ప్రకాశం జిల్లాలో సమైక్య ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఒంగోలులో పలు విద్యాసంస్థలు మూసివేశారు. అద్దంకి, కనిగిరిలలో బంద్ కొనసాగుతోంది. ఉలవపాడులో ఎంఈవో శివన్నారాయణ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. పొదిలిలో రోడ్డుపైనే విద్యార్థులు.. గురుపూజోత్సవాలు నిర్వహించారు.
మార్టూరు జాతీయరహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర అంతటా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రోడ్డుపైనే 'సమైక్య' గురుపూజోత్సవాలు
Published Thu, Sep 5 2013 11:56 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement