సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకోం | narender rao demands upa for telangana state | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకోం

Published Tue, Aug 27 2013 6:17 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని సచివాలయం తెలంగాణ అధ్యక్షుడు నరేంద్‌రావు హెచ్చరించారు.

హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని సచివాలయం తెలంగాణ అధ్యక్షుడు నరేంద్‌రావు హెచ్చరించారు.  బుధవారం నుంచి సచివాలయంలో తాము కూడా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఎవరైనా రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

 

యూపీఏ సమన్వయ కమిటీ ప్రకటించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం రేపు  ఢిల్లీకి వెళుతున్నట్లు నరేందర్ రావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement