![Tenth exam results is today - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/29/ap-ssc-results_0.jpg.webp?itok=zS2q1BOL)
సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లలో ఫలితాలను చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment