మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు సమైక్య సెగ తగిలింది. పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనను మంగళవారం సమైక్య వాదులు అడ్డుకున్నారు.
శ్రీకాకుళం : మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు సమైక్య సెగ తగిలింది. పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనను మంగళవారం సమైక్య వాదులు అడ్డుకున్నారు. సమైక్యవాదులు ఈ సందర్భంగా శత్రుచర్ల కాన్వాయ్పై చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి శత్రుచర్ల రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా సమైక్య సెగ తగిలింది. అయితే తన రాజీనామాతో రాష్ట్ర విభజన ఆగిపోదని ఆమె వ్యాఖ్యానించారు.