డోర్నాల: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ కార్యకర్తలు ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లా డోర్నాల మండలం ఐనముక్కలలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడిని వైఎస్సార్ సీపీ ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
Published Sun, Aug 17 2014 11:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM
Advertisement
Advertisement