
కాడెద్దులైన రైతన్నలు
తొండూరు : తమ పొలంలోని కలుపు తీసేందుకు ఆ రైతులు కాడెద్దులుగా మారారు. మండలంలోని ఇనగలూరు గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి తన పొలంలో పొద్దుతిరుగుడుతో పాటు జొన్న, మినుము సాగు చేశాడు. పంటతో పాటు కలుపు కూడా పెరుగుతూ వచ్చింది. కలుపు నివారణకు ఎద్దులతో మెట్లను దున్నుతారు. ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయ పనులకు ఎద్దులు దొరకుండా పోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు తండ్రితో పాటు మరో వ్యక్తిని కలుపుకుని వాసుదేవరెడ్డి కాడెద్దులుగా మారారు.