
సాక్షి, ఉయ్యూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 147వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శనివారం ఉదయం ఆయన గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నందమూరు క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రాజుపేట, కాటూరు, కడవకల్లు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం వైఎస్ జగన్ ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.