చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.