లారీ, బైక్ ఢీ : మున్సిపల్ డ్రైవర్‌ మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ : మున్సిపల్ డ్రైవర్‌ మృతి

Jul 27 2015 3:31 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

కర్నూలు : వేగంగా వెళ్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంజీవనగర్కు చెందిన యోహాన్(40) మన్సిపాలిటి పరిధిలో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బైక్‌పై సెంటర్‌కు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వాహనం పైనుంచి కిందపడిన యోహాన్ పై నుంచి లారీ రెండు టైర్లు పోవడంతో అతని దేహం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement