబాక్కం వేదికగా 1954 నుంచి మురసొలి పత్రిక వచ్చింది. 1960 సెప్టెంబర్ 17 నుంచి దినపత్రికగా మారింది. కలైజ్ఞర్ పేరుతో చానళ్లు మురసొలి దినపత్రికగా మారినా రోజూ కరుణానిధి పేరిట ఓ కాలం ఉండేది. 2016లో అనారో గ్యం బారిన పడిన తర్వాత కరుణ పేరిట కాలం ఆగింది. డీఎంకే అధినేతగా, సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పత్రిక వ్యవహారాలను ఆయన మేనళ్లుడు మురసొలి మారన్ చేపట్టారు. ఆ తదు పరి మురసొలి మారన్ తనయులు, దయానిధి మారన్, కళానిధి మారన్ నేతృత్వంలో సన్ గ్రూప్ ఆవిర్భావం, దినకరన్ దినప్రతిక చిక్కడం వెరసి కరుణకు కలసి వచ్చాయి. 2007లో కలైజ్ఞర్ పేరుతో టీవీ చానళ్లు పుట్టుకు రావడంతో మీడి యాలో కరుణ కుటుంబం కీలకంగా మారింది. తెలుగువారి భాషా స్ఫూర్తి భేష్ సాక్షి ప్రతినిధి, చెన్నై: కరుణానిధి తండ్రి తమిళుడైనా తల్లి మాతృభాష తెలుగు కావడంతో తెలుగువారిపై మక్కువ కనబరిచేవారు. అంతేగాక ఒక సభలో తెలుగువారికి మంచి కితాబు ఇచ్చారు. చెన్నైలో ప్రముఖుడైన డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షునిగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) స్థాపించిన తరువాత తొలి ఉగాది వేడుకలను 1990లో యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకలకు గంట సమయం మాత్రమే కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి 3 గంటలపాటు కూర్చుండిపోయారు. ‘చెన్నైలో జరిగిన ఉగాది వేడుకలకు ఇంతమంది తెలుగువారా. కొన్నేళ్ల క్రితం తెలుగువారు లేనిదే తమిళనాడు లేదు కదా. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఒకే వేదికపై చూస్తుంటే ముచ్చటేస్తోంది. తెలుగుభాషపై ఉన్న మమకారమే వారందరినీ కలిపింది. ఇలాంటి భాషా స్ఫూర్తితోపాటూ తెలుగువారి నుంచి తమిళులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది..’అంటూ కరుణానిధి తెలుగువారిని కొనియాడారు. -
అమెరికా మీడియా కంటే మనం ఎంతో బెటర్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మీడియా ప్రతికూలంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన పలు సందర్భాల్లో మీడియాను విసుక్కున్నారు. వాస్తవానికి మీడియా ఆయన ఎన్నికల ప్రచారానికి, విదేశీ పర్యటలనలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వాన్ని తూలనాత్మక దష్టితో చూడడం, ఆ ప్రభుత్వ విధానాలను విశ్లేషణాత్మక దష్టితో విమర్శించడం మీడియాకు ఆది నుంచి ఉన్న అలవాటే. మీడియాలో కొంత భాగం మాత్రమే తటస్థ వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. ఎమర్జెన్సీ కాలాన్ని వదిలేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మీడియా ఈ పంథానే అనుసరించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా ప్రాధాన్యత పెరగడం, ఆయన దాన్ని తనకు అనుగుణంగా మలచుకోవడం వల్ల ప్రధాన పత్రికా మీడియా కూడా మోదీ ప్రభుత్వ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఒక్క పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మినహా ప్రతిపక్ష మీడియా మోదీ ప్రభుత్వాన్ని 2016 వరకు వెనకేసుకొనే వచ్చింది. ఆ తర్వాత దేశంలో రైతుల ఆందోళనలు పెల్లుబుకడం, రిజర్వేషన్ల కోసం పటేళ్లు, మరాఠాలు జరిపిన ఆందోళనల్లో విధ్వంసం చోటు చేసుకోవడం, గోరక్షణ పేరిట మూక హత్యలు పెరగడం, పశ్చిమ బెంగాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు నకిలీ వార్తలు ప్రచారం కావడం, నకిలీ వార్తల కారణంగా పిల్లల కిడ్నాపర్లనుకొని మూక దాడుల్లో అమాయకులు మరణించడం, ప్రశాంతంగా ఉన్న యూనివర్శిటీల్లో ఏబీవీపీ లాంటి సంస్థలు అలజడి రేకెత్తించడం, ముఖ్యంగా మహిళలపై, పసిపిల్లలపై అత్యాచారాలు పెరగడం, మొత్తంగానే సమాజంలోనే అభద్రతా భావం పెరగడం వల్ల మీడియా ఇలాంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చింది. పైగా బీజేపీ నాయకులే మహిళల అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, గోరక్షణ పేరిట దాడులు జరిపిన గూండాలను సత్కరించి తమంతట తాము పరువు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వంద రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా తీసుకరాకపోవడం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని ఏటా అందులో నాలుగోవంతు ఉద్యోగాలు కూడా కల్పించక పోవడం, కేంద్ర రైల్వే శాఖలో 2014 నుంచి పాతికవేల ఉద్యోగాలు భర్తీకాకుండా అలాగే ఉండిపోవడం, ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కొనసాగడం, వేల కోట్ల రూపాయల బ్యాంకుల అప్పులను ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు దేశం విడిచి పారిపోవడం లాంటి సంఘటలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం మోదీకి మీడియా తనకు వ్యతిరేకమనిపించవచ్చు. పలు సందర్భాల్లో చారిత్రక అంశాల గురించి తప్పుగా మాట్లాడి మోదీనే పరువు తీసుకున్నారు. ఒక్కసారి అమెరికా మీడియాతో పోల్చుకుంటే భారత్ మీడియా అధికార పక్షంతో ఎలా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది. హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా సీఎన్ఎన్ కవరేజ్ 93 శాతం వ్యతిరేకంగా ఉండగా, ఏడు శాతం మాత్రమే అనుకూలంగా ఉంది. ఎన్బీసీ కవరేజ్ కూడా అలాగే ఉంది. సీబీఎస్ కవరేజ్ 91 శాతం వ్యతిరేకంగా, 9 శాతం అనుకూలంగా, ది న్యూయార్క్ టైమ్స్ కవరేజ్ 87 శాతం వ్యతిరేకంగా, 13 శాతం అనుకూలంగా, ది వాషింగ్టన్ పోస్ట్ కవరేజ్ 83 శాతం వ్యతిరేకంగా 17 శాతం అనుకూలంగా ఉంది. స్వదేశీ మీడియాతోపాటు విదేశీ మీడియా కూడా ట్రంప్ను ఓ మూర్ఖుడిగా భావిస్తున్నప్పటికీ మీడియా కట్టడికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఒత్తిడి కారణంగా అక్కడ జర్నలిస్టుల ఉద్యోగాలు పోవడం లేదు. -
ఢిల్లీలో భారీ వర్షం : తడిచిపోయిన మీడియా కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడివేడిగా సభ జరగాల్సిన సమయంలో భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాసం జరగనుండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. అవిశ్వాస తీర్మానంతో వాడి వేడిగా జరగనున్న వర్షాకాల సమావేశాలను కవర్ చేయడానికి దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఢిల్లీలో పాగావేశాయి. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వార్తా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలు తడిచిపోయాయి. కెమెరాలు, ఇతర కవరేజి వస్తువులు తడిసిముద్దయ్యాయి. -
ఆ క్షణం అద్భుతం
చియాంగ్ రాయ్: థాయ్లాండ్ గుహలో చిక్కుకుని 18 రోజుల తర్వాత బయటపడిన 12 మంది బాలురు, వారి ఫుట్బాట్ కోచ్ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇళ్లకు చేరుకున్నారు. ఆస్పత్రి బయట ఈ సందర్భంగా వారు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గుహ నుంచి బయటపడటం ఓ అద్భుతమని పిల్లలు వ్యాఖ్యానించారు. రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్రాయ్లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచడం తెల్సిందే. తొలుత పిల్లలను గురువారం ఇళ్లకు పంపాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అందరు పిల్లలతోపాటు, వారి కోచ్ కూడా పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా, ఇళ్లకు వెళ్లాక నెలపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా పిల్లలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేలా చూడాలని వైద్యులు సూచించారు. ఆ గుహలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడగనున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుగానే తెప్పించుకుని, మానసిక వైద్యులకు చూపించి, బాలుర ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదనుకున్న ప్రశ్నలనే అనుమతించారు. పిల్లలు ఇళ్లకు రావడంతో అమితానందంగా ఉందని, ఈ రోజు ఓ శుభదినమని బాలుర కుటుంబ సభ్యులు చెప్పారు. -
మీడియా ముందు థాయ్ చిన్నారులు
బ్యాంకాక్: థాయ్లాండ్లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్బాల్ జట్టు కోచ్ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్నారులు మాట్లాడుతూ.. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న తప్పుడు వార్తలకు డాక్టర్లు తెరదించారు. వారు మాట్లాడుతూ.. చిన్నారులతో పాటు వారి కోచ్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. కాగా గత నెల 23న ‘వైల్డ్ బోర్స్’ అనే ఫుట్బాల్ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే. గురువారం వైద్యులు చిన్నారులను వారి ఇళ్లకు పంపిచనున్నారు. -
మీడియా ముందు థాయ్ చిన్నారులు
-
క్యాస్టింగ్ కౌచ్పై స్పందించిన రెజీనా
సాక్షి, సినిమా : ప్రస్తుతం సినీ పరిశ్రమని క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటన(చికాగో సెక్స్ రాకెట్)లు కుదిపేస్తున్నాయి. దీనిపై వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఓ సలహా ఇచ్చారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమన్నారో చూద్దాం.. ‘క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే. దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తమకు ఇష్టం వచ్చిన విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా’ అని రెజీనా చెప్పారు. -
వార్తా చానళ్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మతపర సున్నిత అంశాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఐపీసీలోని ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారో అలాంటి వ్యాఖ్యలు ప్రసారం చేసే వార్తా చానళ్లపైనా అవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ వార్తా చానల్లో నిర్వహిం చిన చర్చా కార్యక్రమంలో రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం మఠాధిపతి పరిపూర్ణానందస్వామి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్రకు పూనుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. మతపర సున్నిత అంశాలపై కొన్ని వార్తా చానళ్లు అభ్యంతరకర రీతిలో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రభుత్వా నికి పోలీసు శాఖ నివేదించింది. దీంతో చానళ్ల ప్రసారాలపై నిఘా ఉంచాలని, రెచ్చగొట్టేలా ప్రసారాలు జరిపితే చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. డీజీపీ సూచనల మేరకు వార్తా చానళ్ల ప్రసారాలను నిరంతరం సమీక్షించడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. -
ఆ మాటంటే ఒప్పుకోను!
ఓ ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత కొందరు కథానాయికలు యాక్టింగ్కు బై బై చెబుతారు. పెళ్లి తర్వాత మరికొందరు స్మాల్ బ్రేక్ ఇచ్చి, మళ్లీ కెమెరా ముందుకు వస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ లాంగ్ బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ అంటూ షూట్లోకి అడుగుపెడతారు ఇంకొందరు కథానాయికలు. ఇలా పెళ్లి తర్వాత కథానాయికలు కెరీర్ గ్రాఫ్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి... మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే స్పీడ్లో యాక్ట్ చేస్తారా? అన్న ప్రశ్నను ఆలియా ముందు ఉంచితే... ‘‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాలన్నా, అవకాశాలు తగ్గిపోతాయని ఎవరైనా అన్నా నేను ఒప్పుకోను. ప్రతిభ ఉంటే చాన్సులు ఆగవు. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ జర్నీకి పెళ్లితో సంబంధం లేదని నా ఫీలింగ్. ఈ విషయాన్ని అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కూడా. నేనూ అలాగే కొనసాగుతాను. మంచి యాక్టర్ కెరీర్ను రిలేషన్షిప్ స్టేటస్ ప్రభావితం చేయదు’’ అని అంటున్నారు ఆలియా భట్. అలాగే రణ్బీర్ కపూర్తో రిలేషన్ ఏంటీ? అన్న ప్రశ్నకు మాత్రం–‘‘అమేజింగ్ కో స్టార్’’ అంటూ తెలివిగా మాట దాటేశారు. కానీ, వారిద్దరి పెళ్లి గురించి మీడియాలో వస్తున్న గాసిప్లకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్స్తో బిజీ బిజీగా ఉన్నారు ఆలియా. -
ఉ. కొరియాలో రహస్య అణు ఉత్పత్తి?
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను రహస్యంగా దాచడానికి మార్గాలను పరిశీలిస్తోందని, అణ్వాయుధాల ఉత్పత్తి రహస్యంగా సాగేలా ఏర్పాట్లు చేస్తోందని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తమ దేశం లో అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని సింగపూర్ సదస్సులో ట్రంప్కు ఉ.కొరియా అధినేత కిమ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాంగ్బ్యాన్ అణు కేంద్రాన్ని ఆధునీకరిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉ.కొరియా అణ్వాయుధ సామగ్రిని సమకూర్చుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అమెరికా సమాచారం సేకరించినట్టు మీడియా వెల్లడించింది. అలాగే దేశ రాజధాని ప్యాంగ్యాంగ్కు 60 మైళ్ల దూరంలో కాంగ్సాన్లో భూగర్భంలో యురేనియం నిల్వలు దాచినట్టు సమాచారం. -
‘దళిత్’ మాటను వాడొద్దని చెప్పండి
ముంబై: ‘దళిత్’ అనే మాటను మీడియాలో వాడకుండా తగు సూచనలు చేయాలని ముంబై హైకోర్టు కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాల్లో ‘దళిత్’ పదాన్ని తొలగించాలంటూ పంకజ్ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్ను ముంబై హైకోర్టు నాగ్పూర్ బెంచ్ విచారించింది. ‘దళిత్’కు బదులు ‘షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్లు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా దళిత్ అనే మాట వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రెస్ కౌన్సిల్కు, మీడియాకు కూడా ‘దళిత్’ అనే మాట వాడరాదని సూచనలు ఇవ్వడం సబబని భావిస్తున్నట్లు పేర్కొంది. -
టీఆర్పీ కోసం మీడియా పాకులాట
హైదరాబాద్: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూప్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’అనే అంశంపై రాజ్దీప్ సర్దేశాయ్ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్ న్యూస్ ఒక కేన్సర్ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు. మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్దీప్ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్మీట్లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్.. రాజ్దీప్ సర్దేశాయ్ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్ను, అల్లం నారాయణను రాజ్దీప్ సత్కరించారు. -
మీడియా రంగంలోకి ఎలన్ మస్క్....?
న్యూయార్క్ : ‘జర్నలిజం అతి పురాతనమైన, పవిత్రమైన వృత్తి. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే విశ్వసనీయతకు మారుపేరు. మరి నేడు.. అధికారంలో ఎవరూ ఉంటే వారికి కొమ్ముకాసి, భజన చేసి ప్రజల దృష్టిలో వారిని దేవుళ్లను చేసి అసలు నిజాలను ప్రజలకు తెలియకుండా.. తాము చెప్పిందే అక్షరసత్యంగా భ్రమింపచేసే అందమైన అబద్ధంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని పత్రికలు ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయనేది బహిరంగ రహస్యం. పత్రికలకైనా, విలేకరులకైనా ముఖ్యంగా ఉండాల్సింది విశ్వసనీయత. కానీ నేడది నేతి బీరకాయ చందంగా తయారైంది. విలువలు పాటించడంలో తమకు సాటి మరెవరూ లేరని బీరాలు పలికే పత్రికా యజమాన్యాల అసలు రూపం అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాను. ఇందుకు గాను నేను ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రతి జర్నలిస్టు విశ్వసనీయతకు మార్కులు ఇవ్వొచ్చు. మీరు చదివే ప్రతి కథనానికి సంబంధించి అసలు వాస్తవాలను తెలపవచ్చు. దాని ఆధారంగా సదరు పత్రిక, దాని యాజమాన్యం, ఆ విలేకరి విశ్వసనీయతను విశ్లేషించి మార్కులు ఇవ్వొచ్చు’ అంటున్నారు ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్ కంపెనీ యజమాని, టెస్లా ఇంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలన్ మస్క్. ఎలన్కు మీడియా మీద ఇంత కోపం రావడానికి కారణం.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ విడుదల చేసిన సెడాన్ మోడల్ 3 కార్ల గురించి మీడియాలో వరుసగా ప్రతికూల కథనాలు ప్రచురితమవుతున్నాయి. పోయిన వారం కూడా ఒక ప్రముఖ వార్త పత్రిక టెస్లా కంపెనీ సెడాన్ మోడల్ 3 కార్లో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా లేదని.. అంతేకాక సెడాన్ మోడల్ 3 కార్లు ఎక్కువగా క్రాష్ అవుతున్నాయని ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ ఎలన్ త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రమాణం చేశారు. తమ కార్లకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా మీడియా సంస్థలు లోపాలనే ఎక్కువగా ప్రచురించి ప్రజల్లో కంపెనీ పట్ల ఉన్న నమ్మకాన్ని నీరుగార్చటంతో తానే స్వయంగా మీడియా రంగంలోకి ప్రవేశించాలని భావించారు మస్క్. దాన్ని గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. పత్రికల వారికి అసలు నిజాలు తెలిసినప్పటికీ వారు చక్కర పూత పూసిన తియ్యని అబద్దాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే తమ వెబ్సైట్లను/ పత్రికలను ఎక్కువ మంది చూడాలని వారు కోరుకుంటారు. ఎంత ఎక్కువ మంది తమ వెబ్సైట్/పత్రికను చూస్తే వారికి అంత ఎక్కువ మొత్తంలో ప్రకటనలు వస్తాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువగా అహేతుకమైన వాటినే ప్రచురిస్తారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఆలోచన తనకు పోయిన ఏడాదిలో వచ్చిందని వెంటనే తన ఆలోచనను తమ న్యూరాలింక్ కంపెనీ అధ్యక్షుడితో పంచుకున్నానన్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ‘ప్రావ్దా క్రాప్(సత్యం) వెబ్ సైట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావ్దాను కాలిఫోర్నియాలో రిజిస్టర్ చేయించడం కూడా జరిగిందన్నారు. ఈ విషయాన్ని మస్క్ తన ట్విటర్లో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 54 వేల మంది ఎలెన్కు తమ మద్దతును తెలిపారు. అయితే ఎలన్ వెబ్సైట్ గురించి టెక్ వెబ్సైట్లో ట్రాన్స్పోర్టేషన్ రిపోర్టర్గా పనిచేసే ఆండ్రూ జే. హకిన్స్ ట్రంప్ గురించి ప్రచారం చేయడానికి మరో కొత్త మీడియా రంగంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ ఎలన్ ‘అంటే ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని(మీడియా) విమర్శిస్తే మీరు వారిని ట్రంప్తో పోలుస్తారన్నమాట. మంచిది మరి ఎన్నికల సమయంలో మీరు ట్రంప్ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసిన అతనే గెలిచారు. ఇది ఎందువల్ల జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే మీరు దానిని కోల్పోయారు’ అని రీట్విట్ చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం!
-
జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్..
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఇందులో 57 ద్విచక్ర వాహనాలు, 51 కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నా నారాయణగూడ ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కవరేజ్ చేస్తున్న మీడియాను దురుసుగా ప్రవర్తిస్తూ.. మీడియాను అడ్డుకున్నాడు. మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటూ ట్రాఫిక్ ఎస్సై మీడియాపై చిందులేశాడు. -
అయ్యో.. నేను అలా అనలేదు
ఇస్లామాబాద్ : 26/11 ముంబై దాడులకు పాల్పడింది పాకిస్థానేనని అంగీకరిస్తూ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో షరీఫ్ మాట మార్చారు. ముంబై దాడులపై తన వ్యాఖ్యలను మీడియా పూర్తిగా వక్రీకరించి.. తప్పుగా ప్రచురించిందని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని నవాజ్ షరీఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజ్యేతర శక్తులైన ఉగ్రవాద మూకలను సరిహద్దులు దాటించి.. ముంబైలో ప్రజల్ని చంపేందుకు ఉసిగొల్పారని తన పరోక్షంగా పాక్ ప్రభుత్వం ప్రమేయముందని పేర్కొన్నారు. ముంబై దాడుల నేపథ్యంలో పాక్ తనకు తానే ఏకాకి అయిందని ఆయన అన్నారు. ‘నవాజ్ షరీఫ్ ప్రకటనను భారత మీడియా పూర్తిగా తప్పుగా వ్యాఖ్యానిస్తూ ప్రచురించింది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్లోని ఓ సెక్షన్ మీడియా, సోషల్ మీడియా కూడా భారత మీడియా చేసిన దురుద్దేశపూరిత ప్రచారాన్ని నమ్మి.. అదే నిజమైనట్టు ప్రచారం చేశారు. ఆయన ప్రకటనలోని నిజానిజాలు పట్టించుకోలేదు’ అని షరీఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ జాతీయ భద్రత విషయంలో దేశ అత్యున్నత రాజకీయ పార్టీ అయిన పీఎంఎల్ఎన్కుగానీ, ఆ పార్టీ అధినేత షరీఫ్కుగానీ ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 6/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని ఇటీవల డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ షరీఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. -
ఎమ్మేల్యేలు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు
-
యువతుల అదృశ్యం అసత్య ప్రచారమే
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు నెలల్లో వంద మంది యువతులు అదృశ్యమైనట్టు కొన్ని చానల్స్లో జరుగుతున్న ప్రచారం అబద్ధమేనని ఎస్పీ శిబిచక్రవర్తి అన్నారు. తిరువల్లూరులో ట్రాఫిక్ నిబందనలు పాటించడంపై వాహనచోదలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మొదట ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల పేరిట నిర్వహించిన బైక్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న పలువురికి ప్రమాద రహిత ప్రయాణంపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. కిలోమీటరు దాకా సాగిన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 40 మంది యువతులు మాత్రమే.. తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 40 మంది యువతులు మాత్రమే అదృశ్యమైయ్యారని వీరిలో 36 మంది ఆచూకీ ఛేదించమన్నారు. కొన్ని చానల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు బాలికలు మాత్రమే మిస్ అయ్యారని వీరి ఆచూకీ కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహన చోదకుల గురించి ఎస్పీ మాట్లాడుతూ వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని ఎస్పీ తెలిపారు.డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మీడియాకి మనమే ‘మసాలా’ ఇస్తున్నాం
న్యూఢిల్లీ: బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడవద్దని, మీడియాకు మనమే మసాలా ఇస్తున్నామని బీజేపీ చట్టసభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వ్యక్తులను ఉద్దేశించి మోదీ తన మొబైల్ యాప్ ద్వారా సంభాషించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు మీడియాతో మాట్లాడటానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని చివరకు పార్టీకే కాకుండా తమకూ చెడ్డపేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మీడియాను నిందించాల్సిన అవసరం లేదు.దాని పని అది చేస్తోంది. కెమెరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి, దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం మనకు లేదు. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవారే మీడియాతో మాట్లాడుతారు’ అని మోదీ అన్నారు. ‘మీడియా అది చేస్తోంది, ఇది చేస్తోందంటూ మన కార్యకర్తలు ఎన్నో మాటలంటుంటారు. కానీ మన తప్పులతో మనమే మీడియాకు వివాదాలను అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కెమెరా పట్టుకున్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్యనూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో, పరిశోధకులమో అని ఫీల్ అయిపోతాం. మనం మాట్లాడిన దాంట్లో నుంచి వారికి ఏది అవసరమో దానినే మీడియా ప్రతినిధులు తీసుకుంటారు. మనల్ని మనమే నియంత్రించుకోవాలి’ అని మోదీ హెచ్చరించారు. ‘అన్ని వర్గాల్లోనూ మన మద్దతుదారులు పెరుగుతున్నారు. బీజేపీలో అత్యధిక మంది చట్టసభ్యులు ఓబీసీలు, దళితులు, గిరిజనులే ఉన్నారు. వెనుకబడిన వర్గాల మద్దతు మనకు లభించిదనడానికి ఇది ఉదాహరణ’ అని మోదీ పేర్కొన్నారు. -
కుట్రలకు పాల్పడుతున్న ఆ ఛానళ్లను బహిష్కరించండి
-
నిజమైన అజ్ఞాతవాసి అతనే..
-
వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్న పవన్ కల్యాణ్
-
నిజమైన అజ్ఞాతవాసి అతనే.. వెల్లడించిన పవన్!
సాక్షి, హైదరాబాద్ : సంబంధంలేని విషయాల్లో తనను లాగి.. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి.. నిజమైన అజ్ఞాతవాసి టీవీ9 చానెల్ సీఈవో రవిప్రకాశ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ9 యజమాని శ్రీనిరాజుపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై.. టీవీ9 చానెల్ ఈ వ్యవహారాన్ని నడిపిందని మండిపడ్డారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్ మార్గదర్శకత్వంలో తన తల్లిని బూతులు పదేపదే తిట్టించారని, శ్రీసిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కై.. రవిప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు చేసిందంతా చేసి.. లీగల్ నోటీసులు పంపించడమేమిటని శ్రీనిరాజును పవన్ తప్పుబట్టారు. తన తల్లిని తిట్టించిన డ్రీమ్టీమ్లో లాయర్లు భాగం కాదంటూ.. శ్రీనిరాజు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ ట్వీట్ చేశారు. ఉదయం నుంచి వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల పచ్చ మీడియా తీరును తప్పుబడుతున్న ఆయన.. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ అంతకుమునుపు ట్వీట్ చేశారు. ‘నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి’. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ‘స్టే ట్యూన్డ్.. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్ కళ్యాణ్’ అంటూ పేర్కొన్నారు. ఈ ‘అజ్ఞాతవాసి’ని ‘వాడో బ్లాక్మెయిలర్’ అని.. స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు... తెలుసుకోవాలనివుందా.. స్టే ట్యూన్డ్ టు “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం నుంచి - పవన్ కల్యాణ్ విత్ కెమెరామ్యాన్ ట్విటర్’ అని పోస్టు చేశారు. టాలీవుడ్లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ దుమారం.. అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా శ్రీరెడ్డి పవన్ను దూషించడం.. ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక టీడీపీ అనుకూల మీడియా, లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పవన్ అంతకుముందు ట్వీట్ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ మరికొన్ని ఇతర చానళ్ల ద్వారా తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు అని మండిపడ్డారు. మహా న్యూస్లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పెట్టుబడులు లేదా ఆయన బినామీలు ఉన్నారని ఆరోపించారు. -
రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు
చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ గురువారం తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లు కాలేరు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్ను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేయిని ఫినాయిల్తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్ను షేర్ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్చేశానన్నారు. -
ఒంటరి స్వేచ్ఛ నిలబడదు
ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! గడచిన అర్థ శతాబ్దకాలంలో చూస్తే భారతదేశ చరిత్రలో శక్తిమంతులైన ముగ్గురు ప్రధానమంత్రులు కనిపిస్తారు. ఈ ముగ్గురికీ కూడా పూర్తి ఆధిక్యం ఉంది. వారివి స్థిరమైన ప్రభుత్వాలు. వీరిలో మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. మార్చి, 1971లో జరిగిన ఎన్నికలలో ఆమె, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ (ఐ) విపక్షాలను తుడిచి పెట్టడం కనిపిస్తుంది. తరువాత రాజీవ్ గాంధీ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 1984లో ఘన విజయం సాధించారు. మనకున్న శక్తిమంతుడైన ఆ మూడో ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఐదేళ్ల పాలన ఇప్పుడు చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతోంది కూడా. అయితే స్పష్టత కోసం 1980–84 ఇందిర పాలనను ఇందులో చేర్చడం లేదు. అప్పుడు హత్యకు గురికావడంతో ఆమె పదవీకాలం అర్థాంతరంగా ముగిసిపోయింది. తరచి చూస్తే ఈ మూడు ప్రభుత్వాల నడుమ ఒక సారూప్యతను మీరు కనుగొనగలరు. ఇందుకోసం ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ వంటి ఒక ఆధారం కూడా నన్ను ఇవ్వనివ్వండి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ ఐదేళ్ల పాలన ఆఖరి సంవత్సరాలలో ఏం చేయడానికి ప్రయత్నించారో ఆలోచించండి! ఇప్పటికీ ఊహించడం దగ్గరే ఉన్నారా? అయితే మరొక ఆధారం ఇస్తున్నాను– పత్రికా రచయిత మాదిరిగా ఆలోచించండి! వాస్తవాలు ఇక్కడున్నాయి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ పాలన చివరి ఏడాదిలో మీడియా స్వేచ్ఛను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ ఐదేళ్ల పాలనలోని సరిగ్గా చివరి సంవత్సరంలోనే అత్యవసర పరిస్థితి ప్రకటించి, పత్రికల మీద సెన్సార్ నిబంధనలను విధించారు (ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత, అందుకు తనకు తాను ఇచ్చుకునే కానుక అన్నట్టు పార్లమెంట్ కాలపరిమితిని ఒక సంవత్సరం, అంటే ఆరేళ్లకు పొడిగించుకున్నారు). స్వార్థ ప్రయోజనాలూ భారత్ను అస్థిరం చేయాలన్న కుట్ర కలిగిన ‘విదేశీ హస్తం’ కనుసన్నలలో మెలగుతున్న పత్రికారంగం (అప్పటికి ఈ రంగాన్ని ఎవరూ మీడియా అని పిలిచేవారు కాదు) ప్రతికూలతను, విద్వేషాన్ని వెదజల్లుతున్నదని ఇందిర వాదన. ఏవో కొన్ని తప్ప పత్రికలన్నీ దారికొచ్చేశాయి. దారికి రాని పత్రికల వారు జైళ్లకు వెళ్లవలసి వచ్చింది. ఆయా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. రాజీవ్ కూడా అంతే. తన ఐదేళ్ల పాలన తుది అంకంలో అంటే 1987–88 సంవత్సరంలో సదరు పరువు నష్టం బిల్లు తీసుకువచ్చారు. బొఫోర్స్ కుంభకోణం, జైల్సింగ్ సవాలు, వీపీ సింగ్ తిరుగుబాటు వంటి వాటితో సతమతమవుతున్న రాజీవ్ కూడా సహజంగా పత్రికారంగాన్ని తప్పుపట్టారు. ఆ బిల్లు అసలు లక్షణాలు ఏమిటో గ్రహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆంగ్లపత్రికను – ఇండియన్ ఎక్స్ప్రెస్–ఏకాకిని చేసి ‘శిక్షించేందుకు’ దాని మీద వందలాది దొంగకేసులు నమోదు చేయించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘నకిలీ వార్త’ మీద పోరాటం పేరుతో ప్రధానస్రవంతి మీడియా మీద దాడిని కొనసాగించే యత్నం చేస్తున్నది. అయితే ప్రధాని జోక్యంతో అలాంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు నాటకీయంగాను, అంతే సంతోషంతోను తప్పుల తడక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు. అలా ప్రకటించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయవలసి ఉందన్నదే నిజం. పైగా ఒక ఆధారం ఇస్తున్నట్టుగానే ఆ ఉపసంహరణ ప్రకటన వెలువడింది. ఎలాగంటే డిజిటల్ మీడియాకు నియమావళిని రూపొందించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అందులో ఉంది. ఈ వాదన ఎలా ఉందంటే, పత్రిక, ప్రసార రంగాలకు వాటి నిబంధనావళి వాటికి ఉంది (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ). ఎటొచ్చీ ఇబ్బందికరంగా ఉన్న డిజిటల్ మీడియాకే ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆ మీడియాను పనిచేయడానికి అనుమతించరాదు. పత్రికారంగ పూర్వపు నిబంధనలలో ‘మూడు ఉదాహరణల నిబంధన’ ఒకటి. మూడింటిని ఒకేసారి స్పృశిస్తే అవి ఒకే విషయాన్ని బోధపరుస్తాయి. ఏక ఖండంగా ఉన్న దారంలా కనిపిస్తాయి. కాబట్టి, శక్తిమంతమైన ప్రభుత్వాలు చివరి అంకంలో ప్రవేశించనప్పుడు వాటికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే వారిని చెడ్డవార్తల సంగతి చూసేటట్టు చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటేæ, అది వేరే చర్చ. వారి ఆకస్మిక పతనాన్ని వారే నమ్మలేకపోవడం, లేదా మరోసారి ప్రభుత్వంలోకి రావడం గురించి ఉన్న అభద్రతా భావం చెడువార్తలను ప్రచురిస్తున్నాయంటూ పత్రికలను తప్పు పట్టేట్టు చేస్తాయి కాబోలు. 1975 ఆరంభం నాటి పరిస్థితి ఏమిటో మనకి తెలుసు. 20 శాతానికి మించిన ద్రవ్యోల్బణంతో, లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో ఇందిరాగాంధీ పతనావస్థకు చేరుకున్నారు. అయినా పత్రికలను అదుపు చేయాలన్న ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారు. ఎందుకంటే చాలా పత్రికలు తలొగ్గాయి. అయితే పత్రికల మీద విధించిన సెన్సార్ నిబంధనల కారణంగా ప్రజలు శిక్షించడం వల్లనే ఇందిర ఓటమి పాలయ్యారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడమనే ఘోర తప్పిదానికి ఆమె పాల్పడకుండా ఉండి ఉంటే, అత్యవసర పరిస్థితి కాలం నాటి ‘క్రమశిక్షణ’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ ఆమె శత్రువులు అధికారంలోకి రావడంతో ఆమె జైలుకు వెళ్లారు. ఒక సాంఘిక ఒప్పందం అక్కడ ఆవిర్భవించింది. ఆ మేరకు సెన్సార్ నిబంధనలలోని క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించి పత్రికా స్వేచ్ఛకు పూచీ పడ్డారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేని దేశంలో ఇలాంటì మలుపు పెద్ద పరిణామం. ఆ మేరకు పత్రికా రంగాన్ని అదుపులో పెట్టాలన్న ఇందిర ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. రాజీవ్గాంధీ కూడా తన తప్పిదాలను పత్రికల మీదకు నెట్టివేసి, వాటిని శిక్షించాలని ప్రయత్నించారు. ఆయన కూడా అందులో విఫలమైనారు. ఆయన తల్లికి జరిగినట్టే ఆయన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దేశంలో ప్రముఖ పత్రికా సంపాదకులు, ఆఖరికి యజమానలు వారి వారి స్పర్థలను, వైరుథ్యాలను కూడా పక్కన పెట్టి ప్లకార్డులు పట్టుకుని జనపథ్ రోడ్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి సంఘీభావం అత్యవసర పరిస్థితి కాలంలో ఎప్పుడూ కనిపించలేదు. రాజీవ్ వెనక్కి తగ్గారు. మీడియా గొంతు నొక్కే ఉద్దేశంతో ఆ రెండు ప్రభుత్వాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు చివరికి మీడియా స్వేచ్ఛను బలోపేతం చేస్తూ ముగిశాయి. ఇలాంటి ప్రయత్నం పునరావృతమవుతుందా? అలాగే ఇలాంటి ప్రయత్నం మూడోసారి చేసి విజయం సాధించగలిగినంత బలంగా ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన చివరి దశకు చేరుకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అవి ఇంతకు ముందు చెప్పిన ఆ రెండు ప్రభుత్వాలు ఉనికి కోసం ఎదుర్కొన్న సవాళ్ల వంటివి కావు. 1975, 1988 కాలంతో పోల్చి చూస్తే ఇప్పుడు భారతీయ మీడియా ఎంతో బలంగా ఉంది. ఎంతో పెద్దది, శక్తిమంతమైనది, వైవిధ్యభరితమైనది. అలా Vó గతంలోని ఆ రెండు సందర్భాలను బట్టి చూస్తే ప్రస్తుత మీడియాకు రెండు బలమైన ప్రతికూలాంశాలు కూడా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న ఆ సామాజిక ఒప్పందం ఇప్పుడు గందరగోళంలో పడింది. ఈ సంగతి నేను గతంలో చాలాసార్లు చెప్పాను కూడా(https://theprint.in/opinion/fake-news-order-we the-indian-media-have-ignored-warning-bells/46741/).. మరొకటి– ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! విస్తారంగా ఉన్న మీడియాను చీలికలు పేలికలు చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. ఇందులోని సాధ్యాసాధ్యాలు కూడా చర్చనీయాంశమే. అయితే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, డిజిటల్ మీడియా ఈ మూడు కూడా నడుపుతున్న పెద్ద మీడియా సంస్థలు దీనితో తమకేమీ ప్రమాదం ఉండదని ఆలోచిస్తాయి. ఎందుకంటే, దాని నుంచి రక్షించే తమవైన వ్యవస్థలు ఉన్నాయని వారి నమ్మకం. అంటే అచ్చమైన డిజిటల్ మీడియా సంస్థలు వాటి బాధలు అవి పడాలి. చాలా కాలం నుంచి నడుస్తున్న మీడియా సంస్థలకు కూడా ఈ చర్య నచ్చుతుంది. ఎందుకంటే, అచ్చమైన డిజిటల్ మీడియా పాత మీడియా సంస్థలని అవినీతి నిలయాలనీ, అసమర్థమైనవనీ విమర్శిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటర్నెట్ను అదుపు చేయడం ఎవరి వల్లా కాదనీ, ఏ ప్రభుత్వం కూడా అదుపు చేయలేదనీ కొత్త డిజిటల్ మీడియా అధిపతుల నమ్మకం. అది నిజం కాదు. ఇంటర్నెట్ అనేది సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమం, ఆఖరికి ఎంతో లోతైన ఉదారవాద వ్యవస్థలు కూడా ఇంటర్నెట్ను అదుపు చేయడానికే మొగ్గుతున్నాయి. నిజంగా అదే జరిగితే, ఒంటిరిగా పోరాడడం నీ వల్ల కాదు. కాబట్టి అప్పుడు మళ్లీ సంప్రదాయ మీడియా మద్దతు అవసరమవుతుంది. అందుచేత దానిని తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. తీర్పులు ఇవ్వడం సరికాదు. కథువా (జమ్మూకశ్మీర్), ఉన్నవ్ (యూపీ) వంటి అన్యాయపు కేసులు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్ల కూడా పాలక వ్యవస్థ అహంకారపూరిత ధోరణి కారణంగా న్యాయం దిగ్బంధనమైంది. లైంగిక అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మీద కేసు కూడా నమోదు కాలేదు. కానీ మీడియా నిర్వహించిన కృషి వల్ల ఈ అన్యాయం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు సాగుతోంది. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే మనమంతా కలసి పోరాడవలసిందే. లేదంటే చీలికలు పేలికలైపోయి కునారిల్లిపోవడానికి సిద్ధంగా ఉండడమే. నీ విరోధులు స్వేచ్ఛను కాపాడగలిగినప్పుడే నీ స్వేచ్ఛను నీవు కాపాడుకోగలుగుతావు. స్వేచ్ఛ చీలికలు పేలికలై పోకూడదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
నేనే పీఎం అయితే, వాళ్లను ఉరితీసేవాణ్ణి!
సాక్షి, ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సల్మాన్ భాయ్కి విధించిన శిక్ష చాలా కఠినమైనదని, ఇప్పటికే ఆయన జీవితంలో ఎన్నో అనుభవించాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ చేసిన ఎన్నో మానవతా సేవా కార్యక్రమాలను గుర్తించాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్శర్మ కూడా సల్మాన్ మద్దతుగా ముందుకొచ్చాడు. సల్మాన్ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించకుండా అతనికి న్యాయవ్యవస్థ తీవ్ర విధించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లు. వాళ్లను నేను కలిశాను. సల్మాన్ మంచి వ్యక్తి. ఆయన ప్రజలకు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆ తప్పు చేశారో లేదా తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే నకిలీ, వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తుందంటూ మరో ట్వీట్లో మీడియాపై మండిపడ్డారు. ‘మీ పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్ కథనాలు రాయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడారు. నెగిటివ్ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారు’ అంటూ ఓ వెబ్సైట్ను ఉద్దేశించి దుర్భాషలాడారు. ‘చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేస్న్యూస్ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’ అంటూ కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్లపై విమర్శలు రావడంతో ఆయన వాటిని డిలీట్ చేశారు. ఆ ట్వీట్లను పట్టించుకోవద్దని, తన అకౌంట్ను హ్యాక్ చేశారని మరో ట్వీట్లో కపిల్ శర్మ తెలిపాడు. ఈ ట్వీట్ల వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ ట్వీట్ను కూడా కపిల్ శర్మ తొలగించడం గమనార్హం. Bhai @KapilSharmaK9 tere tweets tere naye show se jyada funny hain. 😂😂 pic.twitter.com/XiClPvhBXn — PhD in Bakchodi (@Atheist_Krishna) April 6, 2018 -
ఐపీఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్లోనూ ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అయితే మ్యాచ్లు చూసేందుకు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు తీసుకునేవారు. ప్రస్తుతం కొన్ని టెలికాం సంస్థలు సైతం ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్యాక్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్ స్పోర్ట్స్లోనూ ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా దూరదర్శన్లో మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. కానీ, ఐపీఎల్ మ్యాచ్లు కాస్త ఆలస్యంగా ప్రసారం అవుతాయని పేర్కొంది. మరోవైపు 2018-2022ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్ ఇండియానే సొంతం చేసుకుంది. కాగా, టీమిండియా మ్యాచ్ల ప్రసార హక్కులను కళ్లు చెదిరే ధరను బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్ ఇండియా నెట్వర్క్ సంస్థ ప్రసార హక్కులను నేడు (గురువారం) దక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం 6,138 కోట్ల రూపాయలకు టీమిండియా మ్యాచ్ ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది. -
కళ్లు చెదిరే రేటు.. బీసీసీఐకి కాసుల పంట
టీమిండియా మ్యాచ్ల ప్రసార హక్కుల వేలం విషయంలో ఉత్కంఠ వీడింది. కళ్లు చెదిరే రేటును బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్ ఇండియా నెట్వర్క్ సంస్థ ప్రసార హక్కులను దక్కించుకుంది. అధికారిక సమాచారం ప్రకారం రూ. 6,138.10 కోట్లకు హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం టీమిండియా 2018-19కిగానూ 18 మ్యాచ్లు, 2019-20కి గానూ 26, 2020-21కిగానూ 14, 2021-22కిగానూ 23, 2022-23కిగానూ 21 మ్యాచ్లు ఆడనుంది. ఆలెక్కన 102 మ్యాచ్లకు సగటున ఒక్కోమ్యాచ్కు రూ.60.1 కోట్లను స్టార్ సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. దేశివాళీ మ్యాచ్లతోపాటు మహిళా క్రికెట్ మ్యాచ్లను కూడా స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. వీటితోపాటు 2018-2022ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియానే కైవసం చేసుకుంది. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్ ఇండియానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
దొంగచాటు దాడి!
చడీ చప్పుడూ లేకుండా మీడియా పీక నులమడానికి సాగిన కుట్ర భగ్నమైంది. నకిలీ వార్తల్ని అరికట్టే చాటునlపత్రికా స్వేచ్ఛకు ఉరి బిగిద్దామనుకున్నవారు పలాయనం చిత్తగించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం పాత్రికేయులనుద్దేశించి జారీ చేసిన అప్రజాస్వామిక ఉత్తర్వులు కాసేపట్లోనే మాయమయ్యాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చూస్తున్నప్పుడు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను కల్లోల కేంద్రాలుగా మార్చిన ఘనత స్మృతి ఇరానీది. పురిట్లోనే సంధికొట్టిన ప్రస్తుత ఉత్తర్వుల పుణ్యం కూడా ఆమెదే. వెనువెంటనే పాత్రికేయ సంఘాల నుంచీ, పౌర సమాజం నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో గత్యంతరం లేక వాటిని ఉపసంహరించు కున్నారు. నకిలీ వార్తల్ని ప్రచురించినట్టు లేదా ప్రసారం చేసినట్టు పాత్రికేయులపై ఫిర్యాదులందితే అలాంటివారికిచ్చిన అక్రిడిటేషన్(ప్రభుత్వ గుర్తింపు)ను రద్దు చేస్తామన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. మొదటిసారి ఇలా జరిగితే ఆర్నెల్లపాటు, రెండోసారైతే సంవత్సరంపాటు, మూడోసారి తప్పు జరిగితే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని లెక్కలు కూడా ఇచ్చారు. దారుణమైన విషయమేమంటే పత్రికలకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు, చానెళ్లకు సంబం ధించి న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ)కు ఫిర్యాదులందిన పదిహేను రోజుల్లో అందులోని నిజానిజాలేమిటో ఆ సంస్థలు నిర్ధారించాలట. అప్పటివరకూ ఆరోపణలొచ్చిన పాత్రికేయుల గుర్తింపును నిలిపి ఉంచుతారట. అంటే ఆరోపణలు రాగానే ముందు గుర్తింపు ఆగిపోతుందన్నమాట! ఏం తెలివి?! ఇది నకిలీ వార్తల మాటున తమకు ఇబ్బందికరమైన వార్తలు వెలుగు చూడకుండా చేసే కుట్రకాక మరేమిటి? నకిలీ వార్తలు లేదా తప్పుడు వార్తల గురించి ప్రభుత్వాలు అనవసర ఆదుర్దా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందుకోసం అటు పత్రికలకూ, ఇటు చానెళ్లకూ వేర్వేరు నియంత్రణ వ్యవస్థలున్నాయి. అదీగాక పౌరులకు సరైన సమాచారాన్ని, విశ్లేషణల్ని అందించి వారి విశ్వసనీయతను పొందాలని మీడియా ఎప్పుడూ తహతహలాడుతుంది. క్షణక్షణమూ వచ్చిపడే సమాచారాన్నంతటినీ జల్లెడపట్టి ఏది సరైందో, ఏది కాదో నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని పౌరులకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి అందుకు అను గుణమైన కర్తవ్య రచన చేసుకుంటుంది. నిరంతరం తనను తాను సరిదిద్దు కోవడానికి, జనబాహుళ్యంలో విశ్వసనీయత పెంచుకోవడానికి తపిస్తుంది. ఇందుకు మినహాయింపుగా తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టే, వక్రీకరించే మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. అయితే అలాంటి సంస్థలు చాలా త్వరగా విశ్వసనీయతను కోల్పోతాయి. కాలగర్భంలో కలిసిపోతాయి. అన్ని రంగాల్లో మంచి చెడులున్నట్టే మీడియాలోనూ ఈ పోకడలుంటాయి. తప్పదు. ఆ మాదిరి సంస్థలపై వచ్చే ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి పీసీఐ, ఎన్బీఏలున్నాయి. అలాగే వృత్తిపరమైన విలువలను పరిరక్షించడానికి, ఈ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వంటివి పనిచేస్తున్నాయి. వర్తమాన ప్రపంచంలో నకిలీ వార్తల బెడద ఎలా పెరిగిందో, వాటి పర్య వసానాలు ఏవిధంగా ఉంటున్నాయో అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ, బ్రిటన్ ‘బ్రెగ్జిట్’ రిఫరెండం సమయంలోనూ నకిలీ వార్తలు స్వైరవిహారం చేశాయి. తమ ఇష్టాయిష్టాలను వేరెవరో నియంత్రించారని ఆల స్యంగా తెలుసుకుని ఆ దేశాల పౌరులు లబోదిబోమంటున్నారు. అంతెందుకు... ఈమధ్య బయటపడిన కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) వ్యవహారంలో దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలూ ఎన్నికల్లో తమ సేవల్ని ఉపయోగించుకున్నాయని సీఏకు ఇక్కడ భాగస్వామిగా ఉన్న ఒవలెనొ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) తన వెబ్సైట్లో సగ ర్వంగా ప్రకటించుకుంది. తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకకు చెందిన ‘పోస్టుకార్డ్ న్యూస్’ అనే వెబ్సైట్ను ఆమధ్య కేంద్రమంత్రి అనంత్కుమార్ వెనకేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు 2014 నాటి ఎన్నికల్లో ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయడంతో పాటు తన పార్టీ డిజిటల్ మీడియా విభాగం ద్వారా నకిలీ వార్తల్ని ప్రచారంలోపెట్టి లబ్ధిపొందారు. ఇలా నకిలీ వార్తలతో, తప్పుడు సమాచారంతో ప్రజల్ని అయోమ యానికి గురిచేసి ఏలికలుగా మారినవారు మీడియాకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నిస్తుండటమే వర్తమాన విషాదం. ఈ ఉత్తర్వుల సంగతి ప్రధాని నరేంద్రమోదీకి తెలియదని... అది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వీయ నిర్ణయమని చెబుతున్నారు. ప్రధాని కార్యా లయానికి తెలిసిన వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోమని ఆదేశాలు వెళ్లాయంటున్నారు. మంచిదే. అయితే ఉత్తర్వుల జారీ మొదలుకొని ఉపసంహరణ వరకూ సాగిన ప్రహసనాన్ని గమనిస్తే అంతిమంగా మొత్తం ప్రభుత్వంపైనే అనుమానాలు రేకెత్తుతాయి. అంతకు వారం ముందునుంచీ డజనుమంది కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు నకిలీ వార్తల్ని ఫలానా వెబ్సైట్ బట్టబయలు చేసిందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా దాని లింకుల్ని ప్రచారంలో పెట్టడం గమనిస్తే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక్కటే ఈ ఉత్తర్వుల వెనకున్నదని ఎవరికీ అనిపించదు. నచ్చని మీడియా సంస్థల అడ్డు తొలగించుకునేందుకు గత ప్రభుత్వాలు సైతం ప్రయత్నించాయి. ఇందిరాగాంధీ మొదలుకొని మొన్నీమధ్య వసుంధరరాజే వరకూ పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ఎందరో ప్రయత్నిం చారు. మన రాజ్యాంగంలోని 19వ అధికరణ భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతోంది. ఆ హక్కుకు తూట్లు పొడిచే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజలు తిప్పి కొడతారు. పాలకులు ఆ సంగతి గుర్తెరగాలి. మీడియాను నియంత్రించే పనులకు స్వస్తిపలకాలి. -
ఆ మీడియా సంస్థల్ని ద్వేషించను: రాహుల్
న్యూఢిల్లీ: వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై విద్వేషాన్ని ఎగదోసే మీడియాను ద్వేషించనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వీరంతా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టనింపుకుంటున్నారనీ, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందుత్వ ఎజెండా ప్రచారానికి 17 మీడియా సంస్థలు అంగీకరించినట్లు ఇటీవల కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు స్పందించారు. ‘తప్పుడు వార్తలు, అవాస్తవాలతో నాపై విద్వేషాన్ని రగిల్చేవారిని నేను ద్వేషించను. వాళ్లు ద్వేషాన్ని అమ్ముకుంటున్నారు. వారికది కేవలం వ్యాపారం మాత్రమే. ఈ విషయం కోబ్రాపోస్ట్ ఆపరేషన్తో బహిర్గతమైంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
ఈ ట్యాంపరింగ్ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
సిడ్నీ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారీ తమ ఆటగాళ్ల తప్పును కప్పిపుస్తూ వెనకెసుకొచ్చె ఆసీస్ మీడియా ఈసారి మాత్రం అందుకు విరుద్దంగానే ప్రవర్తించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్పై విమర్శల బాణాలను ఎక్కిపెడుతూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి, ‘స్మిత్స్ షేమ్’ అని స్థానిక మీడియా చానెళ్లు సైతం ఆగ్రహం వెల్గగక్కాయి. ఇదే తరహాలో ఓ ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ తమ ఆటగాళ్ల తొండాటపై ఓ స్పూఫ్ వీడియో రూపొందించి మరి ట్రోల్ చేస్తోంది. ఈ వీడియోలో తాజా ట్యాంపరింగ్తో పాటు 1981 వరల్డ్కప్లో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రేగ్ చాపెల్ అతని సోదరుడు ట్రివర్ చాపెల్కు అండర్ఆర్మ్ బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడాన్ని కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బెన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్కు యత్నిస్తూ అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇది జట్టు వ్యూహంలో భాగమేనని కెప్టెన్ స్మిత్ ప్రకటించడంపై తీవ్ర దూమారం రేగింది. ఇప్పటికే ఐసీసీ స్మిత్పై ఓ మ్యాచ్ నిషేదం, మ్యాచ్ ఫీజు కోత విధించింది. బెన్ క్రాఫ్ట్, డెవిడ్ వార్నర్లకు సైతం మ్యాచ్ ఫీజు కోతతో జరిమానా విధించింది. ఇక ఆసీస్ మీడియా కథనాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఈ ముగ్గురి ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేదం విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
బాల్ ట్యాంపరింగ్పై ఫన్నీ స్పూఫ్!
-
క్రీడా స్పాన్సర్షిప్ జోరు
ముంబై: దేశంలో క్రీడల స్పాన్సర్షిప్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2017లో స్పాన్సర్షిప్ రూపంలో రూ.7,300 కోట్ల నిధుల వ్యయం జరిగింది. 2016లో రూ.6,400 కోట్ల కంటే 14 శాతం ఎక్కువ. 55 శాతంతో మీడియా పెట్టుబడులే ఇందులో సింహ బాగంగా ఉన్నాయి. ఆ తర్వాత క్రీడా మైదానాల స్పాన్సర్షిప్లు, ఈఎస్పీ ప్రాపర్టీలు ఉన్నట్టు స్పోర్ట్›్జపవర్ అనే సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది. క్రీడలపై మీడియా ఖర్చు గతేడాదిలో 15.8 శాతం వృద్ధితో 3,511 కోట్ల నుంచి రూ.4,065 కోట్లకు పెరిగాయి. ఇందులో టెలివిజన్ పాత్ర కీలకమని ఈ నివేదిక పేర్కొంది. -
షమీని అరెస్ట్ చేసేలా సహకరించండి: హసీన్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీని అరెస్ట్ చేసేలా సహకరించాలని అతని భార్య హసీన్ జహాన్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె కోల్కతా మెజిస్ట్రేట్లో వాదనలు వినిపించే ముందు మీడియాతో మాట్లాడారు. ‘నా కీర్తి, మర్యాదలను ఈ కేసులో ఫణంగా పెట్టి మరి పోరాడుతున్నాను. షమీ, అతని సోదరుడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికి కుటుంబం కోసం ఇన్నాళ్లు ఓపిక పట్టాను. షమీపై పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి మీడియా నన్ను పాయింట్ అవుట్ చేస్తోంది. ఈ హింసను ఓ మహిళగా నేనెందుకు తట్టుకోవాలి? చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి ఈ కేసులో నాకు మద్దతివ్వండి. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఓ మహిళా గౌరవ, మర్యాదలపై జరుగుతున్న పోరాటం. షమీ నా గౌరవ, మర్యాదలను నాశనం చేశాడు. షమీ నేరాల గురించి నేనొక్కదాన్నే గళం విప్పుతున్నాను. కానీ అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ బయటకి రావడం లేదు. ఓ సెలబ్రిటి ఇలా చేయడం సబబేనా? నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. తన పట్ల వ్యతిరేక వార్తలు ప్రచారం చేయవద్దు. షమీని అరెస్టు చేసేలా నాకు మద్దతివ్వండి. నేనిప్పటికే చాలా భరించాను. దయచేసి నాబాధను అర్థం చేసుకొండి. నేను షమీని పెళ్లి చేసుకోకపోయినా నా జీవితం అద్భుతంగా ఉండేది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నేను షమీతో ప్రేమలో ఉన్నప్పుడు కనీసం అతను జాతీయ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని నన్ను పాయింట్ అవుట్ చేయడం ఆపండి’ అని హసీన్ జహాన్ మీడియాను కోరారు. ఇక షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇక పాక్ యువతి అలీషబా సైతం స్పందించిన విషయం తెలిసిందే. షమీకి తాను కేవలం ఓ అభిమానిని మాత్రమేనన్నారు. -
ప్రాంతీయ పార్టీలదే హవా!
హైదరాబాద్: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని, 10 మంది ఎంపీలుంటే కేంద్రాన్ని శాసించవచ్చని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్లో మీడియా ఇన్ న్యూస్ పేరుతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్ని కల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ‘వాట్సాప్’ వేదికగా ఎన్నికల యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, దేశవ్యాప్తంగా వందల చానళ్లు నిర్వహిస్తున్నారని, ప్రముఖ చానళ్లు కూడా లాభాల్లో లేవని, కేవలం ఎన్నికల అవసరాల కోసమే మీడియా సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు. అప్రాధాన్య వార్తలు ప్రాధాన్యత పొందుతున్నాయని, నిజమైన వార్తలు లోపలి పేజీలకు పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ కాకుండా కేవలం వ్యూస్కు ప్రాధాన్యత ఇస్తున్నారని.. టీఆర్పీ రేటింగ్స్, సంచలనాల కోసం పాకులాడుతూ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని రాజ్దీప్ అన్నారు. మీడియా క్రమంగా ‘మెక్డొనాల్డ్ డైజేషన్’( అప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం), ‘విండో జర్నలిజం’, ‘రావన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం’కి దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. మీడియా ‘వాచ్ డాగ్ ఆఫ్ సొసైటీ’ స్థాయి నుంచి ‘ద ల్యాబ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ’గా శరవేగంగా మారిపోతోందన్నారు. దేశంలోని పలు పార్టీలు, నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియాను నియంత్రిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా రాసే వార్తలను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ సహా కేసీఆర్ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో మీడియా మరింత శక్తివంతంగా, పక్షపాత రహితంగా ఉందని, మీడియా దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. మహిళలు నిజాయితీగా రాజకీయాలు చేస్తారని చెప్పడం కష్టమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నబ్కు, తనకు వ్యక్తిగత వైరం లేదని, వృత్తిపరమైన పోటీ మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ఎల్వో చైర్పర్సన్ కామిని షరాఫ్ అనుసంధానకర్తగా వ్యవహరించగా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు. గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు. రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా తాను కేసీఆర్ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్
అదో అబద్ధాల ప్రసంగం గవర్నర్ ప్రసంగమంతా అబద్ధాలే. గవర్నర్ చేత నాలుగేళ్లుగా ఇదే ప్రసంగాన్ని ప్రభుత్వం చెప్పిస్తోంది. రైతు ఆత్మహత్యలు, లక్ష ఉద్యోగాల అంశాలు ప్రసంగంలో ఎందుకు లేవు? – కిషన్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ మాట తప్పారు దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారు. గవర్నర్ ప్రసంగంలో బీసీ సబ్ప్లాన్ అమలు ప్రస్తావన ఏదీ? గవర్నర్ అబద్ధాల ప్రసంగం వినలేక సభ నుంచి వాకౌట్ చేశాం. – లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేదీ? రాష్ట్రంలోని అణగారిన వర్గాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, కల్యాణలక్షి పథకంలో పెంపుదల అంశం ప్రసంగంలో లేదు. – ఆర్. కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే సంక్షేమాన్ని నిర్లక్ష్యంలో పడేశారు టీఆర్ఎస్ ఎన్నికల హామీలు నెరవేర్చేలా గవర్నర్ ప్రసంగం లేదు. సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిరసన తెలిపేందుకు ఉన్న హక్కును హరించింది. ధర్నా చౌక్ను ఎత్తేసింది. – సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే గవర్నర్ ప్రసంగం వాస్తవ విరుద్ధం గవర్నర్ ప్రసంగం రాష్ట్ర పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. అటవీ హక్కు చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. మిషన్ భగీరథ వంటి పథకాలు కాంట్రాక్టర్ల కోసమే చేపడుతోంది. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. – సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గూండాగిరి.. దాదాగిరి చేస్తారా? అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూండాగిరి, దాదాగిరి చేశారు. దాడులకు పాల్పడితే సహించేది లేదు. గవర్నర్ ప్రసంగంలో ఏం తప్పుందో చెప్పాలి. – శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చరిత్ర పేరుకేనా? గవర్నర్పై కాంగ్రెస్ చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆ పార్టీకి ఉన్న 125 ఏళ్ల చరిత్ర పేరుకేనా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్కన్నా మా ప్రభుత్వమే ఎక్కువగా ఆదుకుంటోంది. – నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభివృద్ధిని అడ్డుకోవడానికే... కాంగ్రెస్ ఎమ్మెల్యే – ఎ. జీవన్రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనంతో దాడులకు పాల్పడటం రాష్ట్ర అభి వృద్ధిని అడ్డుకోవడమే. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాచర్యలు తీసుకున్నారో ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి. ఇదెక్కడి సంప్రదాయం? కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్ద విషయం లేకనే దాడులకు పూనుకున్నారు. కుట్రపూరితంగానే స్పీకర్ పోడియంపై మైక్ విసిరారు. స్పీకర్ సూచనలను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ సభ్యులు దాడులకు పాల్పడటం ఎక్కడి సంప్రదాయం? – కొండా సురేఖ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
ఏపీ భవన్లో మీడియాపై ఆంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఆందోళనలు కవర్ చేస్తున్న మీడియాపై ఢిల్లీలోని ఏపీ భవన్లో నిషేధాజ్ఞలు విధించారు. రెండురోజులు పాటు ఇంటర్వ్యూలు చేయొద్దని అనధికారికంగా హుకుం జారీ చేశారు. ఆందోళనలు ప్రసారం చేసేందుకు ప్రయత్నించిన సాక్షి టీవీ విలేకరులను కూడా పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భవన్లో ఇంటర్వ్యూలు చేయొద్దని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో లిఖిత పూర్వక ఉత్తర్వులు చూపాలని అమర్నాథ్ కోరగా.. రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడుకోవాలని దురుసుగా ప్రవర్తించారు. ఏదేమైనా ఏపీ భవన్ నుంచి బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు తీవ్రతరం చేస్తుండటంతో ఎక్కడ తమకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వమే కావాలని ఏపీ భవన్లో మీడియాపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. సోమవారం సంసద్ మార్గ్లో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించనున్న నేపధ్యంలో కావాలనే ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
శ్రీదేవి అప్పుడే ‘బాడీ’గా మారిపోయిందా?
సాక్షి, ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మృతితో బాలీవుడ్ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్లో మృతిచెందిన శ్రీదేవి భౌతికకాయం తరలింపుపై మీడియాలో వస్తున్న కథనాల పట్ల బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పుడు ఆమెతో కలిసి సినిమాలు చేసిన అప్పటి హీరో రిషీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవిని కేవలం ‘మృతదేహం’గా పరిగణిస్తూ కథనాలు ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. దుబాయ్లో మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు భర్త బోనీ కపూర్, కూతురు ఖుషీతో కలిసి వెళ్లిన శ్రీదేవి గత శనివారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు అధికారిక లాంఛనాల వల్ల జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీదేవి భౌతికకాయాన్ని ‘బాడీ’ అని ప్రస్తావిస్తూ.. మీడియా కథనాలు ప్రసారం చేయడాన్ని రిషీకపూర్ తప్పుబట్టారు. ‘ఎలా శ్రీదేవి అకస్మాత్తుగా బాడీ (మృతదేహం)గా మారిపోయింది. టీవీ చానెళ్లు ‘ఆమె బాడీని ముంబైకి తీసుకువస్తారంటూ’ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉన్నఫలంగా శ్రీదేవి వ్యక్తిత్వం మాయమైపోయి.. ఆమె బాడీగా మారిపోయిందా?’ అని రిషీ కపూర్ ఆగ్రహంగా ట్వీట్ చేశారు. ‘ఇక చందమామ రాత్రులు ఉండవు. చాందినీ శాశ్వతంగా వెళ్లిపోయింది. అలాస్’ అంటూ రిషీ కపూర్ ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Henceforth no more Moonlit nights! Chandni gone forever. Alas! pic.twitter.com/VUuO3dQebL — Rishi Kapoor (@chintskap) February 25, 2018 -
గుర్తుపట్టలేనంతగా మారిన హీరోయిన్
సాక్షి, సినిమా : ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్కు బంధువు. పైగా దర్శకుడు మోహిత్ సూరికి స్వయానా సోదరి. హీరోయిన్గా ఒక్క చిత్రంతోనే క్రేజ్ను సంపాదించుకుంది. ఆమె స్మైలీ సూరీ. ఇప్పుడు అనారోగ్య కారణాలతో బాలీవుడ్ మీడియాలో ఆమె హాట్ టాపిక్గా మారిపోయింది. స్మైలీ సూరీ(34) 2005లో కల్యుగ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఖునాల్ ఖేము పక్కన అమాయకపు పాత్రలో నటించిన స్మైలీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కూడా ఆమె తర్వాత ఎందుకనో సినిమాల్లో కొనసాగలేకపోయింది. మధ్యలో నాలుగైదు చిత్రాల్లో గెస్ట్ రోల్స్తోనే ఆమె సరిపెట్టింది. 2014లో డాన్సర్ వినీత్ బంగేరాను వివాహం చేసేసుకున్న ఆమె రియాల్టీ షో నాచ్ బలీయే-7లో పాల్గొంది కూడా. అయితే ఆ తర్వాతే ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయి. థైరాయిడ్ కారణంగా ఆమె విపరీతమైన బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీనికితోడు పీసీఓడీ తో కూడా ఆమె బాధపడుతున్నారంట. అనారోగ్యంతో ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనై డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చికిత్సతోపాటు డాన్స్ను కూడా ఆమె నమ్ముకున్నారు. ఇప్పుడు ఆమె పోల్ డాన్సర్ అవతారంలోకి మారిపోయారు. -
మీడియా వార్తలు.. నిలదీసిన వర్మ
సాక్షి, సినిమా : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ నిలదీస్తున్నాడు. ‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ను సీజ్ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ — Ram Gopal Varma (@RGVzoomin) 19 February 2018