అధికారం అండతో చర్చి కూల్చివేత | TDP Leaders did Church demolition with authority | Sakshi
Sakshi News home page

అధికారం అండతో చర్చి కూల్చివేత

Jun 23 2018 3:04 AM | Updated on Aug 10 2018 9:52 PM

TDP Leaders did Church demolition with authority - Sakshi

బలుసులపాలెంలో కూల్చివేసిన చర్చి

చెరుకుపల్లి(రేపల్లె): టీడీపీ నాయకులు క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని కూల్చివేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెంలో గురువారం జరిగింది. టీడీపీ నాయకుడు కొనకాల రవికిరణ్, మరి కొంతమంది సెవెన్త్‌డే చర్చిని కూల్చివేశారు. ఆ సమయంలో పాస్టర్‌ ఏసురత్నం ఒక్కరే చర్చిలో ఉన్నాడు. టీడీపీ నాయకులు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగడంతో భయపడి పాస్టర్‌ చెరుకుపల్లికి పారిపోయారు.

ఈ సమాచారం దళిత,  క్రైస్తవ సంఘాల పెద్దలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు చేరి ఆందోళన  చేపట్టడానికి సిద్ధమవడంతో అధికారులు స్పందించారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు కూలగొట్టిన చర్చి పునఃనిర్మాణాన్ని చేపట్టేలా దళిత, క్రైస్తవ సంఘాలతో చర్చలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement