తిరుపతిలో పంద్రాగస్టు వేడుకలు! | Pandragastu celebrations Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పంద్రాగస్టు వేడుకలు!

Jul 26 2017 1:55 AM | Updated on Oct 2 2018 7:21 PM

ఆగస్టు 15న అధికారికంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జెండావిష్కరణ వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆగస్టు 15న అధికారికంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జెండావిష్కరణ వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతిలోని తారకరామ స్టేడియాన్ని పరిశీలిస్తోంది. మంగళవారం తిరుపతి చేరుకున్న పోలీస్‌ వర్గాలు ఈ మేరకు మైదానం విస్తీర్ణం, గేట్లు, పార్కింగ్‌ స్థలంపై పరిశీలన జరిపాయి.

రాష్ట్ర విభజన తరువాత ఏటా ఒక్కో నగరంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విజయవాడ, కర్నూలు, అనంతపురం నగరాల్లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement