
సాక్షి, తూర్పుగోదావరి: కొత్త సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రకటించిన బంపర్ ఆఫర్ ఓ షాపు యజమానికి తలనొప్పిగా మారింది. చేతికందిన చీరలను ఎవరికి వారు పట్టుకోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం గ్రాండ్లో ఒక రూపాయికే ఒక చీర ఆఫర్ను ప్రవేశపెట్టారు. దీంతో చీరలను సొంతం చేసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా షాపులోకి ప్రవేశించి చీరలను పట్టుకుపోయారు. ఈ పరిణామంతో కంగుతిన్న షాపు యజమాని పోలీసుల దగ్గరికి పరిగెత్తుకువెళ్లాడు.
(20 పైసలకే టీ షర్ట్, క్యూ కట్టిన జనం)
Comments
Please login to add a commentAdd a comment