కంభదూర్ మండలకేంద్రంలోని చెరువులో సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహం దొరికింది.
కంభదూర్ మండలకేంద్రంలోని చెరువులో సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహం దొరికింది. హత్య చేసి చెరువులో పడవేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. శవం బాగా కుళ్లిపోవటాన్ని బట్టి చూస్తే నెల రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్థానికుడు కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.