ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం | RTC Bus Steering Failed | Sakshi

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Jan 23 2020 10:57 AM | Last Updated on Thu, Jan 23 2020 10:58 AM

RTC Bus Steering Failed   - Sakshi

సాక్షి,కృష్ణా : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి వద్ద గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉమ్మడిదేవరపల్లి వద్దకు రాగానే  స్టీరింగ్‌ ఫెయిల్‌ కావడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి మోరీని డీకొట్టి ఆగిపోయింది. అయితే పక్కనే ట్రాన్స్‌పార్మర్‌ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కొద్దిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement