రుచి సోయా రేసులో టాప్‌ బిడ్డర్‌గా అదానీ | Adani submit revised bids to acquire Ruchi Soya | Sakshi
Sakshi News home page

రుచి సోయా రేసులో టాప్‌ బిడ్డర్‌గా అదానీ

Published Wed, Jun 13 2018 12:28 AM | Last Updated on Wed, Jun 13 2018 12:28 AM

న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న వంట నూనెల కంపెనీ రుచి సోయాను దక్కించుకునే రేసులో అదానీ గ్రూప్‌ టాప్‌ బిడ్డర్‌గా నిలిచిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.6,000 కోట్లకు బిడ్‌ వేసిన అదానీ విల్‌మర్‌ అత్యధిక బిడ్‌ వేసిన కంపెనీగా నిలిచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

రుచి సోయాను దక్కించుకోవడానికి పోటీ పడిన  మరో కంపెనీ పతంజలి గ్రూప్‌ రూ.5,700 కోట్లకు బిడ్‌ను దాఖలు చేసింది. అయితే స్విస్‌ చాలెంజ్‌ పద్థతిలో పతంజలి గ్రూప్‌కు తన ఆఫర్‌ను మరింతగా పెంచే హక్కు ఉంటుంది. రుచి సోయా రుణ దాతల కమిటీ మంగళవారం బిడ్‌లను ఓపెన్‌ చేసింది. రుచి సోయా మొత్తం రూ.12,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement