మహబూబ్నగర్: జిల్లాలో ఓ మహిళా సర్పంచ్పై కొందరు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మద్దూరు మండలం మన్నాపూర్లో ఈ దారుణం జరిగింది.
మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మ పొలం నుంచి వస్తుందడగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె సజీవదహనం అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతిపై ఓ యువకుడు ఈరోజే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువతికి మూడు రోజుల్లో పెళ్లి. నవీన్ అనే పెయింటర్ ప్రేమిస్తున్నానని రేవతి అనే యువతి వెంటపడుతున్నాడు. ప్రేమ తిరస్కరించడంతో ఆ యువతి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆ యువతి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మహిళా సర్పంచ్ సజీవదహనం
Published Wed, Dec 18 2013 8:37 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement