కిరణ్ విందుకు తెలంగాణ మంత్రుల డుమ్మా | Telangana Ministers Skip CM Kiran's Dinner | Sakshi
Sakshi News home page

కిరణ్ విందుకు తెలంగాణ మంత్రుల డుమ్మా

Published Wed, Sep 11 2013 8:56 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

Telangana Ministers Skip CM Kiran's Dinner

మంత్రులతో తన క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రాజకీయాలు ప్రస్తావించ లేదని తెలిసింది. భేటీ ముగిసిన తర్వాత సీఎం కిరణ్.. గ్రాండ్ కాకతీయ హోటల్కు వెళ్లారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ గౌరవార్థం ఇక్కడ సీఎం విందు ఏర్పాటు చేశారు.

ఈ విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ  సహా పలువురు తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఒక్క గీతారెడ్డి మాత్రమే హాజరయ్యారు.  సమైక్యాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సీఎం కిరణ్ పరోక్షంగా అండ దండలు అందిస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement