గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన | Today, the arrival of ys Jagan | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన

Published Fri, May 1 2015 8:38 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన - Sakshi

గుంటూరు జిల్లాలో నేడు వైఎస్ జగన్ పర్యటన

విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరానికి  విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా గుంటూరు నగరానికి బయలుదేరి   వెళతారు.

అనంతరం అక్కడ సన్నిధి కల్యాణ మండపంలో మాజీ కేంద్రమంత్రి, పార్టీ ముఖ్యనేత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమరాలు, పార్టీ నేత కిలారి రోశయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం గన్నవరం చేరుకుని 2.40 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని రఘురామ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement