ఆగస్టు 1న విజయవాడకు సచిన్!
లెజెండ్ క్రికెటర్, మాస్టర్ బాస్లర్ సచిన్ టెండూల్కర్ విజయవాడకు రానున్నారు. విజయవాడలో పీవీపీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఓ బిజినెస్ మాల్ ను సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆహ్వాన పత్రాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు.
పీవీపీ మాల్ ను విజయవాడలో ఆగస్టు 1 తేదిన సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు అని ట్విటర్ లో ఆహ్వాన పత్రాల పోస్టింగ్ జోరందుకుంది. అయితే పీవీపీ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.