
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 56,030 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్లుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 36,
రూ.50 గదులు - 146 ఖాళీ. .
రూ.100 గదులు - 36,
రూ.500 గదులు - 17 ఖాళీ.
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 123 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణసేవ - 34ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం- 101ఖాళీగా ఉన్నాయి.
బుధవారం ప్రత్యేకసేవ: సహస్ర కలశాభిషేకం