రెండు బైక్‌లు ఢీ - ముగ్గురికి గాయాలు | Three injuried in a road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ - ముగ్గురికి గాయాలు

Published Thu, Dec 31 2015 2:22 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three injuried in a road accident

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పులిచర్ల గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

జేబీ చెరువు గ్రామానికి చెందిన బాష(25), చెంచయ్య(60) బైక్‌పై రాచర్లకు వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా బైక్ పై వస్తున్న రంగస్వామి(40), భాగ్యలక్ష్మి(35)లను ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి భాగ్యలక్ష్మి సురక్షితంగా బయటపడగా.. మిగితా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement