పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య 7.95 లక్షలు | Pushkarni 7.95 million number of bathing | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య 7.95 లక్షలు

Published Fri, Jul 17 2015 2:09 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

Pushkarni 7.95 million number of bathing

 కొవ్వూరు/నరసాపురం అర్బన్/జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో గురువారం ఒక్కరోజే 7,94,848 మంది స్నానాలు ఆచరిం చారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, పెనుగొండ, నిడదవోలు, పెరవలి మండలాల్లో 4,85,993మంది పుష్కర స్నానాలు చేశారు. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపు రం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 2,35,991 మంది, కొవ్వూరు డివిజన్‌లోని పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో 72,864మంది స్నానాలు చేశారు. గడచిన మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 21,48,009 మంది సాన్నాలు ఆచరించారు. వీరిలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 13,47,695 మంది, నరసాపురం డివిజన్ పరిధిలో 6,30,519 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 1,69,795 మంది ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement