సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు | Samaikya ikya vedika organisers arrested by miyapur police | Sakshi
Sakshi News home page

సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

Sep 17 2013 2:34 PM | Updated on Sep 1 2017 10:48 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమావేశానికి అనుమతి లేదంటూ రౌండ్ టేబుల్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా సమైక్య ఐక్యవేదిక నిర్వాహకులు జనచైతన్యవేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, హర్షవర్థనరెడ్డి, గౌతం, చల్లా మధుసూధనరెడ్డిలను మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

 

దాంతో ఆ సభకు విచ్చేసిన అధికమంది సమైక్యవాదులు నిరాసనతో వెనక్కిమళ్లాల్సి వచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు మంగళవారం కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement