-
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్గ్రౌండ్లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలను సీఎం జగన్ ఆశీర్వదించారు. -
తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. -
పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు. -
జోగి రమేష్ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. -
వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వుగా.. ఈ నెలలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. (ఇది చదవండి; మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) కాగా.. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అతిథులు, సన్నిహితుల ఆహ్వానాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపాసన తన ఇన్స్టాలో ప్రస్తావించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈనెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్కి తాకాయి. సీలింగ్కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
గ్రాండ్గా ప్రేతాత్మల పెళ్లి !! నోరూరించే నాన్వెజ్ వంటకాలు..
యశవంతపుర: తుళునాడులో జరిగే విభిన్నమైన పెళ్లి వేడుక ఇది. వధూవరులు ఎవరో కంటికి కనిపించరు. అటు, ఇటు పెళ్లిపెద్దలు చేరి వేడుక జరిపించి ఆశీర్వదిస్తారు. కొత్త జోడీ ఎవరి కంటికి కనిపించకుండా తంతు ముగిసిపోతుంది. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఏటా ఒకసారి ప్రేతాత్మలకు వివాహం చేయడం ప్రజలకు ముఖ్యమైన ఆచారం. కరావళిలో ప్రస్తుతం తుళు మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణించి ఉంటే వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ సంప్రదాయం. తద్వారా మృతులకు పెళ్లి ముచ్చట తీరినట్లుగా భావిస్తారు. బంట్వాళ తాలూకా వగ్గ గ్రామం వధువు కుటుంబం, ఉళ్లాల తాలూకా కోణాజె సమీపంలోని చోళ్మ వరుని కుటుంబంగా ఏర్పడి ప్రేతాత్మలకు పెళ్లి చేశారు. వగ్గ గ్రామానికి చెందిన సంజీవ పూజారి కుతూరు విశాలాక్షి రెండేళ్ల క్రితం మృతి చెందింది. చోళ్మలో లక్ష్మణ కొడుకు ధరణేశ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. వీరిద్దరూ అవివాహితులు కావడంతో ఇరు కుటుంబాలవారు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో నాన్వెజ్ కూడా వండుతారు. చికెన్, మటన్తో పాటు చేపల ఫ్రై కూడా ఉంటుంది. -
స్మశానంలో పెళ్లి బంధువుల ఫీలింగ్ చూడాలి
-
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఇది కూడా చదవండి: సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్ను ఎదుర్కోలేకే: సజ్జల -
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్పై నుంచి జారి.. -
పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్
లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్ హథ్రాస్లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు. The video went #viral while firing pistol bride The bride fired joy at a guest house in Salempur of Thana #Hathras Junction area Bride's video of Harsh firing went viral on #socialmedia The bride is a resident of village Nagla Sekha of Hasayan police stn area.#UttarPradesh pic.twitter.com/neXrJexBik — Siraj Noorani (@sirajnoorani) April 8, 2023 అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు. చదవండి: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి -
వైరల్ వీడియో: అతి చేశారు.. ముఖం కాల్చుకున్న పెళ్లికూతురు
-
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది. కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. -
ఒక్కటికానున్న 220 జంటలు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కార్యకర్తల బలంతోనే..: జనార్దన్రెడ్డి కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా. -
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. అడివి శేష్ తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్
ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. అమర్దీప్ పలు ఓటీటీ సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
పులివెందులలోని రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
-
Pulivendula: వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్లను సీఎం జగన్, భారతీరెడ్డి ఆశీర్వదించారు. వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్నగర్లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్లో ఘనంగా రిసెప్షన్ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం..
సాక్షి, నంద్యాల జిల్లా: బోయరేవులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 24 గంటల్లో పెళ్లికుమారుడు దుర్మరణం చెందడం కలకలం రేపింది. బోయరేవుకు చెందిన శివకుమార్తో జూపాడు బంగ్లా మండలం భాస్కరపురానికి చెందిన మౌనిక అనే యువతితో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో నిన్న(శుక్రవారం) ఘనంగాపెళ్లి జరిగింది. సాయంత్రం బరాత్లో వధూవరులిద్దరూ సంతోషంగా నృత్యాలు కూడా చేశారు. అర్ధరాత్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన వరుడు శివకుమార్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ.. -
Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం
అహ్మదాబాద్: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు. వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్కూ వెళ్తానని ప్రకటించింది.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement