మహారాష్ట్రలో థానే జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగిఉన్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొని దగ్ధమైన బస్సు వోల్వో కాదని ఆ సంస్థ ప్రతినిధి గురువారం పేర్కొన్నారు.
హైదరాబాద్: మహారాష్ట్రలో థానే జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగిఉన్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొని దగ్ధమైన బస్సు వోల్వో కాదని ఆ సంస్థ ప్రతినిధి గురువారం పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు వోల్వో అంటూ మీడియాలో వచ్చిన వార్తను తోసిపుచ్చారు. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవదహనమైన సంగతి తెలిసిందే.