అధికారంలో కొనసాగే అర్హత లేదు | upa has no right for ruling, says jayaprakash narayana | Sakshi
Sakshi News home page

అధికారంలో కొనసాగే అర్హత లేదు

Published Mon, Dec 9 2013 1:40 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

upa has no right for ruling, says jayaprakash narayana


యూపీఏపై జేపీ నిప్పులు


 సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇక ఒక్కరోజు కూడా కేంద్రంలో కొనసాగే అర్హత కోల్పోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవ స్థాపకుడు జయప్రకాష్ నారాయణ యూపీఏపై నిప్పులు చెరిగారు. ఈ ఓటమిని యూపీఏ ఓటమిగా కాంగ్రెస్ గుర్తించాలన్నారు. ఈ ఫలితాలను సంకేతంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్ తన పదవికి రాజీనామా చేసి 3 నెలల ముందే ఎన్నికలను కోరాలన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆదివారం జేపీ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్ర విభజనకు కేంద్రం బలవంతంగా పూనుకోవడాన్నే తాను వ్యతిరేకిస్తున్నానని జేపీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అందులో 4 జిల్లాలను వేరుచేసి మరో రాష్ట్రం ఇస్తామంటే అక్కడి వారు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణను టీ నేతలు ఎందుకు ఒప్పుకోవట్లేదన్నారు.
 అవినీతిపై ప్రజల తిరుగుబాటిది: నారాయణ
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలపై ప్రజా తిరుగుబాటు ఫలితమే ఆ పార్టీ ఓటమని సీపీఐ నేత నారాయణ అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే బీజేపీని గెలిపించారని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement