wedding ceremony
-
రాష్ట్రపతి భవన్కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన పూనమ్గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా బిహార్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్న అవ్నీశ్ కుమార్తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్స్ట్రక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్లో షూట్స్ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
అభిమాన జన సందోహాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ..
సాక్షి, అమరావతి/గన్నవరం: విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి.. ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొని పోరాడదామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు తదితరులున్నారు. విమానాశ్రయం నుంచి తాడేపల్లి బయలుదేరిన వైఎస్ జగన్కు మార్గం మధ్యలో ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు తదితర కూడళ్లలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొమ్మా కోట్లు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి నేతృత్వంలో కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించారు.వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులుతాడేపల్లిలోని శ్రీ ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎండీ, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుక సోమవారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు పరిమళ రెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. -
నేడు సింధు వివాహ రిసెప్షన్... ప్రముఖులు హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకల్లో భాగంగా నేడు మరో కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా మంగళవారం రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు సచిన్ టెండూల్కర్ తదితరులను సింధు ఆహ్వానించింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆదివారం రాత్రి రాజస్తాన్లోని ఉదయపూర్లో సింధు పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులైన కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వధూవరులను ఆశీర్వదించారు. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్షిప్ పతకాలు సహా పలు గొప్ప విజయాలతో భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా సింధు గుర్తింపు తెచ్చుకోగా... పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. -
ఏం పెళ్లి రా అది..! ప్రస్తుతం ట్రెండ్..
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు. కానీ స్థానిక ధనవంతులు అంత స్థాయిలో కాకపోయినా అబ్బో అనిపించేలా తమ పిల్లల వివాహాలను జరిపిస్తున్నారు. సిలికాన్ సిటీలో ఇటువంటి పెళ్లిళ్ల పరిశ్రమ ప్రముఖంగా మారిపోయింది.సాక్షి, బెంగళూరు: గతంలో పెళ్లి అనేది చాలా శాస్త్రోక్తంగా జరగాలని భావించేవారు. అయితే నేటి రోజుల్లో తమ తమ ఆడంబరాలను చాటుకోవడానికి సంపన్నులు, ఆఖరికి మధ్య తరగతివారు కోట్ల రూపాయలు వెదజల్లి వైభవోపేతంగా చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే చాలు.. ఇంద్ర భవనం వంటి ఫంక్షన్హాల్స్, టూరిస్టు ప్రదేశాలలో మూడుముళ్ల వేడుకలు జరుగుతాయి. అందులోనూ వెడ్డింగ్ ప్లానర్ల పాత్ర పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాను తీసినట్లుగా పెళ్లి తంతును మహా ఆర్భాటంగా చేయడం సిలికాన్ సిటీలో ట్రెండ్ అయ్యింది.వెడ్డింగ్ ప్లానర్లుగతంలో పెళ్లి అంటేనే ముహూర్తం, ఆభరణాలు, బట్టల కొనుగోలు, ఆహ్వాన పత్రిక, ఫంక్షన్ హాల్, ఫోటో, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నో అంశాలు మదిలో మెదులుతాయి.. ఇలా హడావుడి పెళ్లిళ్ల ఒత్తిడిని వెడ్డింగ్ ప్లానర్లు తప్పిస్తున్నారు. పెళ్లి బాద్యతలను వెడ్డింగ్ ప్లానర్లకు అప్పగిస్తే పెళ్లి పనులు అన్నీ వారే చూసుకుంటారు. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్లు ప్రస్తుతం బెంగళూరు ఎంతో వేగంగా పెరిగిపోతున్నారు.అన్ని హంగులూ ఉండాలి మరిసాధారణంగా ధనవంతులు తమ కుటుంబంలోని పెళ్లిళ్ల ద్వారా తాము ఎంత శ్రీమంతులమో తెలియజేయాలని అనుకుంటారని, అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్గా పెళ్లిళ్లు జరిగిస్తారని కొందరు ప్లానర్లు తెలిపారు. ఈ గ్రాండియర్, రిచ్నెస్ కోసం భోజనాల దగ్గరి నుంచి అతిథులకు ఇచ్చే గిఫ్ట్ల వరకు రాజీ పడడం లేదు. కొంతమంది శ్రీమంతులు తమ పెళ్లిళ్లలో సెలబ్రెటీలు ఉండాలని కోరుకుంటారని ప్లానర్లు తెలిపారు. పెళ్లిలో సినిమా, టీవీ ప్రముఖ నటీనటులు, మోడల్స్ పాల్గొనేలా చూడమని కోరుతుంటారు. మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 15 లక్షల నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గ్రాండ్గా పెళ్లి జరగాలంటే ఫుల్ ప్యాకేజీ కింద కనీసం కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఎవరూ వెనుకాడకుండా లగ్జరీ పెళ్లిళ్లకు సరే అంటున్నారు.నెలరోజుల్లో రూ.900 కోట్లపైనే వివాహం ఎంతో గ్రాండ్గా జరగాలి... అందరూ మన పెళ్లి కూడా చర్చించుకోవాలి అనే క్రేజ్ కర్ణాటకలో పెరిగిపోతోంది. ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు విచ్చేసి ఘనంగా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరులో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య సుమారు 13 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు ప్లానర్లు తెలిపారు. ఈ సమయంలో డెకరేషన్, సెట్డిజైనర్, షామియానాలు, మేకప్ కళాకారులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యాండ్ సెట్, లైటింగ్, కేటరింగ్, ఆర్కెస్ట్రా, ఆభరణాల కొనుగోలు ఇలా తదితర అంశాల కోసం రూ. 900 కోట్ల మేర లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వెడ్డింగ్ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. ఇక కొందరైతే సముద్ర తీరం, రాజ ప్యాలెస్, అందమైన పరిసరాలు, ఖరీదైన స్టార్ హోటళ్లలో కొద్దిపాటి సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల గడిచిన నెల రోజుల్లో సుమారు 9 డెస్టినేషన్ వెడ్డింగ్లు జరిగాయి. మరో 17 పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ సంఖ్య 10 శాతం పెరిగినట్లు ప్లానర్లు తెలిపారు. -
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
మోగనున్న పెళ్లి బాజాలు
పామర్రు/వత్సవాయి: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలూ గుర్తుండిపోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. మూఢం, ఆషాఢం ముగియడంతో మళ్లీ ముహూర్తాల సందడి మొదలైంది. మార్చి నెల వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగ ఉండటంతో ఆ నెలలో ముహూర్తాలు ఉండవు. మళ్లీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు శుభకార్యాలకు మహూర్తాలు ఉన్నాయి. దీపావళి తర్వాత వద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలతో ఊరూవాడా కళకళలాడనున్నాయి.షాపింగ్ సందడిపట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్లు ప్రారంభించారు. పెళ్లి దుస్తుల కొనుగోలుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. బంగారు ఆభరణాలను తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభ లేఖల ప్రింటింగ్, ప్లెక్సీ ఫ్రింటర్స్, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్, వంట మేస్త్రిలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, భజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడి పడిన ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరుకుతోంది. ఆర్థికంగా స్తోమతు ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తర గతి వారు కూడా తమస్థాయికి తగ్గట్లు పెళ్లి వేడు కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.రాజీ లేకుండా..ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, రిసెన్షన్, పోస్టు వెడ్డింగ్ ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకలను శ్రీమంతులు రాజీ పడకుండా నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. కల్యాణ మండపాలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇటీవల పామర్రులో నిర్మించిన ఓ కళ్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకను సుమారు రూ.25 లక్షలు వెచ్చించి నిర్వహించారు.ఆధునిక సెట్టింగ్లుకల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సెట్టింగ్లు ఏర్పా టుచేస్తున్నారు. కల్యాణ మండపాల్లో రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా అక్కడయితే ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా, ఎవరి స్థాయిలో వారికి రంగుల హరివిల్లులా మండపాలు తీర్చి దిద్దుతున్నారు. వీటికి డిమాండ్ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు.ఫొటోగ్రఫీలో కొత్త పుంతలుముఖ్యంగా పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి నేడు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫొటోలు, వీడియో షూటింగ్లకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇటీవలన పెళ్లిళ్లలో డ్రోన్ కెమెరాలు విరివిగా వాడుతు న్నారు. ఎంత ఎత్తు నుంచి, ఎంత దూరం నుంచి అయినా క్వాలిటీ ఫొటోలు, వీడియో వస్తుండ టంతో డ్రోన్కు మరింత డిమాండ్ ఏర్పడింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ ఘాట్ అని రకరకాలుగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.మంగళవాయిద్యాలకు మంచి గిరాకీహిందూ సంప్రదాయంలో మంగవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పని సరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా ఖర్చుచేస్తున్నారు. పెళ్లిళ్లో భోజనాల సంగతి సరేసరి. కొత్త కొత్త వైరెటీలకు ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. రకరకాల బిరియానీలు, స్వీట్లు, కారా, కూరలు ఉంటాయి. ఎంచుకున్న మెనూ బట్టి ప్లేట్కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వంటలు వడ్డిచ్చే వారికి కూడా డిమాండ్ ఉంది. పెళ్లిళ్లు చేయించే పురోహితులకు డిమాండ్ బాగా ఉంది.శుభ ముహూర్తాలు ఇవీ..అక్టోబర్ (ఆశ్వయుజ మాసం) : 26, 27నవంబర్ (కార్తిక మాసం) : 3, 7, 8, 10, 14, 16, 17, 20, 22, 27, 28డిసెంబర్ (మార్గశిర మాసం) : 4, 5, 6, 7, 8, 11, 12, 14, 15, 19, 20, 21, 26, 27, 28జనవరి (మాఘ మాసం) : 31ఫిబ్రవరి (మాఘ మాసం) : 2, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 26మార్చి (ఫాల్గుణ మాసం) : 2, 6, 9, 12, 15, 16 -
పెళ్లిలో ప్రియురాలి హల్చల్.. పెళ్లికొడుకుపై దాడికి యత్నం
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అంతా ప్రేమ మయం అంటున్న హార్దిక్ పాండ్యా.. ఆ లాకెట్ స్పెషల్ (ఫొటోలు)
-
అనంత్ దంపతులను ఆశీర్వదించిన మోదీ
ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్ సంస్థల అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. ‘శుభ్ ఆశీర్వాద్’ పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు. -
పెళ్లి వేడుకలో కంగనా.. ఫ్యామిలీతో సంతోషంగా.. (ఫోటోలు)
-
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్కు సైతం డిమాండ్ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్తో బ్యాండ్ బాజా బారాత్, షాన్దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్గ్రౌండ్లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలను సీఎం జగన్ ఆశీర్వదించారు. -
తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. -
పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు. -
జోగి రమేష్ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. -
వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వుగా.. ఈ నెలలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. (ఇది చదవండి; మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) కాగా.. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అతిథులు, సన్నిహితుల ఆహ్వానాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపాసన తన ఇన్స్టాలో ప్రస్తావించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈనెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్కి తాకాయి. సీలింగ్కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
గ్రాండ్గా ప్రేతాత్మల పెళ్లి !! నోరూరించే నాన్వెజ్ వంటకాలు..
యశవంతపుర: తుళునాడులో జరిగే విభిన్నమైన పెళ్లి వేడుక ఇది. వధూవరులు ఎవరో కంటికి కనిపించరు. అటు, ఇటు పెళ్లిపెద్దలు చేరి వేడుక జరిపించి ఆశీర్వదిస్తారు. కొత్త జోడీ ఎవరి కంటికి కనిపించకుండా తంతు ముగిసిపోతుంది. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఏటా ఒకసారి ప్రేతాత్మలకు వివాహం చేయడం ప్రజలకు ముఖ్యమైన ఆచారం. కరావళిలో ప్రస్తుతం తుళు మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణించి ఉంటే వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ సంప్రదాయం. తద్వారా మృతులకు పెళ్లి ముచ్చట తీరినట్లుగా భావిస్తారు. బంట్వాళ తాలూకా వగ్గ గ్రామం వధువు కుటుంబం, ఉళ్లాల తాలూకా కోణాజె సమీపంలోని చోళ్మ వరుని కుటుంబంగా ఏర్పడి ప్రేతాత్మలకు పెళ్లి చేశారు. వగ్గ గ్రామానికి చెందిన సంజీవ పూజారి కుతూరు విశాలాక్షి రెండేళ్ల క్రితం మృతి చెందింది. చోళ్మలో లక్ష్మణ కొడుకు ధరణేశ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. వీరిద్దరూ అవివాహితులు కావడంతో ఇరు కుటుంబాలవారు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో నాన్వెజ్ కూడా వండుతారు. చికెన్, మటన్తో పాటు చేపల ఫ్రై కూడా ఉంటుంది. -
స్మశానంలో పెళ్లి బంధువుల ఫీలింగ్ చూడాలి
-
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఇది కూడా చదవండి: సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్ను ఎదుర్కోలేకే: సజ్జల -
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్పై నుంచి జారి.. -
పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్
లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్ హథ్రాస్లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు. The video went #viral while firing pistol bride The bride fired joy at a guest house in Salempur of Thana #Hathras Junction area Bride's video of Harsh firing went viral on #socialmedia The bride is a resident of village Nagla Sekha of Hasayan police stn area.#UttarPradesh pic.twitter.com/neXrJexBik — Siraj Noorani (@sirajnoorani) April 8, 2023 అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు. చదవండి: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి -
వైరల్ వీడియో: అతి చేశారు.. ముఖం కాల్చుకున్న పెళ్లికూతురు
-
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది. కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. -
ఒక్కటికానున్న 220 జంటలు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కార్యకర్తల బలంతోనే..: జనార్దన్రెడ్డి కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా. -
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. అడివి శేష్ తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్
ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. అమర్దీప్ పలు ఓటీటీ సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
పులివెందులలోని రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
-
Pulivendula: వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్లను సీఎం జగన్, భారతీరెడ్డి ఆశీర్వదించారు. వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్నగర్లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్లో ఘనంగా రిసెప్షన్ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం..
సాక్షి, నంద్యాల జిల్లా: బోయరేవులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 24 గంటల్లో పెళ్లికుమారుడు దుర్మరణం చెందడం కలకలం రేపింది. బోయరేవుకు చెందిన శివకుమార్తో జూపాడు బంగ్లా మండలం భాస్కరపురానికి చెందిన మౌనిక అనే యువతితో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో నిన్న(శుక్రవారం) ఘనంగాపెళ్లి జరిగింది. సాయంత్రం బరాత్లో వధూవరులిద్దరూ సంతోషంగా నృత్యాలు కూడా చేశారు. అర్ధరాత్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన వరుడు శివకుమార్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ.. -
Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం
అహ్మదాబాద్: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు. వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్కూ వెళ్తానని ప్రకటించింది. -
అరకులో న్యాయమూర్తి పెళ్లి వేడుక
సాక్షి, పాడేరు (ఏఎస్ఆర్ జిల్లా): గిరిజన సంప్రదాయంలో ఓ పెళ్లి వేడుక. వరుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. వధువు ఆయన శ్రీమతి. చుట్టూ న్యాయమూర్తులు. గిరిజనులే పెళ్లి పెద్దలు. చట్టాలను ఔపోసన పట్టి, వేలాది కేసుల్లో ప్రతిభావవంతమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి, ఆయన శ్రీమతి ఆ గిరిజనుల ముందు సిగ్గుమొగ్గలయ్యారు. గిరిజన సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో మెరిసారు. మరోసారి పెళ్లి పీటలెక్కి ఒద్దికగా కూర్చున్నారు. గిరిజన పూజారులు న్యాయమూర్తి దంపతులకు గిరిజన ఆచారం ప్రకారం మరోసారి వైభవంగా వివాహం చేశారు. అలనాటి వివాహ వేడుకను గురుు తెచ్చుకుంటూ న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టి మురిసిపోయారు. దండలు మార్చుకొని సంబరపడ్డారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పెదలబుడు గ్రామంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, అమితా ఉదయ్ దంపతుల గిరిజన సంప్రదాయ వివాహ వేడుక అలరించింది. ఈ వేడుకలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, సుచితా మిశ్రా దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాహ్, జీబా అమానుల్లాహ్ దంపతులు, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్, నల్సా డైరెక్టర్ పి. శేగల్, పాల్గొన్నారు. వేసవి విడిదిలో భాగంగా జిల్లాలోని అరకు లోయను సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దంపతులు సందర్శించారు. వారితో పాటు జిల్లా న్యాయమూర్తులు రైలు మార్గంలో అరకు లోయ చేరుకున్నారు. వారికి రైల్వే స్టేషన్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తులు పెదలబుడు గ్రామంలోని ఐటీడీఏ ఎకో టూరిజం ప్రాజెక్టు గిరి గ్రామదర్శినిని సందర్శించి గ్రామ దేవతలకు పూజలు చేశారు. -
వివాహ ‘వేడుకంబు’.. జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే
కొవ్వూరు(తూర్పుగోదావరి): శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. నామమాత్రంగానే వివాహాలు చేసుకున్నారు కొందరు. అయితే కోవిడ్ ఆంక్షల సడలింపు, మరోవైపు శుభముహూర్తాలు అధికంగా ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వందలాది జంటలు ఒక్కటవుతున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం ఉంది. చదవండి: ఫస్ట్నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తికమాసాల్లో (ఆగస్టు 23 నుంచి నవంబర్ 27 వరకు శుక్ర మౌఢ్యమి(మూఢం) కావడంతో మరో నాలుగు నెలలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం రానుంది. పెళ్లిళ్లే కాకుండా ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠ మహోత్సవాలు, అన్ని రకాల శుభకార్యాలకు జూన్ 23 వరకు అనువైన మంచి శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్లో ఇప్పటికే 13, 14, 15, 16 తేదీల్లో వేలాది మందికి వివాహాలయ్యాయి. ద్వారకాతిరుమల, అన్నవరం, శ్రీనివాసపురం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వందలాది వివాహాలయ్యాయి. పెళ్లిళ్లపై కరోనా ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలవుతున్నాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లలో నామమాత్రం సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. 2020లో కేవలం 120 పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయి. కోవిడ్ ఆంక్షలకు కొంత మేర సడలింపులు ఇవ్వడం, నిర్దిష్టమైన సంఖ్యలో వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో 2021లో 603 వివాహాలయ్యాయి. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలగించడంతో గడచిన ఐదు రోజుల్లోనే 311 పెళ్లిళ్లయ్యాయి. రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఇక్కడ వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. శుభకార్యాలతో వందల మందికి ఉపాధి పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కల్యాణ మంటపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్ కార్లు, బస్సులు, ఐస్క్రీమ్, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పూలు, డెకరేషన్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది. ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ ముందస్తు బుకింగ్లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని వేలాది మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. రెండేళ్ల నుంచి అంతంతమాత్రంగా శుభ కార్యాలు చేశారు. ఇప్పుడు వరుస ఫంక్షన్లు రావడంతో అన్నీ రకాల వాళ్లకు ఉపాధి చేకూరిందని చెప్పొచ్చు. జూన్ 23 వరకు మంచి ముహూర్తాలు పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠ వంటి శుభకార్యాల నిర్వహణకు జూన్ 23వ తేదీ వరకు మంచి ముహుర్తాలున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30వ తేదీ వరకు ఆషాఢమాసం, ఆగస్టు 23 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు భాద్రపద, ఆశ్వీయుజ, కార్తిక మాసాల్లో శుక్ర మౌఢ్యమి(మూఢం) కారణంగా నాలుగు నెలల పాటు శుభ కార్యాలకు మంచి రోజుల్లేవు. –వారణాసి సీతారామ హనుమంత శర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే.. ఈ నెల 21, 22, 24 తేదీలు మే నెలలో తేదీలు: 3, 4, 12, 14, 18, 20, 21, 22, 25 జూన్లో తేదీలు: 1, 3, 5, 6, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 ఇతర శుభ ముహూర్తాలు మేలో 4 నుంచి 9వ తేదీ వరకు, 11 నుంచి 15 వరకు, తిరిగి 18, 20, 21, 22, 23, 25 తేదీల్లో ఇతర శుభ ముహూర్తాలు ఉన్నాయి. జూన్లో 1 నుంచి ఆరోతేదీ వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు, 13, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీలు ఇతర శుభ ముçహూర్తాలున్నాయి. -
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
కనిగిరి రూరల్: వైఎస్సార్ టీఎఫ్ నాయకుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు శనివారం కనిగిరిలో వైభవంగా జరిగాయి. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో జరిగిన వివాహ రిసప్షన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరై నూతన వధువరులు విష్ణువర్ధన్రెడ్డి, హారితలను ఆశీర్వదించచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఒకే రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జి.బొర్రారెడ్డి, ఎస్కే రహీం, ముల్లంగి శ్రీహరిరెడ్డి, పల్లా మాల కొండ్రాయుడు, మండాది కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి..
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): శ్రీధరఘట్టలో పెళ్లి భోజనం వికటించి 50 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, స్థానికుల వివరాల మేరకు.. మూడు రోజుల క్రితం గ్రామంలో ఓ వివాహం జరిగింది. వివాహంలో బంధుమిత్రులు తిన్న భోజనం వికటించి, వన్నూరుస్వామి, మహేష్, నిరంజన్, పార్వతి, భీమేష్ , నేమకల్లు చాకలి రవి, రామాంజి, హనుమక్క, శ్రీదేవి, మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. చదవండి: శ్రీకాళహస్తి అమ్మాయి జాక్పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం -
పెళ్లి వేడుకలో అపశ్రుతి
కుషినగర్: వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆయన కుమారుడి పెళ్లిలో భాగంగా స్థానికంగా ‘మట్కోర్బా’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. కుష్వాహా ఇంటికి 100 మీటర్ల సమీపంలోని ఒక పాడుబడ్డ బావి దగ్గర ఈ వేడుక కొనసాగుతోంది. ఆ వేడుక చూసేందుకు జనం గుమిగూడారు. మూసేసి ఉన్న ఒక బావి పై మహిళలు, చిన్నారులు కూర్చుని వేడుక చూస్తున్నారు. 70 ఏళ్ల క్రితంనాటి వినియోగంలో లేని పాత బావిపై దాదాపు పదేళ్ల క్రితం వేసిన స్లాబ్ పాడైంది. సామర్థ్యానికి మించి దానిపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దీంతో 23 మంది బావిలో పడిపోయారు. హుటాహుటిన అక్కడి వారు లోపలి వారందరినీ పైకి తేగలిగారు. వారికి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. 10 మంది గాయపడ్డారు. ఈ గ్రామాన్ని ఎంపీ విజయ్ దుబే గతంలో దత్తత తీసుకున్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
పెళ్లి వేడుకలో వింత వేషధారణ
మంగళూరు: పెళ్లి వేడుకలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన ఓ ముస్లిం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులపై కేసు నమోదైంది. బంట్వాల్ తాలూకా కొల్నాడు గ్రామంలో సాలెతూర్కు చెందిన అజీజ్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు బాషిత్ అనే వ్యక్తి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తులునాడు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఆరాధించే కొరగజ్జా అనే దేవుడి మాదిరిగా బాషిత్ తదితరులు దుస్తులు వేసుకుని, ఆ దేవుడిని అవమానించేలా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీనిపై బంట్వాల్ తాలూకా విట్లపడ్నూర్ గ్రామానికి చెందిన చేతన్ ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్!
వివాహం జరిగిన అనంతరం అదేరోజు ఓటు వేసిన వధువరుల జంటలను చూశాం. పెళ్లి జరిగిన తర్వాత పరీక్షలు రాసిన వధువరులకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఓ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరికొన్ని గంటల్లో ఓ నవ వధువు పెళ్లిపీటల మీద కూర్చోవల్సి ఉండగా.. పెళ్లికూతురు అలంకరణతోనే ఎక్జామ్ సెంటర్ వెళ్లి పరీక్ష రాసింది. వివారాల్లోకి వెళ్లితే.. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన శివంగి బగ్తారియా అనే ఓ వధువు కొన్ని గంటల్లో తమ వివాహవేడుక ఉండగా.. అందమైన పెళ్లి దుస్తుల అలంకరణ, మేకప్తో శాంతినికేతన్ కాలేజ్ ఎక్జామ్ సెంటర్కు వెళ్లి తన యూనివర్సిటీ పరీక్షను రాసింది. అయితే ఆమె పెళ్లి వేడుక కంటే తన చదువకు ప్రాధాన్యత ఇస్తూ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన అనంతరం ఆమె నేరుగా వివాహ వేడుక జరిగే చోటుకు చేరుకొని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పరీక్ష రాస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 4 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆ వధువును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘పెళ్లి కంటే పరీక్షకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆమె నిర్ణయం సూపర్’.. ‘చాలా మందికి ఆ వధువు ఆదర్శంగా నిలుస్తుంది’.. ‘వధువు చేసిన పనికి అంతా షాక్ అయి ఉంటారు!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది మాత్రం నెటజన్లు పెదవి విరుస్తున్నారు. ‘వధువు పెళ్లిదుస్తుల్లో వచ్చి పరీక్ష రాయటం ఓ పబ్లిసిటీ స్టంట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లిపీటలపై అరుదైన ఘటన
మండ్య(బెంగళూరు): ఈ ఇంటర్నెట్ యుగంలో మంగళవారం ఒక పెళ్లివేడుకలో వధూవరులు పుస్తకావిష్కరణ గావించి సాహిత్యానికి పెద్దపీట వేసిన అరుదైన ఘటన మండ్యలో చోటు చేసుకుంది. సాహితీవేత్త త.నా.శి. జగన్నాథ్ రచించిన పుస్తకాన్ని నూతన జంట వినుత– సంతోష్లు ఆవిష్కరించి అతిథులకు కానుకగా అందజేశారు. మరో ఘటనలో.. పర్యావరణ రక్షణపై సమీక్ష హోసూరు: పర్యావరణ పరిరక్షణపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖాధికార్లతో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ జయచంద్రభానురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శుద్ధీకరించిన తాగునీటి వినియోగం, పరిశ్రమల్లో కాలుష్య నివారణ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, వర్షపునీరు నిల్వ ప్రాంతాల పరిరక్షణ వంటి విషయాలపై వివిద శాఖాధికార్లతో చర్చించారు. హోసూరు ఆర్డీవో తేన్మోళి, అధికారులు సెంథిల్ కుమార్, పరమశివం, వేడియప్పన్, మరియ సుందరం పాల్గొన్నారు. చదవండి: గ్రామంలో నాగుపాము కలకలం -
వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు..
చట్ట ప్రకారం వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా నేరం. 1961, మే 1న మన దేశంలో అధికారికంగా నిషేధించినా.. ఈ చట్టం కేవలం పేపర్ల వరకే పరిమితం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. నేటికీ వరకట్న ఆచారం యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ డబ్బు, బంగారం, వాహనాలు, పొలాలు, స్థలాలు రూపంలో పద్ధతులు, ఆచారాల పేరిట మగ పెళ్లివారికి సమర్పించుకోవడం రివాజుగా ఉంది. ఐతే ఈ గ్రామంలో పెళ్లిల్లకు డబ్బు, బంగారాభరణాలతోపాటు 21 అత్యంత విషపూరితమైన పాములను కూడా భరణంగా ఇస్తారట. వింతగా అనిపించినా దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఆదేమిటో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్లోని గౌరియా తెగవారు ఈ వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా అనుసరిస్తున్నారు. కూతురికి వివాహం చేస్తే అల్లుడికి విషపూరితమైన 21 పాములను కట్నంగా ఇస్తారట. ఈ విధంగా కట్నం సమర్పించుకోకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులౌతుందని వారి నమ్మకం. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! అంతేకాదు, ఈ తెగ జీవనోపాధికూడా పాములను పట్టడమేనట. పట్టిన పాములను జనాల ముందు ఆడించటం ద్వారా డబ్బు సంపాదిస్తారట. కట్నంగా వచ్చిన పాముల ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆడపిల్ల తండ్రి తన అల్లుడికి పాములను కట్నంగా ఇస్తాడు. అందుకే ఆడపెళ్లివారు మగపెళ్లివారికి కట్నంగా 21 పాములను ఇచ్చుకుంటారు. కట్నంగా తీసుకున్న పాములను కఠిన నియమాలతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకవేళ భద్రపరచిన బాక్సులో పాము మరణిస్తే దాన్ని అశుభంగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటారట కూడా. వింత జనాలు.. వింత ఆచారాలని అనుకుంటున్నారా!! దేశ మూలమూలల్లో ఇంకెలాంటి వింత కట్నాలు, భరణాలు ఆచరణలో ఉన్నాయో.. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు!!
నిజామాబాద్ కల్చరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి షురూ కానుంది. శ్రావణ మాసం ప్రారంభమవడంతో పాటు శుభకార్యాల నిర్వహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, శ్రావణమాసం కావడంతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా ఏడాదిన్నరగా కరోనా వల్ల అన్నిరంగాలు ఇబ్బందులకు గురయ్యాయి. అనేక వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడనున్నాయి. శుభకరం శ్రావణం.. శివకేశవులకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతియేటా ఈ మాసంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈనెల 9 నుంచి శ్రావణం ఆరంభమైంది. పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు వారి తల్లిదండ్రులు వివాహాలు చేసేందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు. ఇన్నాళ్లు ము హూర్తాలు లేక వేచిచూశారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి. చేతినిండా పని.. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, సత్రాలు, గదులు ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పటికే వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగా రం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. శుభ ముహూర్త తేదీలు.. ఈనెలలో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్ 1వ తేదీ ముహూర్తాలు ఉన్నాయి. వీటిల్లో 14వ తేదీ స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహుర్తాలు ఉండటంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు అభిప్రాయపడుతున్నారు. బాధ్రపద మాసంలో సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 5వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు చేయరు. తిరిగి అక్టోబర్ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్ (మార్గశిరమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. వివాహాలకు మంచి రోజులు ఈనెల 27వ తేదీ వరకు పలు తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. కరోనాతో రెండేళ్లుగా శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్ల్లో ముహూర్తాలున్నాయి. – మురళీకృష్ణ మాచార్యులు, రామాలయ పూజారి, సుభాష్నగర్ -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి చేరుకున్నారు. అక్కడ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిలరెడ్డి, గౌతమ్రెడ్డిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
వరుడికి కోలుకోలేని షాకిచ్చిన వధువు: ఇంతకీ ఏం జరిగిందంటే!
లక్నో: హిందూ వివాహ పద్ధతిలో సప్త పదికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాణి గ్రహణం తర్వాత, వధూవరులు హోమగుండం చుట్టు ప్రదక్షిణలు చేసి, ఏడడుగులు నడుస్తారు. ఆ సమయంలో చదివే మంత్రాలు, వరుడి సంకల్పాన్ని దేవతలకు ఏడు వాక్యాలలో తెలియజేస్తాయని ప్రతీతి. అలాంటి పవిత్ర కార్యం జరుగుతున్న సమయంలో ఓ పెళ్లికూతురు వరుడికి కోలుకోలేని షాకిచ్చింది. ఆరడుగులు అతడితో కలిసి నడిచిన తర్వాత.. ఈ పెళ్లిని ఆపేయాలంటూ అక్కడున్న పెద్దలను కోరింది. దీంతో.. పెళ్లికొడుకు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతవరకు సంతోషంగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా గంభీరంగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబాలో గల కుల్పహడ్ తహసీల్లో చోటుచేసుకుంది. కాసేపట్లో శ్రీమతిగా మారాల్సిన వధువు.. తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అత్యవసరంగా అర్ధరాత్రి పంచాయతీ పెద్దలు పెళ్లివేదిక వద్దకు వచ్చి ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. కాసేపు చర్చలు జరిగిన తర్వాత వధువు పెళ్లి ఆపేయాలన్న తన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పడంతో వరుడు, అతడి బంధువులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ.. పెళ్లి కుమార్తెకు వరుడు నచ్చలేదట. పెద్దల కోసం అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా మనసు అందుకు అంగీకరించకపోవడంతో... చివరి నిమిషంలో.. ‘‘ఆపండి’’ అన్న ఒక్క డైలాగ్తో జీవితకాల నిర్బంధం నుంచి తప్పించుకుందట. ఈ విషయంపై స్పందించిన వరుడి తండ్రి మాట్లాడుతూ... ఒకవేళ అమ్మాయికి పెళ్లి ఇష్టంలేకపోతే ముందే చెప్పాలి కానీ.. ఇంతదాకా వచ్చాకా ఆపడం ఏంటని మండిపడ్డారు. కాగా పెళ్లికొడుకు గుట్కా నములుతున్నాడని, కళ్లద్దాలు లేకుండా పేపర్ చదవలేకపోతున్నాడని, మద్యం సేవించి మండపానికి వచ్చాడన్న కారణాలతో పలువురు వధువులు మండపంలోనే పెళ్లిళ్లు ఆపేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ‘‘ఇప్పటికైనా యువతులు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ, ముందుకు సాగడం సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యువతుల్లో చైతన్యం రావడం హర్షించదగ్గ పరిణామమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సప్తపది ఎందుకు? వధువు మొదటి అడుగుతో అన్నం, రెండో అడుగు వల్ల బలం, మూడో అడుగు వలన కర్మ, నాల్గవ అడుగుతో సుఖసంతోషాలు, ఐదో అడుగువలన పశుసంపద, ఆరో అడుగు వలన ఋతుసంపద, ఏడో అడుగు వలన సత్సంతానం కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత.. గృహస్థాశ్రమ ధర్మాలలో మీకు అర్ధ శరీరమై, వెన్నంటే ఉండి అన్ని బాధ్యతలు నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఆ తర్వాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి ఆమె అంగీకారాన్ని పొందుతాడు. అలా వారిద్దరి మధ్యన ఏర్పడిన బంధం ఏడు జన్మల వరకు నిలవాలని కోరుకోవడమే సప్తపది అని పెద్దలు చెప్పిన మాట. చదవండి: 18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై దారుణం: నవవధువుపై భర్త,మరుదుల సామూహిక లైంగిక దాడి -
వధువుకు వింత బహుమతులు.. వరుడుని ఉతకడానికేనా?
న్యూఢిల్లీ: ఈ మధ్య పెళ్లిలో జరిగే నాటకీయ దృశ్యాలు సీరియల్స్ని మించి ఉంటున్నాయి. ఇక స్నేహితులు ఇచ్చే వింత బహుమతులు బంధువులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో వధువుకి ఇచ్చిన వింత బహుమతుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అప్పడాల కర్ర (రోలింగ్ పిన్), చిమాటా (టాంగ్స్) వంటి వంటగదికి సంబంధించిన వస్తువులను కొంత మంది స్నేహితులు వధువుకు బహుమతిగా అందజేశారు. అయితే ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘స్నేహితులు కొత్త సంసారం ముందుకు సాగడానికి ఈ వస్తువులన్నింటినీ బహుమతిగా ఇచ్చారా లేదా వరుడుని ఉతకడానికా..’’ అంటూ చమత్కరించాడు. (చదవండి: వైరల్: స్ప్రింటర్లను మించి కెమెరామెన్ పరుగో పరుగు..) (చదవండి: ముంబైని ముంచెత్తిన వర్షాలు) -
అప్పగింతల్లో కూతురిని చెప్పుతో కొట్టిన తండ్రి.. ఫన్నీవీడియో..
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తు. ఈ వివాహ కార్యక్రమంలోని ప్రతి వేడుకను వధూవరులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అయితే, పెళ్లి తంతు జరిగే వరకు ఎంతో ఆనందంగా ఉండే వధువు అప్పగింతలు వచ్చేసరికి మాత్రం కన్నీటి పర్యంతమవుతుంది. తనవాళ్లను వదిలి వెళ్లలేక తెగ ఇబ్బంది పడిపోతుంటుంది. వధువుతో పాటు చుట్టుపక్కల వారుకూడా ఆ సమయంలో కన్నీరు పెట్టుకుంటారు. అయితే, ఇక్కడ జరిగిన ఓ అప్పగింతల కార్యక్రమంలో ఒక తండ్రి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. పెళ్లి జరిగిన అనంతరం ఓ వధువు తన తండ్రిని వదిలి వెళ్లలేక తెగ ఏడుస్తోంది. కాస్త దూరం వెళ్తుందో లేదో.. తిరిగి వచ్చి తండ్రిని హత్తుకుని మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కొంత దూరం పోగానే.. మళ్లి పరుగెత్తుకు వచ్చి హత్తుకుని బాధపడుతుంది. పదే పదే ఇలాగే చేయడంతో విసిగిపోయిన తండ్రి కోపంతో కూతురిని చెప్పుతో కొట్టి అక్కడి నుంచి సాగనంపాడు. అయితే, ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈసంఘటన గతంలో జరిగిందే.. తిరిగి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి అప్పగింతలు ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. -
తులసి వరమాల
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక నెట్టింట వైరల్ అవుతోంది. కారణం వీరీ పెళ్లిలో తులసిమొక్కలు ప్రధాన పాత్ర పోషించడమే. విషయమేమింటే.. ఆదిత్య అగర్వాల్, మాధురి బలోడి స్కూల్ ఏజ్ నుంచి స్నేహితులు. చదువులు పూర్తయ్యాక పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, తమ మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా పర్యావరణం పట్ల ప్రేమనూ చాటుకోవాలనుకున్నారు. రెండు కుటుంబాలవారూ ధనవంతులే అయినప్పటికీ ఇరు కుటుంబాల నుంచీ పెళ్లి ఖర్చునూ తగ్గించాలని ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆలోచించుకొని అన్నింటా ఖర్చును తగ్గిస్తూ వచ్చారు. తులసిమొక్కని తమ పెళ్లికి పెద్దగా నిర్ణయించారు. ఊరేగింపులో మొక్కలు వరుడు తన స్నేహితులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చే ముందు జరిగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గుర్రం లేదా కారులో కాకుండా వరుడు ఎలక్ట్రిక్ సైకిల్ మీద మండపానికి చేరుకున్నాడు. పూల దండలకు బదులుగా వధూవరులు తులసి మాలలు మార్చుకున్నారు. వధూవరుల దుస్తులు రూ.6000కు మించకుండా జాగ్రత్తపడ్డారు. పెళ్లి మండపం అలంకరణ అంతా పర్యావరణ అనుకూలమైన వాటితో తీర్చిదిద్దారు. ఈ వివాహంలో అతిథులకు బహుమతులకు బదులుగా మొక్కలు అందించారు. ఇలా తమ పెళ్లి ద్వారా పర్యావరణం పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. ‘మా పెళ్లికి కార్డులు కూడా ముద్రించలేదు. ఇ–ఆహ్వానాలనే డిజైన్ చేసి, పంపించాం. వేదిక ముందు ప్రింటెడ్ బ్యానర్ కు బదులుగా చాక్పీస్తో రాసిన బోర్డును ఏర్పాటు చేశాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి మా రెండు కుటుంబాలు మద్దతు తెలపడం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు వధూవరులు. ప్లాస్టిక్ వాడకం లేని ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లిని నెటిజన్లు విపరీతంగా ప్రశంసిస్తున్నారు. వివాహంతో ఒక్కటయ్యే జంటలు ఇలాంటి వివాహ పద్ధతులను అవలంబించాలని కొందరు, ఇదొక సృజనాత్మక మార్గం అని మరికొందరు కొనియాడుతున్నారు. పర్యావరణ అనుకూలమైన బైక్లపై ఊరేగింపుగా వివాహ వేదికకు చేరుకుంటున్న వరుడు, అతడి స్నేహితులు. -
ఎన్నో పెళ్లిల్లు చూశాం.. కానీ ఈ పెళ్లి ఎప్పుడైనా చూశారా!
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు.. అంతేనా.. ఇంకా చాలా.. వెడ్డింగ్ ప్లానర్లు.. డెస్టినేషన్ వెడ్డింగులు.. ఇలాంటివి కొన్ని విన్నాం.. కొన్ని చూశాం కూడా.. మరి.. ఢిల్లీలో జరిగిన ఆదిత్య–మాధురీల పెళ్లి గురించి విన్నారా? ఎలా జరిగిందో చూశారా? వీరు చాలా వినూత్నంగా చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ పెళ్లి గురించి జాతీయ పత్రికలు సైతం రాశాయి.. ఎందుకంటే.. అందరిలా ఆదిత్య అగర్వాల్(32) పెళ్లి మండపానికి భారీ బారాత్తో గుర్రమెక్కి రాలేదు.. తనే కాదు.. అతని ఫ్రెండ్స్ కూడా ఇదిగో ఇలా చిన్నపాటి ఎలక్ట్రిక్ బైక్ల మీద వచ్చారు.. అది కూడా రెంట్కు తీసుకుని.. ఇక మాధురి బంధువుల ఇంట్లోనే పెళ్లి వేదిక ఏర్పాటు చేశారు. బయట పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టలేదు.. స్కూళ్లో వాడే బ్లాక్బోర్డుపై చాక్పీసుతో ఆదిత్య వెడ్స్ మాధురి అని రాశారు. ఎక్కడా ప్లాస్టిక్ అన్నది వాడకుండా.. మండపం డెకరేషన్ కూడా పాత సీసాలు, వార్తాపత్రికలతో చేసేశారు.. భారీ దండలకు బదులు తులసిమాలలు వేసుకున్నారు. అది కూడా ఎందుకో తెలుసా? ఎండిపోయిన తర్వా త టీ పౌడర్లా వాడుకోవడానికట! ఇక కట్నం సంగతి.. రెండు కుటుంబాల వాళ్లు ఒక కిలో పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అదే కట్నం!! శుభలేఖలు ముద్రించనేలేదు.. అంతా ఆన్లైన్ పిలుపులే. వచ్చినోళ్లు కూడా ఎకోఫ్రెండ్లీ బహుమతులు ఇవ్వగా.. వాటిని కూడా కాగితంలో చుట్టి తెచ్చారట. ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లి ఐడియా మాధురీదే.. తన తల్లి రీసైక్లింగ్కు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నారట.. దాంతో అదే స్ఫూర్తితో కేవలం రూ.2 లక్షల ఖర్చుతో మొత్తం పెళ్లి కానిచ్చేశారు. -
పెళ్లికి అతిథులుగా వెళ్లి కేసుల్లో ఇరుక్కున్నారు
థానే: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో పాటు చాలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా 50 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కానీ ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ థానే జిల్లాలోని కల్యాణ్లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్ డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పెళ్లి మార్చి 10న జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని తెలియగానే కేడీఎంసీ అధికారులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారని, అప్పుడు అక్కడ 700 మంది వరకు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పెళ్లికి హాజరైనవారు మాస్కులు ధరించలేదని, భౌతికదూరం సహా ఎలాంటి కోవిడ్–19 నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. దీంతో పెళ్లి జరిపించిన రాజేశ్ మాత్రే, మహేశ్ రావూత్లపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే గత పది రోజుల్లో కరోనా నిబంధనలు పాటించని 1,131 మంది నుంచి రూ.5,64,900 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) -
అలా.. రామ్తో పరిచయం ఏర్పడింది: సునీత
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఇక భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న సునీత.. తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చారు. రామ్తో కలిసి నూతన జీవితం ప్రారంభిచడం తన అదృష్టం అన్నారు. ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ.. రామ్తో తన పరిచయం.. పెళ్లి గురించి చెప్పినప్పుడు పిల్లల స్పందన వంటి తదితర విషయాలను వెల్లడించారు సునీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి తను నా సోషల్ మీడియా అకౌంట్స్ని చూసుకునే వాడు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆ స్నేహం మరింత బలపడింది. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. దీని గురించి ఇరు కుటుంబాలతో మాట్లాడి.. వారి అంగీకారం తర్వాతే పెళ్లి చేసుకున్నాం’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) నా నిర్ణయంతో పిల్లలు ఇబ్బంది పడకూడదు ‘రామ్తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు పిల్లలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాలతో వారు ఇబ్బందిపడకూడదు. అలానే జీవిత భాగస్వామి ఉండటం కూడా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచేవారు.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. ఇక నా తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెద్దవారయ్యారు.. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకునే పరిణీతి వారిలో ఉంది. ఇక రామ్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం ఎంతో అదృష్టం. ఇక నా కుటుంబం కూడా నాకు ఎల్లప్పుడు మద్దతుగా నిలబడింది’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్?) ఆ తర్వాతే హనీమూన్కి వెళ్తాం.. ‘ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి. అతిథుల జాబితా 200కు చేరింది. ఇక రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఎందుకంటే మేం కలవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకే వారందరి కోసం రానున్న రోజుల్లో చిన్న చిన్న పార్టీలు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ ముగిశాక హనీమూన్ గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇద్దరం ఎక్కడికైనా వెళ్తాం’ అంటూ చెప్పుకొచ్చారు సునీత. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్
తల్లి పెళ్లి వేడుకలో పిల్లల సందడి. తన జీవితంలోని మధుర జ్ఞాపకంలో అడుగడుగునా వారి భాగస్వామ్యం. పెళ్లిపందిరిలో.. తమను పెంచి పెద్దచేసిన అమ్మను అట్టిపెట్టుకునే ఉన్నారు... ఉంగరాల ఆటలో ఆమె గెలుపును ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న మాతృమూర్తికి తోడు దొరికినందుకు వారి కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రముఖ గాయని సునీత వివాహంలో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానన్న సంతోషం కంటే.. పిల్లలు అందుకు అండగా నిలిచినందుకే బహుశా ఆమె ఎక్కువగా ఆనందించి ఉంటారు. ఏదైతేనేమీ ఎన్నో ఒడిదొడుకుల అనంతరం ఆమె.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జనవరి 9న ఏడడుగులు నడిచారు. శంషాబాద్లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక) ఇక అప్పటి నుంచి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ పెళ్లి.. అందునా ఇద్దరికి రెండో వివాహం. ఇంకేముంది నెటిజన్లకు కావాల్సినంత చర్చ. సునీత నిర్ణయాన్ని స్వాగతిస్తూ భర్తతో ఆమెకున్న అనుబంధాన్ని, అందుకు పిల్లలు ఆనందిస్తున్న తీరు చూసి చాలా మంది అభినందనల అక్షింతలు జల్లుతుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘‘పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని, తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఛస్! అయ్.. అసలు ఏంటిది? ‘‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!’’ అంటూ ఫేస్బుక్ వేదికగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. -
ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక
సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్త రామ్ వీరపనేని, టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీతల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. కాగా.. సునీత, రామ్లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వయస్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భర్తతో విభేదాల నేపథ్యంలో డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సునీత మెహందీ ఫోటోలను, ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో మొహానికి పసుపు రాసుకొని కనిపించారు. తన కుమారుడు ఆకాష్, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: (సింగర్ సునీత మెహందీ ఫంక్షన్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆన్లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!
ఒకప్పుడు పెళ్లిళ్లంటే కొబ్బరాకులతో ఇంటి ముందు పందిరి.. అరిటాకుల్లో బంతి భోజనాలు.. అంతా కలిసి ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టే దృశ్యాలు.. వివాహ తంతు ముగిశాక బ్యాండ్ బాజాలతో ఊరేగింపులు గుర్తుకు వచ్చేవి.. అయితే కాలక్రమేణా పెళ్లి వేదిక ఫంక్షన్హాళ్లకు మారింది. ఇక సంపన్నులైతే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట సుదూర ప్రాంతాలకు బంధు గణాన్ని తరలించి అత్యంత వైభవోపేతంగా వివాహాలు జరిపించే పోకడలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం కోవిడ్ కారణంగా సుముహుర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేక అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక లాక్డౌన్ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్లైన్లో వివాహ తంతు కానిచ్చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. వీడియోకాల్లో ఆశీస్సులు ఓకే.. మరి భోజనం సంగతి ఎలా? శుభమస్తు అని దీవించిన బంధువర్గానికి విందు భోజనం పెట్టేదెలా? కల్యాణ సాపాడు పెట్టడం కనీస మర్యాద కదా! అదే పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆలోచనలే వెంటాడాయి ఓ తమిళ కుటుంబాన్ని! అందులో పెద్దగా ఆలోచించాల్సి ఏముంది.. ఏ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థనో ఆశ్రయిస్తో సరిపోతుంది కదా అంటారేమో! అదీ నిజమే.. అయితే వాళ్లు డిజిటల్ అతిథులను కేవలం సాదా సీదా భోజనంతో సరిపెట్టేయాలనుకోలేదు. (చదవండి: అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!) అందుకే ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు. మ్యారేజ్ వెబ్కాస్ట్ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లిభోజనం చేస్తూ కంప్యూటర్ల ముందుకు కూర్చుని వధూవరులను ఆశీర్వదించమని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్ ఇందుకు సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డిసెంబరు 10న వివాహ బంధంతో ఒక్కటైన శివప్రకాశ్, మహతి జంటకు నెటిజన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
మెగా పెళ్ళి సందడి
కొణిదెల వారింటి గారాలపట్టి, సినీ నటి నిహారిక వివాహం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు చూడచక్కని జంట అనిపించుకున్నారు. బంగారు వర్ణపు చీరలో నిహారిక మెరిసిపోయింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉదయ్విలాస్ ప్యాలెస్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మిస్ యూ... నిహా తల్లీ... నటుడు నాగబాబు, తన కుమార్తె నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ఫొటోను షేర్ చేసి, ‘‘నా చిన్నారి స్కూల్కి వెళ్లే వయసులో అడుగుపెట్టినప్పుడు ఇక తనతో రోజంతా ఆడుకోలేమనే ఫీలింగ్ వెంటాడేది. ఆ ఫీలింగ్ను దూరం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నా కూతురు తొలిరోజు పాఠశాలకు (పెళ్లిని ఉద్దేశించి) వెళుతున్నట్లుగా ఉంది. అయితే తను సాయంత్రం తిరిగి రాదు. ఇప్పుడు ఈ ఫీలింగ్ను పోగొట్టుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి. కాలమే నిర్ణయిస్తుంది. ఆల్రెడీ నిన్ను మిస్సవుతున్నాను నిహా తల్లీ’’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వివాహ మహోత్సవంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సుముహూర్త సమయంలో... కన్యాదాన వేళ... శుభలగ్న వేళ..., వధూవరుల పూజా సమయం... -
ఫ్యామిలీలోకి వెల్కమ్ రీతూ: కంగనా
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం రాజస్తాన్లో ఉన్నారు. ఉదయ్పూర్లో ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ డెస్టినేషన్ వెడ్డింగ్ను కంగనా దగ్గరుండి జరిపిస్తున్నారు. గురువారం అక్షత్, రీతూ వివాహం బంధంతో ఒకటయ్యారు. కంగనా, ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ చద్దేలి, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సోదరుడికి ట్విటర్ వేదికగా కంగనా శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ నూతన దంపతులైన అక్షత్, రీతూలను ఆశీర్వదించాలని, వారి జీవితంలోని ఈ కొత్త జీవితం గొప్పగా ఉండాలని దీవించాలని కోరారు. మెహెందీ ఫంక్షన్, సంగీత్, ఇలా పెళ్లి వేడకకు చెందిన అన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. చదవండి: ‘జో బైడెన్ ఏడాదికి మించి ఉండరు’ Welcome to our family Ritu .... 🌹 pic.twitter.com/yvNCHCuTx5 — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Dear friends, bless my brother Aksht and his new bride Ritu, hope they find great companionship in this new phase of their lives 🌹 pic.twitter.com/50gECg5TOy — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Bhai ki shaadi 🌹 pic.twitter.com/SJGf3mKQWf — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Yes it’s a big day for our family but just got to know ki #arnabisback So here we go ... Welcome back dear friend ... pic.twitter.com/TYPPVHQsCz — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Bhai ki shaadi ❤️ pic.twitter.com/EFCDp9PyEV — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Little galaxy on my bholu’s hand is by me ❤️❤️❤️ pic.twitter.com/56Clt1zssL — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Pre festivities of Aksht’s wedding 🤎 pic.twitter.com/lgnm67oX2g — Kangana Ranaut (@KanganaTeam) November 10, 2020 -
హనీమూన్ వాయిదా వేసుకున్న కాజల్..
ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ముంబైలోని ఓ హోటల్లో శుక్రవారం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేశారు. కోవిడ్ నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్గా జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ‘చందమామ’కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్తో జీవితాంత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొననున్నారు. చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్ లీడ్లో కాజల్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో కాజల్ మరో 15 రోజుల్లో తిరిగి జాయిన్ కానున్నారు. ఇదిలా ఉండగా కాజల్ హనీమూన్ టాపిక్ తాజాగా తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పట్లో కాజల్-గౌతమ్ హనీమూన్కు వెళ్లలనే ఆసక్తి లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆచార్య షూటింగ్గే కారణం అట. ఈ సినిమా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం హనీమూన్ ట్రిప్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. షూటింగ్కు ప్యాకప్ చెప్పిన తర్వాత డిసెంబర్లో హనీమూన్కు ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కాజల్ ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ ’ఇండియన్ 2’, మంచు విష్ణుతో కలిసి ‘మొసగాళ్లు’లో కనిపించనున్నారు. చదవండి: మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి -
వేడుకల వేళ... ఆనందాల హేల
కుమారి కాజల్ అగర్వాల్ శ్రీమతి కాజల్ అవుతున్న రోజు రానే వచ్చింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో నేడు కాజల్ వివాహం జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో ముంబైలో వివాహ వేడుక ప్లాన్ చేశారు. గౌతమ్ కిచ్లుతో తన వివాహం కుదిరినట్లు అక్టోబర్ 6న కాజల్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయ్యారు. పెళ్లి కాగానే కొత్తింట్లోకి మారబోతున్నారు కాజల్, గౌతమ్. పెళ్లి షాపింగ్, ఆ ఇంటి పనులు చూసుకుంటూ, వేడుకలు చేసుకుంటూ ఈ జంట బిజీ బిజీగా గడిపారు. వారం రోజులుగా కాజల్, గౌతమ్ ఇంట్లో పెళ్లికి ముందు జరిగే వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకల గురించి తెలుసుకుందాం. కాజల్, గౌతమ్ కిచ్లు నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో కొన్ని రొజుల క్రితం జరిగింది. ఆ తర్వాత కాజల్ తన చెల్లెలు నిషా, స్నేహితులతో కలిసి బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నారు. గౌతమ్ కిచ్లుతో కలిసి ఇటీవల దసరా పండగ జరుపుకున్నారు కాజల్. ‘‘రెండు రోజుల్లో మిసెస్ కాబోయే ముందు ‘మిస్’గా ఉన్నప్పుడు జరుపుకున్న ‘పైజామా పార్టీ’’ అంటూ తన చెల్లెలు నిషా, ఆమె కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు కాజల్. గురువారం మెహందీ ఫంక్షన్ తాలూకు ఫొటోను పంచుకున్నారు. అదే రోజున ‘హల్దీ’ ఫంక్షన్ కూడా జరిగింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురిని చేస్తారనే సంగతి తెలిసిందే. కాజల్ని కూడా గురువారం పెళ్లి కూతుర్ని చేశారు. ఆట పాటలతో.. సంగీత్ లేని పెళ్లి వేడుకలు చాలా అరుదు. పెళ్లి రోజునే సంగీత్ని ప్లాన్ చేశారు. ‘‘పెళ్లి వేడుకలన్నీ తక్కువమంది సమక్షంలో అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాం. పెళ్లి రోజునే సంగీత్ ప్లాన్ చేశాం. ఆటపాటల హంగామా తప్పనిసరిగా ఉంటుంది’’ అని కాజల్ చెల్లెలు నిషా పేర్కొన్నారు. నటనకు దూరం కావడంలేదు ‘‘కొన్నేళ్లుగా నా మీద ఎంతో అభిమానం చూపించారు. ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ప్రకటించినప్పుడు కాజల్ పేర్కొన్నారు. ‘‘మీ కొత్త ప్రయాణానికి మా శుభాకాంక్షలు’’ అని అభిమానులు పేర్కొన్నారు. తమ అభిమాన కథానాయిక పెళ్లి చేసుకోవడం అభిమానులు ఆనందపడే విషయం. అలాగే పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం కావాలనుకోవడంలేదు. ఇది అభిమానులకు రెండింతలు ఆనందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా
తిరువనంతపురం: కరోనా విలయానికి పెళ్లిళ్లు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి వైరస్ను అంటించుకుంటూ పచ్చని పందిళ్లను కరోనా హాట్స్పాట్లుగా మార్చేస్తున్నారు. ఎంతటి శుభకార్యమైనా 50 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రభుత్వాలు హెచ్చరించినా కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా వైరస్ బారిన పడుతూ అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేరళలోని కేసర్గాడ్ జిల్లా పిలంకట్టలో జూలై 17న ఓ వివాహ మహోత్సవం 125 మంది అతిథుల సమక్షంలో జరిగింది.(పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..) అయితే ఈ మధ్యే వధువు తండ్రికి కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ పెళ్లికి హాజరైనవారందరికీ పరీక్షలు జరపగా 43 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో నూతన వధూవరులు కూడా ఉండటం గమనార్హం. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది బంధుగణం మధ్య వివాహం జరుపుకున్నందుకు గానూ పోలీసులు పెళ్లికూతురు తండ్రిపై కేసు నమోదు చేశారు. విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ అయితే వారికి రెండేళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. (ఆ ఇద్దరు... దయ చూపిన స్త్రీలు) -
పెళ్లి కొడుకు నితిన్కు అద్భుతమైన బహుమతి!
టాలీవుడ్ హీరో నితిన్, షాలినిల వివాహ వేడుకలు హైదరాబాద్లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్నుమా హోటల్లో అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఈనేపథ్యంలో నవ వరుడు నితిన్కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజ్ ఫలక్నుమా హోటల్కు శుక్రవారం చేరుకుని నితిన్ని ఆశీర్వదించారు. ఆయన వెంట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) ఉన్నారు. దీంతో పవన్ రాకతో అతని వీరాభిమాని నితిన్ ఆనందంలో మునిగిపోయారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా వచ్చిన పవర్ స్టార్, త్రివ్రిక్రమ్, చినబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెళ్లి కొడుకు ఫంక్షన్కు హాజరై విషెస్ తెలిపిన ముగ్గురు అతిథులకు చాలా చాలా థాంక్స్’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఇక ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరుగనున్న ఈ పెళ్లి వేడుకలో ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కాగా అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొననున్నారు. (మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్కడ ఐదు నిమిషాల్లో పెళ్లి చేస్తారు
బ్రెసీలియా: వివాహం అంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే వేడుక. దాని కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు.. ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పటి వరకు మనం డెస్టినేషన్ వెడ్డింగ్, గాల్లో, నీటిలో జరిగిన వివాహ వేడుకలను చూశాం. కానీ బ్రెజిల్కు చెందిన జోవా బ్లాంక్, ఎరికా బ్లాంక్ మాత్రం వినూత్నంగా వివాహం చేసుకున్నారు. అదే ‘డ్రై థ్రూ’ వివాహా వేడుక. ఈ నయా ట్రెండ్ బ్రెజిల్లో ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది. ఈ వేడుక ఐదు నిమిషాల పాటు జరుగుతుంది. కార్లో వచ్చిన జంటలు తమ ప్రమాణాలను చదివి, ఉంగరాలను మార్పిడి చేసుకుంటారు. తర్వాత మాస్క్ మీదుగానే ముద్దు పెట్టుకుంటారు. దాంతో వారి వివాహం పూర్తయినట్లే. వెంటనే అధికారులు వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత ఆ కారు వెళ్లి పోతుంది. మరో కారు మరో జంటతో వస్తుంది. ఈ సందర్భంగా ఎరికా మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవాలని వారం క్రితం అనుకున్నాము. ఈ డ్రైవ్ థ్రూ వివాహ వేడుక గురించి తెలుసుకున్నాము. ఈ పద్దతి మాకు చాలా నచ్చింది. కొత్త పద్దతిలో వివాహం చేసుకోవడం చాలా బాగుంది. సంతోషంగా కూడా ఉంది అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి బ్రెజిల్ హాట్స్పాట్గా మారిన సంగతి తెలిసిందే. కోవిడ్ కట్టడి కోసం ప్రస్తుతం అక్కడ లాక్డౌన్ అమలవుతోంది. దాంతో ఆ దేశ యువత ఈ డ్రైవ్ థ్రూ వివాహ వేడుకవైపు ఆకర్షితులవుతున్నారు. కొన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా వివాహ వేడుకలు జరుగుతుండగా..మరికొన్ని చోట్ల ఇలా ‘డ్రైవ్ థ్రూ’ పద్దతిలో వివాహాలు జరుగుతున్నాయి.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) -
చిరకాల మిత్రుడిని పెళ్లాడిన దర్శకురాలు
పుదుచ్చేరి: కన్నడ సినిమా దర్శకురాలు, నిర్మాత సుమన కిత్తూరు వివాహం చేసుకున్నారు. చిరకాల మిత్రుడైన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ను పుదుచ్చేరిలో మనువాడారు. గత కొంత కాలంగా సుమన పుదుచ్చేరిలోనే నివాసముంటున్నారు. షిమోగాలోని ఓ దేవాలయంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటైనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం శాశ్వతంగా ఈ జంట బెంగళూరుకు మకాం మార్చనున్నారు. (లాక్డౌన్ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి! ) అయితే వీరి వివాహం ఏప్రిల్ 17 నే జరిగినట్లు సమాచారం. కాగా ఆదివారం(మే 24) పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పత్యక్షమవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక సుమన స్లమ్ బాలా, కిరియురినా గయాలిగలు, ఎడెగారికా వంటి ప్రశంసలు అందుకున సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘ఆ దినగలు’ చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్, గేయ రచయితగా తన వృత్తిని ప్రారంభించిన సుమన.. కల్లారే సాంటే, ఎడెగారికే చిత్రాలకు రెండు కర్ణాటక రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె సినిమాలు చాలావరకు నేటి కాలంలో ఆధిపత్యం చెలాయించే సామాజిక వ్యతిరేక అంశాలతో కూడుకొని ఉంటాయి. (ఎన్ని రోజులు సింగిల్గా ఉంటావో నేనూ చూస్తా: నితిన్ ) -
ఆ పెళ్లిలో భౌతిక దూరం మాయం
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి కో ఆర్డినేటర్ శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి రాజమండ్రి మంజీరా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు అమృతవల్లి, శ్రీరంగనాథ్లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ భరత్, కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు హాజరయ్యారు. తణుకులో సందడి వాతావరణం.. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. తణుకు బెల్ వెదర్ స్కూల్ అవరణలో జరుగుతున్న ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు భారీగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు రాజకీయ ప్రముఖులతో తణుకు సందడి వాతావరణం నెలకొంది. -
నా జీవితంలో ఇంకెప్పుడూ సంతోషంగా ఉండలేను
కాబూల్ : ‘‘బంధువుల సందడి, అతిధుల పలకరింపులు ఇవన్నీ గుర్తుచేసుకుంటుంటే ఎంతో బాధగా ఉంది. ఈ సంఘటన నన్ను సంతోషం నుంచి దూరం చేసి విషాదంలోకి నెట్టివేసింది. నా కుటుంబం, పెళ్లి కూతరు అందరూ షాక్లో ఉన్నారు. పెళ్లి కూతురైతే ఇప్పటికీ వణికిపోతోంది. నా తమ్ముడ్ని, స్నేహితులను, బంధువులను కోల్పోయాను. నా జీవితంలో ఇకపై నేనెప్పుడూ సంతోషంగా ఉండలేను. గాయపడిన వారిలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నారు. దాడి జరగటానికి ముందు పెళ్లికి వచ్చిన అతిధులు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. క్షణాల్లో అంతా నాశనమైపోయింది. అందరూ కేకలు వేస్తూ తమ వాళ్లకోసం ఏడుస్తూ వెతుకుతూ ఉన్నారు. దాడి జరిగిన తర్వాత మేము స్పృహలో లేము! మమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకొచ్చారో కూడా తెలియదు.’’ అంటూ తన పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న తీరని విషాదంపై పెళ్లికుమారుడు మిర్వేస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి ముందు చోటుచేసుకున్న మధురమైన సంఘటనలను నెమరువేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శనివారం రాత్రి పెళ్లి వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడి పెను విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. పేలుడు దాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడటం అందరినీ కలిచివేసింది. చదవండి : పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి -
పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి
కాబూల్: ఓ పెళ్లి వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాల్లో సాగిపోతున్న ఆ కార్యక్రమంలో భారీ బాంబు విస్పోటనం సంభవించింది. ఈ ఘటన అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో సుమారు 1200 మంది పాల్గొన్నట్టు సమాచారం. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఫంక్షన్ హాల్ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపిస్తోంది. ఓ పెండ్లి వేడుకలో ఈ ఘటన జరిగిందని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి వెల్లడించారు. ఇది ఆత్మహుతి దాడి కావొచ్చునని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రతినిధి సెడిడ్ సిద్దిఖీ ట్విటర్లో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. పశ్చిమ కాబూల్లోని ‘దుబాయ్ సిటీ’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో షియా హజారా జాతికి చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. షియా హజారా ప్రజలపై కావాలనే ఎవరైనా కక్ష పూరితంగా వ్యవహరించారా తెలియాల్సి ఉంది. -
పెళ్లి వేడుకలో భారీ చోరీ
సాక్షి, గుంతకల్లు: పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. బాధితులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని విద్యానగర్లో నివాసముంటున్న ఫరూక్, ముంతాజ్ దంపతుల కుమారుడు అస్లాం వివాహం రైల్వే ఇన్స్టిట్యూట్లో జరిగింది. శనివారం రాత్రి షుక్రానా ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము రెండు గంటల దాకా మేలుకున్నారు. వివాహానికి హాజరైన ఫరూక్ సమీప బంధువులైన కడపకు చెందిన మీరా, పర్వీన్, ఖదిరిన్, ఆయేషాలకు చెందిన సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు ఒకే సూట్కేస్లో ఉంచి తాళాలు వేసి పెళ్లి కొడుకు విడిది రూంలో భద్రపరిచారు. వారంతా అక్కడే బస చేశారు. నిద్రపట్టకపోవడంతో అక్కడి నుంచి విడిది గది సమీపాన ఇన్స్టిట్యూట్ వేదికపైకి వెళ్లి నిద్రించారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో గదిలోకి వెళ్లి చూడగా సూట్కేసు కనిపించలేదు. కంగారుపడిన వారు ఈ విషయాన్ని బంధువులకు చెప్పారు. సూట్కేస్ కోసం ఎంత గాలించినా జాడ దొరకలేదు. కాగా ఇన్స్టిట్యూట్ ఆవరణలో యోగా చేయడానికి వచ్చిన కొందరిని విచారణ చేయగా ఇప్పుడే ఒకతను ఆ రూంలో నుంచి సూట్కేసు తీసుకెళ్లడం చూశామన్నారు. బయట మరో వ్యక్తి స్కూటీలో రాగా ఇద్దరూ కలిసి వెళ్లారని చెప్పారు. మీరాకు చెందిన దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలు, పర్వీన్, ఖదిరిన్లకు చెందిన చెరి 15 తులాలు, ఆయేషా 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.16వేల నగదు ఎత్తుకుపోయారు. బాధితులు లబోదిబోమన్నారు. బంధువులు వెంటనే వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉమామహేశ్వర్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలావుండగా శాంతినగర్లో నబీ అనే వ్యక్తికి చెందిన టీవీఎస్ జస్ట్ రెడ్ కలర్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. దుండగులు ఆ స్కూటర్ ఎత్తుకెళ్తూ ఇన్స్టిట్యూట్లో దొంగతనానికి పాల్పడ్డారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడమేమిటి? వివాహ కార్యక్రమాలకు భారీగా అద్దె వసూలు చేస్తున్న నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం ఏంటని సీఐ ఉమామహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రైల్వే ఇన్స్టిట్యూట్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇన్స్టిట్యూట్ సమీపంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తామన్నారు. పట్టణంలోని కళ్యాణ మండపాలు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద ఎంట్రెన్స్, అవుట్ గేట్ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
ఇలా చేసిన అత్తను చూశారా?
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదని అత్త గుండెలో కూడా అమ్మ ఉన్నదన్నాడో సినీకవి. చంపాబాయీ అనే మహిళ ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్తను కోల్పోయిన తన కోడలికి తానే తల్లిగా మారి రెండోపెళ్లి చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.ఛత్తీస్గఢ్లోని హీరాపూర్కు చెందిన చంపాబాయీకి చిన్నతనంలోనే పెళ్లైంది. ఓ కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆమె భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి కొడుకే లోకంగా బతుకుతూ అతడిని పెంచి పెద్ద చేసింది. ఓ మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపించింది. తన కష్టాలు తీరినట్టేనని, కొడుకు, కోడలు, రాబోయే మనవలతో సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని ఆశపడింది. కానీ దురదృష్టం.. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాన్మరణం చెందడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. అమ్మ మనసు.. అర్థం చేసుకున్న కోడలు ఓ పెళ్లివేడుకలో చోటుచేసుకున్న ప్రమాదంలో చంపాబాయి కొడుకు డోమేంద్ర సాహు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించడంతో తన కోడలి జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా చంపాబాయి భావించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన స్త్రీగా సమాజంలో తానెలా బతికిందీ ఒంటరి తల్లిగా కొడుకును పెంచేందుకు పడిన కష్టాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు కదలాడాయి. అన్నింటికంటే... చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన కోడలు ఙ్ఞానేశ్వరి పరిస్థితి ఏమవుతుందోనన్న వేదనే చంపాబాయి మనసును కలచివేసింది. తాను పడిన కష్టాలు కోడలు పడకకూడదనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది.అయితే హీరాపూర్ ప్రజలకు చంపాబాయి తీసుకున్న నిర్ణయం అంతగా నచ్చలేదు. ‘‘ఇలా చేయడం సంప్రదాయ విరుద్ధం.. అసలు నువ్విలాంటి ఆలోచన చేస్తావని అనుకోనేలేదు..’’ అంటూ ఈటెల్లాంటి మాటలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ చంపాబాయి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోడలి కోసం వరుడి వేట మొదలుపెట్టింది. తమ గ్రామానికి దగ్గర్లోనే ఉండే కమల్ సాహు అనే డివోర్సీతో కోడలి పెళ్లి ఖాయం చేసింది. అత్తగారు తన కోసం పడుతున్న తపన చూసిన ఙ్ఞానేశ్వరి ఆమె నిర్ణయాన్ని గౌరవించింది. భార్యతో విడిపోయినప్పటికీ.. ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను తలకెత్తుకున్న కమల్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలై.. అతడిని పెళ్లి చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఈనెల 24న కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వారి పెళ్లి జరిగింది. కోడలు కాదు.. తను నా కూతురు.. కోడలు ఙ్ఞానేశ్వరికి రెండో పెళ్లి చేయడం గురించి చంపాబాయి మాట్లాడుతూ..‘మా ఇంట్లో అడుగు పెట్టిన నాటినుంచే కోడలిగా కాకుండా తనను కూతురిగా భావించాను. నా ఒక్కగానొక్క కొడుకు భార్య కాబట్టి వారిద్దరికీ నా ప్రేమను సమానంగా పంచాను. కానీ దురదృష్టవశాత్తూ 2017, ఏప్రిల్ 20న డోమేంద్ర మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ బాధను మరచిపోయేందుకు నా కోడలికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. భర్తను కోల్పోయిన స్త్రీగా ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు. ఙ్ఞానేశ్వరి జీవితంలో చోటుచేసుకున్న విషాదాన్ని తీర్చాలంటే పెళ్లి ఒక్కటే మార్గంగా తోచింది. అందుకే ఎవరేమనుకున్నా లెక్కచేయక ఆమెకు మళ్లీ పెళ్లి చేశాను’ అంటూ తల్లి మనసు చాటుకున్నారు. మా వియ్యంకురాలు బంగారం.. ‘మా వియ్యపురాలు ధైర్యం చేశారనే చెప్పాలి. ఆమె నా కూతురిని తన కూతురిలా భావించారు. తనకు రెండోపెళ్లి చేసి కొత్త జీవితాన్నిచ్చారు. వైధవ్యంలో మగ్గిపోకుండా తనను కాపాడారు. అందరూ మా వియ్యపురాలిలా ఆలోచిస్తే ఆడవాళ్ల పరిస్థితి మెరుగవుతుంది. స్త్రీ పునర్వివాహం నేరం కాదనే భావన సమాజంలో నాటుకుపోతుంది. ఇందుకు నా కూతురి పెళ్లి ఆదర్శంగా నిలుస్తుంది’ అంటూ ఙ్ఞానేశ్వరి తల్లి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. అవును... భార్య చనిపోయిన రెండో రోజే వధువు కోసం వెదికే భర్తలున్న ఈ సమాజం భర్త చనిపోయిన తర్వాత స్త్రీ జీవితం అక్కడితోనే ఆగిపోవాలని ఎన్నో ఆంక్షలు విధించింది.దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు వీటన్నింటినీ అధిగమించి వితంతు పునర్వివాహాలు జరిపించినప్పటికీ ఉత్తరాది సమాజంలో చంపాబాయి లాంటి వాళ్లు అరుదుగానైనా కన్పిస్తుండటం ఊరట కలిగించే విషయమే కదా! – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
బొత్స కుటుంబంలో వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ నగరానికి విచ్చేశారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పలనరసయ్య కుమార్తె యామిని సింధూకి, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు కుమారుడు రవితేజతో రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్లో శనివారం అర్ధరాత్రి తర్వాత 3.42 గంటలకు వివాహం జరగనున్న సందర్భంగా రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఎయిర్పోర్టులో పార్టీ నేతలు, శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడ నుంచి సాయిప్రియా రిసార్ట్స్కు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లారు. వైఎస్ జగన్తో పాటు నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలశౌరి, బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, కిల్లి కృపారాణి, పెన్మత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, దాడి వీరభద్రరావు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్తో పాటు విశాఖ సిటీ, రూరల్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, శరగడం అప్పలనాయుడు, పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఉన్నారు. -
పెళ్లికి పూలొచ్చాయి
పెళ్ళిళ్లలో పువ్వుల అలంకారాలు వేదికకు అందం తెస్తాయి.పెళ్లికి పూలే నడిచొస్తేప్రాంగణమే పూల పల్లకి అవుతుంది.పెళ్లికి వెళ్లండి..పూలకరించండి. ►ప్రముఖ జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి పువ్వుల ప్రింట్లున్న ఫ్యాబ్రిక్స్తో వేడుకకు తీసుకొచ్చిన కొత్త హంగుల దుస్తులు. ►రా సిల్క్, నెటెడ్ కాంబినేషన్ లెహెంగా వేడుకకు ఎవర్గ్రీన్ అయితే, దాని మీద పువ్వుల హంగులు కొత్త సింగారాలనుఅద్దుకున్నాయి. ►వివాహ వేడుక అనగానే పట్టు దుస్తుల వైపుగా ఎంపికలు మొదలుపెడతారు. కానీ, ఇలా పువ్వుల విరిబోణిలా కనిపించేదే అరుదైన అందం. ►పువ్వుల ప్రింట్లు ఉన్న నెటెడ్ ఫ్యా్రబ్రిక్ను లెహంగాకు ఎంచుకొని, దానికి ప్లెయిన్ రా సిల్క్ క్రాప్టాప్, నెటెడ్ దుపట్టాను ను జత చేస్తే వేడుకలో హైలైట్. ►క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన పువ్వులు కొత్త అందాలను సింగారించుకున్నాయి. ►ఇండోవెస్ట్రన్ స్టైల్ దుస్తులకు పువ్వుల హంగామాలు జత అవ్వాలి. అందుకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లెహంగా, క్రాప్టాప్ ధరిస్తే చాలు గెట్ టు గెదర్ పార్టీకి గ్రాండ్ లుక్ వస్తుంది. ►పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ సిల్క్ మెటీరియల్తో డిజైన్ చేసిన లెహంగా, దానికి పువ్వుల రంగులో నెటెడ్ దుపట్టా, స్లీవ్లెస్ బ్లౌజ్ జత చేస్తే వచ్చే అందమే వేరు. ►టాప్ టు బాటమ్ ముదురు నీలం రంగు లంగా ఓణీ ఓ ఆకర్షణ అయితే, దాని మీద ఒదిగిన పువ్వుల జిలుగులు వేడుకలో వేల రెట్లు కాంతులే. ►మఖమల్ క్లాత్ అంటేనే గ్రాండ్నెస్కు సిసలైన చిరునామా. మెరూన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద బంగారు, వెండి జరీ పువ్వుల వెలుగులు వేడుకంతా సందడి చేస్తూనే ఉంటాయి. -
సందడి పట్టుకోండి
ముహూర్తాలు మూటగట్టుకొని మాఘమాసం వచ్చింది. పెళ్లి పీటల మీద వధువు పక్కన పేరంటాలను కళకళలాడేలా చేయనుంది. అంతా సందడి.. ముచ్చటగా తయారవ్వాలనే తపన ఆలస్యమెందుకు పట్టు అందుకోండి సందడి పట్టుకోండి. ►కంచిపట్టు చీర వివాహ వేడుకలకు ఎవర్గ్రీన్. దీనికి కాంబినేషన్గా బెనారస్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ను ధరిస్తే గ్రాండ్లుక్తో ఆకట్టుకుంటారు. దీని మీదకు వెడల్పాటి చోకర్స్, టెంపుల్ జువెల్రీ లేదా పెద్ద పెద్ద ముత్యాల హారాలు రాణికళను తెప్పిస్తాయి. ►పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు అందమైన పట్టుచీరల రెపరెపలు కూడా ఉండాలి. అవి వధువుకైనా, వేదికను అలంకరించే వనితలకైనా నిండుతనాన్ని తీసుకువస్తాయి. పెళ్లింటికి లక్ష్మీ కళను మోసుకువస్తాయి. ►కంచిపట్టు చీరకు డిజైనర్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ ఎంపికతో వివాహ వేడుకలో గ్రాండ్గా కనిపిస్తారు. అందులోనూ లాంగ్ స్లీవ్స్ ట్రెండ్లో ఉన్న స్టైల్. ఆధునికతను, హుందాతనాన్ని కోరుకునే అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. కుందన్స్ ఆభరణాలు కంచిపట్టు చీరలకు అమితమైన కళను తీసుకువస్తాయి. ►పెళ్లిలో గ్రాండ్గా కనిపించడానికి సిల్వర్ జరీ పట్టుచీరల కాంబినేషన్ బాగా నప్పుతుంది. జరీ రంగులో డిజైనర్ బ్లౌజ్ ధరించి, పెద్ద పెద్ద రాళ్ల హారాలను ఎంపిక చేసుకుంటే లుక్ గ్రాండ్గా కనువిందు చేస్తుంది. ►సింపుల్, మార్వలెస్ అనిపించే కలర్ కాంబినేషన్స్ చిలకపచ్చ, గులాబీ రంగులు. ఈ రంగు కాంబినేషన్ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీతో ప్రత్యేకత తీసుకురావచ్చు. వజ్రాలు, పచ్చల హారాలు హెవీగా అనిపించక స్మార్ట్నెస్ను తలపిస్తున్నాయి. – శశి వంగపల్లి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ద ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ -
మా పెళ్లికి సెల్ఫోన్లు తేవొద్దు!
ముంబై : రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. విరాట్ కోహ్లి-అనుష్క శర్మల మాదిరి ఈ జంట కూడా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. గతంలో నవంబర్ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం జోరుగా సాగితే, తాజాగా వివాహ ముహుర్తం నవంబర్ 20న పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కు 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించకూడదని దీపికా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వివాహాన్ని ప్రైవేట్గా నిర్వహించాలని చూస్తోంది. రిపోర్టుల ప్రకారం కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకలో భాగం కాబోతున్నారట. అంతేకాక వీరి వివాహ వేడుకకు సెల్ ఫోన్లు అనుమతించకూడదని కూడా ఈ జంట నిర్ణయించారట. వేడుక అనంతరం వీరిద్దరే వివాహ ఫోటోలను అందరికీ షేర్ చేయాలని ప్లాన్ చేశారట. మా పెళ్లికి సెల్ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా-రణ్వీర్ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని కూడా వీరు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నాయి. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని, కొంతమంది అతిథులను మాత్రమే పిలుస్తున్నారని, అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయంటూ సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ పెళ్లి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలని రణ్వీర్, దీపికాలు నిర్ణయించారట. -
టపాసులు కాల్చొద్దని అన్నందుకు..
గువహటి : పెళ్లి వేడుకల్లో బాణాసంచా పేలుళ్లను వద్దన్నందుకు 35 సంవత్సరాల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. నల్బారి జిల్లాలోని గురతోల్లో మంగళవారం రాత్రి పెళ్లి వేడుకలో బాణాసంచా కాల్చుతుండగా పొరుగున ఉండే జతిన్ దాస్ అభ్యంతరం తెలిపారు. బాణాసంచా కాల్చుతుండగా ఓ టపాసు దాస్ కాలికి తగలడంతో ఘర్షణ ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. టపాసులు పేల్చడంపై దాస్ ఆగ్రహం వ్యక్తం చేయగా అతనిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని నల్బారి ఎస్పీ శైలాదిత్య చెటియా తెలిపారు. కాగా వరుడి ఇంటికి పెళ్లికుమార్తె రాకపోవడంతో పెళ్లి జరగలేదని పోలీసులు చెప్పారు. ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఆరుగురు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. దినసరి కూలీ అయిన బాధితుడు దాస్పై నిందితులు మద్యం మత్తులో దాడికి పాల్పడిఉంటారని స్ధానికులు చెప్పారు. -
చూడచక్కని జంట.. ఆకుపచ్చని పెళ్లి
సాక్షి, ముంబై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను ప్రస్తుత తరంవారు విభిన్నంగా, అందరూ మెచ్చుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేశారు ముంబైకి చెందిన దీపా కామత్, ప్రషిన్ జాగర్ జంట. వివాహం అనగానే పెళ్లి పత్రికల నుంచి మొదలు డెకరేషన్స్, భోజనాలు చేసే ప్లేట్లు, గ్లాస్ల దాకా పర్యావరణానికి విఘాతం కలిగించేవే. ప్రకృతికి నష్టం కలిగించే ఇలాంటి వస్తువులేవీ వాడకుండా.. పర్యావరణ హితంగా తమ పెళ్లి ఉండాలని వారు కోరుకున్నారు. తమ సాదాసీదాగా వినూత్న వివాహానికి పెద్దలను, స్నేహితులను ఒప్పించారు. వారి సహకారంతో పర్యావరణానికి అనుకూలమైన, రీసైక్లింగ్ (జీరో ప్లాస్టిక్)వస్తువులనే వాడాలని, ఆఖరికి టిష్యూ పేపర్ కూడా వాడకూదని(పేపర్ చెట్ల నుంచి వస్తుందని) నిర్ణయించుకున్నారు. వివాహ ఆహ్వానానికి పత్రికల బదులు వాట్సప్ మెసేజ్, దగ్గరి బంధువులను కలిసి ఆహ్వానం చెప్పివచ్చారు. భోజనాలు వడ్డించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పాత పద్ధతి పళ్లాలు వాడారు. వీరనుకున్నంత సులభంగా ఈ పనులు జరగలేదు. ఎన్నో అడ్డంకులు, బంధువుల నుంచి వ్యతిరేకత వీటన్నింటినీ అధిగమించి, ప్రకృతి ఒడిలో అందరినీ ఆలోచింపజేసాలా వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పర్యావరణ అనుకూల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది. -
వంతెన పైనుంచి పడ్డ ట్రక్కు
భావ్నగర్: పెళ్లి వేడుకలకు వెళ్తున్న ట్రక్కును మృత్యువు వెంటాడింది. అప్పటివరకు పెళ్లి కబుర్లతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. రక్తసిక్తమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందికి పడిపోయింది. దీంతో 30 మందికిపైగా చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. 26 మంది ఘటనా స్థలిలోనే చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. ఉదయం 7:30–7:45 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, జిల్లా అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.‘బోతాడ్ జిల్లాలోని టోటమ్ గ్రామంలో పెళ్లికి హాజరయ్యేందుకు దాదాపు 60 మందితో అనిదా గ్రామం నుంచి ట్రక్కు బయలుదేరింది. భావ్నగర్–రాజ్కోట్ రహదారిపై రంగోలా వద్ద బ్రిడ్జిపై ముందు వెళ్తున్న వాహనాన్ని దాటబోయి.. అదుపుతప్పి కింద పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ఐఎం సయ్యద్ తెలిపారు. మరోవైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.