
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయమని సినీ హీరో, ప్రజా ఉద్యమకారుడు ఆర్. నారాయాణ మూర్తి అన్నారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలి అవుతున్న రాజకీయం’ అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడం గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు.
భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. స్నేహ చిత్ర బ్యానర్పై నిర్మించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాను మరోసారి నవంబర్ 15న విడుదల చేస్తున్నామని, అందరు ఆదరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment