
వీరవరంలో మావోయిస్టుల సంచారం!
జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. మండలంలోని ఎ.వీరవరం గ్రామంలో ఆదివారం నలుగురు మావోయిస్టులు సంచరించినట్టు సమాచారం.
దేవీపట్నం : జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. మండలంలోని ఎ.వీరవరం గ్రామంలో ఆదివారం నలుగురు మావోయిస్టులు సంచరించినట్టు సమాచారం. వారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామంలోని తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న చిట్టడవిలో మకాం వేశారని, బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ తుపాకులతో ఉన్న వారిని చూసి భయపడి నలుగురికీ చెప్పిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు చెపుతున్నారు. ఈ విషయంపై రంపచోడవరం ఏఎస్పీ విజయారావును వివరణ కోరగా మావోయిస్టుల ఉనికిపై తమకూ సమాచారం అందిందని, గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపామని చెప్పారు.